మామిడిపల్లి వీరభద్ర రావు

వికీపీడియా నుండి
సుత్తి వీరభద్ర రావు
Veerabadrarao.jpg
జన్మ నామం మామిడిపల్లి వీరభద్రరావు
జననం జూన్ 6 1947(1947-06-06)
Flag of భారత దేశం తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 1988(1988-06-30) (వయసు 41)
Flag of భారత దేశం మద్రాసు, భారతదేశం
ఇతర పేరు(లు) వీరభద్రుడు
భార్య/భర్త శేఖరి
ప్రముఖ పాత్రలు బాబాయ్ అబ్బాయ్

సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు (1947-1988) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు.


విషయ సూచిక

బాల్యము [మార్చు]

వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రధమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడ కు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.

వృత్తి [మార్చు]

చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాసలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు ని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్సకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రముతో చిత్రసీమ లో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్సకత్వములో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రము ఆఖరి చిత్రము.

రంగస్థలము [మార్చు]

ఆకాశవాణి [మార్చు]

చిత్రసీమ [మార్చు]

వ్యక్తిగత విషయములు [మార్చు]

మరణము [మార్చు]

1988 లో చూపులు కలసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదు లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. మధుమేహముతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు.అది 1988, జూన్ 30 తెల్లవారుఝామున జరిగింది.

చిత్రాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]