ప్రకాశం జిల్లా
| ?ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 17,626 కి.మీ² (6,805 చ.మై) |
| ముఖ్య పట్టణము | ఒంగోలు |
| ప్రాంతం | కోస్తా |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
33,92,764 (2011) • 192/కి.మీ² (497/చ.మై) • 4,66,000(2001) • 17,12,735 (2011) • 16,80,029 (2011) • 57.86 (2001) • 69.78(2001) • 45.6(2001) |
ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించినది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడినది.
స్వాతంత్రోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు , శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , కర్నూలు, గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.
స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది. 1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా [1]పేరు మార్చబడింది.
భౌగోళిక స్వరూపం [మార్చు]
ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉన్నది. ఉత్తరాన మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.
కొండలు [మార్చు]
త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలు ను తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.
నదులు [మార్చు]
గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు లు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. తమ్మిలేరు, ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగల వాగు వంటి వాగులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి.
వాతావరణం, వర్షపాతం [మార్చు]
జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్- సెప్టెంబరు లో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరు లో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. జిల్లా సగటు వర్షపాతం 764మిమి.
నేలలు [మార్చు]
ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు క్రమంగా 51% , 41%, 6% వరకు జిల్లాలో ఉన్నాయి.
వృక్ష సంపద [మార్చు]
జిల్లా విస్తీర్ణంలో 4,42,500 హెక్టార్లలో (25.11% )అడవులు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడు లలోజీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు లలో మామిడీ,సపొటా తోటలు ప్రసిద్ది.
ఖనిజ సంపద [మార్చు]
పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది.
ఆర్ధిక స్థితి గతులు [మార్చు]
వ్యవసాయం [మార్చు]
జిల్లా విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే వ్యవసాయభూమి. 72 శాతం ఆహర పంటలు ,28శాతం అహారేతర పంటలు పండుతున్నాయి. 3,10,433 కమతాలున్నాయి. వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో వుంది.
మొత్త సాగుభూమిలో 24 శాతానికి నీటి పారుదల సౌకర్యం వుంది. కాలువల ద్వారా 71000 హెక్టార్లు, చెరువుల ద్వారా 34000 హెక్టార్లు, గొట్టపు బావులద్వారా 65000 హెక్టార్లు భూమి సాగవుతున్నది.
జిల్లాలోని 102 కి మీల సముద్ర తీరంలో సముద్ర ఉత్పత్తులు విరివిగా అవకాశాలున్నాయి.
పరిశ్రమలు [మార్చు]
జిల్లాలో ఐరన్ ఓర్, గ్రానైట్, ఇసుక, సిలికా, బైరటీస్, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్ క్యూబిక్ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, ఏల్చూరు, దర్శి, కనిగిరి, అద్దంకిల్లో 13.86 మిలియన్ల క్యూబిక్ మీటర్లు మరియు బ్లాక్ పెరల్ గ్రానైట్ నిల్వలు 0.435 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు అంచనా.ఇవేగాక ప్రత్తి జిన్నింగ్, పొగాకు , మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు వున్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (చినగంజాం,పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా 5000 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పును పండిస్తారు. అవస్థాపన: జిల్లా లో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపూర్, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము, ఒంగోలు ఆటోనగర్, వుడ్ కాంప్లెక్స్ ఒంగోలు లో వున్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిశ్రమాభివృద్ధికి తోడ్పడుతున్నది. [2]
| పరిశ్రమ రకం | సంఖ్య | పెట్టుబడి(కోట్లు) | ఉపాధి | వివరణలు |
|---|---|---|---|---|
| భారీ, మధ్య తరహా | 30 | 389 | ఉదా: ఐటిసి, అమరావతి టెక్స్టైల్స్, జయవెంకటరమణ స్పిన్నింగ్ మిల్స్, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ | |
| సూక్ష్మ, చిన్న తరహా | 28,088 | 150.66 | 1,65,728 |
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు [మార్చు]
- రెవిన్యూ డివిజన్లు (3): కందుకూరు, ఒంగోలు, మార్కాపురం.
- మునిసిపాలిటీలు (3): ఒంగోలు, చీరాల, మార్కాపురం అద్దంకి
- గ్రామాలు:1005, గ్రామ పంచాయితీలు:775
- రెవిన్యూ మండలములు: 56
![]() |
|
నియోజకవర్గాలు [మార్చు]
- లోక్సభ నియోజకవర్గములు (1): ఒంగోలు-మాగుంట శ్రీనివాసులరెడ్డి (కాంగ్రేస్ )
- శాసనసభ నియోజకవర్గములు (12):
అద్దంకి , ఎర్రగొండపాలెం , ఒంగోలు , కందుకూరు , కనిగిరి , కొండపి , గిద్దలూరు , చీరాల , దర్శి , పరుచూరు , మార్కాపురం మరియు సంతనూతల
రవాణా వ్వవస్థ [మార్చు]
చెన్నయ్-ఢిల్లీ రైలు మార్గము, గుంతకలు గుంటూరు రైలు మార్గము జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి. రైల్వే లైను పొడవు242 కిమీ. ఎన్.హెచ్.5. జాతీయ రహదారి(నాలుగు దారుల) జిల్లా లో 117 కిమీ, రాష్ట్ర రహదారులు 570 కిమీ, జిల్లా పరిషత్ రహదారులు 1786 కిమీ, ఇతర జిల్లా రహదారులు 936 కిమీ వున్నాయు.
జనాభా లెక్కలు [మార్చు]
2011 జనగణన ప్రకారం జనసంఖ్య 3,392,764 తో [3] పనామా దేశానికి సరిపోలుతుంది[4] లేక అమెరికా లోని కొనెక్టికట్ రాష్ట్రంతో సరిపోతుంది.[5] దేశం మొత్త 640జిల్లాలలో ఇది 98స్థానంలో వుంది. జనసాంద్రత 192 చకిమీ.[3]2001-2011దశకానికి జనాభా పెరుగుదల 10.9 %.[3] లింగ నిష్పత్తి 981 స్త్రీలు ప్రతి 1000 పురుషలకు [3] మరియు అక్షరాస్యత 63.53 %.[3]
సంస్కృతి [మార్చు]
ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల(రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. ఒంగోలు డివిజన్ లోని ఈశాన్య భాగం గుంటూరుకు దగ్గరగా వుండే వ్యవసాయాధారిత ప్రధాన సంస్కృతికాగా, కందుకూరు డివిజన్ లో అలాలేదు. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత మరియు గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న మరియు బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో 2 వది.
పశుపక్ష్యాదులు [మార్చు]
ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ది గాంచింది. అమెరికా, హాలండ్. మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడినది. మలేషియా లో ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. ఈ జాతి పశువులు ప్రపంచంలో లక్షలలో వుంటాయి . 2002 భారత జాతీయ పోటీల చిహ్నం ఐన వీర1 ఒంగోలు గిత్త. పొట్టి కొమ్మల ఒంగోలు జాతి గిత్తలు, నంది శిల్పాలలాగా వుంటాయి.
విద్యాసంస్థలు [మార్చు]
2001 నాటికి 57.86 శాతం అక్షరాస్యత నమోదైంది. 2010 మార్చి ఇంటర్ ద్వితీయ పరీక్షలో19742 సాధారణ విద్యార్థులు హాజరు కాగా, 11967 మంది అనగా 61శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇది గత సంవత్సరం తో పోల్చితే తేడా లేదు. విద్యశాలలకు సంబంధించిన గణాంకాలు క్రింది పట్టికలో చూడండి. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా వున్నాయి.
| విభాగం | మొత్తం విద్యాశాలల సంఖ్య | వ్యాఖ్య |
|---|---|---|
| పాఠశాల విద్య | 4254 | [6],2001 నాటికి 2220 ప్రాథమిక పాఠశాలలు,137 ప్రాథమికోన్నత పాఠశాలలు, 144 ఉన్నత పాఠశాలలు |
| పారిశ్రామిక శిక్షణ (ఐటిఐ) | 18 | [7] |
| ఇంటర్మీడియట్ | 181 | [8], 37వృత్తి ఇంటర్మీడియట్ కళాశాలలు [9] |
| పాలిటెక్నిక్ | 17 | [10] |
| కళాశాల విద్య( వృత్తేతర)(ఉన్నత విద్య) | 75 | 2001 నాటి సంఖ్య[11] |
| వృత్తివిద్య (ఇంజనీరింగ్) | * | [12] |
| వృత్తి విద్య (ఎమ్బిఎ ) | * | [13] |
| వృత్తి విద్య (ఫార్మసీ) | * | [14] |
| వృత్తి విద్య (ఎమ్సిఎ) | * | [15] |
| వైద్యవిద్య (సాధారణ వైద్యం) | 1 | రాజీవ్ గాంధీ వైద్యవిజ్ఞానాల సంస్థ [16] |
| వైద్యవిద్య (దంత వైద్యం) | 0 | |
| వైద్యవిద్య (నర్సు) | 0 | |
| వైద్యవిద్య (వైద్య అనుబంధ) | * | [17] |
| విశ్వవిద్యాలయాలు లేక సమానస్థితిగలవి | 0 |
ఆకర్షణలు [మార్చు]
చీరాల (ఓడరేవు), మార్కాపురం చెన్నకేశవస్వామి దేవాలయము, కొమ్మినేనివారిపాలెం దేవాలయము, కంభం చెరువు, singarakonda ప్రసన్నాంజనేయస్వామి మరియు లక్ష్మినృసింహ స్వామివార్ల దేవాలయాలు, భవనాసి చెరువు, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని ఆలయం, మణికేశ్వరం లోని మండూకేశ్వరస్వామి ఆలయం, భార్గవకొండలో దుర్గాభైరవస్వాముల ఆలయం మరియు మాలకొండలో మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ పర్యాటక కేంద్రాలు. పాకల(సింగరాయకొండ) సముద్రతీరప్రాంతంలో ప్రతి వారములో సందర్శించే పర్యాటకస్థలంగా పేరు పొందింది. [18]
వైద్యం [మార్చు]
9 అల్లోపతి వైద్యశాలలు, 46 డిస్పెన్సరీలు, 90 అయుర్వేద వైద్యశాలలు, 1 యునాని వైద్యశాల వున్నాయి.
సహకార సంఘాలు [మార్చు]
2,62,000 మంది సభ్యులతో జిల్లాలో 1275 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1086 సాధారణ, 69 చేనేత,68 పారిశ్రామిక, 31 మత్స్యకార, 21 పాలసరఫరా సహకార సంఘాలు.
క్రీడలు [మార్చు]
జిల్లాలో ఎండాకాలంలోపలు చోట్ల ఎడ్ల బలప్రదర్శన నిర్వహిస్తారు . జిల్లా నలుమూలలనుండి రైతుల పాల్గొంటారు.
ప్రముఖవ్యక్తులు [మార్చు]
ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. అసెంబ్లీ స్పీకర్ దివికొండయ్య,పిడతల రంగారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో త్యాగరాజు, శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన షేక్ చినమౌలానా . సినీరంగంలో ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ
బయటి లింకులు [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ ఎపిఆన్లైన్ లో జిల్లా పరిచయపత్రం
- ↑ పరిశ్రమాభివృద్ధిశాఖ జిల్లా పరిశ్రమలపత్రం, పరిశీలించిన తేది:17 మే 2012
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Panama 3,460,462 July 2011 est."
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. "Connecticut 3,574,097"
- ↑ 2010-11 సావంత్సరిక నివేదిక
- ↑ జాతీయ వృత్తిపర శిక్షణ సమాచార వ్యవస్థ
- ↑ ప్రకాశంలో సాధారణ ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు
- ↑ ప్రకాశంలో వృత్తి ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు
- ↑ ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాలలు
- ↑ ఆంధ్రప్రదేశ్ కళాశాలలవివరాలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్బిఎ కళాశాలలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఫార్మసీ కళాశాలలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్సిఎ కళాశాలలు
- ↑ రాజీవ్ గాంధీ వైద్యవిజ్ఞానాల సంస్థ
- ↑ ఆంధ్రప్రదేశ్ లో పారామెడికల కళాశాలలు
- ↑ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థలో జిల్లాపేజి
|
||||||||||||||
