వాడుకరి:Pavan santhosh.s/sand box

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

21 ఆగస్టు[మార్చు]

[1] [2] [3]

ఆగస్టు 22[మార్చు]

[4] [5] [6]

ఆగస్ట్ 23[మార్చు]

[7] [8] [9] [10] [11]

సెప్టెంబర్ 5[మార్చు]

[12] [13]

సెప్టెంబర్ 18[మార్చు]

[14] [15] [16]

ఉపయుక్త వివరాలు[మార్చు]

  • క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో తెలిపేవి అపరాధ పరిశోధక నవలలు. తెలుగులో ఒకనాడు వెల్లువలా వచ్చిన డిటెక్టివ్ నవలల్లో ఇదీ ఒకటి.
  • జీవిత చరిత్రను ఈ గ్రంథం ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.
  • భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజలు ద్వారా వాద్యాల గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు.
  • వయోజన విద్య ద్వారా కొత్తగా అక్షరాలు నేర్చుకున్న పెద్దలు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలకు ప్రత్యేకమైన లక్షణాలు కావాల్సివుంటుంది. కథాంశం ప్రౌఢమైనది, విజ్ఞానదాయకమైనదీ కావాలి, కథనం ఆసక్తికరంగా, వేగంగా ఉండాలి ఐతే భాష మాత్రం బాలల సాహిత్యం వలె తేలికగా చదివి అర్థం చేసుకునేందుకు పనికి రావాలి. ఇటువంటు లక్షణాలతో నవశిక్షితుల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నవశిక్షిత గ్రంథమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ పుస్తకం ప్రచురణ పొందింది.
  • శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడం లో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
  • రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో ఇది ఒకటి.

|- | [[భాగవతం - ఏడవ స్కంధము|శ్రీమదాంధ్ర భాగవతం - సప్తమ స్కంధము]] [] || [[పోతనామాత్యుడు]] || పద్యకావ్యం || తెలుగు సాహిత్యంలోని అత్యంత ప్రాముఖ్యత, ప్రాచుర్యం కలిగిన గ్రంథాల్లో ఆంధ్ర భాగవతం ముందువరుసలో ఉంటుంది. మూలమైన వ్యాస భాగవతాన్ని కూడా పోతన భాగవతం మరపించేలా చేసిందంటే ప్రాధాన్యత అర్థంచేసుకోవచ్చు. తెలుగు నాట వందల ఏళ్ళుగా ఇంటింటికీ ప్రచారమైనదీ కావ్యం. గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రము, కుచేలోపాఖ్యానము వంటీవి విడివిడిగా చదువుకునేవారు. వ్రాత ప్రతుల కాలంలో ఈ ఘట్టాల వ్రాతప్రతులు తెలుగునాట ఎన్నో గ్రంథాలకన్నా ఎక్కువగా ఉండడంతో వీటి ప్రాచుర్యం తెలుస్తుంది. ||

|- | [[శ్రీమదాంధ్ర మహాభారతం]] [] || కర్తలు.[[కవిత్రయం]] || ఇతిహాసం || మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని తెలుగులో ఒక సామెత. "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. ||

కవులు[మార్చు]

"భాసో హాసః కాళిదాసో విలాసః"-సరస్వతీదేవి ముఖంపై భాసుడు చిరునవ్వు, కాళిదాసు ఆమె విలాసమూ అని సంస్కృత పండితుల్లోని ఉక్తి. అంతగా రసికులు, పాఠకులు, పండితుల మన్నన పొందిన సంస్కృత కవి భాసుడు. ఆయన రాసిన నాటకాలు సంస్కృత సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచేవి. భారతం, రామాయణం, హరివంశం, బృహత్కథలలోని ఇతివృత్తాలను ఆధారం చేసుకుని ఆయన రచించిన నాటకాలు మొత్తంగా 13 లభిస్తూ అలరిస్తున్నాయి. వాటిలో భారతకథను ఆధారంగా చేసుకున్న రచన ఇది. ఈ గ్రంథం భాసుని రచనకు పోతుకుచ్చి సుబ్రహ్మణ్యశాస్త్రి చేసిన అనువాదం.

ఇప్పటివి[మార్చు]

25 శనివారం ఉ.8 గంటలకు వైదిక స్మార్త వెలనాటి అర్చకసంఘ సమావేశం నిడదవోలు కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో. బెంగళూరి నారాయణరాజు తోటలో కార్తీక వనసమారాధన. శివకోట వెంకట కామేశ్వర అప్పారావు శర్మ దంపతులు పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. సాహిత్యవేత్త ఆచార్య శలాక రఘునాథశర్మ(క్రిష్ణదేవరాయ విశ్వవిద్యాలయం) ముఖ్యవక్త, రాష్ట్రనాయకులు పాల్గొంటారు.