మత్స్యాసనం
వికీపీడియా నుండి
మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.
[మార్చు] పద్ధతి
- ముందు పద్మాసనం వెయ్యాలి.
- పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి.
- రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.
- కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
- తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.
[మార్చు] ప్రయోజనం
- ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.
|
|||||||||||