శ్రీ సూర్యరాయ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సూర్యరాయ శతకము
కవి పేరుదేవగుప్తాపు భరద్వాజము
మొదటి ప్రచురణ తేదీ1916
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంసూర్యనృపా!
విషయము(లు)నీతిబోధ
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకందపద్యాలు
ప్రచురణ తేదీ1916
మొత్తం పద్యముల సంఖ్య100
మొత్తం పుటలు23
అంకితంరావు సూర్యారావు
ముద్రాపకుని పేరుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
ముద్రణా శాలఆంధ్రపత్రిక కార్యాలయము, చెన్నపురి

23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము[1] దేవగుప్తాపు భరద్వాజము చేత రచింపబడి 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం కలదు. ఇది కాక కవి "సూర్యరాయ విబుధవిదేయా!" "సూర్యరాయ సజ్జనగేయా!" "సూర్యరూప! చిత్తజరూపా!" అని కూడా సంబోధించాడు. అపాత్రదానము పనికి రాదని, ప్రభువెన్నడు తనకున్నదంతయు వెచ్చింపరాదని, వెనుక ముందు చూచి ఇవ్వవలెనని కవి ఈ శతకము ద్వారా ప్రభువుకు హితబోధ చేశాడు.

కం. పండితున కొక్కడబ్బిడఁ
గొండగు, మఱి వేనవేలు కొండీండ్రకిడన్
బెండగు పాత్రాపాత్రల్
ఖండితముగ నెంచి చూడ ఘనసూర్యనృపా!

మూలాలు[మార్చు]

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973