మక్కా మసీదు (హైదరాబాదు)
మక్కా మస్జిద్ (హైదరాబాదు, భారతదేశం) భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా మరియు తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.
చార్మినారు కు నైఋతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగివున్నది. ఈ మస్జిద్ లో మహమ్మదు ప్రవక్త గారి "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
విషయ సూచిక |
[మార్చు] మస్జిద్ వద్ద బాంబు పేలుడు
హైదరాబాదు లోని ప్రాచీన మక్కా మసీదు వద్ద 2007 మే 18 న బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 11 మంది చనిపోయారు. పేలుడు తరువాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.[1]
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
|
|||||||