బగళాముఖీ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బగళాముఖీ దేవి
శత్రువుల నుండి రక్షించే దేవత
అనుబంధంకాళి దశ అవతారము
మంత్రంఓం హ్రీం బగళాముఖీ,సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్దిం వినాశయ హ్రీం ఓం స్వాహ
ఆయుధములుదుడ్డు కర్ర
భర్త / భార్యశివ
వాహనంCorpse or Ghost.

బగళాముఖీ లేదా బగళా (సంస్కృతం: बगलामुखी), హిందూమతంలో కాళికాదేవి దశ అవతారములలో బగళాముఖీ అవతారం ఒకటి. బగళాముఖీ దేవి తన దుడ్డు కర్రతో భక్తుని దురభిప్రాయాలు, భ్రమలు (లేదా భక్తుని యొక్క శత్రువులను) నాశనం చేస్తుంది. ఆమెను ఉత్తర భారతదేశంలో పీతాంబరీ దేవి అని పిలుస్తారు. బగళాముఖీ దేవి బంగారు సింహసనంపై, చేతులో పసుపు కమలతో సముద్రం మద్యలో ఉంటుంది.ఆమె అర్ధచంద్రాకార తల కలిగిఉంటుంది. కొన్ని చోట్ల రెండు చేతులు, మరి కోన్ని చోట్ల నాలుగు చేతులు కలవు అని ఉన్నాయి.

బగళాముఖీ దేవి కోర్టు కేసుల నుండి, అప్పుల నుండి బయట పడవేసె దేవత.

లాయర్లు ప్రతి రోజు పూజించ వలసిన దేవత.

శత్రువుల నుండి రక్షించే దేవత

బగాళా అనగా "బంధించు", ముఖీ అనగ "ముఖం". అందువలననే ముఖం పట్టుకోవటానికి లేదా నియంత్రణ అధికారం బగళాముఖీ దేవి ఉంది. బగళాముఖీ దేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను దరించి ఉంటుంది.

బగళాముఖీ దేవిని పసుపు వస్త్రములు దరించి, పసుపు వస్త్రముపై కూర్చుని, పసుపు పువ్వులతో పూజించాలి.

Maa Pitambara (Bagalamukhi) Temple, Amleshwar
పేరు
ఇతర పేర్లు:Maa Pitambara (Bagalamukhi) Temple, Amleshwar
స్థానిక పేరు:Maa Pitambara (Bagalamukhi) Shaktipeeth, Amleshwar
దేవనాగరి:माँ पीताम्बरा बगलामुखी मंदिर (अमलेश्वर)
స్థానం
దేశం:India
రాష్ట్రం:Chhattisgarh
జిల్లా:Durg
ప్రదేశం:Amleshwar Durg Raipur
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Bagalamukhi
ప్రధాన పండుగలు:Navratri
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
16 May 2005
వెబ్‌సైటు:https://www.facebook.com/maapitambarakripa

బగళాముఖీ దేవి మంత్రం[మార్చు]

ఓం హ్లీం బగళాముఖీ|
సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్దిం వినాశయ హ్లీం ఓం స్వాహ||

పై మంత్రం గురువు ద్వారా అభ్యసించిన వారికి, నరఘోష, సమస్త శత్రువుల బాదలను దూరం చేస్తుంది అనడంలో సందేహం లేదు.

బగళాముఖీ దేవాలయము[మార్చు]

మా పీతాంబరి (బగళాముఖీ) దేవాలయం భారతదేశం రాయ్పూర్ విమానాశ్రయం నుండి సుమారు 15 కి.మీ. దుర్గ్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ అమలేశ్వర్ (దుర్గ్ / రాయ్పూర్) పట్టణంలో ఉంది. రాయ్పూర్ రైల్వే స్టేషను నుండి సుమారు 5 కి.మీ.లో ఉంది.

పరమ పూజ్యశ్రీ శ్రీ పీతాంబ పీఠాధిపతి యోగిరాజ్ యుధిష్టర్ జీ మహరాజ్ గారు ఏర్పాటు చేసారు.

మూలాలు[మార్చు]