దేవదాసి
దేవదాసి అంటే గుడి లోని దేవుడి ఉత్సవాల లో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ. సతి, బాల్యవివాహాలు, గణాచారి, లాంటి సాంఘిక దురాచారం.
[మార్చు] కఠిన నియమాలు
మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్ర్రదర్శిస్తూ,గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు. ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని స్కూల్లో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు. [1]
- గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి మాతంగి నులుగా, బసివి ని లుగా ఎలా బలితీసుకుంటారో వి.ఆర్.రాసాని "మట్టిమనుషులు" లో బయటపెట్టారు. దళిత స్త్రీలను జోగిని లుగా మార్చడం గురించి ‘‘జగడం ’’ నవలలో బోయ జంగయ్య చిత్రించారు.
- 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక హేమలతా లవణం కృషి వుంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
- జోగినుల వ్యవస్థ నిర్మూలనకు 'ఆశ్రయ్ ' సంస్థ ,ఆంధ్రప్రదేశ్ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన (ఎపిజెవివిఎస్) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
- జోగినిలు చదువుబాట పట్టాలి.
- అమ్మాయిలకు ఎవరో కట్టిన తాళిని తీసేయించాలి.జోగినులకు అందరిలా పెళ్లి చేయాలి.వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి.
- జోగినిల సంక్షేమం కోసం వారి అనారోగ్య సమస్యలు పరిష్కరించాలి.వారికి పింఛను ఇవ్వాలి
- తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి.
- వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ చట్టానికి సవరణలు తీసుకురావాలి.
[మార్చు] ఏకసభ్య కమిషన్
రాష్ట్రంలో జోగినీ , మాతంగి , దేవదాసి , బసవి మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ వి.రఘునాథరావుతో ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ కార్యాలయ చిరునామా: 'దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం, ఐదో అంతస్తు, రూమ్నెం-529, 530, 532, మసాబ్ట్యాంక్, హైదరాబాద్.సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి.
[మార్చు] మూలాలు
ర్