హెజీబు అచ్యుతరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హెజీబు అచ్యుతరామయ్య (1924 - 1996) గ్రంథాలయ కార్యకర్త.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1924 జూన్ 4 తేదీన విజయనగరం జిల్లా వసంత గ్రామంలో జన్మించాడు. హిందీ విశారద వరకు చదివి చిన్నతనం నుండే ప్రజా ఉద్యమాల వైపు మొగ్గాడు. అతను 1953లో తన గ్రామంలో పొట్టి శ్రీరాములు గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. యువకుల శ్రమదానంలో దానికి భవనం నిర్మించాడు . ఆ గ్రంథాలయ పురోగతికి విశేష కృషిచేశాడు. తన గ్రామంలోనే కాక విజయనగరం జిల్లాలో పలు గ్రామాలలో గ్రంథాలయాలను స్థాపించేందుకు కృషిచేశాడు అతను కొంతకాలం విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యాలయంలో పనిచేశాడు

అతను 1996 జూన్ 18 తేదీన పరమపదించారు.

మూలాలు[మార్చు]