విజయనగర సామ్రాజ్యము

వికీపీడియా నుండి

(విజయనగర రాజులు నుండి దారిమార్పు చెందింది)
విజయనగర సామ్రాజ్యము
సామ్రాజ్యము
Blank.png
 
Blank.png
 
Blank.png
1336 – 1646
Location of విజయనగర సామ్రాజ్యము
విజయనగర సామ్రాజ్యం, 1446, 1520 CE
రాజధాని విజయనగరం
భాష(లు) తెలుగు, కన్నడ
మతము హిందూ మతం
Government Monarchy
King
 - 1336–1356 మొదటి హరిహరరాయలు
 - 1642–1646 మూడవ శ్రీరంగరాయలు
History
 - ఆవిర్భావం 1336
 - Earliest records 1343
 - పతనం 1646
Preceded by
Succeeded by
Blank.png హొయసల సామ్రాజ్యం
Blank.png కాకతీయులు
Blank.png పాండ్య రాజ్యం
మైసూరు రాజ్యం Flag of Mysore.svg
కేళడి నాయకులు Blank.png
తంజావూరు నాయకులు Blank.png
మదురై నాయకులు Blank.png
చిత్రదుర్గ నాయకులు Blank.png
విజయనగర సామ్రాజ్యం
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవ రాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢ రాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహ దేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ రాయలు 1572-1586
వెంకట II 1586-1614
శ్రీ రంగ రాయలు 2 1614-1614
రామదేవ 1617-1632
వెంకట III 1632-1642
శ్రీరంగ III 1642-1646

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.

విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.

ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధములోదారుణంగా ఓడించి, రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.

విషయ సూచిక

[మార్చు] స్థాపన

విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశమునందలి రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫుర్ ఓరుగల్లు ను ఆక్రమించి మలాబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను గొల్ల సోదరులిద్దరు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. ఇరువురు ఢిల్లీకి తరలించబడి ఇస్లాము మతమునకు మార్చబడ్డారు. హోయసాల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపుతాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు[1].


హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని ప్రకారము బుక్కరాయలు ముసునూరి కాపానీడు బంధువు. కాని ఇది సబబుగా తోచదు.


దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయలు తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.

[మార్చు] తారస్థాయి

తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యముఆ వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.

1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవా ను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు చాలా ముఖ్యమైనవి.

శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్దములో సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు.

విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

[మార్చు] పతనము

చివరకు కొంచము పరువు, ప్రతిష్ఠ మిగిలినా కూడ, పతనము తప్పలేదు. ఈ దశలో కూడా పోర్చుగల్ తో వాణిజ్యము కొనసాగించారు. బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు.

[మార్చు] వంశ పరంపర

కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

సంగమ వంశము

  • హరిహర I (దేవ రాయ) 1336-1343
  • బుక్క I 1343-1379
  • హరిహర II 1379-1399
  • రెండవ బుక్క రాయలు 1399-1406
  • మొదటి దేవ రాయలు 1406-1412
  • వీర విజయ 1412-1419
  • రెండవ దేవ రాయలు 1419-1444
  • (తెలియదు) 1444-1449
  • మల్లికార్జున రాయలు 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
  • మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
  • ప్రౌఢదేవ రాయలు 1476-? (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
  • రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
  • రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)

సాళువ వంశము

  • నరసింహ 1490-?
  • నరస (వీర నరసింహ) ?-1509
  • శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530
  • అచ్యుత దేవరాయలు 1530-1542
  • సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567

తుళువ వంశము

  • రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
  • తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
  • తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
  • రెండవ రంగరాయలు 1575-1586
  • మొదటి వెంకటాపతి రాయలు 1586-1614

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు

  • రంగ దేవరాయ II 1614-1615
  • రామ దేవరాయ 1615-1633
  • వెంకట దేవరాయ III 1633-1646
  • రంగ దేవరాయ III 1614-1615

[మార్చు] చూడండి

  1. విజయ నగర వంశస్తుల వంశ వృక్షములు
  2. విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు
  3. విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్తితులు
  4. విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
  5. విజయ నగర రాజులు పరిపాలనా కాలాన్ని అనుసరించి

[మార్చు] సంబంధిత లింకులు

[మార్చు] వనరులు

  1. Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2; http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు