Coordinates: 16°44′19″N 80°53′29″E / 16.738674°N 80.891497°E / 16.738674; 80.891497

మోర్సపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోర్సపూడి
—  రెవెన్యూ గ్రామం  —
మోర్సపూడి is located in Andhra Pradesh
మోర్సపూడి
మోర్సపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°44′19″N 80°53′29″E / 16.738674°N 80.891497°E / 16.738674; 80.891497
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం నూజివీడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,720
 - పురుషులు 856
 - స్త్రీలు 864
 - గృహాల సంఖ్య 525
పిన్ కోడ్ 521111
ఎస్.టి.డి కోడ్ 08656

మోర్సపూడి, ఏలూరు జిల్లా, నూజివీడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 111. ఎస్.టి.డి.కోడ్ = 08656. మొర్సపూడి ఏలూరు జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 525 ఇళ్లతో, 1720 జనాభాతో 753 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 856, ఆడవారి సంఖ్య 864. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 289 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 9. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589063.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నూజివీడు మండలం[మార్చు]

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం, హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.[3]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో రామన్నగూడెం, దేవరగుంట, వట్టిగుడిపాడు, గొల్లపల్లి, తుక్కులూరు గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మొర్సపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. నూజివీడు, హనుమాన్ జంక్షన్ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 42 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నూజివీడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్):- ఈ సంఘ కార్యాలయానికై నిర్మించిన నూతన భవనాన్ని 2017,ఫిబ్రవరి-13న ప్రారంభించారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మొర్సపూడిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

సాగునీటి చెరువు:- నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2017,మే-29న ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ విధంగా చెరువులో త్రవ్విన మట్టిని, రైతులు తమ పొలాలకు తరలించుకొనడమేగాక, పేదల ఇళ్ళు మెరక చేసుకొనడానికీ, పంచాయతీ పనులకూ ఉపయోగించుకొనడం విశేషం.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, ఉపసర్పంచిగా జి.భాస్కరరావు ఎన్నికైనాడు.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఫిబ్రవరి-13వతేదీ సోమవారంనాడు సంకట విమోచన శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ, కలశ, ధ్వజస్తంభ, ప్రతిష్ఠామహోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత గణపతిపూజ, పుణ్యాహవచనం, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భజన కోలాటం భక్తులను ఆకట్టుకున్నది. విచ్చేసిన భక్తులకు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ ఆలయ ధ్వజస్తంభం ఏర్పాటుకు దాతలు యలమంచిలి వెంకటరావు, స్వరాజ్యలక్ష్మి దంపతులు, నూకవరపు హనుమయ్య చౌదరి, మాధవి దంపతులు సహకరించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో, రినెన్ అను సంస్థవారు, రు. ఏడు కోట్ల వ్యయంతో, నూతనంగా నెలకొల్పిన, ఒక మెగావాట్టు సామర్ధ్యంగల, సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని, 2014, ఆగస్టు-7వ తేదీన ప్రారంభించారు. మూడు నెలల కాలంలోనే నిర్మించిన ఈ కేంద్రం, జిల్లాలోనే ప్రథమంగా ఏర్పాటు గావింపబడిన కేంద్రం. దీనిద్వారా రోజుకు 4,000 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తుని రు. 6-54 లకు ప్రభుత్వానికి విక్రయించెదరు.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మొర్సపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 310 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 69 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 373 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 180 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 193 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మొర్సపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 40 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 76 హెక్టార్లు
  • చెరువులు: 76 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మొర్సపూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

పరిశ్రమ[మార్చు]

శ్రీ శ్రీనివాస ఆయిల్ మిల్ (ఫీడ్ డివిజన్) అను ఒక పరిశ్రమ ఉంది. ఇందులో కోళ్ళదాణా, పశుదాణా ఉత్పత్తి చేయుదురు. [6]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1644. ఇందులో పురుషుల సంఖ్య 815, స్త్రీల సంఖ్య 829, గ్రామంలో నివాస గృహాలు 437 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 753 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-21.
  3. "మోర్సపూడి". Retrieved 21 June 2016.

వెలుపలి లింకులు[మార్చు]