వేలుపిళ్ళై ప్రభాకరన్

వికీపీడియా నుండి

మూస:WP:SLR/bluebox మూస:Cleanup-rewrite మూస:Infobox Criminal

మూస:Sri Lankan Conflict

' వేలు పిళ్ళై ప్రభాకరన్' ( [4][4] నవంబర్ 26,1954-మే 19,2009[5] [7] [9] [11] ) శ్రీలంక యొక్క ఉత్తర మరియు తూర్పు భాగాలలో స్వతంత్ర తమిళ రాష్ట్ర స్థాపనని కోరుకొనే లిబెరషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE లేదా Tamil Tigers) అనే ఒక ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు.ఈ ల్ట్టే గత 25 సంవత్సరాలుగా శ్రీలంకలో స్వమత త్యాగము అనే ప్రచండమైన నినాదంతో పోరాటాన్ని సాగిస్తూ తద్వారా ప్రపంచంలోని 32 దేశాల చేత ఒక ఉగ్రవాద సంస్థ గా గుర్తించబడింది.[13] ఉగ్రవాదం , హత్య , వ్యవస్థీకృత నేరం మరియు ఉగ్రవాద పన్నాగం మొదలైన ఆరోపణలతో ప్రభాకరన్ను అంతర్జాతీయ పోలీస్ సంస్థ (ఇంటర్ పోల్) బంధించాలని కోరుకుంది. [15] శ్రీలంక మరియు భారతదేశమ్ లో అతనిని బంధించాలని ఉత్తరువులు కూడా జారీఅయ్యాయి.

మే 18, 2009 న దేశ ఉత్తర భాగంలో ముందుకు జరుగుతున్న శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి హతుడయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.[16] [17] [18] [20]మరుసటి రోజు అతని మ్రుతదేహము శ్రీలంక ప్రచార మాధ్యమంలో చూపించబడింది , [22] మరియు ఒక వారం రోజుల తర్వాత తమిళ పులులలో ముఖ్యుడైన సెల్వరస పథ్మనాథన్, మే 17 న ప్రభాకరన్ మృతి చెంధడని అంగీకరించాడు. [24] [26] రెండు వారాల తరువాత DNA పరీక్షలో ప్రభాకరన్ మరియు అతని కుమారుడు చార్లెస్ అంతోనీల మృతి ధ్రువీకరించబడినది.[citation needed]

విషయ సూచిక

[మార్చు] మునుపటి జీవితం

వేలుపిళ్లై ప్రభాకరన్ ఉత్తర తీరప్రాంతంలోని వేల్వేట్టితురై అనే పట్టణం లో నవంబర్ 26,1954 లో వేలుపిల్లై తిరువెంకడం మరియు వల్లిపురం పార్వతి దంపతులకు జన్మించాడు.అనుక్రమిక శ్రీలంక ప్రభుత్వాలు తమిళ ప్రజల పట్ల చూపుతున్న వివక్షను చూసి ఆగ్రహించి ,ప్రమాణీకరణ తర్జనభర్జనలల్లో TIP అనే విద్యార్ధి సంఘంతో జతకలిసాడు.1972 లో ప్రభాకరన్,అధికసంఖ్యలో వుండే సింహాలీయులతో అల్పసంఖ్యాకులైన శ్రీలంక తమిళులని అలక్ష్యం చేసే నూతన రాజకీయ మార్గాన్ని నిరసించే మునుపటి సంస్థలకి అనుసంధానంగ తమిళ కొత్త పులులు(తమిళ న్యూ టై గెర్ - TNT) అనే సంస్థని స్థాపించాడు.

1975 లో తమిళ ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమైన తరువాత ,ఒక ఉగ్రవాద సంస్థ ద్వారా మొదటి రాజకీయ హత్య జరిపాడు.జఫ్ఫ్న మేయర్ అయిన అల్ఫ్రెడ్ దురైఅప్పఃని , అతను పొన్నాలై లోని హిందూ దేవాలయంలోకి అడుగుపెడుతుండగా అతి సమీపం నుంచి గురి చూసి కాల్చి హత్య చేసాడు.దురైఅప్పః ఆ కాలంలో అధికారంలో ఉన్న శ్రీలంక స్వతంత్ర పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల 1974 లో జరిగిన తమిళ సమ్మేళనంలో తమిళ పోరాటవాదుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది.అదే కారణంతో అతను హత్యగావించబడ్డాడు. అధికసంఖ్యకులైన సింహాలీయుల ప్రభుత్వానికి సహాయపడి తమిళ ఉగ్రవాదుల దృష్టిలో అతను,జఫ్ఫ్న ద్వీపకల్పంలోని తమిళ జాతీయవాద భావనల్ని కించపరిచే విస్వాసఘాతకుడు అయ్యాడు.

[మార్చు] తమిళ పులులు

[మార్చు] లిబెరషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(LTTE) స్థాపన

మే 5, 1976 లో టీ.ఎం.టీ (TNT )అనే ఈ సంస్థ, సాధరణంగా తమిళ పులులు అని పిలువబడే లిబెరషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(LTTE) గా పేరు మార్చడం జరిగింది. [40] [41]

మతం అనేది అతని సిద్ధాంతం లేదా తత్వం కాకపోయినప్పటికీ , లిబెరషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(LTTE) బౌద్ధమత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రూపొందించబడినది.[42] ప్రభాకరన్ చాంధస భావనలు ఉన్న వ్యక్తి.[43]. లిబెరషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(LTTE) కేవలం శ్రీలంక తమిళ జాతీయవాదంనే స్పూర్తిగా తీసుకుంది కానీ, తన సిద్ధాంత పత్రాలలో కానీ,ప్రచారంలో కానీ మతం గురించి కానీ, మతసంబంధమైన విషయాల గురించి కానీ ప్రస్తావించలేదు.వారు ఈ ఏకపక్షవిధానాన్ని మరియు ఉత్తేజాన్ని, స్వతంత్ర తమిళ్ ఈలం సాధించటానికి కేంద్రీకరించారు.

[మార్చు] కిల్లినోచ్చిలో పాత్రికేయుల సమావేశం

ప్రభాకరన్ యొక్క మొదటి మరియు ముఖ్యమైన పాత్రికేయుల సమావేశం ఏప్రిల్ 10, 2002 న కిల్లినోచ్చిలో జరిగింది.[45] ఆ సమావేశానికి దేశవిదేశాల నుండి 200 మందికి పైగా పాత్రికేయులు హాజరయినట్లు మరియు ఆ సమావేశానికి ముందు వారందరిపై 10 గంటల పాటు రక్షణ తనిఖీలు జరుపబడినట్లు నివేదించటం జరిగింది.[46] ఆ సమావేశం లోనే అంటోన్ బాలసింఘం LTTE నాయకుడిని, తమిళ్ ఈలంకి రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి గా పరిచయం చేశారు.

గతకాలపు శాంతిగత్వం పట్ల LTTE యొక్క నిబద్ధతను గురించి చాలా ప్రశ్నలు అడుగబడ్డాయి,మరియు వాటికి Dr.అంటోన్ బాలసింఘం మరియు ప్రభాకరన్ సంయుక్తంగా సమాధానాలు ఇచ్చారు.

ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, స్వతంత్ర రాజ్యం అనే లక్ష్యంలో తను ఏమైనా రాజీ పడితే తనని అంతంచేయమని LTTE దళాలను ఆదేశించినట్లు ప్రభాకరన్ చెప్పాడు.[47]

రాజీవ్ గాంధీ హత్యలో అతని ప్రమేయం గురించి పలుమార్లు అడిగిన ప్రశ్నలకు బాలసింఘం మరియు ప్రభాకరన్ తెలివిగా సమాధానం చెప్పారు. వారు దానిని ఒక దుర్ఘటనగా అభివర్ణించారు (తమిళంలో చెప్పబడినట్లు "తున్బియాల్ చంబవం") 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి త్రవ్వుకోవద్దని వారు పాత్రికేయులను అభ్యర్ధించారు.

తమిళ్ ఈలం సాధించాలనే హక్కుని త్యజించటానికి తగినస్థితి ఇంకా రాలేదని ఒక ముఖాముఖిలో అతను చెప్పాడు.ఆయన ఈ విధంగా పేర్కొన్నారు"ఇక్కడ మూడు ప్రధానాంశాలు ఉన్నాయి. అవి తమిళ మాతృభూమి, తమిళ జాతీయవాదం మరియు స్వీయసంకల్పం కోసం తమిళ హక్కు.ఇవి తమిళ పరాజయ యొక్క ప్రాధమిక అవసరాలు.ఈ అవసరాలు ఆమోదించబడితే లేదా ఈ మూడు ప్రాధమికాంశాలను గుర్తించి ఒక రాజకీయ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తే మరియు మా ప్రజలు ఆ పరిష్కారానికి సంతృప్తి చెందితే, అప్పుడు మేము ఈలం అనే కోరికని త్యజించడానిని పరిగణిస్తాము." ఆయన ఇంకా తమిళ్ ఈలం అనేది కేవలం LTTE కోరిక మాత్రమే కాదు అది తమిళ ప్రజల కోరిక కూడా అని చెప్పారు.[1]

ప్రభాకరన్ చాల ప్రశ్నలకు సమాధానాలిస్తూ శాంతిగత్వంలో వారి నిబద్ధతను గూర్చి నొక్కివక్కానించారు.ఇంకా ఆయన "శాంతిగత్వం లో మేము హృదయపూర్వకమైన నిబద్ధతతో ఉన్నాం" అని ప్రకటించారు. ఆ రకమైన నిబద్ధత ఉండటంవల్లే మా వైరానికి నాలుగు నెలల విరామాన్ని ఇచ్చాము". శ్రీలంక మరియు ఇండియాలో LTTE బహిష్కరణను తొలగించాలని ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు,"భారత ప్రభుత్వం LTTE పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మేము కోరుకొంటున్నాము.సరైన సమయంలో మేము ఈ విషయాన్ని లేవనేత్తుతాము " అని ఆయన ప్రకటించారు.

నార్వే మధ్యవర్తిత్వంలో కొనసాగుతున్న శాంతిగత్వానికి, బహిష్కరనని ఎత్తివేయటం ఒక్కటే సరి అయిన పరిష్కారమని ప్రభాకరన్ పట్టుబట్టారు,"చర్చలు మొదలవటానికి బహిష్కరనని నిషేదించటం ఒకటే అవశ్యకమైన స్థితి అని ,ప్రభుత్వానికి మరియు నార్వేజిఅంస్ కి తెలియచేప్పామని ఆయన అన్నారు".[49][50]

[మార్చు] సిద్ధాంతం మరియు తత్వము

"Few dispute he was one of the most effective guerrilla leaders in modern warfare - displaying the tactical prowess of Afghanistan's Ahmad Shah Masoud, the ruthlessness of Osama bin Laden and the conviction of Latin American revolutionary Che Guevara."

ప్రభాకరన్ ఒక క్రమబద్ధమైన సిద్ధాంతాన్ని వ్యక్తపరచకపోయినప్పటికీ , తన తత్వానికి మూలం పోరాటవాద సామ్యవాదము మరియు సమసమాజ స్థాపన అని ప్రకటించాడు.అతను యవ్వనంలో తమిళ జాతీయోద్యమంలో పాల్గొన్నాడు మరియు LTTE స్థాపన ద్వారా గట్టిపట్టుదల ఉన్న తీవ్రవాద నాయకుడిగా పేరుగాంచాడు.అతని అరుదైన ముఖాముఖిలు, తమిళ్ ఈలం హీరోస్ డే లో అతని వార్షిక ఉపన్యాసాలు మరియు LTTE యొక్క పద్ధతులు మరియు కార్యక్రమాలు ప్రభాకరన్ యొక్క సిద్ధాంతము మరియు తత్వానికి సూచనగా పరిగణించవచ్చు. ప్రభాకరన్ సిద్ధాంతం మరియు తత్వాలని పరిగణించేటప్పుడు ఈ క్రింది అంశాలను ప్రధానాంశాలుగా పేర్కొనవచ్చు.

[మార్చు] శ్రీలంక తమిళ జాతీయవాదం

ప్రభాకరన్ యొక్క స్ఫూర్తికి మూలం మరియు దిశ ,శ్రీలంక తమిళ జాతీయవాదం ఇచ్చాయి. [52][52] వారి అధికారిక వెబ్ పేజీలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం అతని అంతిమ లక్ష్యం , U.N.శాసనాల ప్రకారం ఒక జాతిగా గుర్తింపబడిన తమిళ ఈలంని సాధించటం,తద్వారా ప్రజల రాజకీయ స్వాతంత్ర్యపు హక్కుకి [54] భరోసా ఇవ్వటం. 2003 లో జరిగిన శాంతి చర్చలలో ఒక తాత్కాలిక స్వయంపాలక అధిష్టానాన్ని స్థాపించాలని కూడా LTTE ప్రతిపాదించింది.పూర్వపు తమిళ గొరిల్లా మరియు తర్వాత రాజకీయవేత్తగా మారిన ధర్మలింగం సితాడతాన్ ఈ విధంగా చెప్పారు" తమిళ ఈలంకి హేతువైన అతని కార్యదీక్ష ప్రశ్నించలేనిది, శ్రీలంకలో యుద్ధం ఉండాలో లేదా శాంతి ఉండాలో నిర్ణయించగలిగేది అతనొక్కడే."[55]

[మార్చు] LTTE సైనిక విధానం

ఆయుధ సంపత్తి ఉన్న శ్రీలంక ప్రభుత్వానికి, దానితో పోల్చితే ఆయుధాలే లేని వర్గానికి జరుగుతున్నసమానత లేని యుద్ధాన్నిఎదుర్కోవటానికి ఆయుధపోరాటం ఒకటే మార్గమని ప్రభాకరన్ స్పష్టంగా ప్రకటించారు. తిలీపాన్ సంఘటన తరువాత అహింసామార్గం ప్రభావశూన్యమని మరియు చెల్లనిదని పరిశీలించిన తరువాత సైనిక విదానాని కోరుకున్నానని అతను వాదించాడు.సేనాధిపతి హోదాకలిగిన తిలీపాన్ అనే అధికారి, IPKF హత్యలకు వ్యతిరేకంగా గాంధేయమార్గాన్ని అవలంబిస్తూ ,అన్నపానీయాలను విసర్జించి సెప్టెంబర్ 15,1987 నుండి 26,సెప్టెంబర్ వరకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి, తనతో పాటు దీక్షలో ఉన్న వేల మంది తమిళుల ముందు మరణించారు. ఇది, శాంతియుత ఆక్షేపణలను అలక్ష్యం చేయాలి లేదా అణగద్రొక్కాలి కాని ఎప్పటికి ఆలకించ కూడదు అనే ,ప్రభాకరన్ నిశ్చయాన్ని మరింత ధ్రుడపరిచింది.[3]

అతని యోధులు సాధారణంగా ఎవరిని బందీలుగా తీసుకోకుండా,మరియు శత్రుసైన్యంలో ప్రతిసైనికుడిని హతమార్చడంలో ప్రసిద్దులై ఉండగా ,ప్రభాకరన్ యుక్తిగా ఆత్మాహుతి దళాలను నియమించటం మరియు వారిని వినియోగించుకోవటంలో పరిపూర్ణత సాధించాడు. [58] అంతర్జాతీయ పోలీస్ సంస్థ (ఇంటర్ పోల్) అతనిని వ్యక్తిగతంగా "చాలా జాగరూకుడు,మారువేషాలు వేస్తాడని పేరుగాన్చినవాడు మరియు అధునాతన ఆయుధాలు మరియు పేలుడు పదార్ధాలు వాడడంలో సమర్ధుడు"అని అభివర్ణించింది. [59]

[మార్చు] Modus operandi

శ్రీలంక సైనికాదికారిఅయిన జనరల్ శరత్ ఫోన్సేక, 2009 లో శ్రీలంక సైనిక విజయాల అనంతరం తను శ్రీలంకను వదిలి విదేశాలకు పారిపోయానని చెప్పారు.[61] మలేషియా పోలీసు వ్యవస్థ ,అతను తమ దేశానికి కానీ, లేదా థాయిలాండ్ కి పారిపోయి వుండవచ్చని అందిన నివేదికలపై చాల అప్రమత్తంగా ఉంది.[63]

[మార్చు] మరణం

శ్రీలంక రక్షణ దళాలు LTTE రాజ్యంలో ప్రవేశించగానే ప్రభాకరన్ మరియు ఇతర ముఖ్య నాయకులు వారి ఆఖరి దుర్గమైన ములైతివుకి పారిపోయారు.ఒక ఆంబులెన్స్ లో యుద్ధ భూమి నుండి పారిపోతూ రాకెట్ దాడిలో ప్రభాకరన్ మరణించాడని మరియు అతని శరీరం తీవ్రంగా కాలిపోయిందని ప్రాధమిక నివేదికలో వెల్లడైంది. కాని తీవ్రవాదాన్ని సమర్ధించే ఒక తమిళనెట్ అతను సజీవంగా ఉన్నాడని ప్రకటించిన తరువాత జాతీయ దూరదర్శన్లో అతని మ్రుతదేహం చూపబడింది.తరువాతి నివేదికల ప్రకారం అతని శరీరం ,ముల్లైతివు సమీపంలోని వేల్లముల్లివైక్కల్ కు ఉత్తరాన ఉన్న నందికాతల్ లాగూన్ ప్రక్కన కనుగొనబడింది. అతని పూర్వ ఆంతరంగికురాలైన కరుణ అమ్మన్, [65] దయ మాస్టర్ మరియు అతని కుమారుని జన్యు పదార్ధముతో జరిపిన DNA పరీక్షల వల్ల ఆశరీరము అతనిదే అని ద్రువీకరించబడింది. [67] సంధర్బోచితమైన సాక్ష్యాలు , అతని మరణం తలకు బలమైన గాయం అవటం వల్లకాని లేదా అతి సమీపం నుండి కాల్చడం వల్ల కానీ జరిగివుండ వచ్చని చెపుతున్నాయి.అతను ఉరితీయబడ్డాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. [69] అతని శరీరం ఒక లగూన్ లో కనుగొన్నామని శ్రీలంక సైన్యం ప్రకటించింది.ఒక పలకపై పడుకోబెట్టబడి ,సైనికులు మరియు పాత్రికేయులచే చుట్టుముట్టబడి ఉన్న, ప్రభాకరన్ మృతదేహానికి సంభందించిన చిత్రాలను మరియు చలన చిత్రాలను శ్రీలంక సైన్యం విడుదల చేసింది.ఆ శవం ప్రభాకరన్ యునిఫోరం ధరించి ఉంది,మరియు ప్రభాకరన్ ను పోలి ఉంది, మరియు తలపైన తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయాడనటానికి సూచనగా,నుదుటిపైన పెద్ద బుల్లెట్ గాయం కూడా ఉంది.

[మార్చు] నేరారోపణలు

వేలుపిళ్ళై ప్రభాకరన్ను, 1991 నుండి తీవ్రవాదం, హత్య,వ్యవస్థీకృత నేరం, ఉగ్రవాద పన్నాగం మొదలైన ఆరోపణలతో ,ప్రభాకరన్ను బంధించాలని అంతర్జాతీయ పోలీసు సంస్థ (Interpol)ఇంకా అనేక సంస్థలు కోరుకున్నాయి .[71] 1991, మే లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య పన్నాగంపై మద్రాస్ హైకోర్ట్ ,భారత దేశంలో అతను కనిపిస్తే కాల్చివేయాలనే ఉత్తర్వులు జారీచేసింది, మరియు 1996 లో సెంట్రల్ బ్యాంకు పై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయంపై 2002 లో న్యాయమూర్తి అమ్బెపిటియ అతనిని బంధించాలని ఉత్తర్వులు జారీచేసారు.[75]ఆ న్యాయమూర్తి అతనిని 51 నేరాలలో దోషిగా పరిగణిస్తూ అతనికి 200 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు .

[మార్చు] వ్యక్తిగత జీవితం

దస్త్రం:Prabhakaran family.jpg
చిత్రంలో చూపబడినట్లు, కుదివైపునుండి, వేలుపిళ్లై ప్రభాకరన్, అతని భార్య మతివతాని,కుమార్తె దువరాగా,కుమారుడు చార్లెస్ ఆంథోనీ మరియు మడివాడిని యొక్క గుర్తుతెలియని ఇద్దరు బంధువులు .[76]

ముఖాముఖి సమావేశాల ద్వారా కాని,ప్రచారమాధ్యమాల ప్రకటనల ద్వారా కానీ ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది విషయాలే తెలిసినా,అక్టోబర్ 1,1984 న మథివథాని ఎరంబును వివాహం చేసుకున్నది చాల మందికి తెలిసిన విషయమే. [77] [78][78] వారికి ఒక కుమార్తె (దువరాగా),చార్లెస్ అంతోనీ మరియు బాలచంద్రన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి ఆచూకీ తెలియకపోయినా వాళ్ళు శ్రీలంకలో మాత్రం లేరని అందరు విశ్వసిస్తున్నారు.[4] కాని చార్లెస్ అంతోనీ మృతదేహాన్ని కనుగొన్నామని శ్రీలంక సైనికదళాలు ప్రకటించాయి. [82] తరువాత ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్ 13, భార్య మథివథాని, కుమార్తె దువరాగల మృతదేహాలను కూడా శ్రీలంక సైన్యం కనుగొనిందని ఒక ప్రముఖ శ్రీలంక మంత్రి తెలియజేశారు.[84] కాని ప్రభాకరన్ మిగిలిన కుటుంబ సభ్యుల ఆచూకీ గురించి ఏవిధమైన సమాచారం లేదని సైన్యంలో ముఖ్యుడైన ఉదయ నానయక్కార ప్రకటించారు."మాకు వారి మృతదేహాలు దొరకలేదు మరియు మాదగ్గర వారి గురించిన సమాచారం ఎమీ లేదు" అని ఆయన అన్నారు. [86] కాని , ప్రభారన్ కుటుంబమంతా తుడిచిపెట్టుకు పోయిందని, ప్రభాకరన్ మృతదేహానికి 600 మీటర్స్ దూరంలో ,మదివధనీ, దువరాగా మరియు బాలచంద్రన్ ల మృతదేహాలు ఒక చిన్న పొదలాంటి ప్రదేశంలో దొరికాయని అనుకున్నారు.[88]

70 ఏళ్ళ వయసువారైన ప్రభాకరన్ తల్లితండ్రులు తిరువెంగడం వేలుపిళ్ళై మరియు పార్వతిలను ,వావునియ పట్టణానికి సమీపంలో ,నిరాశ్రయులైన వారికోసం ఉన్న మెనిక్ శిబిరంలో కనుగొన్నారు. శ్రీలంక సైన్యం మరియు ప్రభుత్వం వారిని ఏవిధమైన ప్రశ్నలు అడుగమని, వారికి ఏవిధమైన హాని తలపెట్టమని,వారిపై ఏరకమైన దౌర్జన్యం జరుపమని బహిరంగంగా భరోసా ఇచ్చారు.[90]

[మార్చు] చార్లెస్ ఆంథోనీ

చార్లెస్ ఆంథోనీ , వేలుపిళ్ళై ప్రభాకరన్ యొక్క మొదటి సంతానం.2008-2009 లో శ్రీలంక సైనికదళాలు ఉత్తరభాగంలో జరిపిన ఆఖరిపోరాటంలో, చార్లెస్ హతుడయ్యాడని మే 2009 లో శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖప్రకటించింది. ప్రభాకరన్ తన ఆప్తమిత్రుడైన చార్లెస్ ల్యుచాస్ అంతోనీపేరు తన కుమారునికి పెట్టుకున్నాడు.

[మార్చు] అతని పేరు యొక్క ఉఛ్చరణ

లాటిన్ లిపి లో అతని పేరుని చాల విధాలుగా వ్రాయవచ్చు,అవి మొదటిసారి చూసినప్పుడు చాలా భిన్నంగా అగుపిస్తాయి.జాతీయ గ్రంధాలయ ప్రతిలేఖన పధకం ప్రకారం ప్రతిలేఖనమే అతి ఖచ్చితమైన పధ్ధతి. తమిళ్ లో ఇవ్వబడినట్లు అతని పేరు வேலுப்பிள்ளை பிரபாகரன், వేలుపిళ్లై పిరపకర గా వుచ్చరించబడుతుంది ప్రతిలేఖనం పరిచయం లేని ప్రజలు అతని పేరుని తప్పుగా వుచ్చరించడానికి అవకాశం వున్నది కనుక పుస్తక పరిజ్ఞానం కన్నా శబ్దానుకురణ(పరివర్తితలేఖనం)ఎక్కువ వాడుకలో వున్నది అతని పేరుని క్రింది విధంగా వుచ్చరించవచ్చు [ʋeːlʊppɨllaəppɨraːbaharan]. దీనిని ఇంగ్లీష్ వర్ణక్రమం ప్రకారం వురామరికగా క్రింది విధంగా వ్రాయవచ్చు "Pirapakaran", "Pirapaharan" లేదా "Pirabaharan". సంస్కృతంలో ఈ పేరుకి సంబంధించిన చరిత్ర యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొని,దానికి జాతీయ గ్రంధాలయ ప్రతిలేఖన నియమాలను అన్వయించడం మూడవ వికల్పము.ఇది పాశ్చాత్య మాధ్యమంలో విరివిగా వాదబడే వుచ్చారణ "ప్రభాకరన్"

[మార్చు] గమనిక

[మార్చు] ఇది కూడా చూడండి

[మార్చు] సూచనలు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; tnr అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 'Sun God's' Life of War Straits Times, May 18, 2009
  3. [1][dead link]
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; health అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు

[మార్చు] ఇంకా చదవడానికి

  • రాజన్ హూలే. (2001) 'ది అర్రోగాన్స్ అఫ్ పవర్', UTHR(J),కొలొమ్బో.
  • ప్రతాప్,అనిత. ఐలాండ్ అఫ్ బ్లడ్: ఫ్రంట్ లైన్ రిపోర్ట్స్ ఫ్రం శ్రీలంక,ఆఫ్గనిస్తాన్ అండ్ అథెర్ సౌత్ ఆసియన్ ఫ్లాష్ పాయింట్స్ (2001).
  • Heilmann-Rajanayagam, Dagmar (1994). The Tamil Tigers: Armed Struggle for Identity. Stuttgart, Germany: Franz Steiner Verlag. 

[మార్చు] బాహ్య లింకులు

[మార్చు] ముఖాముఖిలు మరియు ఉపన్యాసాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు