వలిపె రాంగోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వలిపె రాంగోపాలరావు నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 2013లో ఇన్ఫోసిస్ అవార్డును[1] పొందాడు.

విద్యాభ్యాసం[మార్చు]

రాంగోపాలరావు కొల్లాపూర్ పట్టణానికి చెందిన న్యాయవాది రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు కొల్లాపూర్ సమితి చైర్మెన్‌గా పనిచేశాడు.[2] రాంగోపాలరావు ఇంటర్మీడియట్ వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివాడు. బీటెక్ ను మహారాష్ట్ర లోని రాంటెక్ నుంచి పూర్తిచేశాడు. ఆ తర్వాత ముంబాయి ఐఐటీలో శాస్త్రవేత్తగా చేరి ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నాడు.

అవార్డులు- గుర్తింపులు[మార్చు]

రాంగోపాలరావు కృషికి గుర్తింపుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 2009 జనవరిలో ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపికయ్యారు.[3].2013లో నానో టెక్నాలజీ విభాగంగంలో కృషికిగాను ఇన్ఫోసిస్ అవార్డూకు ఎంపికకాబడ్డాడు. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తిగా కీర్తి గడించాడు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-11-2013
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-11-2013
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-21. Retrieved 2013-11-17.