మేధాపాట్కర్
వికీపీడియా నుండి
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.
భావాలు [మార్చు]
- ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సాహించడమే. ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు. పంట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. ఎస్ఈజడ్లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి. అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూనే పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారు. పచ్చని పంట పొలాలను నిప్పచ్చరం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి. జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగకపోవడానికి కారణం పెట్టుబదీదారులకు భూములు తెగనమ్మటమే. ఇలా భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కరువవుతాయి.(ఆంధ్రజ్యోతి11.11.2009)