శంకరా నాదశరీరాపరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"శంకరా నాదశరీరాపరా"
శంకరా నాదశరీరాపరా పాటలోని దృశ్యం
రచయితవేటూరి సుందరరామమూర్తి
సంగీతంకె.వి.మహదేవన్
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణశంకరాభరణం (1979)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారుజె.వి. సోమయాజులు

శంకరా నాదశరీరాపరా 1979లో విడుదలైన శంకరాభరణం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]

పాట నేపథ్యం[మార్చు]

బ్రాహ్మణకులంలో పుట్టి సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన మంజుభార్గవిని శంకరశాస్త్రి ఇంటికి తీసుకొస్తాడు. ఒకసారి శివాలయంలో తాను చేస్తున్న కచేరికి మంజుభార్గవిని తీసుకొనిపోయి, తనతోపాటు వేదిక మీద కూర్చోబెడుతాడు. దాంతో కోపించిన తోటి బ్రాహ్మణ కులస్తులు ఆ సభనుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఎదురుగా కనిపిస్తున్న శివుని మీద కోపంతో శంకరశాస్త్రి ఈ పాటను పాడుతాడు.

పాటలోని సాహిత్యం[మార్చు]

శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా || శంకరా ||

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ || ప్రాణము నీవని ||

నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా || శంకరా ||

పురస్కారాలు[మార్చు]

  1. వేటూరి సుందరరామమూర్తి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -1979

మూలాలు[మార్చు]

  1. సితార, పాటల పల్లకి. "వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు". www.sitara.net. Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

వీడియో లింకులు[మార్చు]

  1. యూట్యూబ్ లో పాట వీడియో