యాద్గిరి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Yadgir district కర్ణాటకలో స్థానం.

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో యాద్గిరి జిల్లా కన్నడ:ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆ ఒకటి. 2010 ఏప్రిల్ 10న జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. .[1] యాద్గిర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[2] జిల్లావైశాల్యం 5,160.88 చ.కి.మీ.

సన్నతి వద్ద భీమా నది

విభాగాలు[మార్చు]

జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: షహ్‌పూర్ (కర్ణాటక), షోరాపూర్, యాద్గిర్.[2] జిల్లాలో 16 మండలాలు, 117 గ్రామపంచాయితీలు, 519 (నిర్జన, నివాసిత ) గ్రామాలు, పురపాలకాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

యాదవగిరిని సాధారణంగా ప్రజలు యాదగిరి అంటారు. ఇది యాదవ రాజ్య రాజధానులలో ఒకటిగా ఉంది. ఇది చారిత్రకంగా, సంస్కృతికంగా సుంసంపన్నంగా ఉంది. యాదవులు యాదగిరిని వారి రాజధానిగా చేసుకుని 1347-1425 వరకు పాలించారు. యాదగిరి జిల్లా ప్రాంతంనికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణభారతీయ ప్రముఖ సామ్రాజ్యాలైన శాతవాహనులు, చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, షాహీలు, ఆది షాహీలు, నిజాం షాహీలు జిల్లా ప్రాంతాన్ని పాలించాయి.

1504లో యాద్గిరి (గుల్బర్గా) శాశ్వతంగా బీజపూరుకు చెందిన ఆదిషాహి సామరాజ్యానికి ఆనుకుని ఉంది. 1657లో ఈ ప్రాంతం మీద జుమ్లా దండయాత్ర చేసిన తరువాత ఈ ప్రాంతం ముగల్ సామ్రాజ్య ఆధీనంలోకి మారింది. తరువాత హైదరాబాద్‌కు చెందిన అసాఫ్ జాహి (నిజాం) సామ్రాజ్యం (1724-1948) యాద్గిరి, గుల్బర్గాను తమ ఆధీనంలోకి తీసుకుంది. 1863లో నిజాం ప్రభుత్వం జిల్లాబండి, సుర్పూర్ (షోరాపూర్) జిల్లాకేంద్రాలుగా 9 తాలూకాలతోచేయబడ్డాయి. 1873లో గుల్బర్గా 7 తాలూకాలతో ప్రత్యేక జిల్లాగా రూపొందింది. 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినప్పుడు గుల్బర్గా కర్ణాటక రాష్ట్రంలో భాగం అయింది. యాహ్గిరి అందులో ఒక తాలూకాగా ఉంది.

భహమనీ సుల్తానులు గుల్బర్గా నగరాన్ని మసీదు.ఉ, గుమాజ్లు, రాజ్యాంగ భవనాలతో నిర్మించారు. ఇందులో 5 అంతస్తుల. మసీదులు, మూడు మసీదులు, 10 దర్గాలు ఉన్నాయి. నగరం " గార్డెన్ ఆఫ్ గుంబజాలు " అని పిలువబడుంది. ఇందులో ఆలయాలు, చర్చీలు, ఇతర మతప్రధాన్యత కలిగిన పలు ప్రదేశాలు నగరమంతటా విస్తరించి ఉన్నాయి. యాదగిరిలో యాదవ వంశానికి చెందిన కోట నగరంలోని కొండ మీద నిర్మించబడి ఉంది.

జుమ్మా మసీదు[మార్చు]

కోటలోపల జుమ్మా మసీదు ఉంది. లోపల ప్రసిద్ధ గుల్బర్గా స్మారక చిహ్నం చక్కాగా సంరక్షించబడిన స్థితిలో ఉంది. ఇది స్పైయిన్ నగరంలోని కొర్డోవా నగరంలో ఉన్న మసీదును పోలి ఉంటుందని భావిస్తున్నారు. మసిదు తూర్పు పడమరలలుగా 216 అడుగులు మరొయు ఉత్తర దక్షిణాలుగా 176 అడుగులు కొలతలతో నిర్మించబడింది. మదీదు వైశాల్యం 38016 చ.అడుగులు ఉంటుంది. భరతదేశంలో పూర్తిగా కప్పబడిన మసీదు ఇది ఒక్కటి మాత్రమే.

యాద్గిరి రాష్ట్రజిల్లాలలో అతితక్కువ వైశాల్యం కలిగిన జిల్లాలలో రెండవస్థానంలో ఉంది. జిల్లాలోని సారవంతమైన నల్లరేగడి మట్టి వ్యవసాయానికి అత్యంత అనుకూలమైనదిగా ఉంది. ఇది జొన్నలు, పప్పుధాన్యాలు విస్తారంగా పండించబడుతున్నాయి. జిల్లా రాష్ట్ర " డాల్ బౌల్ " (పప్పుధాన్యాగారం) జిల్లాలలో పలు సిమెంటు కంపెనీలు ఉన్నాయి. జిల్లాలో ప్రఖ్యాత " మలఖెడా స్టోన్ "లు ఉన్నాయి.

నదులు[మార్చు]

జిల్లాలో ప్రధానంగా కృష్ణా , భీమా నదులు ప్రవహిస్తున్నాయి. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ , షహపూర్ తాలూకాలోని బెండేబెంబలి వద్ద " కోర్ గ్రీన్ చక్కెర ఫ్యాక్టరీ " ఉన్నాయి. యాద్గిరి సిమెంట్, వస్త్రాల తయారీ, తోలు , రసాయన ఉత్పత్తులకు ప్రసిద్ధి. భీమరాయన గుడి వద్ద (బి.గుడి) ఉంది.

రూపకల్పన[మార్చు]

2008 సెప్టెంబర్ 26 న గుల్బర్గా వద్ద కేబినెట్ మీటింగ్ నిర్వహించబడిన తరువాత యాద్గిరి జిల్లా సరికొత్త జిల్లాగా అవతరించింది. అయినప్పటికీ 2009 డిసెంబర్ 30 న చివరి నోటీస్ జారీ చేయబడిన తరువాత జిల్లా పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలైంది..[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,172,985, [4]
ఇది దాదాపు. తైమూర్ లెస్తే దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. రోదే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 404 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 224 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.67%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 984: 1000, [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 52.36%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

విద్య[మార్చు]

జిల్లాలో 1024 పాఠశాలలు, 149 ఉన్నత పాఠశాలలు, 40 ప్రి యూనివర్శిటీ కాలేజీలు, 6 డిగ్రీ కాలేజీలు, 1 పాలిటెక్నిక్ విద్యాసంస్థ ఉన్నాయి.

యాద్గిరి జిల్లాలో 933 ప్రాథమిక పాఠశాలలు, 464 లోయర్ ప్రాథమిక పాఠశాలలు, 469 హయ్యర్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో మహిళా, శిసు సంక్షేమ కార్యక్రమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 1223 అంగంవాడి కేంద్రాలు ఉన్నాయి. 605 పాఠశాలలు‌లో లోయర్ ప్రాథమిక విద్య అందుబాటులో ఉంది. వీటిలో 464 పాఠశాలలు ఎజ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. 1 పాఠశాల‌ను సోషల్ వెల్‌ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 3 నిధిసహాయంతో నడుస్తున్నాయి. 137 నిధిసహాయ రహిత పాఠశాలలు ఉన్నాయి. 587 పాఠశాల హయ్యర్ సెకండరీ విద్యను అందిస్తున్నాయి. వీటిలో 469 ఎజ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. 15 పాఠశాల‌ను సోషల్ వెల్‌ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 26 నిధిసహాయంతో నడుస్తున్నాయి. 77 నిధిసహాయ రహిత పాఠశాలలు ఉన్నాయి. 200 పాఠశాలలు ఉన్నత పాఠశాల విద్యను అందిస్తున్నాయి. వీటిలో 119 ఎజ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. 16 పాఠశాల‌ను సోషల్ వెల్‌ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 15 నిధిసహాయంతో నడుస్తున్నాయి. 50 నిధిసహాయ రహిత పాఠశాలలు ఉన్నాయి. .

మేజర్ సంస్థలు ఉన్నాయి:

  1. చిరంజీవి మెథడిస్ట్ ఉన్నత పాఠశాల (ఇంగ్లాండ్ & కన్ మీడియం)
  2. మహాత్మా మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాల & పు విజ్ఞాన శాస్త్రం కాలేజ్
  3. ఢోకా జైన్ ఉన్నత పాఠశాల
  4. డాన్ బాస్కో పాఠశాల & కాలేజీ
  5. Jawar ఎడ్యుకేషన్ సొసైటీ
  6. R.V. ఎడ్యుకేషన్ ట్రస్ట్
  7. న్యూ కన్నడ హయ్యర్ ప్రాథమిక పాఠశాల & కాలేజీ
  8. శ్రీ చెన్నారెడ్డి పాటిల్ పు కాలేజ్
  9. చిరంజీవి మెథడిస్ట్ మిశ్రమ పు కాలేజ్
  10. Governament డిగ్రీ కళాశాల
  11. గవర్నమెంట్ హయ్యర్
  12. నివేదితచే ఎడ్యుకేషన్ సొసైటీ
  13. Govt. జూనియర్ కాలేజ్
  14. Yadgir పాలిటెక్నిక్ (లుక్మాన్ ట్రస్ట్, గుల్బర్గా ద్వారా నిర్వహించబడింది)
  15. ఎం.ఆర్.ఎం. ఉన్నత పాఠశాల ఎ.టి. పౌల్స్, ఉన్నత పాఠశాల (షహపూర్)
  16. ప్రభుత్వం హైర్ ప్రాథమిక పాఠశాల బుదనూర్ టి.క్యూ: షహపూర్ 5853309.
  17. జవజర్ నవోదయ ఆర్గనైజేషన్, యాద్గిర్, హొత్పేట్ భీమరయాన గుడి, షపూర్,
  18. శ్రీ బాలాజీ లోవర్ ప్రాథమిక పాఠశాల బలజానగర్ (బసవంథర్పుర్)

వైద్యసౌకర్యాలు[మార్చు]

జిల్లాలో 3 ఆయుర్వేదిక, 37 ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలు, 20 డిస్పెంసరీలు, 120 కుటుంబ సంక్షేమ కేంద్రాలు ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • 'ధాబ్ దాబి జలపాతం :- గుర్మిత్కల్ నుండి 5 కి.మీ, యాద్గిరి నుండి 30 కి.మీ దూరంలో ఉంది.
  • చింతానలి :- గవి సిద్ధేశ్వరాలయం ఉంది. ఇది ఒక గుహాలయం. ఈ అలయం మీదుగా ద్వారం వద్ద సహజసిద్ధమైన నీరు ప్రవహిస్తూ ఉంది. అందువలన భక్తులకు దైవదర్శానినికి ముందు పవిత్ర స్నానం లభ్యమౌతుంది.
  • బీమా నదిమీద వంతెన నిర్మితమై ఉంది. నగరానికి 4 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన రహదారి మార్గంతో నగరంతో అనుసంధానితమై ఉంది.
  • షహపూర్ సమీపంలో ఉన్న నిద్రపోతున్న బుద్ధుడు. 4 ప్రవతాలు నిద్రపోతున్న బుద్ధునిలా కనిపిస్తుంటాయి.

మూలాలు[మార్చు]

  1. "Yadgir becomes State's 30th district". The Hindu. 11 April 2010. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 25 April 2010.
  2. 2.0 2.1 Sivanandan, T. V. (30 December 2009). "Yadgir district to become reality today". The Hindu. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 22 April 2010.
  3. [1]
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567