మైనాకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైనాకుడు లేదా మైనాకము అనేది రామాయణంలో ఒక పర్వతము. ఇతడు మేనక, హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతముల రెక్కలు కత్తిరిస్తున్నందుకు భయపడి ఇతడు దక్షిణ సముద్రములో దాగెను. హనుమంతుడు సముద్రమును దాటునపుడు మైనాకుడు పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొమ్మని కోరెను.


హిమవంతునికిని మేరుపుత్రి అయిన మేనకకును పుట్టిన సుతుఁడు. పూర్వము కృతయుగమున పర్వతములకు అన్నింటికి ఱెక్కలు కలిగి ఉండెను. అప్పుడు అవి ఎల్లయెడల అతిరయముతో తిరుగుచు ఉండినందున ప్రాణులకు మిక్కిలి భయము కలుగుచు ఉండెను. అది నిలుపుటకై ఇంద్రుఁడు తన వజ్రాయుధముచే పర్వతముల ఱెక్కలు తెగకొట్టసాగెను. ఆసమయమున వాయుదేవుని సాహాయ్యకమువలన మైనాకుఁడు తప్పించుకొని పోయి సాగరములో చొచ్చి డాఁగి ఉండెను. ఆకృతజ్ఞతనుబట్టియే మైనాకుఁడు, వాయుపుత్రుఁడు అగు హనుమంతుఁడు సీతను వెదక లంకకు పోవుచు సముద్రమును దాఁటు నవసరమున, తనపై కొంతసేపు నిలిచి పొమ్ము అని సముద్రము వెలువడి వచ్చి హనుమంతుని ప్రార్థించెను. అది తనకు ప్రియము అయిన కార్యము అగుటచే ఇంద్రుఁడు మైనాకునితో స్నేహము చేసి అభయము ఇచ్చి పంపెను. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)]

"https://te.wikipedia.org/w/index.php?title=మైనాకుడు&oldid=3814044" నుండి వెలికితీశారు