విష్ణుకుండినులు

వికీపీడియా నుండి

Guntupalli Buddist site 8.JPG
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
----------- కాలరేఖ -----------
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.త.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు • క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు • క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు • 210 - 300
బృహత్పలాయనులు • 300 - 350
అనందగోత్రులు • 295 - 620
శాలంకాయనులు • 320 - 420
విష్ణుకుండినులు • 375 - 555
పల్లవులు • 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు • 624 - 1076
పూర్వగాంగులు • 498 - 894
చాళుక్య చోళులు • 980 - 1076
కాకతీయులు • 1083 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి నాయకులు • 1320 - 1368
ఓఢ్ర గజపతులు • 1513
రేచెర్ల పద్మనాయకులు • 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు • 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు • 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము • 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము • 1572 - 1680
కుతుబ్ షాహీ యుగము • 1518 - 1687
నిజాము రాజ్యము
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము • 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాధ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ధి
చారిత్రిక నగరాలు
భట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురి
హంపిసింహపురిహైదరాబాదు
చారిత్రిక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

శాలంకాయనుల తరువాత వేంగీదేశమును పాలించినవారు విష్ణుకుండినులు. సాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధికప్రాంతము పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము క్రీ. శ. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (క్రీ. శ.400-422), మొదటి గోవిందవర్మ (క్రీ. శ.422-462), రెండవ మాధవవర్మ (క్రీ. శ.462-502), మొదటి విక్రమేంద్రవర్మ (క్రీ. శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (క్రీ. శ.527-555), రెండవ విక్రమేంద్రభట్టారక (555-572) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ క్రీ. శ. 613 వరకు పాలించాడు[1].


విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాల గొప్పవాడు. ఇతడు వాకాటకుల తో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఈతనిని త్రికూట మలయాధిపతి అంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండయే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.


ఉండవల్లి గుహాలయాలు విష్ణులుండినుల కాలంలో నిర్మించబడ్డాయి

విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. బౌద్ధవిహారాలు నిర్మించి వాటికి దానాలు చేశారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్థంభముల మీద పంజా ఎత్తిపెట్టిన సింహప్రతిమ ఉండుటచేత వీరు సింహలాంఛనులని పరిశోధకుల అభిప్రాయము. పలు శాసముల ప్రకారము వీరి రాజధాని శక్రాభిధానపురి నల్లగొండ మండలము తుమ్మలగూడెం వద్ద శిధిలముల రూపమున నుండి, స్థానికులచే ఇంద్రపాలగుట్ట అని పేర్కొనబడునదే శక్రాభిధానపురి అని చెప్పవచ్చును.


విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. నాణెముల మీద సూర్యగోళపు మధ్యనున్న ఏకతల దేవాయతన రూపం ముద్రించారు. భారతదేశములో ఇట్టి నాణెములు తొలుతగ ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు.

[మార్చు] మూలాలు

  1. విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు
పేజీకి సంభందించిన లింకులు