విశాఖ ఎక్స్ప్రెస్ (రైలు)
వికీపీడియా నుండి
విశాఖ ఎక్స్ప్రెస్ (Visakha Express) భారత రైల్వేల ఎక్స్ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్ మరియు భువనేశ్వర్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే కు సంబంధించినది. దీని రైలుబండి సంఖ్యలు 17015 మరియు 17016. రైలుబండి 17016 సికింద్రాబాద్ నుండి 1700 గంటలకు బయలుదేరి భువనేశ్వరి మరునాడు 1525 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుబండి 17015 భువనేశ్వర్ లో 0835 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 0730 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
విషయ సూచిక |
ప్రయాణించే మార్గం [మార్చు]
విశాఖ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి మొదలై 1134 కిలోమీటర్లు ప్రయాణించి ఒరిస్సా ముఖ్యపట్టణం భువనేశ్వర్ చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల గుండా ప్రయాణిస్తుంది.
ఈ రైలుబండి క్రింది రైల్వే స్టేషన్లలో ఆగుతుంది :
ఆంధ్రప్రదేశ్ [మార్చు]
- సికింద్రాబాద్ కూడలి
- నల్గొండ
- మిర్యాలగూడ
- నడికుడి కూడలి
- పిడుగురాళ్ళ
- సత్తెనపల్లి
- గుంటూరు కూడలి
- విజయవాడ కూడలి
- గుడివాడ కూడలి
- కైకలూరు
- ఆకివీడు
- భీమవరం పట్టణం
- అత్తిలి
- తణుకు
- నిడదవోలు కూడలి
- రాజమండ్రి
- సామర్లకోట కూడలి
- అన్నవరం
- తుని
- ఎలమంచిలి
- అనకాపల్లి
- దువ్వాడ
- విశాఖపట్నం కూడలి
- సింహాచలం
- కొత్తవలస కూడలి
- విజయనగరం కూడలి
- చీపురుపల్లి
- పొందూరు
- శ్రీకాకుళం రహదారి
- తిలారు
- కోటబొమ్మాళి
- నౌపడ కూడలి
- పలాస
- సోంపేట
- ఇచ్చాపురం