సామర్లకోట

వికీపీడియా నుండి

  ?సామర్లకోట మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో సామర్లకోట మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో సామర్లకోట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము సామర్లకోట
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 17
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
131,548 (2001)
• 65769
• 65779
• 63.49
• 67.87
• 59.13


సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ వూరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన "రాజశేఖర చరిత్రం" అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర వుంది.

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం

సామర్లకోట 17.0500° N 82.1833° E.[1] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు)

[మార్చు] జనవిస్తరణ

2001 జనగణన ప్రకారం సామర్లకోట పట్టణం జనాభా 53,402. ఇందులో మగవారు 50%, ఆడువారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65% మరియు ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు.

[మార్చు] రవాణా

సామర్లకోట రైల్వేస్టేషన్

హౌరా - చెన్నై రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.

[మార్చు] కుమారారామ మందిరం

ప్రధాన వ్యాసం: కుమారభీమారామము

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

దేవాలయ ప్రదానద్వారము
దేవాలయ ఆవరణ లోపలిభాగం

సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కధనంలో వివరించబడినది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.


ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇ్కా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

[మార్చు] పరిశ్రమలు

  • రెలియన్స్ ఎనర్జీ లిమిటెడ్ వారి 220 మెగావాట్ల విద్యుత్కేంద్రము
  • నవభారత్ వెంచర్స్ వారి దక్కన్ షుగర్స్
  • శ్రీ వెంకట్రామా ఆయిల్ ఇండస్ట్రీస్ - రైస్ బ్రాన్ నూనె తయారీ


1949 నుండి అభిసారిక అనే తెలుగు లైంగిక సమాచార పత్రిక ఇక్కడినుండి ప్రచురింపబడుతున్నది.

[మార్చు] ప్రముఖులు

  • ప్రతివాది భయంకరాచారి - స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు.
  • చాగంటి సన్యాసిరాజు - నాటకరంగం
  • దర్భా వెంకటరమణ (రాంషా)- రచయత, అభిసారిక పత్రిక ఎడిటర్
  • సమయం వీర్రాజు - ఉపన్యాసకుడు
  • డా.బేతిన వెంకటరాజు, డా. చాగంటి శ్రీరామరత్నరాజు, డా. అప్పల వెంకటశేషగిరిరావు, డా. చందలాల అనంతపద్మనాభం, డా.దర్భా వి.ఆర్. పూషా - అభిసారిక ఎడిటర్
  • చంద్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
  • నేమాణి భూషయ్య - పారిశ్రామికవేత్త

[మార్చు] మండలంలోని గ్రామాలు


[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు