మాడపాటి హనుమంతరావు

వికీపీడియా నుండి

ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు (Madapati Hanumantha Rao) (1885 - 1970), కవి, రచయిత, బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు. హైదరాబాదు నగర తొలి మేయర్. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.

హనుమంతరావు 1885 జనవరి 22న కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరు గ్రామంలో ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన తండ్రి మాడపాటి వెంకటప్పయ్య, తల్లి వెంకటసుబ్బమ్మ. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు.

[మార్చు] మూలాలు

  • ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ. [1]

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు