మౌలానా హస్రత్ మోహాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉర్దూ కవి
సయ్యద్ ఫజల్ హసన్ హస్రత్ మోహాని
మౌలానా హస్రత్ మోహాని
పుట్టిన తేదీ, స్థలం(1875-01-01)1875 జనవరి 1
మోహన్ నగరం, ఉన్నవ్ జిల్లా, సంయుక్త ప్రాంతము, బ్రిటీష్ ఇండియా
మరణం1951 మే 13(1951-05-13) (వయసు 76)
లక్నో, ఉత్తర ప్రదేశ్, భారత్
కలం పేరుమౌలానా హస్రత్ మోహాని
వృత్తిఉర్దూ కవి
జాతీయతభారతీయుడు
కాలం20వ శతాబ్దం
రచనా రంగంగజల్
విషయంప్రేమ, తత్వము,
సాహిత్య ఉద్యమంభారత స్వాతంత్ర్య పోరాటం

మౌలానా హస్రత్ మోహాని (ఉర్దూ: مولانا حسرت موہانی) (జననం 1875 - మరణం 1951) ఒక శృంగారరసభరిత కవి. ఇతను ఉర్దూ భాషాకవి, జర్నలిస్టు, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు, నిర్భయ స్వాతంత్ర్యసమరయోధుడు. ఇతని అసలు పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. ఉత్తర ప్రదేశ్, ఉన్నావ్ జిల్లాలోని 'మోహాన్' పట్టణంలో 1875లో జన్మించాడు.

ఇతడు ఒక చురుకైన విద్యార్థి, అన్ని పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉన్నతుడు. తరువాత అలీఘర్ లో చదివాడు. ఇతడు మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ జౌహర్మిత్రుడు. ఇతని రచనలు 'కులియాత్-ఎ-హస్రత్ మోహాని', 'షర్హ్-ఎ-కలామ్-ఎ-గాలిబ్', 'నుకాత్-ఎ-సుఖన్', 'ముషాహిదాత్-ఎ-జిందాన్' మొదలగునవి. గజల్ గాయకుడు గులాం అలి పాడిన 'చుప్ కే చుప్ కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై' ఇతని రచనే.

ఇతడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ను అధ్యక్షత వహించాడు. కమ్యూనిజంపట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు జోష్ మలీహాబాది, నాసిర్ కాజ్మి, జిగర్ మొరాదాబాది, అస్గర్ గోండవి.‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాద సృష్టికర్త.ఈ నినాదం ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ అధికార నినాదంగా మారింది.

ఇతను మే 13, 1951, లక్నోలో మరణించాడు.

మౌలానా నుస్రత్ మోహానీచే, మౌలానా హస్రత్ మోహానీ మెమోరియల్ 1951లో స్థాపింపబడింది. పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో ఇతని గౌరవార్థం ఒక మెమోరియల్ హాల్ కు, గ్రంథాలయాన్ని, కోరంగిటౌన్ లోని ఒక కాలనీకి, ఇతని పేరు పెట్టారు.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]