రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు

వికీపీడియా నుండి

రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు (ఫిబ్రవరి 20, 1901 - 1978) బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.[1]. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా జస్టిస్ పార్టీ వ్యక్తిగా 1932 నుండి 1936 వరకు మళ్ళీ 1936 నుండి 1937 వరకు నిర్వహించారు.[2].


తన చిన్నతనం నుంచే చేసిన పనిమీద పట్టుదల సాధించడం అలవాటు. లక్ష్మీ విలాస్ పాలస్ లో ముగ్గురు దొరలు ఒక భారతీయ గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు. బాడ్మింటన్, బిలియర్డ్స్ ఎక్కువగా ఆడేవారు.

1921 సంవత్సరంలో తల్లప్రోలు జమిందారీ యువరాణి లక్ష్మీ సుభద్రమ్మను వివాహం చేసుకున్నారు. 1930లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైజాగపటం నియోజకవర్గం నుండి 28,00 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లండన్ లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారతదేశం తరుపున పాల్గొన్నారు. ముత్తుస్వామి నాయుడు రాజీనామా తరువాత జస్టిస్ పార్టీ రామకృష్ణ రంగారావును పార్టీ అధికారిగా ఎన్నుకున్నారు. గవర్నరు పిలుపుమీద ముఖ్యమంత్రిగా నవంబరు 5, 1932లో అధికారం చేపట్టారు.

వీరి హయాంలో ఎస్టేట్ల భూమి చట్టం, 1908 సవరించారు. దీనిద్వారా రైతులకు ఎంతో మేలు కలిగింది. ఆ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో మూడవ వంతు జమిందారుల హస్తాల్లో ఉండేది. ఇనాం బిల్లు ప్రవేశపెట్టి 5 మిలియన్ల రైతులకు న్యాయం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానము అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెట్టారు. మద్రాసు ప్రెసిడెన్సీలో హరిజనులను దేవాలయ నిర్వాహణలో పాల్గొనేవిధంగా చట్టసవరణ చేశారు.

వీరు మంచి క్రీడాభిమాని. వీరు గుర్రపు స్వారీ మరియు పోలో ఆటలలో ఎక్కువగా పాల్గొనేవారు. మేలు జాతి గుర్రాలను ఇంగ్లండు, ఫ్రాన్స్ మరియు పాకిస్థాన్ లనుండి దిగుమతి చేసుకొనేవారు. జైపూరు మరియు మైసూరు లలో జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.

వీరు విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు రవీంద్రనాథ్ టాగోర్ శాంతి నికేతనం కోసం బహుళ విరాళాలు అందజేశారు.

[మార్చు] మూలాలు

3. Bobbili: Being a biography of Sri Varu Sir Ramakrishna Swatchelapathi Ranga Rao, the 13th Raja of Bobbili, who was Chief Minister of Madras (1932-36), Nilkan Perumal, The Topical Book Co: 1960.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు