Coordinates: 16°08′02″N 81°00′43″E / 16.133803°N 81.011904°E / 16.133803; 81.011904

మాజేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాజేరు
—  రెవెన్యూ గ్రామం  —
మాజేరు is located in Andhra Pradesh
మాజేరు
మాజేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°08′02″N 81°00′43″E / 16.133803°N 81.011904°E / 16.133803; 81.011904
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మాచవరపు సునీత
జనాభా (2011)
 - మొత్తం 3,998
 - పురుషులు 1,982
 - స్త్రీలు 2,016
 - గృహాల సంఖ్య 1,311
పిన్ కోడ్ 521131
ఎస్.టి.డి కోడ్ 08671

మాజేరు గ్రామం కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలంలో ఉంది. ఇది మండల కేంద్రమైన చల్లపల్లి నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1311 ఇళ్లతో, 3998 జనాభాతో 1668 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1982, ఆడవారి సంఖ్య 2016. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 269 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 58. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589753[1]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నేలకుర్రు, చిన్నాపురం, దాలిపర్రు, పూషడం, లంకపల్లి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పురావస్తుశాఖ వారి వివరాల ప్రకారం పూర్వం ఈగ్రామం పేరు మజేరికా విషశ్య. ఇది కాలక్రమేణా "మాజేరు"గా రూపాంతరం చెందింది. ఇచట జరిపిన తవ్వకాలలో పురాతన బౌద్ధ అవశేషాలు లభించాయి. కొత్త మాజేరు, పాత మాజేరు అను గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి చల్లపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

జిల్లాపరిషత్తు ప్రాథమికొన్నత పాఠశాల[మార్చు]

కోటి సూర్య ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల 14వ వార్షికోత్సవం, 2017,మార్చ్-19న ఘనంగా నిర్వహించినారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల (ఆదర్శ పాఠశాల)[మార్చు]

కైతేపల్లె దాస్

  1. కొత్త మాజేరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న కైతేపల్లి దాస్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత. వీరికి 2014, అక్టోబరు-12న హైదరాబాదులో, అరుంధతీ బంధు సేవామండలి వారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసినారు. ఒక నిరుపేద వ్యవసాయం కుటుంబం నుండి వచ్చిన వీరు, ఈ పురస్కారం అందుకొనడం విశేషం. [3]
  2. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో, మాస్టర్ జీ ఫౌండేషన్, విశ్వజన కళా మండలి అను సంస్థల వారు, సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో, వీరికి "సర్వేపల్లి రాధాకృష్ణన్" పురస్కారాన్ని అందజేసినారు. దేశంలోని పది రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన వ్యక్తులకు తగిన పురస్కారాలను మాస్టర్ జీ ఫౌండేషన్ సంస్థ అందించుచున్నది. శ్రీ కైతేపల్లి దాస్, కొత్తమాజేరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమేగాక, విద్య ఆవశ్యకతపై గ్రామంలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించినందుకు, ఈ పురస్కారం లభించింది. [4]
  3. వీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారం, ప్రశంసాపత్రాన్ని, 2016, సెప్టెంబరు-6న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో, భారత రాష్ట్రపతి శ్రీ ప్రణభ్ ముఖర్జీగారి చేతులమీదుగా అందుకున్నారు. [5]
  4. వీరిని, ఎం.వి.ఎల్.ఎ.ట్రస్ట్ జాతీయస్థాయిలో గ్లోబల్ రోల్ మోడల్ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసింది. 2016, సెప్టెంబరు-5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో రాష్ట్రానికి ఒక్కరు చొప్పున, రోల్ మోడల్ ఉపాధ్యాయులుగా ఎంపికచేసెదరు. ఈ సంవత్సరం ఆ పురస్కారం వీరికి దక్కినది. హైదరాబాదులోని రవీంద్రభారతి లో, 2016, నవంబరు-30న నిర్వహించిన గ్లోబల్ టీచర్స్ కాన్ఫరెన్స్-2016 లో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. [6]
  5. విశాఖపట్నం నగరానికి చెందిన ఎ.పి.జె.అబ్దుల్ కలాం స్మారక సంస్థ, వీరిని విద్యా భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. 2017, జూలై-9న, హైదరాబాదులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీరు స్వర్ణపతకాన్నీ, ఙాపికనూ, ధ్రువపత్రాన్నీ, అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, పేదల విద్యాభివృద్ధికి కృషిచేసినందుకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపికచేసారు. [8]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మాజేరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మాజేరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మాజేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 273 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1394 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1394 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మాజేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1394 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మాజేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, చేపలు

మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ బ్యాంక్.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మాచవరపు సునీత సర్పంచిగా 520 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయo:- ప్రతి యేడు దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు.
  2. ఈ ఊరిలో ఇంకా చాలా దేవాలయములు ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

అరెకపూడి శ్రీనివాస్[మార్చు]

2017, జూలై-10న, 60వ జాతీయ మత్స్య కృషీవలుర దినోత్సవం సందర్భంగా, కేంద్రీయ మంచినీటి సంస్థ, భువనేశ్వర్, ఒడిశా, మత్స్యశాఖ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ఉత్తమ చేపల రైతు పురస్కారం అందుకున్నారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4335.ఇందులో పురుషుల సంఖ్య 2179, స్త్రీల సంఖ్య 2156, గ్రామంలో నివాస గృహాలు 1114 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1668 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాజేరు&oldid=4130748" నుండి వెలికితీశారు