వి.వి. గిరి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రములో ఉన్నాయి.
1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
| ఇంతకు ముందు ఉన్నవారు: జాకీర్ హుస్సేన్ |
భారత రాష్ట్రపతి 1969 మే 3 — 1969 జూలై 20 |
తరువాత వచ్చినవారు: ఎం.హిదయతుల్లా |
| ఇంతకు ముందు ఉన్నవారు: ఎం.హిదయతుల్లా |
భారత రాష్ట్రపతి 1969 ఆగష్టు 24 — 1974 ఆగష్టు 24 |
తరువాత వచ్చినవారు: ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ |
|
|
|
|---|---|