Coordinates: 16°13′39″N 80°54′51″E / 16.227387°N 80.914049°E / 16.227387; 80.914049

మొవ్వ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొవ్వ
—  రెవెన్యూ గ్రామం  —
మొవ్వ is located in Andhra Pradesh
మొవ్వ
మొవ్వ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′39″N 80°54′51″E / 16.227387°N 80.914049°E / 16.227387; 80.914049
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,277
 - పురుషులు 3,174
 - స్త్రీలు 3,103
 - గృహాల సంఖ్య 1,673
పిన్ కోడ్ 521135
ఎస్.టి.డి కోడ్ 08671

మొవ్వ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, మొవ్వ మండలం లోని గ్రామం, ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1679 ఇళ్లతో, 5653 జనాభాతో 1546 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2889, ఆడవారి సంఖ్య 2764. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1845 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 204. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589689.[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, పెడన, రేపల్లె.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మచిలీపట్నంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

కళాశాలలు[మార్చు]

వేమూరి సుందర రామయ్య ప్రభుత్వ డిగ్రీ, పి.జి. కళాశాల

క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల: ఈ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకులైన శ్రీ వేమూరి శివనాగేశ్వరరావు, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే, రాష్ట్రస్థాయిఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనారు. 2014, సెప్టెంబరు-5న గుంటూరులోని పెరేడ్ గ్రౌండ్సులో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రమంత్రుల నుండి, వీరీ పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్నీ అందుకుంటారు. ఇంతకుముందు వీరు, 2014, ఆగస్టు15, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిల్లా కలక్టరుగారి చేతులమీదుగా, జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. వీరు కళాశాలలో 100% ఉత్తీర్ణతకు కృషిచేయడమేగాక, సెలవురోజులలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించుచూ విద్యాభివృధికి కృషిచేస్తున్నారు. కార్పొరేటు కళాశాలకు దీటుగా విద్యాబోధన జరుచున్న ఈ కళాశాలలో ప్రస్తుతం 550 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత ఏడు సంవత్సరాలుగా, 4 సార్లు రాష్ట్రస్థాయిలో, మిగిలిన మూడు సంవత్సరాలు జిల్లాస్థాయిలో, ప్రథమస్థానంలో, ఫలితాలు సాధించారు. ఈ కళాశాల 36వ వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-20న ఘనంగా నిర్వహించారు.

పాఠశాలలు[మార్చు]

మండవ కనకయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో 2016, జనవరి-19 నుండి 23 వరకు నిర్వహించనున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్య, విఙానిక సదస్సులో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్థుల బృందం ఎంపికైనది.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

లాల్ బహదూర్ విద్యాలయం

ఇమ్మానుయేలు మిషన్ స్కూలు

హోలీ స్పిరిట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల

పి.హెచ్.డబ్ల్యు.పాఠశాల

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మొవ్వలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోం ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మొవ్వలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మొవ్వలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 168 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 2 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 25 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10 హెక్టార్లు
  • బంజరు భూమి: 23 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1316 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 104 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1235 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మొవ్వలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1235 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మొవ్వలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, చెరకు

మౌలిక సదుపాయాలు[మార్చు]

స్త్రీశక్తి భవనం:- ఈ భవనం మొవ్వ ఎం.పి.డి.ఓ కార్యాల ఆవరణలో ఉంది.

శాఖా గ్రంథాలయం

  • ఈ పురాతన గ్రంథాలయాన్ని, చాలా సంవత్సరాల క్రితం, గ్రామానికి చెందిన శ్రీ మండవ వెంకటరంగయ్య ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి ప్రసూనాంబ, గ్రామస్థుల సహకారంతో అప్పట్లో నిర్మించారు. ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇదిగాక కంప్యూటర్ల కొనుగోలుకు, 2011 లోనే, మరియొక 2.90 లక్షల రూపాయలను మంజూరు చేసింది. నూతన భవననిర్మాణానికి 16 నెలల క్రితమే శంకుస్థాపన గూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు, భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కంప్యూటర్లూ కొనలేదు.
  • ఈ గ్రంథాలయానికి నూతన భవనం, నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్దంగా ఉంది.

బ్యాంకులు[మార్చు]

  • ఇండియన్ బ్యాంక్.
  • విజయ బ్యాంక్:- మొవ్వ గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2016, జనవరి-22వ తేదీ శుక్రవారం ఉదయం 10-35 గంటలకు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తాతినేని పిచ్చేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.[మార్చు]

ఈ గ్రామం లోని ఈ ఆలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థలపురాణము ప్రకారం, మౌగల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య, స్వామి కృపతో గొప్పకవి అయ్యాడని ప్రతీతి. వరదయ్య వ్రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి.

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణబ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో, మాఘశుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహిచెదరు. త్రయోదశి నాడు ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పెళ్ళికుమారుని, పెళ్ళికుమార్తెను చేయడం, సాయంత్రం 4 గంటలకు క్షేత్రయ్య ఆరాధనోత్సవం, రాత్రికి అంకురార్పణ, ధ్వజారోహణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం నిత్యహోమం, గ్రామ బలిహరణ, లక్ష్మీనారాయణ సహిత సుదర్శన మహాయఙం, సాయంత్రం నిత్య హోమం, ఎదురుకోలు సంవాదం, రాత్రికి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించెదరు. మాఘశుద్ధ పౌర్ణమినాడు ఉదయం నిత్య హోమం, రాత్రికి పవళింపుసేవ కార్యక్రమాలు నిర్వహించెదరు.

ఈ ఆలయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి దత్తత దేవాలయం.

ఇతర దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం (శివాలయం) :- ఈ అలయంలో స్వామివారి మహాకుంభాభిషేకాలను, 5వ తేదీ శుక్రవారంనాడు, ప్రారంభించారు. ముందుగా మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, ఋత్వికా వరుణ, యాగశాల ప్రవేశం, శాలాసంస్కారలు ధ్వజపతాక ఆవిష్కరణ, నవగ్రహ ఆరాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ శనివారంనాడు, దేవతాహోమాలు నిర్వహించారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 8-48 గంటలకు, శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారలకు, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, నాగసుబ్రహ్మణ్యం, నందీశ్వర, బలిపీఠ ప్రతిష్ఠా మహోత్సవాలు, శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామివారు నిర్వహించెదరు.
  2. శ్రీ రామాలయం.
  3. శ్రీ సిద్ధి గణపతి ఆలయం.
  4. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం.
  5. శ్రీ షిర్దీ సాయి ఆలయం.
  6. శ్రీ రేణుకా అంకమ్మ అమ్మవారి ఆలయం:- మొవ్వ గ్రామంలో ఈడే వారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక సంబరాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ సందర్భంగా (మే నెలలో) మూడు రోజులు వైభవంగా నిర్వహించెదరు.

పై ఆలయాలే కాక గ్రామ దేవతల ఆలయాలు మరి కొన్ని ఉన్నాయి. ఈ కారణాన మొవ్వను దేవాలయాల గ్రామం అని ప్రస్తావించెదరు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

క్షేత్రయ్య
  1. క్షేత్రయ్య లేదా మొవ్వా వరదయ్య అని పిలువబడే 17వ శతాబ్దపు వాగ్గేయకారుడు.
  2. భారత జాతీయ పతాకం రూప కల్పన చేసిన పింగళి వెంకయ్య ఈ మండలంలో నున్న భట్లపెనుమర్రు గ్రామంనకు చెందినవాడు.
  3. ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ జానకి రామయ్య కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఛైర్మన్. ఈయన ఇండియన్ డైరీ అసోసియేషన్ వారి ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డుకు యెన్నికయ్యాడు. జాతీయ స్థాయిలో ప్రతి యేటా అన్ని రాష్ట్రాలలో డెయిరీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 'ఫాదర్ ఆఫ్ మిల్క్ డెయిరీ' గా పేరొందిన డాక్టర్ కురియన్ పేరు మీద ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నారు[2] వీరికి 2014, మార్చి-31 ఉగాదిరోజున, విజయవాడలోని ఫన్ టైం క్లబ్ వారు, "కృష్ణరత్న" పేరుతో ఉగాది పురస్కారం అందజేసి, దుశ్శాలువతో సన్మానించారు.
  4. అమెరికాలో 8వ గ్రేడ్ విద్ద్యార్ధిని అయిన నందిపాటి స్నిగ్ధ ఈ వూరి బాలికయే. అమెరికాలో 2012 లో నిర్వహించిన స్పెల్లింగ్-బీ పోటీలలో 2012 వ సంవత్సరానికి గాను జాతీయ ఛాంపియన్ గా ఎన్నిక అయింది. ఈ పోటీలలో ఎన్నిక అయిన మొదటి ముగ్గురు విద్యార్థులూ భారతీయ అమెరికనులు కావటం విశేషం[3].
  5. ఈ గ్రామంనకు చెందిన కీ.శే.మండవ కనకయ్య, సీతారత్నం దంపతుల కుమారుడు శ్రీ మండవ బాబూరావు, అమెరికాలో చేసిన సమాజసేవను గుర్తించిన అ దేశప్రభుత్వం, 2011 లో వీరికి ప్రతిష్ఠాత్మక ఇల్లీస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.. వీరు జన్మభూమి స్ఫూర్తితో 50 లక్షల రూపాయల వితరణతో, మొవ్వ గ్రామభివృద్ధికి తోడ్పడటమే గాకుండా, అమెరికాలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు 2016, జనవరిలో పరమపదించారు.
  6. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ ఆదిరాల డేవిడ్ కుమార్, జాతీయ సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) పురస్కారం అందుకున్నారు. దళితుల అభివృద్ధికి పాటుబడే రచయితలనూ, సేవారంగంలో కృషిచేసినవారినీ ప్రోత్సహించే భారతీయ దళిత సాహిత్య అకాడమీ, 2012-13 సంవత్సరానికి గాను వీరిని ఎంపికచేసింది. న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో, 2013, డిసెంబరు-12న జరిగిన, 29వ జాతీయ దళిత రచయితల మహాసభలలో, జాతీయ అకాడమీ అధ్యక్షులు దా.ఎస్.పి.సమనాక్షర్ చేతులమీదుగా, జాతీయస్థాయి సాహిత్య అకాడమీ అవార్డు అయిన, "డా.బి.ఆర్.అంబేద్కర్ ఫెలోషిప్"ను అందుకున్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

మొవ్వ ఇంటిపేరుతో ప్రసిద్ధులు:- మొవ్వా వృషాధ్రిపతి.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్[మార్చు]

గ్రామంలో ఈ పథకాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయత్‌రాజ్‌శాఖ, గ్రామీణ ఉపాధి పథకం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, 3.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసారు. చెత్త నుండి సంపద సృష్టించాడానికై గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుచున్నది. జిల్లాలో తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 39 చెత్త నిర్వహణ ప్రాజెక్టులలో, మొవ్వ ప్రాజెక్టు, సేంద్రియ ఎరువుల తయీరీలో ఆదర్శంగా నిలుచుచున్నది. వాతావరణ కాలుష్యాన్ని నిలువరించేటందుకు వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినది.

వనరులు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ఈనాడు నవంబరు 23, 2011- 11వ పేజీ , ది హిందూ దినపత్రిక ఏప్రిల్ 15, 2012, పేజీ-3
  3. ఈనాడు జూన్ 3, 2012, హాయ్ బుజ్జి పేజీ., ది హిందూ జూన్ 2, 2012, 14వ పేజీ.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మొవ్వ&oldid=4113738" నుండి వెలికితీశారు