వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
| వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి . | |
|---|---|
| పార్లమెంటు సభ్యులు | |
| Incumbent | |
| Assumed office 2009 |
|
| Constituency | కడప , ఆంధ్రప్రదేశ్ |
| Personal details | |
| Born | డిసెంబరు 21 1972 (వయసు 40) జమ్మలమడుగు గ్రామము, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| Political party | కాంగ్రెస్ |
| Spouse(s) | భారతీ రెడ్డి |
| Children | ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష) |
| Residence | హైదరాబాదు మరియు బెంగలూరు |
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (లేదా జగన్) కడప పార్లమెంటు స్థానము నుండి కాంగ్రెస్ తరపున 14వ లోక్ సభ కు ప్రాతినిథ్యము వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు. వీరు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఏకైక పుత్రుడు.
విషయ సూచిక |
విద్యాభ్యాసము [మార్చు]
వీరు తమ ప్ర్రాధమిక విద్య ను Hyderabad public school నుండి పూర్తి చేశారు. వ్యాపారశాస్త్రం లో ఉన్నత విద్య ను అభ్యసించారు.
వ్యాపారరంగ ప్రవేశము [మార్చు]
వ్యాపారరంగంలో ప్రవేశించి పలు పరిశ్రమలు స్థాపించాడు. ఇందులో భారతీ సిమెంట్శ్, సాక్షీ ప్రసార మాధ్యమం , సండూరూ జలవిద్యుత్ కేంద్రము ఉన్నాయి.
రాజకీయ జీవితము [మార్చు]
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రేస్ పార్టీ తొ విబేదించి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ని స్థాపించాడు , ఈ పార్టీ కి వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. డిశంబరు అసెంబ్లీ సమావేశాలల్లొ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపింది. 2011 కడప లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ 5,43,053 ఓట్ల మెజార్టీతో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు.
అభియోగాలు [మార్చు]
2012 మే 27న అక్రమంగా ఆస్తులు సంపాదించాడన్న అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు. ప్రస్తుతం చంచలగూడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు.
వ్యక్తిగత జీవితము [మార్చు]
సమీప బంధువైన డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి కుమార్తె భారతీరెడ్డి ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. బెంగుళూరు, హైదరాబాదు మరియు పులివెందులలో నివాసగృహాలు ఉన్నాయి.
యువజన శ్రామిక రైతు (వై. యస్. ఆర్.) కాంగ్రెస్ పార్టీ 2011 లో వై.ఎస్.జగన్ చేత స్థాపించబడిన ప్రాంతీయ పార్టీ.