రాజపుత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసక్రమం
హిందూ మతం

ఓం

చరిత్ర · దేవతలు
Denominations
Mythology

ధర్మము · Artha ·
కామము · మోక్షము ·
కర్మ · సంసారం
యోగ · భక్తి · మాయ
పూజ  · హిందూ దేవాలయం

వేదములు · ఉపనిషత్తులు
రామాయణం · మహాభారతము
భగవద్గీత · పురాణములు
ధర్మ శాస్త్రములు · others

సంబంధిత విషయాలు

en:Hinduism by country
Gurus and saints
Reforms · Criticism
హిందూ కేలండర్ · హిందూ చట్టము
ఆయుర్వేదం · జ్యోతిష్యము
వర్గం:హిందువుల పండుగలు · Glossary

హిందూ స్వస్తిక గుర్తు

రాజ్ పుత్స్ (రాజ్ పుట్స్) అనగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం, పాకిస్థాన్ లో నివసించే హిందూ తెగలు. వీరు 6 నుండి 12 వ శతాబ్దం వరకూ రాజ్యాలు పాలించడంలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాజస్థాన్, సౌరాష్ట్ర (సూరత్) ప్రాంతాలను పాలించారు. వీరి జనాభా ఇప్పటికీ రాజస్థాన్, సూరత్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ, పంజాబ్, మధ్య ప్రదేశ్,, బీహర్ లో కనిపిస్తారు. వీరు జన్మతః క్షత్రియులు. వీరు సూర్య, చంద్ర, అగ్ని వంశాలకు చెందినవారిగా చెప్తారు. రాజ్పుట్స్ అనగా తెలుగులో రాజపుత్రులు (అగ్ని కుల క్షత్రియులు) అని అర్ధం.

8 నుండి 11 శతాబ్దాల్లో సామ్రాజ్యాలు[మార్చు]

సా.శ. 9వ శతాబ్దం ఆరంభంనుండి రాజ్పుట్ సామ్రాజ్యాలు ఉత్తర భారత దేశాంలో చాలవరకూ ఆక్రమించాయి, కాని చాలా సామ్రాజ్యాలకు ముస్లిం రాజులు ప్రధాన శత్రువులుగా ఉండేవారు. పంజాబును, గంగానది ఒడ్డుని ముస్లిములు ఆక్రమించిన తర్వాత కూడా మధ్య భారత దేశంలో రాజ్పుట్స్ తమ స్వాతంత్ర్యతను నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఖిల్జీ సామ్రాజ్యానికి చెందిన అల్లాఉద్దీన్ ఖిల్జీ తూర్పు రాజస్థాన్లో చిత్తూరుగర్, రంతంభూర్ కోటలను ఆక్రమించారు.

బ్రిటీషు పాలన[మార్చు]

1817-1818 లో ఆంగ్లో మరాఠాల యుద్ధం తర్వాత రాజపుటానా (రాజస్థాన్) లో అన్ని సామ్రాజ్యాలు బ్రిటీషు వారికి సామంతులైయ్యారు. బ్రిటీషువారి కాలంలో మరో మూడు సంష్తానాలు ఏర్పడ్డాయి. అవి ఏమనగా టాంక్, జలావర్, మైరియు ధోల్పుర్.

రాజ వంశాలు[మార్చు]

  • సూర్యవంశం: బైస్, చత్తర్, గౌర్, కచ్వహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథొర్, సిస్సొడియ, సహారన్
  • చంద్రవంశం: భాటి ఖండేల, భట్టి రాజపుత్రులు (భట్టు), జడొన్, జడేజ, చుడసమ, కటొచ్, భంగాలియ, పహొర్, సొం, తొమార.
  • అగ్నివంశం: పల్లవరాజులు, భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరామర, సోలంకి.

వంశాలు, సామ్రాజ్యాలు[మార్చు]

Rajpoots 2.png
రాజపుత్రులు ,1876లో తీసిన చిత్రం
  • జాంజువా రాజ్పుట్ హిందూ షాహీ సామ్రాజ్యం: టర్కీవారి ఆక్రమణ కాలంలో వీరు ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ ప్రదేశాలు పాలించారు. జయపాల మొదటి రాజు కాగా భీమపాల ఆఖరి రాజు.
  • చౌహాన్ వంశం: సా.శ. 956 నుండి 1192 మధ్య చౌహానులు అజ్మెర్ ను రాజధానిగా చేసుకొని తూర్పు రాజస్థాన్ ను పాలించారు. వీరిలో గొప్పవాడు పృధ్విరాజ్ చౌహాన్. రెండవ తారైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతుల్లో పృద్విరాజ్ మరణించాడు.
  • సోలంకి వంశం: సోలంకిలు సా.శ. 945 నుండి 1297 వరకూ గుజరాత్ రాష్ట్రాన్ని పాలించారు.
  • పరమర వంశం: ఈ వంశం సా.శ. 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది. ఉపేంద్ర మొదటి రాజు. తర్వాత ఇతని కుమారులైన వైరిసింహ, దంబరసింహ పాలించారు. వైరిసింహ 2 తర్వాత అతని కుమారుడైన సియాక 2 (హర్ష) పాలన సాగించాడు. తర్వాత ఇతని కుమారుడైన వాక్పతిరాజా పాలన సాగించాడు. సియాక 2 కుమారుడైన వాక్పతిరాజ 2 శ్రీవల్లభ, పృధ్వి వల్లభ, అమోఘవర్ష అను బిరుదులు సాధించాడు. వాక్పతిరాజ సోదరుడైన సింధురాజ కుమార నారాయణ మరియూ నవసాహసంఖ అను బిరుదులు సాధించాడు. భోజ 1 భోజ్పుర్ నగరాన్ని స్థాపించి ఎన్నో ఆలయాలు నిర్మించాడు, 84 పుస్తకాలు రచించాడు. ఇతని తర్వాత జయసింహ, ఉదయాదిత్య, లక్ష్మణదేవ, నరవర్మదేవ, సలక్షణవర్మ, యశోవర్మ, జయవర్మ, బల్లాల, వింద్యావర్మ, సుభతావర్మ, అర్జునవర్మ, దేవపాల, జైతుగిదేవ, జయవర్మ, జయసింహ 2, అర్జునవర్మ 2, భోజ 2, మహ్లకదేవ పాలించారు.
  • ప్రతిహార వంశం: ఈ సామ్రాజ్యము సా.శ. 6వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకూ ఉత్తర భారతంలో విరాజిల్లింది. కన్నాజ్ వీరి రాజధాని. ఈ దడ్డ 1,2,3, నాగ భట్టు, వత్సరాజ, నాగభట్టు 2, రామభద్ర, మిహిరభోజ 1, మహేంద్రపాల 1, భోజ 2, మహిపాల 1, మహేంద్రపాల 2, దేవపాల, వినయపాల, మహీపాల 2, విజయపాల 2, రాజపాల, త్రిలోచనపాల, జసపాల వంటి రాజులు పాలించారు.
  • ఖండేల వంశం: వీరు ఖజురహో రాజధానిగా చేసుకొని 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విద్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
  • గహద్వాల వంశం: ఉత్తర ప్రదేశ్ లో కనాజ్ అను జిల్లాను రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంనుండి సుమారు 100 సంవత్సరాలవరకు పాలించారు. ఈ సామ్రాజ్యాన్ని చంద్రదేవ 1096 లో స్థాపించాడు.
  • చాంద్ వంశం: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కుమాన్ ప్రాంతానికి చెందిన ఈ సామ్రాజ్యాన్ని వీరు 11వ శతాబ్దంలో పాలించారు. వీరు రఘు వంశస్తులని పలువురి భావన. ఈ సామ్రాజ్యాన్ని సోమ చంద్ అనే రాజు స్థాపించాడు.
  • కటోచ్ వంశం: చాలా పురాతనమైన ఈ సామ్రాజ్యాన్ని రాజనక భూమి చంద్ స్థాపించాడు. ఈ సామ్రాజ్యం పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము రాష్ట్రాల మధ్య విరాజిల్లింది. క్రీస్తు పూర్వం 275 లో వీరు సామ్రాట్ అశొకుడి చేతిలో ఓడిపోయారు. కంగ్రా లోయలో వీరు నిర్మించుకొన్న కంగ్రా కోటపై వరుసగా సా.శ. 1009లో మహమ్మద్ గజిని, 1337 లో తుగ్లక్, 1351 లో ఫిరోజ్ షా తుగ్లక్ దాడి చేశారు. మహాభారత కావ్యంలో ఈ సామ్రాజ్యం త్రిగార్తగా ప్రస్తావించబడింది.
  • బుందేల వంశం : ఈ వంశము 16 వ శతాబ్దమునుండి బుందేల్ఖండ్ ను పాలించింది. బుందేలుల నాయకుడైన రుద్ర ప్రతాపుడు మధ్య ప్రదేశ్ లో యుర్ఖ నగరాన్ని నిర్మించాడు. తరువాత ఇతని కుమారుడైన మధుకరుడు పాలించాడు. వీరు ఆఖీ, ధాటియ, పన్న, అజయగర్, చర్కారి, చత్తర్పుర్, జసొ అను సామ్రాజ్యాలు స్థాపించారు.
  • తొమార వంశం: ఈ వంశస్థులు ఇణ్ద్రప్రస్తను, ఉత్తర కురు, నుర్పుర్, ఢిల్లీ, తన్వరవటి, గ్వాలియర్, కయస్తపద, ధోల్పుర్, తార్గర్ వంటి ప్రాంతాలను పాలించారు. అనంగపాల తొమార 2 యొక్క కుమార్తె కుమారుడే పృధ్విరాజ్ చౌహాన్.
  • పతానియ వంశం: 11వ శతాబ్దంలో ఈ వంశస్థులు హిమాచల్ ప్రదేశ్ లో నుర్పుర్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు, 1849 వరకూ పాలించారు. వీరు పంజాబులో పథంకోట్ ను రాజధానిగా చేసుకొని, పంజాబు ప్రాంతాలను, హిమాచల్ ప్రదేశ్ లో కంగర్ జిల్లాలను పాలించారు. రాజ జగత్ సింగ్ పాలనలో ఈ సామ్రాజ్యం స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. వీరు శివాలిక్ శ్రేణుల్లో మకట్ కోటను, నుర్పుర్ నుండి తారగర్ మధ్య ఇస్రాల్ కోటను నిర్మించారు.
  • సిస్సోడియా వంశం: వీరు రాజస్థాన్లో మెవార్ అను సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ, ఆగ్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను పాలించారు. మహా రాణా ప్రతాప్ సింగ్ ఈ వంశానికి చెందినవాడు .
  • కచ్వాహ వంశం: ఈ వంశం వారు జైపుర్, అల్వార్, మైహార్, తాల్చర్ వంటి ప్రాంతాలను పాలించారు. జైపుర్ సామ్రాజ్యాన్ని మహారాజ సవై జై సింగ్ 2 స్థాపించాడు. వీరిలో పజ్వాన్, జై సింగ్ 1, రాంసింగ్ 1, మహారాజ సవై జై సింగ్ 2, మహారాజ సవై ఇస్రిసింగ్, మహారాజ సవై మధొసింగ్, మహారాజ సవై ప్రతాప్ సింగ్, రాజ మాన్ సింగ్ 1, మహారాజ సవై మాన్ సింగ్ 2, మహారావ్ శేఖ, మహారాజ హరి సింగ్, మహారాజ గులాబ్ సింగ్ ముఖ్యమైనవారు. రాజా మాన్ సింగ్ 1 నిర్మించిన అంబర్ కోట ప్రసిద్ధి చెందింది.
  • రాథొర్ వంశం: ఈ వంశస్థులు మార్వార్, బికానెర్, బత్ ద్వారక, కిషాంగర్, ఇదార్, రత్లాం, సితమౌ, సైలాన, కొత్ర, అలిరాజ్పుర్, మండ, పూంచ్, అమ్రిత్పుర్ వంటి ప్రాతాలను పాలించారు.
  • జడేజ వంశం: ఈ వంశస్థులు 1540 నుండి 1948 వరకూ గుజరాత్ లో కచ్ జిల్లాను పాలించారు.
  • హడ వంశం: వారు చౌహాన్ వంశస్థులు. వీరు బుంది, బరన, ఝల్వర్, కోట జిల్లలను పాలించారు. హడా రావ్ దేవ బుందిని 1241 లో ఆక్రమించాడు, 1264 లో కోటను ఆక్రమించాడు.
  • భాటి వంశం: ఈ వంశస్థులు జైసల్మెర్ ను పాలించారు. ధీరజ్ జైసల్మెర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ధీరజ్ కుమారుడైన రావల్ జైసల్ 1156 లో ఒక మట్టికోటను నిర్మించాడు. ఈ ప్రదేశము నేడు జైసల్మెర్ గా పులవబడుతోంది.
  • షెకావత్ వంశం: కచ్వాహ్ వంశానికి చెందిన వీరు 1445 నుండి 1949 వరకూ షెకావతి అను ప్రాంతాన్ని పాలించారు. మహారావ్ షెఖా షెకావతి సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
  • దోగ్ర వంశం: ఈ వంశస్థులు జమ్ము కాశ్మీర్ ను పాలించారు. గులాబ్ సింగ్ (1792–1857) మొదటి రాజు, హరి సింగ్ ఆఖరి రాజు.
  • రాణా వంశం: ఈ వంశస్థులు నేపాల్ సామ్రాజ్యాన్ని 1846 నుండి 1951 వరకూ పాలించారు. కస్కి జిల్లాకు చెందిన బాల్ నర్సింగ్ నుండి సంక్రమించిన ఈ సామ్రాజ్యాన్ని జంగ బహదుర్ కన్వర్ మొదలుపేట్టాడు.

గోత్రాలు[మార్చు]

రాజపుత్రులు గోత్రాలు కాస్యప, శేఘూఋఊ, కౌండిన్య, భరద్వాజ, గౌతమ, వశిష్ట, వత్స, కౌశిక (విశ్వామిత్ర), రఘుకుల, ఆత్రి, భార్గవ, ఆత్రేయస, వంటి గోత్రాలు ఉన్నాయి.

సేవా సంస్థలు[మార్చు]

దేశవ్యాప్తంగా క్షత్రియ కులాలకు చెందిన విద్యార్థులు, పేదలు, వృద్దులు కోసం రాజ్పుట్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (RANA), రాజ్పుట్ ఫేడరేషన్ వంటివి ఎన్నో ఏర్పడ్డాయి. దక్షిణదేశపు ఆంధ్ర రాజులు (ఆంధ్ర క్షత్రియులు), రాజ్పుట్స్ కలిసికట్టుగా ఏర్పడిన అఖిల భారత క్షత్రియ సంఘానికి (All India Kshatriya Federation - AKIF) సూర్యవంశ రాజ్పుట్ వంశానికి చెందిన నరేంద్ర సింగ్ రాజావత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఇంకా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]