మహబూబ్‌నగర్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(మహబూబ్‌నగర్ పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో సమీపంలోని 10 పంచాయతీలు ఈ పురపాలక సంఘం పరిధిలో చేర్చి సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘంగా మార్చారు. దీన్ని నగరపాలక సంస్థగా చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుతానికి పంపిననూ వాస్తవరూపం దాల్చలేదు.

జనాభా[మార్చు]

పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి జనాభా 130986 కాగాం 2011 నాటికి 157902కు పెరిగింది.

ఆదాయము[మార్చు]

2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఘం ఆదాయం 703.70 లక్షలు, వ్యయము 603.28 లక్షలు.[1]

ఎన్నికలు[మార్చు]

ఈ పురపాలక సంఘాణికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టికి చెందిన శంకర్ రావు తొలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[2] అప్పటినుంచి 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-13. Retrieved 2014-03-09.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా మినీ, తేది 08-03-2014