బంగారు ముంగిస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంగారు ముంగిస అనే ఈ చిన్న పురాణ కథల పుస్తకం కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలము నుండి వెలువడిన పురాణ కథల సంపుటి. ఈ పుస్తకం గుంటూరు ది చిల్డ్రన్స్ బుక్ హౌస్ వారి చేత ముద్రించబడి అమ్మబడింది. ఈ పుస్తకములో వివిధ పురాణాల నుండి సంగ్రహించబడిన ఆరు పురాణ కథలు ఉన్నాయి. ఒక్కొకథకి ఒక్కో శీర్షిక పేరు పెట్టారు.

పుస్తకములొ వివరించడిన కథలు[మార్చు]

  1. అగ్ని పరీక్ష - ఇందులో అష్టావక్రుడి బ్రహ్మచర్య నిష్ఠకి వదాన్య మహర్షి పెట్టిన పరీక్షకి సంబంధించిన కథ
  2. మునిమూల్యం - చ్యవన మహర్షి,జాలరులు, నహుష రాజు వృత్తాంతం. జాలరులు నదిలో తపస్సు చేసుకొంటున్న చ్యవన మహర్షిని నహుషుడు వద్దకు తీసుకొని వెళ్తారు.
  3. జీవనదానం -నాడిఘంగుడు కథ
  4. తపోబలం - చ్యవన మహర్షి - సుకన్య వివాహ వృత్తాంతం - ఈ కథ దేవి భాగవతం నుండి గ్రహించబడింది
  5. భీష్మ ప్రతిజ్ఞ - భీష్ముడు తన తండ్రి శంతన మహారాజుకి సత్యవతికి వివాహాం చేయడం కోసం చేసిన ప్రతిజ్ఞ వైనం
  6. బంగారు ముంగిస కథ : పుస్తక శీర్షికకి సంబంధించిన కథ బంగారు ముంగిస.

బంగారు ముంగిస కథ[మార్చు]

యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.[1]

మూలాలు[మార్చు]

  1. Latha, Suma (2020-03-11). "Vaartha Online Edition చెలి". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-06.

బయటి లింకులు[మార్చు]