Coordinates: 12°24′50″N 76°42′14″E / 12.414°N 76.704°E / 12.414; 76.704

శ్రీరంగపట్టణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరంగపట్నం
శేరింగపట్నం (సామ్రాజ్యవాద కాలంలో)
పట్టణం
శ్రీరంగపట్నంలో గుంబజ్
శ్రీరంగపట్నంలో గుంబజ్
శ్రీరంగపట్నం is located in Karnataka
శ్రీరంగపట్నం
శ్రీరంగపట్నం
Coordinates: 12°24′50″N 76°42′14″E / 12.414°N 76.704°E / 12.414; 76.704
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లామాండ్యా
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyశ్రీరంగపట్నం పురపాలక సంఘం
Area
 • Total13 km2 (5 sq mi)
Elevation
679 మీ (2,228 అ.)
Population
 (2011)
 • Total25,061
 • Density2,157/km2 (5,590/sq mi)
భాషలు
 • అధికారికకన్నడ
Time zoneUTC+5:30 (IST)
PIN
571 438
ప్రాంతీయ ఫోన్ కోడ్08236
Vehicle registrationKA-11
Websitehttp://www.srirangapatnatown.mrc.gov.in/

శ్రీరంగపట్టణం (కన్నడ: ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ శ్రీరంగపట్న శిరంగపట్టణ్ అని పిలువబడేది). కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతి సమీపంలో ఉంది. ఈ నగరం, చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగిఉంది.

ప్రదేశం[మార్చు]

శ్రీరంగనాధ మందిరం

మైసూరు కు 13 కి.మీ. దూరంలో గల ఈ నగరం, మాండ్య లో గలదు. ఈ పట్టణం చుట్టూ కావేరీ నది చే చుట్టబడిఉంది. ఇదో ద్వీపంలా కనబడుతుంది.

ధార్మిక ప్రాముఖ్యత[మార్చు]

ఈ నగరంలోని శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.

జనగణన[మార్చు]

2001 గణాంకాల ప్రకారం,[1] శ్రీరంగ పట్టణ జనాభా 23,448. అందులో పురుషులు 51%, స్త్రీలు 49% గలరు. అక్షరాస్యత శాతం 68%, జాతీయ అక్షరాస్యత శాతం 59.5% కంటే ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్యత 74%, స్త్రీల అక్షరాస్యత 63%. 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు.

భూగోళికం[మార్చు]

శ్రీరంగపట్టణం, 12°25′N 76°42′E / 12.41°N 76.7°E / 12.41; 76.7 లో గలదు. దీని సరాసరి ఎత్తు 679 మీటర్లు (2227 అడుగులు).

చరిత్ర[మార్చు]

శ్రీరంగపట్టణం, విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుచున్నది. అంతేగాక మైసూరు రాజ్యపు రాజధానిగాను విరాజిల్లినది. రంగరాయను ఓడించి వడయార్ రాజు 1614 లో శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకున్నాడు.[2] విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్ రాజుకు విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది.

టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
హైదర్, టిప్పు

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం 'మైసూరు రాజ్యానికి' రాజధాని అయింది. టిప్పు సుల్తాన్ తన రాజ్యానికి ఖుదాదాద్ సల్తనత్ లేదా సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణానికి రాజధాని చేసుకుని, దక్షిణ భారత్ లోని పలు భాగాలను తన రాజ్యం క్రింద కలుపుకున్నాడు. ఇండో-ఇస్లామీయ నిర్మాణ శైలి లో టిప్పుసుల్తాన్ సమాధి, టిప్పూ పాలెస్, దరియా దౌలత్, జుమ్మా మసీదు లాంటి నిర్మాణాలు కానవస్తాయి.'1799' లో తన స్వంత అనుచరగణం విద్రోహచర్యవలన శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు.

ముఖ్యమైన ప్రదేశాలు[మార్చు]

శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవి. వాటిలో ముఖ్యమైనవి:

గమనికలు[మార్చు]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. The fall of Srirangapattana to the Wodeyar dynasty in 1614 is much celebrated in local ballad and legend, one of which concerns a curse put upon the Wodeyars by Alamelamma, the lamenting wife of the defeated Vijayanagar viceroy. In fulfillment of that curse, no ruling Maharaja of Mysore has ever had children; the succession has inevitably devolved upon brothers, nephews or adopted heirs, or on children born to the Maharaja before his accession, but never has a child been born to a ruling Maharaja.
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  4. "Shivasamudra Falls". Retrieved 2006-11-11.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]