శోభనా భర్తియా

వికీపీడియా నుండి
(శోభనా భార్తియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శోభనా భర్తియా
2013 లో శోభనా భర్తియా
జననం (1957-01-04) 1957 జనవరి 4 (వయసు 67)
జాతీయతభారతీయుడు
వృత్తివ్యాపారవేత్త
పదవీ కాలం2006–2012
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిశ్యాం సుందర్ భర్తియా
తల్లిదండ్రులుకృష్ణకుమార్ బిర్లా
పురస్కారాలుపద్మశ్రీ

శోభనా భర్తియా (Shobhana Bhartia (జ: 1957) హిందుస్తాన్ టైమ్స్ గ్రూపు యొక్క ఎడిటోరియల్ డైరెక్టర్. ఈ పదవి ఈమెకు తండ్రి కృష్ణ కుమార్ బిర్లా తర్వాత వంశపారంపర్యంగా సంక్రమించింది. ఈమె తాతగారు స్థాపించిన బిర్లా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ సంస్థ ప్రొ-చాన్స్ లర్ గా కూడా ఈమెనే. ఈమె ప్రస్తుత ఎండీవర్ ఇండియా చైర్ పర్సన్. ఈమె అధికారంలోనున్న భారత జాతీయ కాంగ్రెసుకు చాలా సన్నిహితంగా పనిచేస్తూ 2006 - 2012 మధ్య రాజ్యసభకు నామినేట్ చేయబడింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె తాత జి.డి.బిర్లా; తండ్రి కె.కె.బిర్లా. వీరు ముగ్గురు అక్కాచెల్లెల్లలో శోభనా చిన్నది. ఈమె భర్త శ్యామ్ భర్తియా వ్యాపారవేత్త. వీరికి ఇద్దరు పిల్లలు.

తొలి రోజులు[మార్చు]

చిన్నతనం నుండి ఢిల్లీలోని హిందుస్తాన్ టైమ్స్ కార్యాలయానికి వెళ్లి, అందులోని వివిధ విభాగాల పనితీరు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అంశాలు తెలుసుకున్నారు. అప్పుడు వాషింగ్టన్ పోస్ట్ యజమాని క్యాథరిన్ గ్రాహమ్తో పరిచయం ఏర్పడి వాషింగ్టన్లో వారం రోజుల పాటు ఆ సంస్థ ఉద్యోగుల పనితీరు గమనించి; తిరిగివచ్చిన తర్వాత 1986లో హిందుస్తాన్ టైమ్స్ లో చేరారు.

పత్రికా జీవితం[మార్చు]

ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పత్రికను అభివృద్ధిపథంలో నడిపించింది. ఆదివారం అనుబంధంలో బ్రంచ్ మ్యాగజైన్ ను తీసుకొనివచ్చింది. తర్వాత హెచ్ టీ నెక్స్ట్ ను ప్రారంభించింది. ఈ రెండూ యువ పాఠకుల్ని ఆకట్టుకోవడంతో పత్రికను ఉత్తర భారతదేశంలో ఆరు నగరాలకు విస్తరించారు.

2004లో పత్రికల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి వచ్చినప్పుడు వీరి కంపెనీలో 20 శాతం వాటాను హెండర్సన్ గ్లోబల్ ఇన్‍వెస్టర్స్ కు ఇచ్చారు. దానితో పత్రికను ఆధునీకరించారు. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ ప్రకటించి నిధులు సమీకరించారు. తర్వాత 2007లో మింట్, ఫీవర్ 104 ఎఫ్.ఎం. రేడియో ప్రారంభించారు.

ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.