మెసొపొటేమియా నాగరికత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెసొపొటేమియాఅనే పదం (గ్రీకు నుండి తీసుకోబడింది. దీనికి అరబికు భాషలో అర్ధం Μεσοποταμία "నదుల మధ్య [భూమి]"(అరబిక్ లోبلاد الرافدينగా) అన్వయించబడింది bilād al-rāfidayn )[1] భౌగోళిక వర్ణన అధారితంగా స్వికరించబడిన ఈ పేరుకు తగినట్లుగా ఇది టైగ్రిసు-యూఫ్రేట్సు నదీవ్యవస్థ ప్రాంతంగా ఉంది. ఆధునిక ఇరాక్కు అధికంగా టైగ్రిసు, యూఫ్రేట్సు నదీజలాలు అధికంగా సహకరిస్తున్నాయి.[2] అలానే ఇది ఈశాన్య సిరియా కొన్ని ఖండాలు,[2] టర్కీ కొన్ని దక్షిణతూర్పు ప్రాంతాలు, ఇరాన్ దక్షితూర్పు ఖుజెస్థాను జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.[3][4]

దీనిని నాగరికత సంరక్షణగా విస్తారంగా భావించబడింది, కంచుయుగం మెసొపొటేమియా సుమేరు, అక్కాడియను, బాబిలోనియా ఇంకా అస్సిరియా సామ్రాజ్యాలను కలుపుకుంది. ఇనుప యుగం లో, నూతన-అస్సిరియా, నూతన-బాబిలోనియా సామ్రాజ్యలు పరిపాలించాయి. వేరే దేశంకు చెందిన సుమేరియన్ల, అక్కాడియన్ల (వీరిలో అస్సిరియన్లు & బాబిలోనియన్లు ఉన్నారు) అధీనంలో దాదాపు చరిత్ర వ్రాయబడిన క్రీ.పూ.3100 నాటినుండి క్రీ.పూ.539 లో బాబిలోను పతనం వరకు ఉంది. ఇది తర్వాత దీనిని అచమెనిదు సామ్రాజ్యం జయిచింది. క్రీ.పూ.332లో దీనినిఅలెగ్జాండరు ఆక్రమించాడు. అలెగ్జాండరు మరణం తర్వాత గ్రీకు సెల్యుసిడు సామ్రాజ్యంలో భాగమయ్యింది. క్రీ.పూ. 150 నాటికి మెసొపొటేమియా పార్థియన్ల నియంత్రణలోకి వచ్చింది. మెసొపొటేమియాలోని కొన్ని భాగాలు (ముఖ్యంగా అస్సిరియ) క్రమముగా రోమను నియంత్రణలోకి రావడంవల్ల మెసొపొటేమియా రోమన్ల, పార్థియన్ల యుద్దభూమిగా అయ్యింది. సా.శ. 226 లో సస్సానిదు పర్షియన్ల ఆక్రమణలోకి వెళ్ళింది. సా.శ. 7వ శతాబ్దంలో సస్సానిదు సామ్రాజ్యం విజయం వరకు ఇది పర్షియన్ల ఆక్రమణలో ఉంది. క్రీ.పూ.1 వ శతాబ్దం నుండి సా.శ. 3వ శతాబ్దం వరకు అనేక మెసొపొటేమియా రాజ్యాలు ఉద్భవించాయి; అడియబెను, ఒష్రోయను, హత్రా.

శబ్దఉత్పత్తి శాస్త్రం[మార్చు]

Map showing the Tigris–Euphrates river system, which surrounds Mesopotamia

ప్రాంతీయ స్థలవర్ణన పేరు మెసొపొటేమియా మెసో (μέσος) అంటే అర్ధం మధ్య, పొటేమియా ποταμός అర్ధం నది, మెసొపొటేమియా అంటే "రెండు నదుల మధ్య"). దీనికి హెల్లెనిస్టికు కాలంలో కచ్చితమైన సరిహద్దులు లేనట్లు భావించబడింది. ఇది విస్తారమైన భౌగోళిక ప్రాంతంగా సూచించబడింది. దీనిని బహుశా సెల్యుసిదులు ఉపయోగించారు. బిరిటుం (బిరిట్ నరిం) అనేపదం అదేవిధమైన భౌగోళిక అంశం కలిగి ఉంది. దీనిని క్రీ.పూ 10వ శతాబ్దంలో అరమైకు జేషన్ సమయంలో కనుగొన్నారు.[5] అయిననూ పూర్వ మెసొపొటేమియా సంఘాలు మొత్తం ఒండ్రుమట్టిని సుమేరియన్ లో కలాం గా సూచించటాన్ని (lit. "భూమి") అధికంగా ఆమోదించారు. ఈ మధ్య వాడుకలో కొచ్చిన పదాలు "గ్రేటర్ మెసొపొటేమియా" లేదా "సైరో-మెసొపొటేమియా" లాంటివి తూర్పు దగ్గర లేదా మధ్య తూర్పు భూగోళ భూభాగాన్ని సూచించడానికి ఉపయోగించారు. తర్వాత వచ్చిన యూరోసెంట్రికు పదాలు 19వ శతాబ్దం అనేక ఆక్రమణల మధ్యలో ఉన్న ప్రాంతానికి ఆరోపించబడ్డాయి.[6]

హిబ్రూ, అరామికు సమానమైన నహరైమ్లను అనువదించడానికి గ్రీకు సెప్టువాజింటు (క్రీ.పూ. 250) అంతటా దీనిని ఉపయోగిస్తారు. అలెగ్జాండరు అనాబాసిసు నుండి గ్రీకు పదం మెసొపొటేమియా అనే పేరు ఉపయోగించబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది సా.శ. 2 వ శతాబ్దం చివరలో వ్రాయబడినప్పటికీ ప్రత్యేకంగా అలెగ్జాండరు ది గ్రేట్ కాలం నుండి లభించిన మూలాలను ఇది సూచిస్తుంది. అనాబాసిస్‌ఉలో ఉత్తర సిరియాలోని యూఫ్రటీసుకు తూర్పున ఉన్న భూమిని గుర్తించడానికి మెసొపొటేమియా ఉపయోగించబడింది.

మెసొపొటేమియా అనే పదాన్ని యూఫ్రటీసు, టైగ్రిసుల మధ్య ఉన్న భూములన్నింటికీ ఈ పేరును వర్తించారు. సిరియాలోని కొన్ని భాగాలను మాత్రమే కాకుండా ఇరాక్, ఆగ్నేయ టర్కీలను భూభాగాలు కూడా ఇందులో భాగంగా ఉండేవి.[7] యూఫ్రటీసు పశ్చిమాన, జాగ్రోస్ పర్వతాల పశ్చిమ భాగంలో పొరుగున ఉన్న స్టెప్పీలు కూడా విస్తారమైన మెసొపొటేమియా భూభాగంలో చేర్చబడ్డాయి.

సాధారణంగా ఉత్తర లేదా ఎగువ మెసొపొటేమియా, దక్షిణ లేదా దిగువ మెసొపొటేమియా అని విభజించి విభిన్నమైన పేర్లుగా వ్యవహరించ బడుతుంది..[8][9][10] యూఫ్రటీసు, టైగ్రిసుల మధ్య బాగ్దాదు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎగువ మెసొపొటేమియాను జాజీరా అని కూడా పిలుస్తారు. .[11] దిగువ మెసొపొటేమియా బాగ్దాదు నుండి పర్షియను గల్ఫు వరకు ఉన్న ప్రాంతం, కువైటు - పశ్చిమ ఇరాను భాగాలను కలిగి ఉంది..[8] ఆధునిక విద్యా వాడుకలో మెసొపొటేమియా అనే పదం తరచుగా ఉంటుంది. ముస్లిం ఆక్రమణల వరకు ఈ ప్రాంతాన్ని సూచించడానికి సాధారణంగా ఈ పదం ఉపయోగిస్తారు.[7][12]

చరిత్ర[మార్చు]

One of 18 Statues of Gudea, a ruler around 2090 BC

చరిత్రపూర్వ పురాతన నియరు ఈస్టు దిగువ పాలియోలిథికు కాలంలో ప్రారంభమవుతుంది. 5వ ఉరుకు కాలంలో (క్రీ.పూ. 4 వ మిలీనియం) పిక్టోగ్రాఫికు లిపితో ఉద్భవించింది. వాస్తవ చారిత్రక సంఘటనల డాక్యుమెంటు రికార్డు - దిగువ మెసొపొటేమియా పురాతన చరిత్ర - క్రీ.పూ 3 వ సహస్రాబ్దిలో ప్రారంభ రాజవంశం రాజుల కాలంలో క్యూనిఫాం రికార్డులతో ప్రారంభమైంది. చరిత్ర పూర్వపు ఈ చరిత్ర క్రీ.పూ. 6 వ శతాబ్దం చివరలో అచెమెనిదు సామ్రాజ్యం రాకతో ముస్లింల ఆక్రమణ, సా.శ. 7 వ శతాబ్దం చివరలో కాలిఫేటు స్థాపనతో ముగుస్తుంది. తరువాత నుండి ఈ ప్రాంతం ఇరాక్ అని పిలువబడింది. ఈ సుదీర్ఘ కాలంలో మెసొపొటేమియా ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, సామాజికంగా సంక్లిష్టమైన రాజ్యాలను కలిగి ఉంది.

ఈజిప్టులోని నైలు లోయ, భారత ఉపఖండంలోని సింధు లోయ నాగరికత చైనాలోని పసుపు నది నాగరికతలతో కనుగొనబడిన నాలుగు నదీ నాగరికతలలో మెసపొటేమియా నాగరికత ఒకటి. మెసొపొటేమియా చారిత్రాత్మకంగా ముఖ్యమైన నగరాలైన ఉరుకు, నిప్పూరు, నినెవె, అస్సూరు, బాబిలోన్లతో పాటు ప్రధాన ప్రాదేశిక రాజ్యాలైన ఎరిడు నగరాలు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అక్కాడియను రాజ్యాలు, మూడవ రాజవంశం, వివిధ అస్సిరియను సామ్రాజ్యాల పాలనలో ఉంది. కొన్ని ముఖ్యమైన చారిత్రక మెసొపొటేమియన్ నాయకులు ఉరు-నమ్ము (ఉరు రాజు), అక్కాడు సర్గోను (అక్కాడియను సామ్రాజ్య స్థాపకుడు), హమ్మురాబి (పాత బాబిలోనియను రాజ్యాన్ని స్థాపకుడు), రెండవ అషురు-ఉబలిటు, మొదటి టిగ్లాతు-పిలేజరు (అస్సిరియను సామ్రాజ్య స్థాపకుడు).

జర్మనీలోని ఒక పురాతన శ్మశానవాటికలో దొరికిన 8,000 సంవత్సరాల పురాతన రైతుల అవశేషాల నుండి శాస్త్రవేత్తలు డిఎన్‌ఎను విశ్లేషించారు. వారు జన్యు సంతకాలను ఆధునిక జనాభాతో పోల్చారు. ప్రస్తుత టర్కీ, ఇరాకు నివసిస్తున్న ప్రజల డి.ఎన్.ఎ.తో సారూప్యతలు ఉన్నట్లు కనుగొన్నారు.[13]

కాలానుక్రమణ[మార్చు]

  • పూర్వ- ప్రోటోహిస్టరీ
జర్మో (రెడ్ డాట్, సిర్కా క్రీ.పూ 7500) ప్రారంభమైన తరువాత క్రీ.పూ 7 వ -5 వ సహస్రాబ్దిలో మెసొపొటేమియా నాగరికతలో భాగంగా ఉన్న ఉత్తరాన హసునా సంస్కృతి, వాయవ్యంలో హలాఫు సంస్కృతి, మధ్య మెసొపొటేమియాలోని సమారా సంస్కృతులు కేంద్రీకృతమై ఉంది. ఆగ్నేయంలో ఉన్న ఉబైదు సంస్కృతి తరువాత మొత్తం ప్రాంతంలో విస్తరించింది
    • ప్రీ-పాటరీ నియోలిథికు ఎ (క్రీ.పూ 10,000–క్రీ.పూ8700)
    • ప్రీ-పాటరీ నియోలిథికు బి (క్రీ.పూ8700–క్రీ.పూ6800)
    • జర్మో (క్రీ.పూ. 7500-క్రీ.పూ5000)
    • హసునా (క్రీ.పూ6000 క్రీ.పూ–? క్రీ.పూ.),సమర్రా (క్రీ.పూ5700-క్రీ.పూ4900), హలాఫు సంస్కృతులు (క్రీ.పూ6000–క్రీ.పూ5300) సంస్కృతులు
  • ఉబైద్ కాలం (క్రీ.పూ5900–క్రీ.పూ4400)
    • ఉరుకు కాలం (క్రీ.పూ4400–క్రీ.పూ3100)

జెమ్డెట్ నాస్ర్ కాలం (క్రీ.పూ3100-2900క్రీ.పూ)[14]

  • ప్రారంభ కంచుయుగం
    • ప్రారంభ రాజవంశం కాలం (క్రీ.పూ2900–క్రీ.పూ2350)
    • అక్కాడియను సామ్రాజ్యం (క్రీ.పూ.~ 2350–క్రీ.పూ2100)
    • ఉరు మూడవ రాజవంశం (క్రీ.పూ.2112-క్రీ.పూ2004)
    • ప్రారంభ అస్సిరియను రాజ్యం (క్రీస్తుపూర్వం 24 నుండి 18 వ శతాబ్దం)
  • మధ్య కంచుయుగం
    • ప్రారంభ బాబిలోనియా (క్రీ.పూ 19 నుండి క్రీ.పూ18 వ శతాబ్దం)
    • మొదటి బాబిలోనియను రాజవంశం (క్రీ.పూ 18 నుండి క్రీ.పూ17 వ శతాబ్దం)
    • మినోయను విస్ఫోటనం (క్రీ.పూ. 1620)
  • చివరి కంచుయుగం
    క్రీ.పూ. 15 వ శతాబ్దంలో భౌగోళిక పటం అస్సిరియా ప్రధాన భూభాగం దాని రెండు ప్రధాన నగరాలతో అస్సూరు, నినెవెహు ప్రాంతాలు బాబిలోనియా దిగువలో ఉన్న మితాన్నీ, హట్టి ఎగువప్రవాహిత ప్రాంతం మధ్య విస్తరించింది
    • పాత అస్సిరియను కాలం (క్రీస్తుపూర్వం 16 నుండి 11 వ శతాబ్దం)
    • మధ్య అస్సిరియను కాలం (క్రీ.పూ. 1365-క్రీ.పూ1076)
    • బాబిలోన్లోని కస్సైట్సు (క్రీ.పూ. 1595–క్రీ.పూ1155)
    • చివరి కాంస్య యుగం పతనం (క్రీ.పూ 12 నుండి 11 వ శతాబ్దం)
  • ఇనుప యుగం
    • సిరో-హిట్టిటు రాజ్యాలు (క్రీ.పూ 11 నుండి క్రీ.పూ.7 వ శతాబ్దం వరకు)
    • నియో-అస్సిరియను సామ్రాజ్యం (క్రీ.పూ. 10 నుండి క్రీ.పూ.7 వ శతాబ్దం)
    • నియో-బాబిలోనియను సామ్రాజ్యం (క్రీ.పూ. 7 నుండి క్రీ.పూ.6 వ శతాబ్దం)
  • శాస్త్రీయ ప్రాచీనత
    • పర్షియను బాబిలోనియా, అచెమెనిదు అస్సిరియా (క్రీ.పూ 6 నుండి క్రీ.పూ.4 వ శతాబ్దం)
    • సెలూసిదు మెసొపొటేమియా (క్రీ.పూ. 4 నుండి 3 వ శతాబ్దం)
    • పార్థియను బాబిలోనియా (క్రీ.పూ 3 వ శతాబ్దం నుండి సా.శ. 3 వ శతాబ్దం)
    • ఓస్రోయిను (క్రీ.పూ 2 వ శతాబ్దం నుండి సా.శ. 3 వ శతాబ్దం)
    • అడియాబెను (సా.శ. 1 నుండి 2 వ శతాబ్దం)
    • హత్రా (సా.శ. 1 నుండి 2 వ శతాబ్దం)
    • రోమను మెసొపొటేమియా (సా.శ. 2 నుండి 7 వ శతాబ్దాలు), రోమను అస్సిరియా (సా.శ. 2 వ శతాబ్దం)
  • పురాతన కాలం
    • పామిరిను సామ్రాజ్యం (సా.శ. 3 వ శతాబ్దం)
    • అసిరిస్టను (సా.శ. 3 వ నుండి సా.శ.7 వ శతాబ్దం)
    • యుఫ్రటెన్సిసు (సా.శ. 4 వ శతాబ్దం మధ్య నుండి క్రీ.పూ. 7 వ శతాబ్దం వరకు)
    • ముస్లిం ఆక్రమణ (సా.శ. 7 వ శతాబ్దం మధ్యలో)

భూగోళికం[మార్చు]

Known world of the Mesopotamian, Babylonian, and Assyrian cultures from documentary sources

మెసొపొటేమియా యూఫ్రేట్సు, టిగ్రిసు నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ రెండూ నదులు ప్రస్తుత టర్కీ లోని ఆర్మేనియా కొండలలో జన్మించాయి. ఈ రెండూ నదులకు అనేక ఉపనదుల సామూహాలు ఉన్నాయి. మొత్తం నదీ వ్యవస్థ విస్తారమైన కొండప్రాంతాలలో ప్రవహిస్తుంది. యూఫ్రేట్సు నదీప్రవాహాలు మెసొపొటేమియా భూమార్గాలలో ప్రవహిస్తాయి. టిగ్రిసు తీరప్రాంతాలు తరచుగా కోణీయంగా, కఠినంగా ఉంటాయి. ఈ ప్రాంతం అర్ధ-శుష్క శీతోష్ణస్థితితో ఉత్తరం ప్రాంతంలో ఎడారి వ్యాప్తితో దక్షిణంలో 6,000 చదరపు మైళ్ళు కచ్చాలు, చెరువులు, బురద నేలలు, వెదురు తీరాలు ఉంటాయి. యూఫ్రేట్సు, టిగ్రిసు దక్షిణ చివర భాగంలో సంగమించి పర్షియను గల్ఫులో సముద్రంలో సంగమిస్తాయి.

ఉత్తరం వైపున ఉన్న వర్షాధార వ్యవసాయ ప్రాంతాల నుండి దక్షిణాన వ్యవసాయక్షేత్రాల వరకు శుష్క వాతావరణం ఉంటుంది. ఒకవేళ " ఎనర్జీ రిటర్న్డు ఆన్ ఎనర్జీ ఇన్వెస్టెడు " (EROEI) మిగులు ఉంటే పొందబడుతుంది. జాగ్రోసు కొండలు, అర్మేనియను కార్డిల్లేరా శిఖర ప్రాంతాలలో ఉన్న మంచుకరిగి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించడానికి సహకరిస్తాయి. టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మూలం ఆ ప్రాంతానికి ఆ పేరును ఇచ్చింది. కాలువల నిర్మాణం నిర్వహణకు అవసరమైన కార్మికశక్తి సరఫరాసామర్థ్యం ఆధారంగా నీటిపారుదల ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాచీనకాలంనుండి పట్టణాల ఏర్పాటుకు, రాజకీయ అధికారం కేంద్రీకృత విధానాలకు సహకరించింది. వ్యవసాయం అంతటా కూడా సంచార జీవితంతో అనుబంధం కలిగి ఉంది. ఇక్కడ దిమ్మరులు వేసవి మాసాలలో నదీ పచ్చికప్రాంతాలు మేకల గొర్రెల మందలను (ఒంటెలను)శిబిరాలతో నివసించే దిమ్మరులతో నిండి ఉంటుంది. చిత్తడిగా ఉండే చలికాలంలో ఎడారి తీరప్రాంతంలోని పచ్చిక మైదానం లోకి తీసుకుని రాబడతాయి. ఈ ప్రాంతంలో కట్టడరాయి, విలువైన ఖనిజాలు, వృక్షాలు తక్కువగా ఉండేవి. అందువలన చారిత్రాత్మకంగా ఈ వస్తువులను బాహ్య ప్రాంతాల పొందడానికి అతి దూరంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వర్తకం మీద ఆధారపడి ఉంది. దేశం దక్షిణ భాగంలో ఉన్న కచ్చా ప్రాంతాలలో చారిత్రిక కాలాల ముందు నుండి సంక్లిష్ట జలచరాలను పట్టే ఆచారం ఉంది. ఇది సాంస్కృతిక మిశ్రమానికి కారణం అయింది.

సాంస్కృతిక విధానంలో అనేక కారణాలతో క్రమానుసార ఘటనలు సంభవించాయి. కాలక్రమేణా కార్మికులకు గిరాకీ అధికరించడం జనాభా అధికరించడానికి దారితీసి ఆవరణ సామర్థ్య అవధులను విస్తరింపజేసింది. వాతావరణ అనిశ్చితి కేంద్ర ప్రభావం పతనం జనాభా తరుగదల సంభవించడానికి కారణం అయింది. ప్రత్యామ్నాయంగా కొండ జాతులు, సంచార ప్రాంతాలలో సంచారజాతుల ముట్టడి కారణంగా వర్తకం పతనం నీటిపారుదల విధానాల నిర్లక్ష్యతకు దారితీసాయి. అదేవిధంగా పట్టణ రాజ్యాలలో కేంద్రమండల ధోరణలు మొత్తం ప్రాంతం మీద కేంద్రకృత అధికారానికి దారితీసింది. అధికారం అమలు చేసినప్పుడు క్షణికమైన, స్థానికాధికారం జాతుల లేదా చిన్న ప్రాంతీయ భాగాల అధికారం వచ్చింది.[15] ఈ శైలులు ఈనాటి వరకు ఇరాక్లో కొనసాగుతున్నాయి.

భాష, లిపి[మార్చు]

Square, yellow plaque showing a lion biting in the neck of a man lying on his back
One of the Nimrud ivories shows a lion eating a man. Neo-Assyrian period, 9th to 7th centuries BC.

మెసొపొటేమియాలో వ్రాయబడిన ప్రాచీన భాష సుమేరియను (సమ్యుక్త భాష). మెసొపొటేమియాలో సుమేరియనుతో ప్రాచీన భాషా మాండలికాలు కూడా వాడుకలో ఉండేవి. ప్రాచీన భాషల తరువాత అక్కాడియను విశిష్టమైన భాషగా అయ్యింది. అయినప్పటికీ సుమేరియను పరిపాలన, మతపరమైన, సాహిత్యక, శాస్త్రీయ అవసరాల కొరకు ఉపయోగించబడింది. నవీన- బాబిలోనియను కాలం చివర వరకు అక్కాడియను అనేక వైవిధ్యాలతో ఉపయోగించబడింది. అప్పటికే మెసొపొటేమియాలో సాధారణవాడుకలో ఉన్న అరమైకు అచెమినిదు, పర్షియా సామ్రాజ్యం అధికారిక భాషగా చేయబడి అక్కాడియను నిరుపయోగం అయ్యింది. ఇదీ సుమేరియాలో కొన్ని శతాబ్దం వరకు ఆలయాలలో ఉపయోగించారు.

ప్రాచీన మెసొపొటేమియాలో (క్రీ.పూ.4వ మిల్లియనియం మధ్య సమయంలో) కీల లిపి కనుగొనబడింది. సాహిత్య పరంగా కీల లిపి అర్ధం "కీల-ఆకారం", చిత్తడిగా ఉన్న బంకమన్ను మీద గుర్తులను ముద్రించడానికి వాడిన త్రికోణసూది కొనతో ముద్రించబడింది. కీలాకార గుర్తు ప్రామాణీకరణ ఆకృతి చిత్ర సంజ్ఞల నుండి అభివృద్ధి చేసినట్టు అగుపిస్తుంది. E-అన్నా గొప్ప పవిత్ర ప్రదేశం నుండి వచ్చిన పురాతన వ్యవహార ఖండికలు(7 పురావస్తు ఫలకాలు) త్రవ్వకాలు జరిపిన వారిచే పేరుపెట్టబడిన గుడి C భవంతి, ఉరుకు వద్ద ఇనన్నా, లెవెలు ఈఈఈ దేవతలకు అంకితమిస్తారు.

కీలాకారం లిపి ప్రాచీన శబ్ద లేఖన విధానం ప్రావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అందుచే కేవలం పరిమిత సంఖ్యలో వ్యక్తులను దాని లిపిలో చదవడంలో శిక్షణ ఇవ్వడానికి లేఖకులుగా నియమించుకున్నారు. సార్గోను పాలన వరకు దీని అక్షరీయ లిపిని అవలంబించ లేదు[ఆధారం చూపాలి] మెసొపొటేమియా జనాభాలో అధిక భాగం అక్షరాస్యులు అయ్యారు. ఖండికల సామూహిక అంశాలు పురాతన బాబిలోనియా లేఖకుల పాఠశాల పురావస్తు ప్రకరణం నుండి పొందబడ్డాయి. దీని నుండి అక్షరాస్యత పొరపాటుగా అంచనావేయబడింది.

సాహిత్యం, పౌరాణిక కథలు[మార్చు]

బాబిలోనియను కాలాలలో అధిక నగరాలలో గ్రంథాలయాలు, ఆలయాలు ఉండేవి; పురాతన సుమేరియను సామెత ప్రకారం "విద్వాంసుల పాఠశాలలో విశిష్టతను పొందినవాడు అరుణోదయంతో పాటు పెరుగుతాడు." మహిళలు పురుషులు వ్రాయడం, చదువడం నేర్చుకున్నారు.[16] సెమిటికు బాబిలోనియన్లకు నిర్జీవమైన సుమేరియను భాషావిజ్ఞానం క్లిష్టమైన ఇంకా విస్తారమైన అక్షరమాల చేరి ఉంటుంది.

సుమేరియను మూలాల నుండి బాబిలోనియను సాహిత్యం గణింపదగినంతగా తర్జుమా చేస్తున్నారు. ప్రాంతీయ భాష సుమేరు పురాతన సంయోజక భాషగా దీర్ఘకాలం కొనసాగింది. శబ్దజాలాలు వ్యాకరణం సరళ తర్జుమాలు విద్యార్థుల ఉపయోగం కొరకు సేకరించారు. అలానే పాత ఖండికల మీద వ్యాఖ్యానాలు, అజ్ఞాతమైన పదాలు, సమాసాలు వివరణలు ఉంటాయి. అక్షరమాల సంకేతాలు బాగా ఏర్పరచి పేరుపెట్టి, వాటి విశదమైన జాబితాలు వర్ణించారు.

అనేక బాబిలోనియను సాహిత్య రచనలు వీటి పేర్లు అందాయి. వీటిలో ప్రముఖమైనది గిల్గమేషు మహాకావ్యం ఒకటి. సుమేరియను పన్నెండు పుస్తకాల మూలల నుండి సిన్-లిక్-ఉన్నిన్ని చేత తర్జుమాచేయబడింది. విభాగంలో గిల్గమేషు వృత్తిలో ఒంటరి సాహస కథ ఉంటుంది. మొత్తం కథ ఒక మిశ్రమ పదార్థం. దీనిలో కొన్ని కథలు కృత్రిమంగా ముఖ్య పాత్రకు జతచేయబడ్డాయి.

తత్వశాస్త్రం[మార్చు]

ప్రాచీన మెసొపొటేమియా జ్ఞానం నుంచి తత్వశాస్త్రం మూలాలు కనిపెట్టబడినాయి. ఇందులో జీవితంలోని కచ్చితమైన తత్వాలు చేర్చబడ్డాయి. ముఖ్యంగా నీతిశాస్త్రాలు మాండలికాలు, సంభాషణలు, నీతిశాస్త్ర కవితలు, జానపద పాండిత్యం, శ్లోకాలు, పాటలు, గద్యాలు, సామెతలు భాగంగా ఉన్నాయి. బాబిలోనియను తర్కం - విచక్షణ, అనుభవాత్మక విచారణ కంటే అధికంగా అభివృద్ధి చెందింది.[17]

బాబిలోనియన్లు తర్కం పురాతన ఆకృతిని అభివృద్ధి చేసారు. ముఖ్యంగా వారి కఠినమైన సాంఘిక విధానాలు హరించని స్వభావం ఉన్నాయి. బాబిలోనియను ఆలోచన స్వయంసిద్ధమైనది. జాను మయ్నార్డు కీన్సు వర్ణించిన "సాధారణ తర్కం"తో సరిపోల్చదగినట్లు ఉంది. బాబిలోనియను ఉద్దేశం అంతఃతత్వవాదం బహిరంగ విధానాల మీద ఆధారపడి ఉంది. ఇది హరించదగిన స్వయంసిద్దాలతో అనుగుణ్యత కలిగి ఉన్నాయి.[18] బాబిలోనియను ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రంలో కొంతవరకు తర్కాన్ని నియమించారు.

బాబిలోనియను ఉద్దేశం పురాతన గ్రీకు తత్వశాస్త్రం, హెల్లెనిస్టికు తత్వశాస్త్రం మీద తగినంత ప్రభావాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా, బాబిలోనియను ఖండిక డైలాగు ఆఫ్ పెస్సిమిజం నిరాశావాదంతో కూడిన తెలివితేటలుకల బాధాకరమైన ఆలోచనతో సంబంధం కలిగి ఉంది. హెరక్లిటాను విరుద్దాల సిద్దాంతం ప్లాటో మాండలిక సంభాషణలు, అలానే సోక్రటీసు, మయోటికు, సోక్రటికు పద్ధతికి ముందుమాటగా ఉంది.[19] బాబిలోనియను సృష్టిశాస్త్ర ఉద్దేశాలు ఐవోనియను తత్వవేత్త థాలెసును ప్రభావితం చేసాయి.

విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విద్య[మార్చు]

ఖగోళ శాస్త్రం[మార్చు]

బాబిలోనియను ఖగోళశాస్త్రజ్ఞులు నక్షత్రాలు ఆకాశాన్ని అధ్యయనాన్ని చేయడానికి ఉత్సుకత కనబరిచారు. అందులో చాలావరకు గ్రహణాలను, అయనాంతాలు ముందే ఊహించారు. ఖగోళశాస్త్రంలో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉందని ప్రజలు భావించారు. వీటిలో చాలా వరకు మతం, శకునములతో సంబంధం కలిగి ఉన్నాయి. మెసొపొటేమియా ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రభ్రమణం ఆధారంగా 12 నెలల క్యాలండరు తయారుచేశారు. వారు సంవత్సరాన్ని రెండు సీజన్లుగా విభజించారు: ఎండాకాలం, చలికాలం. ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం మూలాలు ఈ కాలం నుండి మొదలయ్యాయి.

క్రీ.పూ. 8 - 7 శతాబ్దాలలో బాబిలోనియను ఖగోళ శాస్త్రజ్ఞులు ఖగోళశాస్త్రం కొరకు ఒక నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రాచీన విశ్వం స్వభావంతో ఉన్న తత్వశాస్త్రంను అధ్యయనం చేయటం ఆరంభించారు. వారి గ్రహమండల విధానాలలో అంతర్గత తర్కం వివరణ చేయడం ఆరంభించారు. ఖగోళశాస్త్రానికి విజ్ఞానశాస్త్రం తత్వశాస్త్రం అపూర్వ తోడ్పాటు అందించింది. ఇంకా కొంతమంది విద్వాంసులు ఈ నూతన విధానాన్ని తొలి సాంకేతిక విప్లవం గా సూచించారు.[20] ఖగోళశాస్త్రానికి ఈ నూతన విధానం అవలంబించబడింది. దీనిని గ్రీకు ఇంకా హెల్లెనిస్టికు ఖగోళశాస్త్రంలో మరింతగా అభివృద్ధి చేశారు.

సెల్యుసిదు, పార్థియాను కాలాలలో ఖగోళశాస్త్ర నివేదికలు పూర్తిగా సాంకేతిక సారాంశాన్ని కలిగి ఉన్నాయి; వారి ఉన్నత విజ్ఞానం పద్ధతుల అభివృద్ధి యెంత ప్రాచీనమైనవనేది స్పష్టంగాలేదు. గ్రహాల కదలికలను ముందుగా చెప్పటానికి బాబిలోనియను అభివృద్ధి ఖగోళశాస్త్రం చరిత్రలో అతిపెద్ద భాగంగా భావించబడింది.

గ్రీకు బాబిలోనియను ఖగోళ శాస్త్రజ్ఞుడు గ్రహ సంచారం సెల్యుకసు అఫ్ సెల్యుసియా " సూర్యకేంద్ర సిద్దాంత " నమూనాకు సహాయపడినట్లు పేరొందారు. (b. 190 క్రీ.పూ).[21][22][23] సెల్యూకసు ప్లుటార్చి వ్రాతలతో పేరొందింది. అతను అరిస్టార్కుసు సమోసు' సూర్యకేంద్ర సిద్దాంతానికి మద్దతునిచ్చారు. ఇందులో భూమి పరిభ్రమణం దాని అక్షం చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ప్లుటార్చి అభిప్రాయం ఆధారంగా సెల్యూకసు ఇంకా సూర్యకేంద్ర సిద్దాంతాన్ని నిరూపించారు. కానీ అతను ఏ వాదనలు ఉపయోగించాడో తెలియలేదు (చంద్రుని ఆకర్షణ ఫలితంగా అలలను సరిగ్గా సిద్దాంతీకరించడం మినహా).

బాబిలోనియను ఖగోళశాస్త్రం గ్రీకు హెల్లెనిస్టికు ఖగోళశాస్త్రం, సాంస్కృతిక భారతీయ ఖగోళశాస్త్రం, సస్సానియను, బైజంటైను, సిరియా ఖగోళశాస్త్రం, మధ్యస్థిత ఇస్లామికు ఖగోళశాస్త్రం, మధ్య ఆసియా, పాశ్చాత్య ఐరోపా ఖగోళశాస్త్ర పరిశోధనలకు చాలా ఆధారంగా ఉంది.[24]

గణిత శాస్త్రం[మార్చు]

మెసొపొటేమియన్లు షష్ట్యంశమాన (base 60) సంఖ్యా విధానం ఉపయోగించారు. ప్రస్తుతం ఉన్న 60-నిమిషాల గంటలు 24-గంటల రోజులకు అలానే 360 డిగ్రీల వృత్తానికి ఇదే మూలం. సుమేరియను క్యాలండరు ఏడు రోజులను వారంగా కూడా లెక్కించారు. ఈ గణితశాస్త్ర విజ్ఞానం పటం తయారీలో ఉపయోగించారు.

బాబిలోనియన్లు వైశాల్యాలు కొలవటానికి సాధారణ నిభంధనలతో సన్నిహితంగా ఉన్నారు. వారు వృత్తం చుట్టుకొలత వ్యాసానికి మూడింతలు ఉంటుందని, చుట్టుకొలత చతురస్రంలో పన్నెండవ వంతుగా కొలిచారు. pi 3గా అంచనావేస్తే అది సరిగ్గా ఉంటుంది. స్థూపం ఘనపరిమాణం ఆధారం, ఎత్తుల లబ్ధం, అయినప్పటికీ శంకవు తునక ఘనపరిమాణం లేదా చతురస్ర పిరమిడు ఎత్తు, ఆధారం మొత్తంలో సగం లబ్ధంగా పొరపాటుగా తీసుకోబడింది. ఈ మధ్యనే కనుగొన్నదాని ఆధారంగా ఫలకం piను 3, 1/8 గా ఉపయోగించబడింది(3.125, 3.14159~ కొరకు). బాబిలోనియన్లు ఇంకా బాబిలోనియను మైలుకు కూడా ప్రసిద్ధి చెందారు. ఈ కొలత ఇప్పటి ఏడు మైళ్ళకు (11 km) సమానంగా ఉంటుంది. దూరాల కొరకు ఈ కొలత తర్వాత సూర్యుడి ప్రయాణాన్ని కొలవడం కొరకు టైం-మైలుకు మార్చారు.[25]

వైద్య శాస్త్రం[మార్చు]

క్రీ.పూ.2వ సహస్రాబ్ధి మొదటి సగభాగంలో పురాతన బాబిలోనియను కాలం నాటి వైద్య ఖండికలు నాటి ఉన్నాయి. బాబిలోనియను రాజు అడదు-అప్ల-ఇడ్డిన (క్రీ.పూ. 1069-1046) కాలంలో బోర్సిప్ప అనే వైద్యుడు అత్యంత ప్రచారంలో ఉన్న బాబిలోనియను వైద్య ఖండిక రోగ నిర్ధారణ హ్యాండ్బుకును వ్రాశాడు.[26].[27]

సమకాలీన ప్రాచీన ఈజిప్టు వైద్యంతో బాబిలోనియన్లు రోగ నిర్ధారణ, రోగరీతిని తెలియచేయటం, శారీరక పరీక్ష, మందుల చీటీలు ప్రవేశపెట్టారు. దానికితోడూ ఇసాగిల్-కిన్-అప్లి వ్రాసినడయాగ్నాస్టికు హ్యాండు బుక్ చికిత్స, రోగకారకం, అనుభవ సిద్దాంతం, రోగనిర్దారణలో తర్కం, సకారణమైన రోగరీతిని తెలియచేయడం, చికిత్సా పద్ధతులను పరిచయం చేసింది. ఈ ఖండికలో వైద్య లక్షణాల జాబితా ఉంది. తరచుగా వివరించబడిన అనుభవం మీద ఆధారపడిన గమనికలు తర్క సంబంధ నియమాలతో రోగి శరీరం మీద గమనించిన లక్షణాలను దాని రోగనిర్ధారణ రీతితో కలపటానికి ఉపయోగించారు.[28]

రోగి లక్షణాలు, వ్యాధులు చికిత్సా సంబంధ సాధనాల ద్వారా నయం చేయబడతాయి, వీటిలో కట్టుకట్టడం, పైపూత పూయడం, మందులు ఉన్నాయి. ఒకవేళ రోగి వైద్య పరంగా నయంకాకపోతే బాబిలోనియను వైద్యులు తరచుగా రోగిని శాపాల నుండి రక్షించడానికి, దయ్యాలను వదిలించడానికి మీద తరచుగా భూతవైద్యం మీద ఆధారపడతారు. ఇసాగిల్-కిన్-అప్లి డయాగ్నస్టిక్ హ్యాండ్ బుక్ తర్కసంబంధమైన, మానసిక ఆలోచనలమీద మీద ఆధారపడి ఉంది. ఇందులో రోగ పరీక్ష, తనిఖీ లక్షణాల ద్వారా రోగి వ్యాధిని, రోగ పరిశోధన, భవిష్య అభివృద్ధి, రోగి కోలుకోవడానికి అవకాశాలు నిర్ణయించడం సాధ్యపడుతుందని ఆధునిక అభిప్రాయం ఉంది.[26]

ఇసాగిల్-కిన్-అప్లి అనేకరకాల జబ్బులను, వ్యాధులను కనుగొన్నారు. వాటి లక్షణాలను అతని డయాగ్నస్టికు హ్యాండ్ బుక్కులో వర్ణించారు. ఇందులో అనేక మూర్చ రోగ రకాలు, సంబంధిత చికిత్సలు వారి రోగ నిర్ధారణ రీతితో ఉన్నాయి.[29]

సాంకేతిక పరిజ్ఞానం[మార్చు]

మెసొపొటేమియా ప్రజలు అనేక సాంకేతిక విజ్ఞానాలను కనిపెట్టారు. ఇందులో ఖనిజం, కాంస్య-పనితనం, అద్దం, దీపాల తయారీ, బట్టలు నేయడం, వరద నియంత్రణ, నీటి నిలవ, నీటి పారుదల ఉన్నాయి.

వారు ప్రపంచంలోని మొదటి కంచుయుగం ప్రజలుగా భావించబడుత్న్నారు. ప్రారంభంలో వారు కంచు, రాగి, బంగారాన్ని ఉపయోగించారు తర్వాత వారు ఇనుమును వాడారు. రాజభవనాలను ఈ ఖరీదైన వందల కిలోగ్రాముల ఖనిజాలతో అలంకరించేవారు. ఇంకా రాగి, కాంస్యం, ఉక్కు కవచాల కొరకు అలానే కత్తులు, బాకులు, బల్లెంలు, గదలు వంటి వివిధ ఆయుధాల తయారీ కొరకు ఉపయోగించారు.

పురాతన కాలం నాటి పంపు రకం ఆర్కిమెడిస్ స్క్రూ, క్రీ.పూ. 7వ శతాబ్దంలో " బాబిలోను వేలాడే తోటలు ", నినెవెహు వద్ద నదీ వ్యవస్థ కొరకు మొదట దీనిని అస్సిరియా రాజు సెన్నచెరిబు ఉపయోగించాడు. తర్వాత ఇది ఇంకా విపులంగా క్రీ.పూ. 3వ శతాబ్దంలో ఆర్కిమెడిసుచే చెప్పబడింది.[30] మెసొపొటేమియా తరువాత పార్థియా (సస్సానిదు) కాలాలలో మొదటి బ్యాటరీలను బాగ్దాదు బ్యాటరీగా నిర్మించింది.[31]

మతం[మార్చు]

మతం మొదట నమోదుకాబడిన నాగరికతలలో మెసొపొటేమియా ఒకటి. మెసొపొటేమియా వారు ప్రపంచం సమతల పళ్ళెం[ఆధారం చూపాలి]గా ఉందని, చుట్టూ పెద్ద ఖాళీల స్థలం ఉందని, దాని పైన స్వర్గం ఉందని విశ్వసించారు. వారు నీరు అన్నిచోట్ల, పైన, క్రింద, ప్రక్కన ఉన్నట్లు భావించారు. ఇంకా విశ్వం విస్తారమైన సముద్రం నుండి పుట్టినట్లు విశ్వసించారు. మెసొపొటేమియా మతం బహుదేవతారాధనతో కూడి ఉంది.

పైన వర్ణించిన విశ్వాసాలు మెసొపొటేమియా వారిలో సాధారణం అయినప్పటికీ ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నాయి. విశ్వం కొరకు సుమేరియను పదం అన్-కి, ఇందులో అన్ దేవుడు అనే పదాన్ని సూచించగా కి(KI) దేవతను సూచిస్తుంది. వారి కుమారుడు ఎన్లిలు. ఇతను వాయు దేవుడు. వారు ఎన్లిలును అతి శక్తివంతమైన దేవుడిగా విశ్వసించారు. గ్రీకులు, యూదులు, రోమన్లు జుపిటరును కలిగి ఉన్నట్టు ఆయన పన్తియోను ముఖ్య దేవుడు. సుమేరియన్లు తత్వశాస్త్రపరమైన ప్రశ్నలను వేసుకున్నారు. వీటిలో: మనం ఎవరు?, మనం ఎక్కడ ఉన్నాం?, మనం ఇక్కడికి ఎలా వచ్చాం? లాంటివి ఉన్నాయి. వారి దేవుళ్ళచే అందించబడిన వివరణలను ఈ ప్రశ్నలకు సమాధానాలుగా ఆరోపించారు.

సెలవదినాలు, విందులు, పండగలు[మార్చు]

ప్రాచీన మెసొపొటేమియన్లు ప్రతినెలా దైవకార్యాలను కలిగి ఉన్నారు. ప్రతి మాసానికి ప్రత్యేకమైన పూజావిధానాలు, పండుగల అంశాలను ముఖ్యంగా ఆరు అంశాలు నిర్ణయిస్తాయి:

  1. చంద్రుడు కళ;
    వృద్ది చెందుతున్న చంద్రుడు (పుష్కలం, అభివృద్ధి);
    బలహీనంగా ఉన్న చంద్రుడు (తిరోగమనం, పరిణామ వ్యతిరేకం, పాతాళం పండగలు);
  2. వార్షిక వ్యవసాయ చక్రం కళ;
  3. సౌర సంవత్సరం విఘవత్తులు, అయనాంతాలు;
  4. నగరం, దాని పవిత్రమైన భక్తులు;
  5. సార్వభౌముడి పాలన విజయం;
  6. ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటనల స్మారకోత్సవాలు(కనుగోనటం, సైనిక విజయాలు, గుడి సెలవు దినాలు, మొదలైనవి.)

ప్రధాన దేవుళ్ళు, దేవతలు[మార్చు]

  • అను:- సుమేరియను ఆకాశ దేవుడు. ఆయన కిని వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని మెసొపొటేమియా మతాలలో అతని భార్య పేరును ఉరసుగా పిలిచారు. పన్తియోనులో ఇతనిని చాలా ముఖ్య దేవుడిగా భావించినప్పటికీ, పురాణాలలో ఇతను ఎక్కువగా నిదానమైన పాత్రను తీసుకున్నారు, ఎన్లిల్ అత్యంత శక్తివంతమైన దేవుడి స్థానానికి అనుమతించారు.
  • ఎన్లిలు:- ఆరంభంలో మెసొపొటేమియా మతంలో శక్తివంతమైన దేవుడిగా ఉన్నాడు. అతని భార్య నిన్లిలు, అతని పిల్లలు ఇస్కురు (కొన్నిసార్లు), నన్నా - సుయను, నెర్గాలు, నిసాబా, నమ్టారు, నినుర్ట (కొన్నిసార్లు), పబిల్సాగు, నుషు, ఎన్బిలులు, ఉరసు జబబ, ఎన్నుగి. పన్తియోను ముఖ్య దేవుడిగా ఉన్న ఇతని స్థానాన్ని మొదట మార్డుకు, తరువాత అషురు తీసుకున్నారు.
  • ఇరిడు:- ఎంకి (Ea)దేవుడు. ఇతను వాన దేవుడు.
  • మార్డుకు:- బాబిలోను ప్రధాన దేవుడు. బాబిలోను అధికారంలోకి వచ్చినప్పుడు పురాణాలు మార్డుకు వాస్తవ స్థానమైన వ్యవసాయ దేవుడి స్థానం ఉంది. పన్తియోనులో ప్రధాన దేవుడి స్థానానికి పెంచాయి.
  • అషురు:- అస్సిరియను సామ్రాజ్య దేవుడు. అలానే అస్సిరియన్లు అధికారంలోకి వచ్చినప్పుడు వారి నమ్మకాలు అషురుని ముఖ్యస్థానంలోకి తీసుకుని వచ్చాయి.
  • గుల (ఉటు):- (సుమేరియనులో), షమాషు (అక్కాడియనులో) సూర్య దేవుడు, న్యాయ దేవుడు.
  • ఎరెష్కిగలు:- దిగువస్థాయి ప్రపంచం దేవత.
  • నాబు:- మెసొపొటేమియా లిపి దేవుడు. అతను చాలా మేధావి. ఆయన వ్రాసే సామర్థ్యానికి మెప్పును పొందాడు. కొన్ని ప్రదేశాలలో స్వర్గం, భూమి నియంత్రణలో ఆయన ప్రమేయం ఉందని విశ్వసిస్తున్నారు. తరువాత కాలలో అతని ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది.
  • నినుర్త:- సుమేరియను యుద్ద దేవుడు. ఆయన నాయకుల దేవుడు కూడా.
  • ఇస్కురు (అడాదు):- తుపాను దేవుడు.
  • ఎర్రా:- బహుశా కరువు దేవుడు. ఆయన తరచుగా అడాదు, నెర్గాలులో వ్యర్ధాన్ని భూమిమీద వేయడానికి సంబంధించి చెప్పబడుతుంది.
  • నెర్గాలు:- బహుశా ప్లేగు దేవుడు. అతను ఎరెష్కిగలు భర్త.
  • పజుజు (జు):- కీడు దేవుడు, ఎన్లిలు రాజవంశంలోని ఫలకాలను దొంగిలించిన ఫలితంగా అందుకొరకు చంపబడ్డాడు. అతను నయంకాని రోగాలను కూడా తీసుకువచ్చాడు.

పూడ్చిపెట్టటం[మార్చు]

మెసొపొటేమియా ప్రాంతాలలో త్రవ్వబడిన వందలకొద్దీ సమాధులు మెసొపొటేమియా సమాధిచేసే అలవాట్ల సమాచారాన్ని వెల్లడిచేశాయి. ఉరు నగరంలో, చాలా మంది ప్రజలు వారి ఇళ్ళ క్రింద కుటుంబ సభ్యులను సమాధులలో పూడ్చిపెట్టారు (కాతల్హుయుకులో ఇలాంటిది ఉంది). కొంతమంది చాపలలో, కొంతమంది తివాసీలలో చుట్టబడి కనిపించారు. అనారోగ్యులైన పిల్లలను పెద్ద "జాడి"లో పెట్టి కుటుంబ పూజామందిరంలో ఉంచుతారు. మిగిలినవి నగరం మూకుమ్మడి శ్మశానాలలో కనుగొనబడ్డాయి. 17 సమాధుల లోపల విలువైన వస్తువులు ఉన్నాయి; ఇవి రాజకుల సమాధులుగా భావించబడ్డాయి.

సంస్కృతి[మార్చు]

సంగీతం, పాటలు, వాయిద్య పరికరాలు[మార్చు]

దేవుళ్ళ కొరకు కొన్ని పాటలు వ్రాయబడ్డాయి. కానీ అవి చాలా వరకు ముఖ్య సంఘటనలు వర్ణించడానికి వ్రాయబడినాయి. అయినప్పటికీ సంగీతం, పాటలు రాజులను వినోదింపచేసాయి. వీటిలో ఇళ్ళలలో, మార్కెట్టు కూడలిలో ప్రదర్శించే పాటలు, నృత్యం సాధారణ వ్యక్తులు కూడా ఆనందింపజేసాయి. పిల్లల కొరకు కూడా పాటలు పాడారు. వాటిని వారు వారి పిల్లలకు వారసత్వంగా అందించారు. అందువలన ఈ పాటలు అనేక తరాలకు ఎవరో మరొకరు అందించే వరకు ఇలా కొనసాగాయి. ఈ పాటలు చారిత్రాత్మక సంఘటనల సమాచారాన్ని శతాబ్దాలు తరువాత కూడా అందించడానికి ఒక సాధనంగా అయ్యాయి. దాని ఫలితంగా ఇవి ఆధునిక చరిత్రకారులకు చేరాయి.

ఔడు (అరబిక్:العود) నేది ఒక చిన్న, తీగల సంగీత వాద్యపరికరం. దక్షిణ మెసొపొటేమియాలో 5000 సంవత్సరాల క్రితం ఉరుకు కాలంలో ఔడు పురాతన చిత్రకళా సేకరణ ఉంది. ఇది ఒక మూసివేయబడిన స్థూపంలో ప్రస్తుతం డాక్టరు. కోల్లోను సేకరించబడి బ్రిటిషు వస్తుప్రదర్శనలో ఉంచబడింది. ఈ బొమ్మ ఒక మహిళా ఆమె వాద్యపరికరాలతో పడవ మీద వంగి కూర్చొని కుడి-చేతితో వాయిస్తూ ఉంటుంది. ఈ పరికరం వందలసార్లు మెసొపొటేమియా చరిత్రలో, తిరిగి ప్రాచీన ఈజిప్టులో 18వ రాజవంశం తరువాత కాలాలో పొడవైన పొట్టిగా ఉన్న రూపాలతో కనిపించాయి.

ఔడును ఐరోపా ల్యూటుకు మార్గదర్శిగా ఉంది. దీని పేరును అరబికు పదం العود ఆల్-‘ఉడ్ 'ది వుడ్' నుంచి తీసుకోబడింది. బహుశా ఇది ఔడు తయారుచేయబడిన చెట్టు నుండి ఈ పేరు తీసుకొని ఉండవచ్చు. (అరబికు పేరు, ఖచ్చితమైన శీర్షికతో, 'ల్యూటు' పదం ఆధారంగా ఉంది.)

ఆటలు[మార్చు]

అస్సిరియన్ రాజులలో వెటాడటం అనేది చాలా ప్రముఖక్రీడగా ఉంది. బాక్సింగు, కుస్తీ పట్లు, తరచుగా కళలలో కనిపించాయి. కొంతవరకు పోలో కూడా ప్రముఖంగా ఉంది. ఇందులో వ్యక్తులు గుర్రాల మీద కాకుండా వేరే వ్యక్తుల భుజాల మీద కూర్చొని ఆడతారు.[32] వారు మజోరు కూడా ఆడారు. ఈ ఆట రగ్బీ ఆటలాగా ఉంటుంది. కానీ చెక్కతో తయారు చేసిన బంతితో ఆడేవారు. వారు బోర్డు ఆట సెనెటు, బ్యాక్గమ్మొను లాంటివి ఆడేవారు. ఇప్పుడు దానిని "రాయలు గేం అఫ్ మా-అసెస్బ్లు" అని పిలుస్తుంటారు.

కుటంబ జీవితం[మార్చు]

బాబిలోనియన్ వివాహ మార్కెట్, రాయల్ హొల్లోవే కళాశాల.

మెసొపొటేమియా దాని చరిత్ర కాలంలో మరింత పితృస్వామిక సంఘంగా అయ్యింది. ఇందులో మగవారు ఆడవారికన్నా చాలా శక్తివంతంగా ఉంటారు. తోర్కిల్దు జకబ్సెను, ఇతరులు ప్రాచీన మెసొపొటేమియా సంఘాన్ని "పెద్దల సమాఖ్య"తో పాలించబడినట్లు సూచించారు. ఇందులో మగ వారు, ఆడవారు సమానంగా ప్రాతినిధ్యం వహించేవారు. కాలక్రమేణా మహిళల స్థానం పడిపోయి పురుషుల అధికారం అధికరించింది. పాఠశాల విద్య కేవలం రాజవంశీయులు, ధనవంతుల, విద్వాంసులు లేఖకులు, వైద్యులు, దేవస్థాన అధికారుల వంటి కుటుంబాలకు చెందిన వారి పిల్లలు మాత్రమే పాఠశాలకు హాజరయ్యే వారు. చాలా మంది అబ్బాయిలకు వారి తండ్రులు వర్తకం గురించి నేర్పించేవారు లేదా వర్తకం నేర్చుకొనటానికి శిక్షణ కొరకు బయటకు పంపేవారు.[33] అమ్మాయిలు వారి తల్లులతో ఇళ్ళలోనే ఉండి ఇల్లు శుభ్రపరచటం, వంట నేర్చుకోవటం, చిన్న పిల్లలను చూసుకోవటం వంటి బాధ్యతలు వహించేవారు. కొంతమంది పిల్లలు ధాన్యాన్ని దంచటం లేదా పక్షులను శుభ్రంచేయటం వంటివాటిలో సహాయం చేశారు. చరిత్రలో ఆకాలం కొరకు అసాధారణంగా మెసొపొటేమియాలో మహిళలు హక్కులు కలిగి ఉన్నారు. వారు సొంత ఆస్తిని సంపాదించుకోవచ్చు, ఒకవేళ వారివద్ద సరైన కారణం ఉంటే విడాకులు తీసుకుంటారు.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

ప్రాచీన మధ్య ప్రాచ్యం గనుల ప్రాంతాలు. పెట్టెల రంగులు: బ్రౌను, కాంస్యంలో ఎరుపు, తగరం బూడిద రంగులో, ఎరుపు పోకరంగులో ఉన్న ఉక్కు, బంగారం పసుపు రంగులో, వెండి తెలుపులో, లెడు నలుపు రంగులో ఉంటుంది. పసుపు ప్రాంతం పాషాణం కాంస్యాన్ని బూడిదరంగు ప్రాంతాలు తగరం కాంస్యాన్ని సూచిస్తుంది

సుమెరు మొదటి ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. అయితే బాబిలోనియన్లు ప్రాచీన ఆర్ధికశాస్త్రంను అభివృద్ధి చేశారు. ఇది ఆధునిక పోస్టు-కీనేసియను ఆర్ధికశాస్త్రంతో సరిపోల్చవచ్చు. కానీ "ఏదైనా పర్లేదు" అనే పద్ధతి కలిగి ఉంది.[18]

వ్యవసాయం[మార్చు]

మెసొపొటేమియా భౌగోళిక స్వరూపం వ్యవసాయం నీటిపారుదల, మంచి కాలువలతోనే సాధ్యం అనితెలిపింది. మెసొపొటేమియా నాగరికత పరిణామం మీద వ్యవసాయం పరిపూర్ణమైన ప్రభావం ఉంది. నీటిపారుదల అవసరం కొరకు సుమేరియన్లు, తర్వాత అక్కాడియన్లు వారి నగరాలను టిగ్రిసు, యూఫ్రేట్సు ఇంకా ఈ నదుల శాఖలతో నిర్మించుకున్నారు. ఉరు, ఉరుకు వంటి కొన్ని అతిపెద్ద నగరాలు యుఫ్రేట్సు ఉపనదుల మార్గాన్ని తీసుకున్నాయి. అయితే ముఖ్యంగా లగాషు, టిగ్రిసు శాఖలమీద నిర్మించారు. ఈ నదులు చేప (ఆహారం ఎరువుగా ఉపయోగించారు), నీటిగట్టు మొక్కలు, బంక మన్ను (నిర్మాణ వస్తువులు), లాభాలను అందించాయి.

మెసొపొటేమియాలో నీటిపారుదలతో ఆహార సరఫరా టిగ్రిసు, యూఫ్రేట్సు లోయలు ఈశాన్య భూభాగంలో సుసంపన్నమైన అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాయి. ఇందులో జోర్డాను నదీ లోయ & ఇంకా నైలు ఉన్నాయి. అయినప్పటికీ నది సమీపంలో ఉన్న భూమి సారవంతంగా ఉండి, పంటలకు సహకరిస్తుంది. నీటికి దూరంగా ఉన్న భూములు బీడుగా ఉండి నివాసయోగ్యంగా ఉండవు. అందువలన మెసొపొటేమియా స్థిర వాసులకు నీటిపారుదల చాలా అవసరం. ఇతర మెసొపొటేమియా నవీకరణలలో ఆనకట్టల ద్వారా నీటిని నియంత్రణ చేయటం, జలవాహికలను ఉపయోగించటం ఉన్నాయి.

మెసొపొటేమియాలో ముందుగా సారవంతమైన భూములలో స్థిరపడినవారు మట్టిని త్రవ్వడానికి చెక్క, నాగలిని ఉపయోగించి బార్లీ, ఉల్లిపాయలు, ద్రాక్షలు, నూలుకోలు, ఆపిల్ మొదలైన పంట నాట్లు వేసేవారు. మెసొపొటేమియా స్థిరవాసులు బీరు, ద్రాక్షసారాయి చేసిన మొదటివారుగా ఉన్నారు.

అయినప్పటికీ నదులు జీవితాన్ని కొనసాగించడానికి సహకరించినప్పటికీ అవి వరదలతో ముంచెత్తి నగరాలను నాశనం చేసాయి. ఊహించలేని మెసొపొటేమియా వాతావరణం తరచుగా వ్యవసాయదారులకు సమస్యాత్మకంగా ఉంటుంది; వరదలు పంటలు, ఆహారం సహకార వనరులు ఆవులు, గొర్రెల వంటివాటిని నాశనం చేశాయి. ఫలితంగా మెసొపొటేమియాలో వ్యవసాయంలో నైపుణ్యం చేరింది. వ్యవసాయదారులు సాగుపనిని పూర్తి చేయటానికి కొంత మినహాయింపులతో బానిసల మీద ఆధారపడలేదు. బానిసత్వ అభ్యాసంలో అనేక ఆపదలు (అవి బానిస పారిపోవటం/తిరుగుబాటు వంటివి) ఉన్నాయి.

ప్రభుత్వం[మార్చు]

మెసొపొటేమియా భౌగోళికాకృతి ఈ ప్రాంతం రాజకీయ అభివృద్ధి మీద బలమైన ప్రభావాన్ని చూపింది. నదుల ప్రవాహాలలో సుమేరియను ప్రజలు వారి మొదటి నగరాలను విస్తారమైన స్థలాలతో సంచార జాతులు తిరిగిన చిత్తడినేలలతో వేరుచేయబడిన నీటిపారుదలా కాలువలతో నిర్మించుకున్నారు. ఒంటరిగా ఉన్న నగరాలలో సమాచారమార్పిడి చాలా కష్టం, కొన్ని సార్లు అపాయకరం. అందుచే ప్రతి సుమేరియను నగరం నగర-రాజ్యంగా అయ్యింది. ఇవి స్వతంత్రంగా ఉండి, తమ స్వాతంత్ర్యాన్ని రక్షించుకున్నాయి. కొన్నిసార్లు ఒక నగరం ఆ ప్రాంతాన్ని జయింగించి ఐక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అలాంటి ప్రయత్నాలు శతాబ్దాలుగా నిరోధించబడి విఫలమయ్యాలి. ఫలితంగా సుమెరు రాజకీయ చరిత్ర నిరంతరం సాయుధ యుద్ధాన్ని కలిగి ఉన్నవాటిలో ఒకటిగా ఉంది. న్నాటుం సుమేరును ఐక్యంచేసాడు. కానీ ఏకీకరణ స్వల్పంగా తరువాత అక్కాడియన్లు సుమేరియాను క్రీ.పూ.2331లో గెలిచినప్పుడు పరాజయం పొందింది.

అక్కాడియను సామ్రాజ్యం ఒక తరంపాటు కొనసాగిన మొదటి విజయవంతమైన సామ్రాజ్యంగా ఉంటూ శాంతియుతంగా రాజులు కొనసాగటం కనిపించింది. ఆ సామ్రాజ్యం పోలిస్తే తక్కువకాలం ఉంది. కొన్ని తరాలలోనే బాబిలోనియన్లు వారిని ఓడించారు.

రాజులు[మార్చు]

మెసొపొటేమియన్ల నమ్మకంప్రకారం వారి రాజులు, రాణులు దివి నుండి నగరాలకు దివచ్చిన దేవుళ్ళని విశ్వసించారు. కానీ ప్రాచీన ఈజిప్షియన్లులా కాకుండా వారు వారి రాజులు నిజమైన దేవుళ్ళుగా ఎప్పుడూ విశ్వసించలేదు.[34] చాలా మంది రాజులు తమకితామే “విశ్వంకే రాజు” లేదా “గొప్ప రాజు” అని పేర్లను పెట్టుకున్నారు. ఇంకొక సాధారణ పేరు “కాపరి”, ఎందుకంటే రాజులు ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రముఖ మెసొపొటేమియా రాజులలో:

లగాషు రాజు ఎన్నాటుం ఇతను మొదటి సామ్రాజ్యాన్ని (స్వల్ప-కాలం ఉన్న)స్థాపించాడు.

అక్కాడు, సార్గోను అనే రాజు మెసొపొటేమియా మొత్తం జయించి మొదటి సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి స్థాపకుడయ్యాడు.

హమ్మురాబి మొదటి బాబిలోనియను సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

టిగ్లతు-మూడవ పిలేసెరు నూతన-అస్సిరియను సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

నెబుచాడ్నెజ్జారు నూతన-బాబిలోనియా సామ్రాజ్యంలో అతి శక్తివంతమైన రాజుగా ఉన్నాడు. ఆయన నాబు దేవుని కుమారుడుగా భావించబడ్డాడు. ఆయన స్యాక్స్రేసు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అందుచే మీడియాను బాబిలోనియా రాజవంశాలు ప్రముఖమైన సంబంధం కలిగి ఉన్నాయి. నెబుచాడ్నెజ్జారు పేరు అర్ధం: నాబో సింహాసనంనాన్ని రక్షించు!

బాబిలోనియా ఆఖరి రాజు బెల్షెడెజ్జారు ఇతను నబోనిడుసు కుమారుడు. ఇతని భార్య నిక్టోరిసు నెబుచాడ్నెజ్జారు కుమార్తె.

అధికారం[మార్చు]

అస్సిరియా సామ్రాజ్యంగా విస్తరించిన తరువాత అది రెండు చిన్న భాగాలుగా విభజింపబడింది. సామ్రాజ్యం జిల్లాలుగా విభజించబడింది. ఇందులో ప్రతిదానికీ వాటి ముఖ్య నగరాల పేర్లు పెట్టారు. ఇందులో నినెవెహు, సమారియా, డమాస్కసు, అర్పాడు వంటివి ఉన్నాయి. అవన్నీ వాటి సొంత గవర్నరును కలిగి ఉన్నాయి, ఇతను ప్రజల పన్ను వ్యవహారం పరిశీలించాలి. ఆయన యుద్ధానికి సిపాయిలను పిలవాలి, గుడి నిర్మించేటప్పుడు కూలీలను సరఫరాచేయాలి. శాసనాలు అమలుచేయడానికి ఆయన బాధ్యుడిగా ఉండాలి. ఈ విధంగా ఉంటే అస్సిరియాలాగా సామ్రాజ్యం మీద నియంత్రణ ఉంచడం సులభతరం అవుతుంది. అయినప్పటికీ సుమేరియనులో చాలా చిన్న రాజ్యంగా ఉన్న బాబిలోను హమ్మురాబి పాలనలో వేగవంతంగా పురోగతిని సాధించింది. ఆయన “శాసన కర్త”గా పేరొందాడు. త్వరలోనే బాబిలోను మెసొపొటేమియా ప్రధాన నగరాలలో ఒకటిగా అయ్యంది. దీనిని తర్వాత బాబిలోనియా ("దేవతల ముఖద్వారం.") అని పిలిచారు. తరువాత ఇది గొప్ప చరిత్ర కేంద్రాలలో ఒకటిగా అయ్యింది.

సాయుధయుద్ధం[మార్చు]

అస్సిరియన్ సైనికులు, ది హిస్టరీ అఫ్ కాస్ట్యూమ్ బ్రాన్ & స్క్నీడెర్ (ca. 1860).

నగర-రాజ్యాలు అభివృద్ధి ప్రారంభంతో వారి ప్రభావపరిధిని విస్తరించాయి. ఇతర నగర-రాజ్యాలలో వివాదాలను (ముఖ్యంగా భూములు, కాలువల విషయంలో) జరిగాయి. పెద్ద యుద్ధం జరగని వందల సంవత్సరాల ముందు ఈ వాదనలను ఫలకాలలో నమోదు చేశారు - క్రీ.పూ.3200లో జరిగిన యుద్ధం మొదటి నమోదు చేయబడింది. కానీ క్రీ.పూ 2500 నాటిదాకా సాధారణమైన యుద్ధాలు మాత్రమే జరిగాయి. ఈ సందర్భంలో మెసొపొటేమియా రాజకీయ వ్యవస్థ సాయుధయుద్ధంతో ఏకమయ్యింది. ఇక్కడ ఒక మధ్యస్థంగా ఉన్న నగరం రెండు విరోధ నగరాల కొరకు వివాద పరిష్కర్తగా పనిచేయవచ్చు. నగరాల మధ్య సంఘాలను ఏర్పరచడం, ప్రాంతీయ రాజ్యాల ఏర్పాటుకు ఇది సహాయపడింది.[34] సామ్రాజ్యాలు ఏర్పడినప్పుడు వారు అందరూ విదేశీ దేశాలతో యుద్ధం చేయటానికి వెళ్ళారు. ఉదాహరణకి సార్గోను రాజు, సుమేరు అన్ని నగరాలను, మరీ లోని కొన్ని నగరాలను జయించాడు. తర్వాత ఉత్తర సిరియాతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. చాలా బాబిలోనియను రాజభవన గోడలు విజయవంతమైన యుద్ధాల చిత్రాలతో, విరోధులు అత్యవసరంగా పారిపోవటం లేదా చెట్ల వెనక దాక్కొనే చిత్రాలతో అలంకరింపబడినాయి. సుమెరు రాజు గిల్గమేషు రెండు భాగాలు దైవత్వాన్ని కేవలం ఒక భాగాన్ని మానవత్వాన్ని కలిగి ఉన్నాడని విశ్వసించబడింది. అతనిమీద పురాణ కథలు, కవితలు ఉన్నాయి. వీటిని అనేక తరాలకు అందించారు. ఎందుకంటే ఆయన చాలా ముఖ్యమైనవని భావించే అనేక సాహసాలను చేశాడు. అనేక యుద్ధాలు, పోరాటాలలో విజయం సాధించాడు.

శాసనాలు[మార్చు]

హమ్మురాబి రాజు, అతని శాసనాల రూపొందించడానికి పేరుగాంచాడు. వీటిని " ది కోడు అఫ్ హమ్మురాబి " (ఏర్పాటు ca. క్రీ.పూ.1780) అంటారు. ఇది పురాతన శాసనాల వర్గాలలో ఒకటి. ప్రాచీన మెసొపొటేమియా గురించిన అంశాలలో పరిశోధనకు ఇది ఉత్తమ ఉదాహరణగా భావించబడుతుంది. ఆయన మెసొపొటేమియా కొరకు చేసిన 200కు పైగా శాసనాల గురించి తెలుసుకోవడానికి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, సీ హమ్మురాబి అండ్ " కోడ్ అఫ్ హమ్మురాబి " చూడండి. ఇంకా చూడండి: " లాస్ అఫ్ ఎష్నున్నా, కోడ్ అఫ్ ఉర్-నమ్ము.

వాస్తుకళ[మార్చు]

ప్రాచీన మెసొపొటేమియా వాస్తుకళ అధ్యయనం గురించి లభ్యమవుతున్న పురావస్తుశాస్త్ర ఆధారాలు భవంతుల చిత్రాలు భవంతుల నిర్మాణ విధానాల మీద, ఖండికలు మీద ఆధారపడి ఉన్నాయి. సాహిత్యం సాధారణంగా గుళ్ళు, రాజభవనాలు, నగర కుడ్యాలు గేట్లు ఇంకా ఇతర స్మారక భవంతుల మీద కేంద్రీకృతమయ్యింది. కానీ అప్పుడప్పుడూ ఇంటి గోడలమీద కూడా వాస్తుకళ చూడవచ్చు.[35] పురావస్తుశాస్త్ర ఉపరితల పరీక్షలు ఆరంభ మెసొపొటేమియా నగరాలలో పట్టణ ఆకృతి అధ్యయనం చేయడానికి కూడా అనుమతించాయి. ఆరంభ మెసొపొటేమియా పురావస్తు పరిశోధనలో ముఖ్యమైనవి క్రీ.పూ.4వ సహస్రాబ్ధికి చెందిన ఉరుకు దేవాలయ ప్రాంగణాలు, డియాల నది లోయలోని ఆరంభ రాజవంశ కాలానికి చెందిన రాజభవనాల ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఖఫజ, టెల్ అస్మారు, ఉరు మూడవ రాజవంశం శిథిలాలు నిప్పురు (ఎన్లిలు ప్రదేశం), ఉరు (నన్నా ప్రదేశం) ఉన్నాయి. మధ్య కంచుయుగంనికి చెందిన సిరియను-టర్కిషు ప్రాంతాలలోని ఎబ్ల, మరీ, అలఖు, అలెప్పో, కుల్టేపే ఉన్నాయి. తుది కాంస్య యుగానికి చెందిన రాజభవనాలు బోగజ్కోయి (హత్తుష), ఉగారిటు, అషురు, నుజి ఉన్నాయి. ఇనుప యుగానికి చెందిన రాజభవనాలు, గుళ్ళు అస్సిరియా (కల్హు (నిమ్రుదు), ఖోర్సాబాదు, నినెవెహు), బాబిలోనియను (బాబిలోను), ఉరర్టియను (తుష్ప (వాన్ కలేసి), కావుస్టేపే, అయనిస్, అర్మవిరు, ఎరెబుని, బస్టాం), నూతన-హిట్టిటే ప్రదేశాలు (కర్కమిసు, టెల్ హలఫు, కరటేపే)లో ఉన్నాయి. నిప్పురు, ఉరు వద్ద లభించిన పురాతన బాబిలోనియను శిథిలాలలోని ఇళ్ళు పేరొందాయి. భవంతి నిర్మాణం మీద పాఠ్యాంశ ఆధారాలు సంబంధిత పురాణాలతో పాటు, చివర 3వ మిల్లినియానికి చెందిన గుడియా స్థూపాలు, అలానే అస్సిరియను, ఇనుప యుగంనికి చెందిన బాబిలోనియను రాజ ముద్రలు ముఖ్యమైనవి.

గృహాలు[మార్చు]

మెసొపొటేమియా గృహాన్ని నిర్మించటానికి ఉపయోగించే వస్తువులు ఈనాడు వాడబడుతున్నవే: మట్టి ఇటుక, మట్టి పట్టీ, కొయ్య తలుపులు, ఇవన్నీ నగరం చుట్టుపక్కలా సహజంగా లభ్యమయ్యేవి,[36] అయినప్పటికీ వర్ణించిన ఆ కాలంలోచెక్క సహజంగా అంతబాగా చేయబడలేదు. చాలా గృహాలు చతురస్ర గదిని కేంద్రంగా కలిగి మిగిలిన గదులు వాటితో కలపబడి ఉన్నప్పటికీ పరిమాణంలో చాలా వ్యత్యాసం ఉంది. గృహాలను కట్టడానికి ఉపయోగించే వస్తువులు సూచించే దాని ఆధారంగా వాటిని అక్కడ నివసించేవారే నిర్మించారని తెలుస్తోంది. [4]. అతి చిన్న గదులు అతిపేద ప్రజలతో సంబంధం కలిగి లేవు; నిజానికి పేద ప్రజలు పాడైపోయే వస్తువులతో, నగరం బయట వెదురు మొక్కల వంటివాటితో గృహాలను నిర్మించుకునేవారు. కానీ దీనికి సరైన ఆధారం చాలా తక్కువగా ఉంది.[37]

రాజభవనం[మార్చు]

ప్రారంభ మెసొపొటేమియా ప్రముఖుల రాజభవనాల అతిపెద్ద ప్రాంగణాలను తరచుగా ధారాళమైన వ్యయంతో అలంకరించేవారు. ఆరంభ ఉదాహరణలు దియాలా నదీలోయ ప్రాంతాలలోని ఖఫజ, టెల్ అస్మార్ వంటి నిర్మాణాలు ప్రసిద్ధి చెందాయి. క్రీ.పూ. 3 వ సహస్రాబ్ధానికి చెందిన భవనాలు అతిపెద్ద సాంఘిక-ఆర్ధిక సంస్థలుగా పనిచేశాయి. అందువలన ప్రైవేటు, గృహ విధులతో వారు కళాకారులు పనిచేసే ప్రాంతాలను, ఆహార నిల్వగృహాలను, పండుగల ఆవరణలను, విగ్రహాలతో సంబంధం ఉన్న వాటిని ఏర్పరచారు. ఉదాహరణగా ఉరు వద్ద పేరొందిన "గిపారు" (లేదా సుమేరియన్లో గిగు-పారు-కు), ఇక్కడ చంద్ర దేవుడు నన్నా పూజారుల వసతిగృహాలు అతిపెద్ద ప్రాంగణాలతో అనేక ఆవరణలు, ప్రదేశాలు, చనిపోయిన పూజారుల కొరకు పూడ్చిపెట్టే గదులు, ఒక సమావేశ మందిరం, మొదలైనవి కలిగి ఉన్నాయి. సిరియాలో మరీ సమీపంలో నిర్వహించిన త్రవ్వకాలలో ఇలాంటి మెసొపొటేమియా రాజభవనం అవశేషాలు (ఇది పురాతన బాబిలోనియను కాలంనాటిది) లభించాయి.

ఇనుప యుగం[మార్చు]

ఇనుప యుగం నాటి అస్సిరియను రాజభవనాలు ముఖ్యంగా కల్హు (నిమ్రుదు), డురు షర్రుకిను (ఖోర్సాబాదు), నినువా (నినెవెహు) లోని గోడలమీద చిత్రాలతో, పాట్యాంశాలతో ప్రమఖ్యత సంతరించుకున్నాయి. ఇవి మొత్తం ఆర్థోస్టాటు అనబడే రాళ్ళ బండలమీద చెక్కారు. ఈ చిత్రాలలో రాజుల సైనిక, పౌర విజయాల సాంప్రదాయ సన్నివేశాలు, ఇతివృత్తాంతాలు ఉన్నాయి. గేట్లు, ముఖ్య ద్వారాల ప్రక్కలు అధిక శిల్పకళతో పురాణ పాత్రలతో నిండి ఉంటాయి. పెద్ద, చిన్న సభలలో ఇనుప యుగం ఈ భవనాల వాస్తుకళా అమరిక యేర్పరచబడ్డాయి. సాధారణంగా అనేక ఉత్సవ సభలకు రాజు సభామంటపం తెరిచిఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన రాజ సమాఖ్యలు సమావేశమవుతారు. రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు. అస్సిరియా రాజభవనాలలో దంతపు కొయ్య వస్తువులు అధికంగా కనిపిస్తూ ఆ సమయంలో ఉత్తర సిరియా నూతన-హిట్టిటే రాజభావనాలతో ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నాయి. అలంకార బాండ్లు చెక్క గేట్లు, కాంస్యంతో అలంకరించడం కూడా ఇందుకు చక్కటి ఋజువుగా ఉన్నాయి.

జిగ్గురట్లు[మార్చు]

జిగ్గురట్లు అనేవి అతిపెద్ద సూచ్యాకార గుడి గోపురాలు. ఇవి ప్రాచీన మెసొపొటేమియా లోయ, పాశ్చాత్య ఇరాను పీటభూమిలో నిర్మించబడ్డాయి. వేదికల ఆకృతిలో మెట్ల పిరమిడు ఆకృతిలో ఒకొక్క స్థాయిగా (అంచు) దిగుతూ ఉంటుంది. మెసొపొటేమియాలో, సమిపప్రాంతాలలో 32 జిగ్గురట్లు ఉన్నాయి. వీటిలో 38 ఇరాకులో, 4 ఇరాన్లో ఉన్నాయి. ముఖ్యమైన జిగ్గురట్లు నాసిరియా, ఇరాకు వద్ద " గ్రేట్ జిగ్గురటు ఆఫ్ ఉరు, బాగ్దాదు, ఇరాకు వద్ద " జిగ్గురట్ ఆఫ్ అకర్ కుఫ్, ఖజకిస్తాన్ ఇరానులోని చొఘ జంబిలు, ఈ మధ్యనే కనుగొనబడిన - కాషంసు, ఇరాను వద్ద సియల్కు ఇతరమైనవి ఉన్నాయి. జిగ్గురట్లను సుమేరియన్లు, బాబిలోనియన్లు, ఎలం మైట్లు, అస్సిరియన్లు స్థానిక మతాలకు స్మారకాలుగా నిర్మించారు. ఉబైదు కాల వేదికలు[38] క్రీ.పూ. 4 వ సహస్రాబ్ధి నుండి క్రీ.పూ.6వ శతాబ్దం మధ్యకాలంలో అధికరించాయి. చాలా పిరమిడ్లలా కాకుండా జిగ్గురట్ల పైభాగం చదరంగా ఉంటుంది. సోపాన పిరమిడు శైలి ఆరంభ రాజ్యవంశ కాలం ముగింపు నుండి ఆరంభం అయ్యింది.[39] నిర్మాణం తరుగుతూ పోతున్న మడతలులాగా దీర్ఘచతురస్రం, దీర్ఘవృత్తం, లేదా చతురస్ర వేదికలో నిర్మించారు. జిగ్గురటుకు సూచ్యాకార ఆకృతి ఉంది. సూర్యరశ్మిలో కాల్చిన ఇటుకలు జిగ్గురటులో ప్రధానంగా వాడబడిన కాల్చిన ఇటుక ముఖభాగం బయటకు కనిపించేటట్లు పెడతారు. ఈ ముఖభాగాలను అనేక రంగులలో ఉంచుతారు. ఇవి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కూడా కలిగి ఉండవచ్చు. రాజులు కొన్నిసార్లు వారి పేర్లను మెరుస్తున్న ఇటుకల మీద చెక్కించు కుంటారు. మడతల సంఖ్య 2-7 వరకు ఉంటాయి. శిఖరం వద్ద విగ్రహం లేదా గోపురం ఉంటుంది. విగ్రహం దగ్గరకు వెళ్ళటానికి మెట్ల క్రమాన్ని జిగ్గురటు ఒక వైపున ఉంచుతారు లేదా గుండ్రంగా ఉన్న మెట్లను క్రింద నుంచి శిఖరం వరకు ఉంచుతారు. జిగ్గురటు నిర్మాణం కొండలను పోలినట్లు ఉండాలని సూచించారు. కానీ చాలా కొద్దిగా వ్రాతపూర్వక, పురావస్తుపరిశోధనా ఆధారం ఈ పరికల్పనకు సహకారం ఇస్తుంది.

జిగురెటు నిర్మాణం[మార్చు]

ఉరు వద్ద నున్న ఉరు-నమ్ము జిగ్గురటు ఆకృతిని మూడు-స్థాయిలలో నిర్మించారు. ప్రస్తుతం వాటిలో రెండు మాత్రమే సజీవంగా ఉన్నాయి. మొత్తం మట్టి ఇటుకలతో ఉన్న కట్టడం నిజానికి బట్టీలలో కాల్చిన ఇటుకల మొత్తాన్ని ముఖభాగంగా ఇచ్చారు మొదటి దిగువ స్థాయిలో 2.5 మీ ఉండగా రెండవ స్థాయిలో 1.15 మీ రెండవ దాని మీద వేదిక ఉంటుంది. ఈ కాల్చిన ప్రతి ఇటుక మీద ఒకే రాజు ముద్ర ఉంటుంది. వేదికల ఏటవాలు గోడలు ఆధారంగా ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మార్గంగా మూడు అంతస్తుల మెట్ల మార్గం ఉంటుంది. ఇవన్నీ దిగిన తరువాత మొదటి - రెండవ వేదికల మధ్య ద్వారం ఉంటుంది. మొదటి వేదిక ఎత్తు 11 మీ అయితే రెండవ వేదిక ఎత్తు 5.7 ఎత్తు ఉంటుంది. మూడవ వేదిక పునఃనిర్మాణాన్ని జిగ్గురటు పురావస్తు పరిశోధకుడు నిర్మించి (లెనార్డు వూల్లె) గోపురం ఉంచారు. స్చోగా జంబిలు జిగ్గురటు పురావస్తు శాస్త్రజ్ఞులు అధిక మొత్తంలో నీటిమోక్కల తాళ్ళను కనుగొన్నారు. ఇవి ప్రధాన జిగ్గురటుకు అడ్డంగా ఉన్నాయి. మట్టి ఇటుకల ముద్దను దగ్గరకు కట్టబడినాయి.

ప్రాచీన మెసొపొటేమియన్లు నియరు ఈస్టు కేంద్రభాగంలో ఉన్నారు. ప్రస్తుతం అవి ఇరాకు, సిరియా, టర్కీ లోని కొన్ని భాగాలలో ఉన్నాయి. ప్రాచీన మెసొపొటేమియా టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మధ్య ఉంది. సాహిత్య పరంగా మెసొపొటేమియా అర్ధం “రెండు నదుల మధ్య ఉన్న భూభాగం”. మెసొపొటేమియా దక్షిణ భాగం సుసంపన్నమైన అభివృద్ధి కలిగి ఉంది. ఎందుకంటే మెసొపొటేమియాలోని ఎండాకాలాలు, చలికాలాలు ఉంటాయి. మెసొపొటేమియాలో మొదటి నగరం ఎరిడు.

నదులు[మార్చు]

మెసొపొటేమియాలో నదులు జీవితం కొనసాగటానికి, ఆహారం పొందడానికి సహకరిస్తాయి. మెసొపొటేమియన్లు మట్టిని, భూములను తడుపుకొని వ్యవసాయం చేయటానికి నదులు సహకరించాయి. నదులు అపాయకారులుగా కూడా ఉన్నాయి. వరదలకు కారణంగా పంటలు, నాటిన గింజలు కొట్టుకు పోయేవి. మెసొపొటేమియన్ల జీవనశైలి మార్షు అరబ్బుల శైలికి సమానంగా ఉంది. వీరు టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మీద ఆధారపడి, నదీజలాలను వారికి సహాయపడేటట్లు వాడుకుంటారు. వర్షాకాలంలో కొన్నిసార్లు నదులు కొంతవరకు భూములను ముంచెత్తుతాయి. అందుచే ఎత్తులో ఉన్న భూభాగాన్ని నీటితో తడపరు. ఒకవేళ ఇది జరిగితే మెసొపొటేమియన్లు ఇతర ప్రజల ఇళ్ళకు వెళ్ళటానికి లేదా వరద ప్రాంతాలు కాని చోట్లకు వెళ్ళటానికి పడవలను ఉపయోగించవలసి వస్తుంది. నదులు మెసొపొటేమియన్ల జీవితాన్ని అనేకవిధాలుగా ప్రభావితం చేసాయి.

వ్యవసాయం[మార్చు]

మెసొపొటేమియన్లు సంక్లిష్టమైన, జటిలమైన సాగు విధానాలను కలిగి ఉన్నారు. ఎండా కాలంలో నీటిపారుదల కొరకు (వీటిని వారు తరచుగా బాగుచేయాల్సి, తిరిగి-తవ్వాల్సి వచ్చేది) కాలువలను ఉపయోగించారు. మెసొపొటేమియన్లు జాన్ని పైకి ఎత్తే బక్కెట్టు అనే సాధనం కలిగి ఉన్నారు. ఇవి నీటిని కాలువలలో లోపలి తీసుకు వెళ్ళటానికి, పంటలకు నీరును తీసుకురావటానికి ఉపయోగపడింది. నీటిపారుదల చాలా ముఖ్యమైనది దాని వల్ల పంటలు పెరిగి చలికాలానికి సరిపోయే ఆహారాన్ని అందించడానికి సాధ్యమయ్యేది. మెసొపొటేమియాలో నీటిపారుదల ముఖ్యపాత్రను పోషించింది.

వ్రాత - భాషల సృష్టి[మార్చు]

వ్రాతను, భాషను మొదట కనిపెట్టినది మెసొపొటేమియన్లు. ఆరంభంలో లిపి చాలా సులభతరంగా ఉంది. ఏమి చూపించుకోవాలనుకుంటున్నారో అది చూపించడం ఫలితంగా లిపి సంక్లిష్ట కీల ఆకృతిలో తయారయ్యింది. కీల భాషలో వందలకొద్దీ అక్షరాలూ ఉన్నాయి. మెసొపొటేమియన్లు మాట్లాడే భాష మెసొపొటేమియను అని పిలవరు కానీ సుమేరియను అంటారు. కీలభాషను అక్కాడియను, బాబిలోనియను, పర్షియను అనేక ఇతర భాషల ఉపయోగం కొరకు అమలుచేశారు.

వాణిజ్యం[మార్చు]

మెసొపొటేమియా ప్రజలకు అవసరమైన ఆహారం వ్యవసాయదారులు పండించారు. కానీ వర్తకుల, కళాకారుల నుండి నగరాల సంపద వచ్చింది. మెసొపొటేమియా వర్తకానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. మెసొపొటేమియాలో సహజ వనరులు లేనికారణంగా అధికంగా ధాన్యం, బట్టల వ్యాపారం చేసేవారు. టిగ్రిసు, యూఫ్రేట్సు నదులు మెసొపొటేమియా వ్యాపారులు సరుకులు రవాణాచేయడానికి సహకరించాయి. వారు వస్తువులను సుదూరంగా ఆఫ్రికా, ఆసియా, ఐరోపాకు తరలిస్తూ వర్తకం చేసేవారు. మెసొపొటేమియాలో నాణేలు వాడలేదు. కానీ ప్రమాణాలు వెండి, ధాన్యాల బరువు మీద ఆధారపడి ఉన్నాయి. పన్నుల నుండి వచ్చిన ధనాన్ని యూఫ్రేట్సు మీద వారధి కట్టడానికి వెచ్చించి వ్యాపారం అభివృద్ధి చేయడానికి దోహదం చేశారు. వర్తకం లేకుండా ఉంటే మెసొపొటేమియా సులువుగా విఫలమయ్యేది.

చక్రం - వాహనం సృష్టి[మార్చు]

క్రీ.పూ 3500 లో మెసొపొటేమియన్లు మొదటగా చక్రాలుకల వాహనాలను నిర్మించారు. వారు కుండలు చేసే చక్రంతో చక్రం తయారు చేసారు. తర్వాత ఉరుకులో చేశారు. ఈ విధంగా అధిక బరువున్న వస్తువులను మోసుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మనిషి చక్రాన్ని కనుగొన్నాడు. అతను ఒక దూలం మీద చెక్క ముక్కను ఉంచి అతని వస్తువులను లాగటానికి ఉపయోగించాడు. చక్రం కనుగొని ఉండకపోతే ఆధునిక ప్రపంచం ఇలా ఉండేదికాదు.

సూచనలు[మార్చు]

గమనికలు[మార్చు]

  1. "Mesopotamia - The British Museum".
  2. 2.0 2.1 "Geography of Mesopotamia - Thematic Essay - Timeline of Art History - The Metropolitan Museum of Art".
  3. [1]
  4. Khuzestan. Britannica Online Encyclopedia. 2008. Retrieved 2008-12-27.
  5. ఫిన్కెల్ స్టీన్, J. J.; 1962. “మెసొపొటేమియా”, నియరు ఈస్టర్ను అధ్యయనాలు 21: 73-92
  6. స్కేఫ్ఫ్లెర్, థామస్; 2003. “ 'ఫలవంత పురోగమనం', 'ఒరిఎంట్', 'మధ్య తూర్పు': దక్షిణ ఆసియా యొక్క మారుతున్న మానసిక పటాలు,” చరిత్ర యొక్క ఐరోపా సమీక్ష 10/2: 253–272. ఇంకనూ: బహ్రని, జైనాబ్; 1998. “మెసొపొటేమియా: గత ప్రపంచంలోని భావనా భూగోళశాస్త్రం", ఆర్కియాలజీ అండర్ ఫైర్: నేషనలిజం, పాలిటిక్స్ అండ్ హెరిటేజ్ ఇన్ ది ఈస్టర్న్ మెడిటేరనియన్ అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉంది. L. మెస్కేల్ (ed.), రూట్లెద్జ్: లండన్, న్యూ యార్క్, 159–174.
  7. 7.0 7.1 Foster, Benjamin R.; Polinger Foster, Karen (2009), Civilizations of ancient Iraq, Princeton: Princeton University Press, ISBN 978-0-691-13722-3
  8. 8.0 8.1 Canard, M. (2011), "al-ḎJazīra, Ḏjazīrat Aḳūr or Iḳlīm Aḳūr", in Bearman, P.; Bianquis, Th.; Bosworth, C.E.; van Donzel, E.; Heinrichs, W.P. (eds.), Encyclopaedia of Islam, Second Edition, Leiden: Brill Online, OCLC 624382576
  9. Wilkinson, Tony J. (2000), "Regional approaches to Mesopotamian archaeology: the contribution of archaeological surveys", Journal of Archaeological Research, 8 (3): 219–267, doi:10.1023/A:1009487620969, ISSN 1573-7756
  10. Matthews, Roger (2003), The archaeology of Mesopotamia. Theories and approaches, Approaching the past, Milton Square: Routledge, ISBN 978-0-415-25317-8
  11. Miquel, A.; Brice, W.C.; Sourdel, D.; Aubin, J.; Holt, P.M.; Kelidar, A.; Blanc, H.; MacKenzie, D.N.; Pellat, Ch. (2011), "ʿIrāḳ", in Bearman, P.; Bianquis, Th.; Bosworth, C.E.; van Donzel, E.; Heinrichs, W.P. (eds.), Encyclopaedia of Islam, Second Edition, Leiden: Brill Online, OCLC 624382576
  12. Bahrani, Z. (1998), "Conjuring Mesopotamia: imaginative geography a world past", in Meskell, L. (ed.), Archaeology under fire: Nationalism, politics and heritage in the Eastern Mediterranean and Middle East, London: Routledge, pp. 159–174, ISBN 978-0-415-19655-0
  13. "Migrants from the Near East 'brought farming to Europe'". BBC. 2010-11-10. Retrieved 2010-12-10.
  14. Pollock, Susan (1999), Ancient Mesopotamia. The Eden that never was, Case Studies in Early Societies, Cambridge: Cambridge University Press, p. 2, ISBN 978-0-521-57568-3
  15. థాంప్సం, విల్లియం R. (2004) "సంక్లిష్టత, తరుగుతున్న ఉపాంత రాబడులు, వరుసగా మెసొపొటేమియన్ శకలాలు" (Vol 3, ప్రపంచ విధానాల పరిశోధన యొక్క పత్రిక)
  16. తట్లో, ఎలిసాబెత్ మీర్ ప్రాచేన శాసనం, సంఘంలో మహిళలు, నేరం, శిక్ష: ది ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కాన్టినుం ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ గ్రూప్ లిమిటెడ్. (31 మార్చి 2005) ISBN 978-0-8264-1628-5 p.75 [2]
  17. జియోర్జియో బుక్స్ల్లాటి (1981), "జ్ఞానం, లేకపోవటం: మెసొపొటేమియా యొక్క కేసు", అమెరికన్ ఓరియెంటల్ సంఘం యొక్క పత్రిక 101 (1), p. 35-47.
  18. 18.0 18.1 షీలా C. డౌ (2005), "అక్షాంశాలు, బాబిలోనియన్ ఉద్దేశ్యం: ఒక సమాధానం", పోస్ట్ కీనేసియన్ ఎకనామిక్స్ పత్రిక 27 (3), p. 385-391.
  19. జియోర్జియో బుక్స్ల్లాటి(1981), "జ్ఞానం, లేకపోవటం: మెసొపొటేమియా యొక్క కేసు", అమెరికన్ ఓరియెంటల్ సంఘం యొక్క పత్రిక 101 (1), p. 35-47 43.
  20. D. బ్రౌన్ (2000), మెసొపొటేమియన్ గ్రహాల ఖగోళశాస్త్రం-జ్యోతిష్యం , స్టిక్స్ ప్రచురణలు, ISBN 90-5693-036-2.
  21. ఒట్టో E. న్యూగెబార్ (1945). "ప్రాచీన ఖగోళశాస్త్రం సమస్యలు, పద్దతుల యొక్క చరిత్ర", నియర్ ఈస్టర్న్ అధ్యయనాల యొక్క పత్రిక 4 (1), p. 1-38.
  22. జార్జ్ సార్టన్ (1955). "క్రీ.పూ.చివరి మూడు శతాబ్దాల యొక్క చల్డియాన్ ఖగోళశాస్త్రం", అమెరికన్ ఓరియెంటల్ సంఘం యొక్క పత్రిక 75 (3), p. 166-173 [169].
  23. విల్లియం P. D. విట్మన్ (1951, 1953), శాస్త్రీయ ఉద్దేశ్యాల యొక్క అభివృద్ధి , ఎల్ విశ్వవిద్యాలయం ముద్రణ p.38.
  24. Pingree (1998)
  25. ఈవ్స్, హోవార్డ్ గణితశాస్త్రం యొక్క చరిత్రకు పరిచయం హాల్ట్, రైన్హార్ట్, విన్స్టన్ , 1969 p.31 [3]
  26. 26.0 26.1 H. F. J. హోర్స్ట్మాన్షోఫ్ఫ్ , మార్టెన్ స్టోల్, కర్నెలిస్ టిల్బుర్గ్ (2004), మేజిక్ అండ్ రేషనాలిటీ ఇన్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ అండ్ గ్రేకో-రోమన్ మెడిసన్ , p. 99, బ్రిల్ ప్రచురణకర్తలు, ISBN 90-04-13666-5.
  27. మార్టెన్ స్టోల్ (1993), బాబిలోనియాలో మూర్చరోగం , p. 55, బ్రిల్ ప్రచురణకర్తలు, ISBN 90-72371-63-1.
  28. H. F. J. హోర్స్ట్మాన్షోఫ్ఫ్, మార్టెన్ స్టోల్, కర్నెలిస్ టిల్బుర్గ్ (2004), మేజిక్ అండ్ రేషనాలిటీ ఇన్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ అండ్ గ్రేకో-రోమన్ మెడిసన్ , p. 97-98, బ్రిల్ ప్రచురణకర్తలు, ISBN 90-04-13666-5.
  29. మార్టెన్ స్టోల్ (1993), బాబిలోనియాలో మూర్చరోగం , p. 5, బ్రిల్ ప్రచురణకర్తలు, ISBN 90-72371-63-1.
  30. స్టేఫ్నీ డాలీ, జాన్ పీటర్ ఒలేసన్ (జనవరి 2003). "సెన్నచేరిబ్, ఆర్కిమెడిస్, నీటి స్క్రూ: ప్రాచీన ప్రపంచంలో కనిపెట్టడం యొక్క సందర్భం", సాంకేతికత, సంస్కృతి 44 (1).
  31. Twist, Jo (20 November 2005). "Open media to connect communities". BBC News. Retrieved 2007-08-06.
  32. Karen Rhea Nemet-Nejat (1998). Daily Life in Ancient Mesopotamia.
  33. Rivkah Harris (2000). Gender and Aging in Mesopotamia.
  34. 34.0 34.1 Robert Dalling (2004). The Story of Us Humans, from Atoms to Today's Civilization.
  35. Dunham, Sally (2005). "Ancient Near Eastern architecture". In Daniel Snell (ed.). A Companion to the Ancient Near East. Oxford: Blackwell. pp. 266–280. ISBN 0-631-23293-1.
  36. Nicholas Postgate, J N Postgate (1994). Early Mesopotamia: Society and Economy at the Dawn of History.
  37. Susan Pollock (1999). Ancient Mesopotamia.
  38. క్రాఫోర్డ్, పేజీ 73
  39. క్రాఫోర్డ్, పేజీ 73-74

ఉపయుక్త గ్రంథసూచి[మార్చు]

  • అట్లాస్ డే లా మెసొపోటామీ ఎట్ డు ప్రొచె-ఒరిఎంట్ ఎంసిఎన్, బ్రెపోల్స్, 1996 ISBN

|2503500463.

  • బెనోయిట్, ఆగ్నెస్; 2003. ఆర్ట్ ఎట్ ఆర్కేలోజీ: లెస్ సివిలైజేషన్స్ డు ప్రొచె-ఒరిఎంట్ ఎంసిఎన్, మన్యుఎల్స్ డే ల్'ఏకల్ డు లౌవ్ర్.
  • జీన్ బొట్టేరో; 1987.మెసొపోటామీ. లెక్రిట్యూర్, లా రైజన్ ఎట్ లెస్ డైక్స్, గల్లిమార్డ్, కోల్. « ఫోలియో హిస్టిరే », ISBN

|2070403084.

  • జీన్ బొట్టేరో; 1992. మెసొపొటేమియా: లిపి, తర్కం, దేవుళ్ళు . తర్జుమా. జైనబ్ బహ్రని, మార్క్ వాన్ డే మీరూప్ చేశారు, చికాగో విశ్వవిద్యాలయం ముద్రణ: చికాగో.
  • ఎడ్జార్డ్, డీత్జ్ ఒట్టో; 2004. గెస్చిచ్టే మెసొపోటామియన్స్. వాన్ డెన్ సుమేరేర్న్ బిస్ జు అలెగ్జాండర్ దెం గ్రోßఎం, ముంచెన్, ISBN 3-406-51664-5
  • హ్రౌడ, బార్తేల్, రేనే ఫీల్శిఫ్టార్; 2005. మెసొపోటామీన్. డై అంటికేన్ కుల్తురెన్ జ్విస్చెన్ యూఫ్రాట్ ఉండ్ టిగ్రిస్. ముంచెన్ 2005 (4. ఆఫ్ల్.), ISBN 3-406-46530-7
  • జోంన్స్, ఫ్రాన్సిస్; 2001. డిక్శనైర్ డే లా సివిలైజేషన్ మెసొపోటామీయెన్నే, రాబర్ట్ లఫ్ఫోంట్.
  • కోర్న్, వోల్ఫ్ గ్యాంగ్; 2004. మెసొపోటామిఎన్ - వీజ్ డేర్ జివిలైజేషన్. 6000 జహ్రే హాచ్కుల్తురేన్ ఆన్ యూఫ్రాట్ ఉండ్ టిగ్రిస్, స్టూట్ట్గార్ట్, ISBN 3-8062-1851-X
  • కుహ్ర్ట్, అమెలీ; 1995. ప్రాచీన నియర్ ఈస్ట్: c. 3000-330 B.C . 2 Vols. రౌట్లేడ్జ్: లండన్, న్యూ యార్క్.
  • లివెరని, Mario; 1991. అన్టికో ఒరిఎంటే: స్టోరియా, సోసైటా, ఎకనోమియా . ఎడిటోరి లటేర్జా: రోమ.
  • మాథ్యూస్, రోగెర్: 2003. మెసొపొటేమియా యొక్క పురావస్తుతత్వ శాస్త్రం. సిద్దాంతాలు, విధానాలు, లండన్ 2003, ISBN 0-415-25317-9
  • మాథ్యూస్, రోగెర్; 2005. మెసొపొటేమియా యొక్క పురాతన చరిత్ర ముందు కాలం - 500,000 to 4,500 BC, టర్న్హౌట్ 2005, ISBN 2-503-50729-8
  • ఒప్పెన్హీం, A. లియో; 1964. ప్రాచీన మెసొపొటేమియా: మరణించిన నాగరికత యొక్క చిత్రం . చికాగో విశ్వవిద్యాలయం యొక్క ముద్రణ: చికాగో, లండన్. పునరావృతమైన ప్రచురణ ఎరికా రీనేర్ చేత, 1977 లో ముగించబడింది.
  • పొల్లాక్, సుసాన్; 1999. ప్రాచీన మెసొపొటేమియా: ఎప్పుడూ లేని ఎడెన్ . కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ముద్రణ: కేంబ్రిడ్జ్.
  • పోస్ట్ గేట్, J. నికోలస్; 1992. పురాతన మెసొపొటేమియా: చరిత్ర యొక్క పురోగమనం వద్ద సంఘం, ఆర్ధికవ్యవస్థ . రూట్ లేడ్జ్: లండన్, న్యూ యార్క్.
  • రౌక్స్, జార్జెస్; 1964. ప్రాచీన ఇరాక్, పెంగ్విన్ పుస్తకాలు.
  • సిల్వర్, మొర్రిస్; 2007. "ప్రాచీన మెసొపొటేమియా యొక్క ఆర్ధికవ్యవస్థలో పునః పంపిణీ, మార్కెట్లు: పోలన్యి నూతనీకరణం చేయడం", అంటిగు ఒరిఎంటే 5: 89-112.
  • స్నెల్, డానియెల్ (ed.)| 2005 ప్రాచీన నియర్ ఈస్ట్ కు తోడు . మాల్దేన్, MA : బ్లాక్క్వేల్ ప్రచురణ, 2005.
  • వాన్ డే మీరూప్, మార్క్; 2004. ప్రాచీన నియర్ ఈస్ట్ యొక్క చరిత్ర. ca 3000-323 BC . ఆక్స్ఫోర్డ్ : బ్లాక్వెల్ ప్రచురణ.

బాహ్య లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.