మర్రి చెన్నారెడ్డి
మర్రి చెన్నారెడ్డి రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు. చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా, వికారాబాదు తాలూకాలోని సిర్పూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విద్యార్ధి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్ధి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉన్నది. తెలంగాణా కోసం ఓ పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.
[మార్చు] ఇన్నయ్య చెప్పిన విశేషాలు
- దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. చెన్నారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి, ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.[ఆధారం కోరబడినది]
- స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్య రంగా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.
- నా మీద ఎంత కోపమున్నా, మరొక పక్క ఆదరంగానే చూసేవాడు. చెన్నారెడ్డి రాగ ద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలని దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. తులాభారాలు, జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైనవారిని స్టేజిమీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గా భక్తవత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి. రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకున్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషాసంఘాధ్యక్షుణ్ణి చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్గా ఒప్పించటం చెన్నారెడ్డికే తగింది.
- ఉత్తరప్రదేశ్ గవర్నరుగా చెన్నారెడ్డి
| ఇంతకు ముందు ఉన్నవారు: జలగం వెంగళరావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 06/03/1978—11/10/1980 |
తరువాత వచ్చినవారు: టంగుటూరి అంజయ్య |
| ఇంతకు ముందు ఉన్నవారు: నందమూరి తారక రామారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 03/12/1989—17/12/1990 |
తరువాత వచ్చినవారు: నేదురుమిల్లి జనార్ధనరెడ్డి |
మూస:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
|
|||||||||||||||||||||||||||||