పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ
పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ (PAUDA)
సంస్థ వివరాలు
స్థాపన 2022
అధికార పరిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం నరసరావుపేట
16°14′N 80°03′E / 16.23°N 80.05°E / 16.23; 80.05
Parent agency ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్, 2016 (చట్టం నం.5 ఆఫ్ 2016) ప్రకారం ఏర్పడింది. పల్నాడు పట్టణ అభివృద్ధి అథారిటీ (PAUDA) దీని ప్రధాన పరిపాలనా కేంద్రం జిల్లా ముఖ్య పట్టణం నరసరావుపేట.ఇది 2022 డిసెంబరు 26 నుండి అమలులోకి వచ్చింది.[1]

లక్ష్యాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 భాగంగా నరసరావుపేట ప్రధాన కేంద్రంగా, పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడింది.[2][3] ఈ జిల్లా లోని ప్రాంతాల లక్ష్యాలను సాధించడానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో, 21,36,660 జనాభాను కలిగి ఉంది.పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి.[4]

పౌడా పరిధిలోని గ్రామాలు, ప్రాంతాలు[మార్చు]

ఈ చట్టం ప్రయోజనం కోసం ఏర్పడిన "పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియా (PAUDA)" పరిధిలో ఉన్న గ్రామాలు, ప్రాంతాలు వివరాలు.[5]

మూలాలు[మార్చు]

  1. https://ia801407.us.archive.org/21/items/in.gazette.andhra.2022-12-26.17591/17591.pdf
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.
  4. Government of Andhra Pradesh (2022-12-26). Andhra Pradesh Gazette, 2022-12-26, Extraordinary, Part PART I, Number 3362.
  5. Government of Andhra Pradesh (2022-12-26). Andhra Pradesh Gazette, 2022-12-26, Extraordinary, Part PART I, Number 3362.

వెలుపలి లంకెలు[మార్చు]