మీనాక్షి అమ్మవారి ఆలయం

వికీపీడియా నుండి
మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం
Temple de Mînâkshî01.jpg
పేరు: మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం
కట్టిన తేదీ: నిర్ధారించబడ లేదు
ప్రధానదైవం: దేవి మీనాక్షి (పార్వతి)
శిల్పశైలి: ద్రావిడ నిర్మాణ శైలి
స్థలం: మదురై, తమిళ్ నాడు, ఇండియా

మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళం: மீனாட்சி அம்மன் கோவில் ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం

51.9 metres (170 ft) ఎత్తు ఉంది.[citation needed]

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] పురాణ విలువలు

విష్ణు తన సోదరి మీనాక్షిని శివుడికి అప్పగిస్తున్న దృశ్యం

హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి, హిందువుల దేవత] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది, ఎందుకంటే భూమండలం మొత్తంగా మదురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. దేవతల నాటకం కారణంగా, ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా, పెళ్లి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ప్రతి ఏటా మదురైలో 'చిత్తిరై తిరువిళ' గా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ 'అళకర్ తిరువిళా' కు 'మీనాక్షి పెళ్లి' కి జత కుదిర్చాడు. అందుచేత 'అళకర్ తిరువిళా' లేదా 'చిత్తిరై తిరువిళ' పుట్టింది.

[మార్చు] ఆధునిక చరిత్ర

మూల నిర్మాణ చరిత్ర సరిగా తెలియదు కాని, గత రెండు వేల సంవత్సరాలుగా తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. తిరుజ్ఞానసంబంధర్, సుప్రసిద్ధ శైవ తత్వశాస్త్రంకి సంబంధించిన హిందూ మహర్షి , ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నాడు, ఇక్కడి దేవుడిని అలవాయి ఇరైవన్ అని వర్ణించాడు. ముస్లిం దురాక్రమణదారు మాలిక్ కపూర్ ద్వారా ఈ ఆలయం 1310లో కూల్చివేయబడినట్లు భావించబడింది మరియు దీనికి సంబంధించిన అన్ని పాత ఆనవాళ్లు ధ్వంసమైపోయాయి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనే నిర్ణయం మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు (1559-1600 A.D.) తీసుకున్నాడు, నాయక వంశం ప్రధానమంత్రి మరియు పొలిగర్ సిస్టమ్ నిర్మాత అయిన అరియనాథ ముదలియార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తర్వాత తిరుమలై నాయక్ రాజు సిర్కా 1623 నుండి 1659 వరకు దీనికి అమూల్య సహాయం చేశాడు. ఆలయం లోపల వెలుపల అనేక మండపాలు (వీరవసంతరాయర్ మండపం) నిర్మించడంలో ఇతడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, వసంతోత్సవాన్ని నిర్వహించేందుకోసం వసంత మండపాన్ని, కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు మరియు తెప్పకులమ్ వంటి రహదార్లు రాణి మంగమ్మాళ్‌చేత నిర్మించబడాయి. మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది.

[మార్చు] ఆలయ నిర్మాణం

ఆలయం ప్రాచీన మదురై నగరపు భౌగోళిక మరియి సాంప్రదాయిక కేంద్రంగా ఉంటోంది. ఆలయ గోడలు, వీధులు, చివరగా నగర గోడలు (ప్రాచీన) ఆలయం చుట్టూ చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి. నగరానికి కేంద్రంగా ఆలయం ఉండేదని వీధులు తామర పువ్వు మరియు దాని రేకులలాగా విస్తరించి ఉండేవని ప్రాచీన తమిళ కావ్యగ్రంధాలు సూచించాయి. ఇది నాలుగు ముఖాలలో నాలుగు ప్రవేశ ద్వారాలతో ఉన్న తమిళనాడులోని అతి కొద్ది ఆలయాలలో ఒకటిగా ఉంటోది.

ఆలయ సముదాయం గుండ్రంగా ఉండేది

45 acres (మూస:Convert/m2) మరియు ఆలయం 254 బై 237 మీటర్ల పొడవైన భారీ నిర్మాణంతో ఉండేది. ఆలయం 12 గోపురాలతో కూడి ఉండేది. వీటిలో అతి ఎత్తైనది సుప్రసిద్ధమైన దక్షిణ గోపురం, ఇది చాలా

170 ft (52 m) ఎత్తు.[1]కు పెరిగేంది.

[మార్చు] దైవపీఠాలు

ఆలయం అనేక మంది దేవతల సముదాయంగా ఉండేది. శివాలయం ఆలయ సముదాయపు నడిబొడ్డులో ఉండేది, దేవతల సాంప్రదాయిక ఆధిక్యత తర్వాత వృద్ధి చేయబడిందని ఇది సూచిస్తుంది. ఆలయం వెలుపల, ఏక శిలపై మలిచిన గణేష్ భారీ విగ్రహం ఉంది, అక్కడ భారీ గణేష్ ఆలయం ఉంది దీన్ని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. ఆలయ కోనేరును తవ్వే ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ దేవత కనుగొనబడిందని భావించబడుతోంది. మీనాక్షి విగ్రహం శివ విగ్రహానికి ఎడమ వైపున ఉంది మరియు శివ విగ్రహంతో పోలిస్తే ఇది పెద్దగా శిల్పలావణ్యంతో ఉండదు.

[మార్చు] వెళ్ళి అంబాలమ్

ఇది శివుడి వెళ్ళి (తమిళం) యొక్క అయిదు రాజమందిరాలలో (సభై లేదా సభ) ఒకటి, సిల్వర్ అంబాలమ్ (తమిళం)= వేదిక లేదా దైవపీఠం. ఈ శివ పీఠంకూడా హిందూ దేవుడు నటరాజు అసాధారణ శిల్పంతో కూడి ఉంది. భారీ నటరాజ విగ్రహం భారీ రజత పీఠంపై ఉంది అందుచేత దీన్ని వెళ్ళి అంబాలం (రజిత పీఠం) అని పిలుస్తుంటారు. సుప్రసిద్ధమైన హిందూ గోపురం మరియు శివుడి నృత్య రూపం, సాధారణంగా అతడి ఎడమ పాదం లేపి ఉంటుంది, అతడి కుడిపాదం ఈ ఆలయంలో లేపి ఉంటుంది. పురాణం ప్రకారం శివుడి ప్రియ భక్తుడైన రాజశేఖర పాండ్య అభ్యర్థన మేరకు ఇలా జరిగిందట. అతడు దేవుడిని తన స్థానం మార్చుకోమని కోరాడు, ఎప్పుడూ ఒకే పాదాన్ని లేపి ఉంటే అది ఆ పాదంపై అపారమైన వత్తిడి కలుగజేస్తుందని అతడు భావించాడు. నాట్యం చేస్తున్నప్పుడు తన వ్యక్తిగత అనుభవం ప్రాతిపదికన అతడిలా కోరాడు.

తమిళనాడులో శివుడికున్న ఇతర నాలుగు పీఠాలు:

సభ (కోర్ట్) ప్రాంతం దేవత దీనితో తయారు చేయబడింది
పొన్ అంబలమ్‌పోర్‌సభై చిదంబరం బంగారం
చిత్ర సభై కుర్తాళం లేదా రాగి
రత్న సభై తిరువళ్లంగాడు రత్నాలు

[మార్చు] పోర్తమారై సరస్సు

పోర్తమారై కులమ్ , ఆలయంలోని పవిత్రమైన సరస్సు భక్తులకు చాలా పవిత్రమైన స్థలం. ప్రజలు ప్రధాన మండపంలోకి ప్రవేశించే ముందు సరస్సు

165 ft (50 m)చుట్టూ

120 ft (37 m) తిరుగుతారు. ఈ పదానికి స్వర్ణ కమలంతో కూడిన సరస్సు అని అర్థం, మరియు దానిలో పెరుగుతున్న కమలం బంగారు రంగుతో ఉంటుంది. పురాణం ప్రకారం, శివుడు చేప లేదా ఏ సముద్ర జీవి ఈ తటాకంలో పెరగలేవని ఒక పక్షికి వాగ్దానం చేశాడట, అందుకే ఈ సరస్సులో ఎలాంటి సముద్ర ప్రాణులు కనిపించవు.[2] తమిళ/0} పురాణాల ప్రకారం, ఈ సరస్సు కొత్త సాహిత్య విలువను నిర్ణయించే న్యాయమూర్తిగా భావించబడేది. అందుచేత, రచయితలు తమ రచనలను ఇక్కడ ఉంచేవారు, పేలవంగా రాయబడిన రచనలు ఇక్కటి నీటిలో మునిగిపోయేవి, ప్రతిభావంతమైన రచనలు నీటిపైన తేలేవి.

[మార్చు] వేయిస్తంభాల మంటపం

ఉదయం వేళ వేయి స్తంభాల మందిరంలో ఒక భాగం.
వేయిస్తంభాల మంటపం లో వీణ చేతపట్టిన పడతి చిత్రం .

మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వేయి స్తంభాల మంటపం తిరునల్వేలి లోని పురాతన నెల్లయప్పార్ ఆలయం నమూనాగా నిర్మించబడింది. ఆయిరం కాల్ మండపం లేదా వేయి స్తంభాల మంటపం 985 (1000కి బదులుగా) చెక్కిన స్తంభాలను కలిగి ఉన్నాయి. దీన్ని సాంస్కృతికంగా అతి ముఖ్యమైన స్థలంగా గుర్తించారు, దీన్ని భారతీయ పురావస్తు సర్వే విభాగం వారు నిర్వహిస్తున్నారు. వేయి స్తంభాల మంటపం 1569[3]లో అరియనాథ ముదలియార్‌చే నిర్మించబడింది. ఇతడు మొట్టమొదటి telugu మదురై నాయక రాజు అయిన విశ్వనాధ నాయకుడి ప్రధానమంత్రి మరియు సేనాధిపతిగా ఉండేవాడు. (1559-1600 A.D.) ఇతడు పాలెగాళ్ల వ్యవస్థ, దేశంలో ఇది భూస్వామ్య సంస్థకు సమానమైనట్టిది, ఇది పలు పాళ్యంలు లేదా చిన్న ప్రాంతాలుగా విభజించబడేది, ప్రతి పాళ్యం కూడా పాళయక్కార్ లేదా ఉప అధికారిచేత పాలించబడేది[4]. మండపం ప్రవేశద్వారం వద్ద, ఇప్పటికీ అతడి విగ్రహాన్ని మనం చూడగలం; అరియనాథ ముదలియార్ భారీ విగ్రహం ఆలయ ప్రవేశద్వారం వద్ద ఒక వైపున సుందరమైన పంచకళ్యాణిపై కూర్చుని ఉండే భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహానికి ఈనాటికీ నేటి భక్తులు పూలదండలు వేసి కొలుస్తుంటారు.[3]. ఇందులోని ప్రతి స్తంభమూ చెక్కబడింది మరియు ద్రావిడ సంస్కృతి యొక్క కళాఖండంగా ఉంటుంది. ఈ మంటపంలోనే ఆలయ కళా వస్తుప్రదర్శన శాల ఉంది, ఇక్కడ 1200 సంవత్సరాల పురాతన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు ఇతర వస్తువులు ప్రదర్శింబడుతున్నాయి. ఈ మంటపం వెలుపల, పశ్చిమం వైపుగా, సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. మంటపం దక్షిణం వైపున కల్యాణ మంటపం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో చిత్తిరై పండుగ కాలంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు.

[మార్చు] అష్ట శక్తి మంటపం

ఇది ఆలయ తూర్పు గోపురం సమీపంలోని మీనాక్షి గర్భగుడి గోపురం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మొట్టమొదటి మంటపం. ఈ మంటపంలో ఎనిమండుగురు దేవతలు ఉంటున్నారు కనుక దీనికి అష్ట శక్తి మంటపం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మనం ఈ మంటపంలో అనేక పూజాసామగ్రిని అమ్మే అంగళ్లను చూస్తాము.

[మార్చు] ఆలయ గోపుర వివరాలు

Meenadet3.jpg Meenadet4.jpg Meenadet17.jpg Meenadet12.jpg

Meenadet16.jpg Meenadet5.jpg Meenadet15.jpg Meenadet10.jpg

[మార్చు] పండుగలు

మీనాక్షి తిరుకళ్యాణం (మీనాక్షి పవిత్ర కళ్యాణం) ఈ ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఏటా ఏప్రిల్‌లో దీన్ని నిర్వహిస్తారు. ఆ నెల పొడవునా, -తమిళనాడులోని దాదాపు అన్ని ఆలయాలు వార్షిక ఉత్సవాలను జరుపుకుంటుంటాయి- తేర్ తిరువిళాహ్ (రథోత్సవం) మరియు తెప్ప తిరువిళాహ్ (తెప్పోత్సవం)తోపాటు పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతోపాటు, ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడతాయి. తమిళనాడులోని అనేక శక్తి ఆలయాల లాగా, తమిళ నెలలు ఆడి (జూలై 15 - ఆగస్ట్ 17) మరియు తాయి (జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15) వరకు శుక్రవారాలలో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి తమిళ నెలలోనూ అవని ఉర్చవమ్, మార్గళి ఉత్సవం, నవరాత్రి వంటి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, మీనాక్షి తిరుకల్యాణోత్సవం లాగా అవని మూలోత్సవం కూడా మీనాక్షి అమ్మవారి ఆలయంలో అతి ముఖ్యమైన పండుగదినం. పది రోజులు పాటు జిరిగే ఈ ఉత్సవం ప్రధానంగా సుందరేశ్వరార్ దేవుడికి అంకితం చేయబడుతుంది. దీంట్లో అతడికి చెందిన పలు లీలలను వర్ణిస్తుంటారు a.k.a. ఈ దేవుడి భక్తులను అష్టకష్టాలనుంచి తప్పించడం కోసం మదురై నగరంలో తిరువిలాయడల్‌ని నిర్వహిస్తారు.

[మార్చు] ప్రస్తుత పరిస్థితి

ఆలయ గోపురాలను 2009 మార్చివరకు తిరిగి రంగులు అద్దడానికి గాను పరంజాలతో కప్పి ఉంచేవారు. ఈ పని 2009 ఏప్రిల్ నాటికి పూర్తి చేయబడింది, దుర్వ్యసనాలకు దూరంగా ఉండే అనేకమంది ఆలయ కళాకారులను ఈ పనికోసం కేటాయించారు. ఆలయం లోపల పెయింటింగులు, గోడలు, శిల్పాలు, విగ్రహాలు వంటి వాటిని పురావస్తు పరంగా పునరుద్ధరించే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. ఇప్పుడు ఆలయం చాలా కొత్తగా తయారైంది.

ఆలయ శుద్ధి (కుంభాభిషేకం) కార్యక్రమాన్ని 2009 ఏప్రిల్ 8న 9 గంటలు, గం.9.45ల మధ్య 300 మంది శివాచార్యులు అపూర్వ రీతిలో నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాక మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకానికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

[మార్చు] వీటిని కూడా చూడండి

  • అన్నామలయ్యార్ ఆలయం
  • కాళహస్తి ఆలయం
  • ఏకాంబరేశ్వరాలయం
  • చిదంబరం ఆలయం
  • తిరువానైకావల్ ఆలయం
  • నెల్లయప్పర్ ఆలయం
  • శ్రీశైలం ఆలయం

[మార్చు] సూచనలు

  1. "Madurai.com - The meenakshi, temple". 
  2. "Temple theertham". 
  3. 3.0 3.1 హిస్టరీ&డిస్క్రిప్షన్ ఆఫ్ శ్రీ మీనాక్షి టెంపుల్: బై T. G. S. బలరామ్ అయ్యర్, T. R. రాజగోపాలన్ - మీనాక్షి ఆలయం - 1977 - 42 పుటలు
  4. సెయింట్స్, గాడెసెస్ అండ్ కింగ్స్ బై సుసాన్ బాయ్‌లే

[మార్చు] బాహ్య లింకులు

మూస:Famous Shiva temples మూస:HinduMythology


అక్షాంశరేఖాంశాలు: 9°55′10″N 78°07′10″E / 9.91944, 78.11944