వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 52,095 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
|
|
|
|
ఈ వారపు వ్యాసం

ద్వారకా నగరం
మహాభారతం లో ద్వారకా నగరం ద్వారావతి గా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్ధం. కనుక రెండు కారణ నామాలు ఈ నగరానికి చక్కగా వర్తిస్తాయి. అనార్తా సామ్రాజ్యాధీశులైన యాదవులకు ద్వారక రాజధాని. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్రజలాల వలన ముంచివేయబడింది. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసి ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒకభాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యసమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్యసమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ మరియు మధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు మరియు బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్దవుడు, అక్రూరుడు మరియు ఉగ్రసేనుడు.
( ఇంకా…)
మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
శ్రీ కృష్ణ రాయబారం నాటకంలో ఒక దృశ్యం
- భారత దేశం లో గల పల్లెవాసులకు వినోద కార్యక్రమాలుగా నేడు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినా పూర్వం నుంచి వారసత్వ సంపదగా కొన్ని కార్యక్రమాలు యిప్పటికీ నిర్వహింపబడుతున్నవి. వీటిలో ముఖ్యంగా బుర్రకత, హరికథ, జాతరలు, సర్కస్, మోడి, మహా భారత నాటకము, వీది నాటకాలు, భజనలు, కోలాటము, మొదలైనవి. వీటిని గూర్చి తెలియ జేసే వ్యాసం.....పల్లెల్లో వినోద కార్యక్రమాలు
- తమిళనాడు లోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన క్షేత్రం తిరుత్తణి. ఇది తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రం గూర్చి తెలియజేసే వ్యాసం...తిరుత్తణి
- హిందూ తత్వం,సంస్కృతి,రాజకీయ అర్థశాస్త్రం పై సూద్ర విమర్శ చేస్తూ కంచ ఐలయ్య వ్రాసిన పుస్తకం నేను హిందువు నెట్లయిత?.ఈ పుస్తకం అఖిలభారత అనుభవాలనుండి,చారిత్రక పరిణామ క్రమాన్ని,ఇక్కడి మత జీవన విధాలను పరిశోధించి,ప్రదానంగా తెలుగు దేశపు దళిత బహుజనుల ప్రసవవేదన లో పుట్టిందని రచయిత తెలియజేశారు. ఈ పుస్తకాన్ని గురించి పూర్తి విషయాలను తెలియజేసే వ్యాసం,,,నేను హిందువు నెట్లయిత?
- ప్రపంచ వ్యాప్తంగా మధుమేహవ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కల్గిఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలియజేసే వ్యాసం...మధుమేహంలో పాదాల సంరక్షణ
- వెన్న పండు అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫల వృక్షం. ఈ వృక్షం ఫలించే కాయను వెన్న పండు అని అంటారు. వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం. దీని మద్య కల గింజలను పలు ఔషదాలలో వాడుతుంటారు. ఈ వృక్షం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం.....వెన్న పండు
|
ఈ వారపు బొమ్మ
పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్యస్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా తయారు చేసిన తంగ(బంగారు) రథం
ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
|