లక్షద్వీపములు

వికీపీడియా నుండి

లక్షద్వీపముల పటము

లక్షద్వీపములు భారత దేశములోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. ఈ దీవుల యొక్క భూ వైశాల్యము మొత్తము 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరమునుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరములో ఉన్నవి. ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావసము ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జనమైన దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండములు ఉన్నవి.

లక్షద్వీప్ దీవుల పటము

జనావాసమైన దీవులు:

లక్షద్వీపముల ఉపగ్రహ చిత్రము

కవరత్తి (రాజధాని నగరమైన, కవరత్తి ఇక్కడే ఉన్నది), ఆగట్టి, మినీకాయ్ మరియు అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారము ఈ కేంద్రపాలిత ప్రాంతము యొక్క మొత్తము జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయము ఉన్నది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యము కలదు.

1973 వరకు, ఈ దీవుల సమూహము ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపము అని పేరున్న మాల్దీవ్స్ తో పోల్చండి).

ఈ దీవుల యొక్క ప్రజలు మళయాళము యొక్క మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తము జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తూఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకము.

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు