మౌంట్ అబూ
| ?మౌంట్ అబూ రాజస్థాన్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 1,200 మీ (3,937 అడుగులు) |
| జిల్లా(లు) | సిరోహి జిల్లా |
| కోడులు • పిన్కోడు • టెలిఫోను • వాహనం |
• 307501 • ++02974 • RJ |
మౌంట్ అబూ అనేది పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వతశ్రేణుల్లో అతి ఎత్తైన పర్వత శిఖరం. ఇది సిరోహి జిల్లా లో ఉంది. మౌంట్ అబూ, పాలాన్పూర్ (గుజరాత్) నుండి 58 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ పర్వతం 22 కి.మీ.ల పొడవుతో, 9 కి.మీ.ల పరిధిలో విస్తరించిన వైవిధ్యమైన రాతి పీఠభూమిని ఏర్పరుస్తుంది. ఈ పర్వతంపై పొడవైన పర్వత శిఖరం గురు షిఖార్ సముద్రపు మట్టానికి 1,722 మీటర్ల ఎగువన ఉంది. దీని ఉపరితలాలపై నదులు, సరస్సులు, జలపాతాలు మరియు ఆకుపచ్చని అడవులు ఉన్న కారణంగా, దీన్ని ఎడారిలో ఒక నీటి చెలమ వలె వర్ణిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
మౌంట్ అబూ యొక్క ప్రాచీన నామం అర్బుదాంచల్ . అర్బుదాంచల్ అని పిలువబడే ఈ పర్వతశ్రేణులు గుర్జర్ జాతీయుల పూర్విక ప్రదేశమని ఇక్కడ ఉన్న కుడ్యలలో చెక్కిన శిలా శాసనాల ద్వారా ఊహించబడుతుంది. ధనపాలుని తిలకమంజరి కూడా దీనిని ధృవపరుస్తుంది. క్రీ శ 6వ శతాబ్ధం ఆరంభంలో గుర్జరజాతీయులు ఇక్కడ నుండి వలస వెళ్ళారని అంచనా. వారు రాజస్థాన్ మరుయు గుజరాత్లో అత్యధిక భూమిని రాజప్రతినిధులను నియమించారు. రాజస్థాన్లోని అత్యధిక భాగము మరియు గుర్జరాత్ కలిసి ఏకైక గుర్జరాత్ర (గుర్జర ప్రజల చేత పాలించబడేది) లేక గుర్జరభూమిగా ఉండేది. మొగలు సమ్రాజ్యం స్థాపించడానికి ముందు క్రీ శ 1311లో మౌంట్ అబూ దియోరా చౌహాన్ సామ్రాజ్యానికి చెందిన రావు లంబా చేత ఆక్రమించబడడంతో పార్మార్ల కాలానికి ముగింపు పలకడమే కాక మౌంట్ అబూ వైభవం క్షీణత మొదలైంది. క్రీ శ 1405లో ఆయన రాజధాని నగరానిని చంద్రావతి నుండి పీఠభూకి తరలించాడు. రావు షాస్మల్ శిరోహిని రాజధానిని చేసుకున్నాడు. తరువాత ఇది బ్రిటిష్ ప్రభుత్వం లీజుకు తీసుకున్నది. తరువాత కాలంలో షిరోహి మహారాజు రాజపుత్రుల నివాస రాధధాని అయింది.
[మార్చు] పురాణలలో ప్రశస్థి
పురాణాల్లో, ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్యం, ("అర్భు యొక్క అరణ్యం") అని సూచించేవారు మరియు 'అబూ' అనేది ఈ ప్రాచీన నామానికి సంక్షిప్త నామంగా చెప్పవచ్చు. వశిష్ట ముని, విశ్వామిత్రుడుతో విబేధాల కారణంగా మౌంట్ అబూలోని దక్షిణ ప్రాంతంలో సేద తీర్చుకున్నాడని నమ్ముతారు, అలాగే ఈ కథను నిరూపించే చిన్న ఆధారం కూడా దొరికింది. ఇక్కడ మరొక విశ్వాసం ప్రచారంలో ఉంది. అర్బుద అనే సర్పము పరమశివుని వాహనమైన నందీశ్వరుడిని ఇక్కడ రక్షించిందని విశ్వసించబడుతుంది.
[మార్చు] పర్యాటక ప్రదేశాలు
రాజస్థాన్లోని ఏకైక పర్వత ప్రాంతం అయిన మౌంట్ అబూ నగరం 1220 మీటర్ల (4,000 అడుగులు)ఉన్నతిలో ఉంది. దీన్ని శతాబ్దాలుగా రాజస్థాన్ మరియు పరిసర గుజరాత్ల వేడిమిని చల్లార్చుకోవడానికి జనాదరణ పొందిన ఏకాంత ప్రదేశంగా చెబుతారు. మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యం 1960లో స్థాపించబడిన అభయారణ్యం ప్ర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది ఈ పర్వతంలో 290 కిలోమీటర్లు వరకు విస్తరించింది. కొన్ని శతాబ్ధాలుగా ఉష్ణప్రడేశమైన రాజస్థానుకు మౌంటు అబూ ఒక శీతల ఉల్లాసవిడిదిగా ఉంటూవస్తుంది. సమీపంలోని గుజరాతీయులకు ఇది ఉల్లాసవిడిగిగా ఉంది. 1960నుండి ఇక్కడ ఆరంభించిన ది మౌంట్ అబూ విల్డ లైఫ్ శాంక్చురీ 290 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.
మౌంట్ అబూ పలు జైన్ ఆలయాలకు నిలయంగా ఉంది. దిల్వారా ఆలయాలు అనేవి 11వ మరియు 13వ శతాబ్దాల AD మధ్య నిర్మించిన, తెల్ల పాలరాయితో మలిచిన ఆలయాల సముదాయం. వీటిలో విమల్ షాచే 1031 ఏ డి లో నిర్మించబడిన విమల్ వాసవి ఆలయం చాలా పురాతమైనది మరియు ఇది జైన్ తీర్ధంకరలలో మొదటి తీర్థంకరకు ఉద్దేశించబడింది. లున్ వాసవి ఆలయాన్ని 'పార్వాల్ జైన్ సంఘానికి చెందిన సోదరులు వాస్తుపాల్ మరియు తేజ్పాల్లు 1231లో నిర్మించారు. వీరు గుజరాత్ స్థానిక పరిపాలకుడు, రాజా వీర్ ధవాల్ యొక్క మంత్రులు.
- దీనికి సమీపంలోనే మేవార్ రాజా రానా కుంభాచే 14వ శతాబ్దంలో నిర్మించబడిన అఛాల్ఘర్ కోట ఉంది. దీనిలో అఛాలేశ్వర మహాదేవ్ ఆలయం '(1412) మరియు కాంతినాథ్ ఆలయం (1513)లతో సహా పలు సుందరమైన జైన్ ఆలయాలు ఉన్నాయి.
- నక్కీ సరస్సు అనేది మౌంట్ అబూలోని సందర్శకులను ఆకర్షించే మరొక పర్యాటక ప్రాంతం. సరస్సు సమీపంలో పర్వతంపై టోడ్ రాక్ ఉంది. నక్కీ సరస్సు సమీపంలో పర్వతంపై రఘనాథ్ ఆలయం మరియు మహారాజా జైపూర్ ప్యాలెస్లు కూడా ఉన్నాయి.
- ఈ పర్వతంపై పలు హిందూ ఆలయలు ఉన్నాయి. ఘనమైన రాతితో చెక్కబడిన అధర్ దేవి ఆలయం శ్రీ రఘనాథ్ ఆలయం, మరియు గురు షిఖార్ పర్వత శిఖరాగ్రమున నిర్మించిన పవిత్రమైన దత్తాత్రేయ ఆలయం వంటి పలు హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి. మౌంట్ అబూ శిఖరాగ్రాన విష్ణువు యొక్క పాద ముద్రలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మౌంట్ అబూకు కొంచెం వెలుపల జగత్లోని రాతి చీలికలో దుర్గ ఆలయం, అంబిక మాతా ఆలయం ఉంది.
[మార్చు] బ్రహ్మ కుమారీ
ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనే పేరుతో ఉండే పరిత్యజించిన మహిళల వ్యవస్థ బ్రహ్మ కుమారీ యొక్క ప్రపంచ ముఖ్యకార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. " సమాజంలో మానవ విలువలు పూర్తిగా పతనమవుతున్నాయి. విలువలులేని సమాజంలో మనుగడ సాగించే మనుషులు మరమనుషులతో సమానం. నిత్యం సత్యాన్ని పాటిస్తూ అహింస మార్గంలో ముందుకెళ్తే నవసమాజాన్ని నిర్మించవచ్చు.ధనార్జన కోసమే న్యాయవృత్తిలో చేరవద్దు. సమాజంలో శాంతి స్థాపన కోసం బ్రహ్మకుమారీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. " బ్రహ్మకుమారీలు సూచించే అంశాలను పాటిస్తే కచ్చితంగా విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించవచ్చు"."---సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ అని ఉద్ఘాటించారు.
[మార్చు] వాతావరణం
- వేసవి కాలం ;- ఏప్రిల్ మాసం మధ్యకాలం నుండి జూన్ మాసం మధ్యకాలం వరకు వేసవి కాలం ఉటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఇక్కడకు వచ్చే పర్యాటకులు పలుచని నూలు వస్త్రాలను తీసుకువస్తే సౌకర్యంగా ఉండవచ్చు.
- వర్షా కాలం ;- వర్షాకలంలో మౌంటు అబూలో వర్షాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే పర్యాటకులు సాధారణ నూలు వస్త్రాలతో పాటు గొడుగులను కూడా వెంట తీసుకు వెళ్ళడం ఉపయోగం.
- శీతాకాలం ;- మౌంటు అబూ శీతాకాలం రాత్రులలో విపరీతమైన చలిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 16-22 డిగ్రీల మద్య ఫారెన్హీట్ ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 4-12 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్ 2-4 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పడిపోతుంది. ఈ సమయంలో పగటి సమయానికి పూర్తిగా శరీరాన్ని కప్పేలాంటి దుస్తులు సరిపోయినా రాత్రిసమయాలలో ఉన్ని కోట్లు, మఫ్లర్లు, మంకీ టోపీల వంటివి అవసరం ఔతాయి.
[మార్చు] రవాణా
సమీప రైల్వే స్టేషన్ మౌంట్ అబూ నగరానికి ఆగ్నేయంగా 27 కిమీల దిగువ ప్రాంతాల్లో అబూ రోడ్ వద్ద ఉంది. ఈ స్టేషన్ ఢిల్లీ, పాలాన్పూర్ మరియు అహ్మదాబాద్ల మధ్య ప్రధాన భారతీయ రైల్వే లైన్ పై ఉంది. ఇక్కడి నుండి ప్రతిరోజు రైలు సర్వీలు ఉంటాయి. ఇక్కడ నుండి అహమ్మదాబాద్ మరియు గుజరాత్ లోని పెద్ద నగరాలతో మౌంట్ అబూ అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడి నుండి జయపూర్, ఉదయపూర్, అజ్మీర్, ఇండోర్, ఆగ్రా, భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిని, ఢిల్లీ, ముంబాయి, కొలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, తిరువనంతపురం మరియు పూనా వరకు వారాంత(వారానికి ఒకటి) రైలు సౌకర్యాలు ఉంటాయి.
[మార్చు] జనాభా గణనలు
భారతీయ జనాభా లెక్కలు[1] ప్రకారం, మౌంట్ అబూలో 22,045 మంది జనాభా ఉన్నారు. జనాభాలో 58 % పురుషులు కాగా, మిగిలిన 42 % స్త్రీలు ఉన్నారు. మౌంట్ అబూలో సగటు అక్షరాస్యత రేటు జాతీయ సగటు 59.5 % కంటే ఎక్కువగా 67 % ఉంది: పురుషుల అక్షరాస్యత 77 % కాగా, స్త్రీల అక్షరాస్యత 55 % ఉంది. మౌంట్ అబూలో, జనాభాలోని 14 % మంది వయస్సు 6 సంవత్సరాలు కంటే తక్కువ.
[మార్చు] అన్వయములు
- ↑ Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional). Census Commission of India. 2004-06-16న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-11-01.