లేఖా సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • సాహిత్య సంస్కృతికపరమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెపుతారు.
  • వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని లేదా ఊహాజనితమైన వ్యక్తుల మధ్యగాని లేఖలద్వారా సంభాషణ జరుగవచ్చు.
  • తెలుగులో లేఖల్ని స్వీకరించిన మొదటి వ్యక్తి చార్లెస్ పిలిప్ బ్రౌన్.
  • లేఖలకు సంబంధించి భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ప్రస్తావన "అభిజ్ఞానశాకుంతలం"లో ఉంది.
  • లేఖలకు సంబంధించి తెలుగులో మొట్టమొదటి ప్రస్తావన పింగళి సూరన "ప్రభావతిప్రద్యుమ్నము"లో ఉంది.
  • గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లు ప్రేమలేఖలు.
  • కనుపర్తి వరలక్ష్మమ్మ ఉత్తరాల పేర్లు శారద లేఖలు.
  • నెహ్రూ లేఖల్నితెలుగులోకి అనువదించినది కాటూరి వేంకటేశ్వరరావు.
  • బెంగాలీ రచయిత శరత్ చంధ్ర చటర్జీ లేఖల్ని తెలుగులోకి అనువదించినది పురాణరాఘవ శాస్త్రీ.
  • జానపదుని జాబులు రచయిత బోయి భీమన్న.
  • గీరతం రచయితలు తిరుపతి వేంకటకవులు.
  • పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయకుశలోపరిలను రచించినవారు త్రిపురనేని గోపీచంద్.
  • తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధుడు డా.సంజీవ్ దేవ్.
  • పోస్ట్ మ్యాన్ మీద కవితలు రాసినవారు తిలక్.
  • తెలుగులో లేఖా సాహిత్యంపై పి.హెచ్.డి చేసినవారు 1.మలయశ్రీ 2.సి.హెచ్.సీతాలక్ష్మీ.