ముచ్చ సేనాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనందగోత్రికులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

ముచ్చ సేనాని రేచర్ల బమ్మసేనానికి కుమారుడు లేదా మనుమడుగా భావిస్తున్నారు. అతను కాకతి మొదటి ప్రోలరాజు(1052-1076) వద్ద చమూపతిగా (సామంతునిగా) పనిచేశాడు. అతను కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. చక్రకూటము, కొంకణము, కొర్పర్తి, గుణసాగరము, వేములవాడ, మొదలగు ప్రాంతములను సాధించుటలో ఇతను మొదటి ప్రోలరాజునకు చాలా సహాయం చేసాడు. ఇతనికి అరిగజ కేసరి అను బిరుదు ఉంది. ఇతను విరియాల వంశజులతో కలసి కాకతి రాజ్య విస్తరణకు పాటుపడినాడు. ఇతను సైన్యాధిపతిగా చేసాడు.

అతని తండ్రి రేచర్ల బమ్మసేనాని రేచర్ల రెడ్డి వంశ మూల పురుషుడు. ఇతడినే బమ్మిరెడ్డి(1035-1055) అని పిలుస్తారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. [1]

అతని కుమారుడు ఒకటో కాట సేనాని రెండో బేతరాజు(1076-1108) వద్ద సేనానిగా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. "కాకతీయుల సామంతులు". www.notificationsadda.in. Retrieved 2020-07-22.