వెంపటి చినసత్యం
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| వెంపటి చినసత్యం | |
| జననం | 25 అక్టోబర్ 1929 కూచిపూడి, కృష్ణా జిల్లా |
|---|---|
| మరణం | 29 జూలై 2012 చెన్నై, తమిళనాడు |
| వృత్తి | నాట్యాచార్యుడు |
| సంతానం | 2 కుమారులు; 3 కుమార్తెలు |
| తండ్రి | చలమయ్య |
| తల్లి | వరలక్ష్మమ్మ |
వెంపటి చిన సత్యం ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు. ఈయన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి అగ్రహారంలో 1929 అక్టోబరు 25న వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. సినీ నృత్య దర్శకులైన అన్న పెదసత్యం వద్ద 15 ఏళ్లపాటు నాట్యంలో మెలవకులు నేర్చుకున్నారు. చెన్నై లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. తన దగ్గర నృత్యం అభ్యసించే శిష్యుల వద్ద రుసుము సైతం వసూలు చేయకుండా నర్తనశాలను నిర్వహించారు. కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, రాజసులోచన, ప్రభ, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, వాణిశ్రీ, ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వారి శిష్యులే. 1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. అనంతరం సొంతంగా అనేక తెలుగు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. నర్తనశాల, దానవీరశూర కర్ణ, 'రోజులు మారాయి', 'దేవదాసు', 'అమెరికా అమ్మాయి', 'శ్రీకృష్ణవిజయం', 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ' తదితర ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. చినసత్యం వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యంల పర్యవేక్షణలో చలన చిత్రాల్లో కూడా నటించారు.1976లో తితిదే ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. 1984లో అమెరికా పిట్స్బర్గ్లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 29.7.2012 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం 'కూచిపూడి ఆర్ట్ అకాడమీ'లో చనిపోయారు.
పురస్కారాలు [మార్చు]
- 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, కళాప్రపూర్ణ, నాట్యకళాసాగర్
- 1967లో సంగీత నాటక అకాడమీచే ఫెలోషిప్
- 1982లో భరత కళాప్రపూర్ణ
- 1992లో కాళిదాసు సమ్మాన్, సర్ సింగర్ అవార్డు, సప్తగిరి సంగీత విద్యాన్మణి, నాట్య కళాతపస్వి, నాట్య కళాభూషణ, కళైమామణి
- 1998లో పద్మభూషణ్ పురస్కారం
- 2011, 12లో జీవన సాఫల్య పురస్కారం
నృత్యరూపకాలు [మార్చు]
- శ్రీ కృష్ణ పారిజాతం
- మేనకా విశ్వామిత్ర
- రుక్మిణీ కల్యాణం
- కిరాతార్జునీయం
- క్షీరసాగరమధనం
- పద్మావతీ శ్రీనివాసం
- చండాలిక
- హరవిలాసం