సిరికొండ మధుసూధనాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరికొండ మధుసూధనాచారి
సిరికొండ మధుసూధనాచారి

సిరికొండ మధుసూధనాచారి


ఎమ్మెల్సీ
పదవీ కాలం
14 డిసెంబర్ 2021 - 13 డిసెంబర్ 2027
నియోజకవర్గం గవర్నర్ కోటా

పదవీ కాలం
12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు

వ్యక్తిగత వివరాలు

జననం (1956-10-13)1956 అక్టోబరు 13
నర్సక్కపల్లి, నడికూడ మండలం,హన్మకొండ జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సిరికొండ వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య
జీవిత భాగస్వామి ఉమాదేవి
సంతానం ప్రదీప్‌, ప్రశాంత్‌, క్రాంతి
మతం హిందూ
నవంబర్ 20, 2021నాటికి

సిరికొండ మధుసూధనాచారి తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 2014 జూన్ 12 నుండి 2019 జనవరి 16 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్రం, వరంగల్లు జిల్లా,పరకాల, నర్సక్కపల్లి గ్రామంలో సిరికొండ వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య దంపతులకు జన్మించాడు. అయన ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలో పూర్తి చేసి ’ ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పరకాలలో, వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో డిగ్రీ, కేయూలో ఎంఏ పూర్తి చేసి మేనేజ్‌మెంట్ డిప్లొమాలో పీజీ పూర్తి చేశాడు. మధుసూదనాచారి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

సిరికొండ మధుసూధనాచారి స్వర్గీయ ఎన్టీఆర్‌ పిలుపుతో 1982లో రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో చేరి 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశించాడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో 2001లో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చారి పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సభ్యుడు. 1994లో అసెంబ్లీకి మొదటి సారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించి పోయిన మధుసూధనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చారు.ఆయన 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. మధుసూదనచారిని 2021 నవంబరు 19న గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపింది.[3][4] మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా 2021 డిసెంబరు 14న తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.[5]

వనరులు[మార్చు]

  1. The Hindu, Telangana (10 June 2014). "Madhusudhana Chary is Speaker of Telangana Assembly" (in Indian English). Ravi Reddy. Archived from the original on 9 November 2017. Retrieved 24 July 2021.
  2. Sakshi (11 June 2014). "మురిసిన నర్సక్కపల్లి". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  3. Andhrajyothy (20 November 2021). "మధుసూదనాచారికి గవర్నర్‌ ఆమోదం". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  4. Eenadu (20 November 2021). "నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  5. V6 Velugu (14 December 2021). "నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)