హిరణ్యకశిపుడు
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
హిరణ్యకశిపుడు ఒక ప్రసిద్ద రాక్షసరాజు. ఈతడు దితి కుమరుడు.
ఇతర వివరాలు [మార్చు]
- హిరణ్యకశిపుని భార్యలు- లీలావతి,దత్త.
- హిరణ్యకశిపుని కుమారులు- ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు.సంహ్లాదుడు,అనుహ్లాదుడు మరియు హ్లాదుడు.
పురాణాలలో హిరణ్యకశిపుని కథ [మార్చు]
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు,వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు విష్ణుమూర్తిని ప్రార్ధించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు,కావున వారి శాపమున మూడుజన్మలు రాక్షసులులుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రహ్లాదుడు ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ మహావిష్ణువు చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
|
|||||||||||||||||||||||