సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
వికీపీడియా నుండి
| దక్షిణ ఆసియా నవీన యుగం |
|
|---|---|
| పేరు: | సయ్యద్ అహ్మద్ ఖాన్ |
| జననం: | అక్టోబరు 17 1817 |
| మరణం: | 1898 (వయసు 80) |
| సిద్ధాంతం / సంప్రదాయం: | సున్నీ; మొఘల్ |
| ముఖ్య వ్యాపకాలు: | విద్య, రాజకీయ రంగం |
| ప్రముఖ తత్వం: | అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, రెండు దేశాల సిద్ధాంతము |
| ప్రభావితం చేసినవారు: | మొఘల్ సామ్రాజ్యము, పాశ్చాత్యవిద్య |
| ప్రభావితమైనవారు: | ముస్లింలీగ్ |
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహాదుర్ :(ఉర్దూ :: سید احمد خان بہا در) (అక్టోబరు 17, 1817 – మార్చి 27, 1898), పరిచయమైన పేరు సర్ సయ్యద్, భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామీయ సామాజిక సంస్కర్త మరియు నవీన భావాలు గలవాడు. ముస్లిం సమాజంలో విద్యావ్యాప్తి కొరకు అహర్నిశలూ కఠోరంగా కృషిచేసిన ఘనుడు. మహమ్మదన్ అంగ్లో ఓరియంటల్ కాలేజీని స్ఠాపించి దాన్నే అంచెలంచెలుగా అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ గా తీర్చిదిద్దిన ధీశాలి. ఇతడి దూరదృష్టి మూలంగానే ముస్లిం సమాజంలో విద్యాపరంగానూ రాజకీయంగానూ ఎదుగుదలకు ఓ వేదిక ఏర్పాటైంది.
ఇవీ చూడండి [మార్చు]
|
|||||