హైదరాబాదు జిల్లా
| ?హైదరాబాదు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 217 కి.మీ² (84 చ.మై) |
| ముఖ్య పట్టణము | హైదరాబాదు |
| ప్రాంతం | తెలంగాణ |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
40,10,238 (2011) • 18,480/కి.మీ² (47,863/చ.మై) • 4010238 • 2064359 • 1945879 • 79.04 (2001) • 84.11 • 73.67 |
హైదరాబాదు జిల్లా, [1][2]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అతిచిన్న జిల్లా. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరం మొత్తం ఈ జిల్లాలో భాగమే.
హైదరాబాదు (నగర) జిల్లా ప్రస్తుత స్థితిలో 1978 ఆగష్టులో ఏర్పడినది. పూర్వపు హైదరాబాదు జిల్లానుండి నగరం చుట్టూ వున్న గ్రామీణ ప్రాంతాన్నిరంగారెడ్డి జిల్లా గా ప్రత్యేక జిల్లాగా యేర్పడటంతో ఇలా పరిణమించింది. అప్పటి హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లాలో చేర్చారు. మొత్తం హైదరాబాదు మున్సిపాలిటీ ప్రాంతము (ఒక చిన్న భాగము మినహాయించి), సికింద్రాబాదు కంటోన్మెంటు ప్రాంతము, లాలాగూడ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము ప్రాంతాలను హైదరాబాదు జిల్లాలో చేర్చారు.అప్పుడు జిల్లాలో మొత్తం 66 గ్రామాలు నాలుగు తాలూకాలు (చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ మరియు సికింద్రాబాద్) గా విభజించబడినవి. ఆ తరువాత పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక పాలనను సంస్కరించి 1985 జూన్ 25న మండలాలను యేర్పాటు చేసినప్పుడు హైదరాబాదు జిల్లా నాలుగు మండలాలుగా విభజించారు. అవి చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ మరియు సికింద్రాబాద్. 1996 డిసెంబర్ 27న ఈ నాలుగు మండలాలనుండి మొత్తం 16 మండలాలు సృష్టించి పునర్వ్యవస్థీకరించారు.
రాష్ట్ర రాజధాని జిల్లాలో ఉండటంతో జిల్లా అన్నివిధాల బాగా అభివృద్ధి చెందినది.
విషయ సూచిక |
జిల్లా చరిత్ర [మార్చు]
1948లో జరిగిన పోలీస్చర్య వలన ఆట్రాఫ్-అ-బాల్దా మరియు భగత్ జిల్లాలని ఏకీకృతం చేసి హైదరాబాదు జిల్లాను రూపుదిద్దారు. 1978లో ఈ జిల్లాను హైదరాబాదు గ్రామీణ మరియు హైదరాబాదు పట్టణ జిల్లాలగా విభజించారు. గ్రామీణ హైదరాబాదు జిల్లాకు తరువాత రంగారెడ్డి జిల్లా గా పేరు మార్పిడి జరిగింది. హైదరాబాదు పట్టణ జిల్లా ప్రస్తుతం హైదరాబాదు జిల్లాగా పిలువబడుతుంది.
భౌగోళిక స్వరూపం [మార్చు]
హైదరాబాదు జిల్లా 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
ఆర్ధిక స్థితి గతులు [మార్చు]
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు [మార్చు]
మండలాలు మరియు గ్రామాలు [మార్చు]
| సంఖ్య | పూర్వపు మండలం | మండలం పేరు | గ్రామాలు |
| 1 | సికింద్రాబాదు | అమీర్పేట | అమీర్పేట, బహలూల్ఖాన్ గూడ, సోమాజీగూడ |
| 2 | తిరుమలగిరి | తోకట్ట, బోయిన్పల్లి, సీతారాంపూర్, చందూలాల్ బౌలీ, కాకాగూడ, తిరుమలగిరి, అమ్ముగూడ, మచ్చ బొల్లారం | |
| 3 | మారెడుపల్లి | మారెడుపల్లి (సర్ఫేఖాస్), మారేడ్పల్లి పైగా, లాలాగూడ, మల్కాజ్గిరి (కంటోన్మెంట్ ప్రాంతం) | |
| 4 | ముషీరాబాదు | అంబర్పేట | అంబర్పేట, డ్రైనేజ్ లింగంపల్లి, అంబర్పేట సైఫేఖాస్, మలక్పేట |
| 5 | హిమాయాత్నగర్ | భాగ్ లింగంపల్లి, గగన్ మహల్, దాయిరా, హసనలీ గూడ | |
| 6 | నాంపల్లి | నాంపల్లి, తోటగూడ | |
| 7 | గోల్కొండ | షేక్పేట్ | షేక్పేట్, హకీంపేట్, భక్తావర్ గూడ |
| 8 | ఖైరతాబాద్ | యెల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్, యూసుఫ్గూడ | |
| 9 | ఆసిఫ్నగర్ | ఆసిఫ్నగర్, మల్లేపల్లి, గుడి మల్కాపూర్, కుల్సుంపూర, రాజ్దార్ఖాన్ పేట్ | |
| 10 | చార్మినార్ | సైదాబాద్ | సైదాబాద్, మాదన్నపేట, తీగలగూడ, మూసారాం భాగ్, గడ్డి అన్నారం (పాక్షికం) |
| 11 | బహదూర్పూర్ | ||
| 12 | బండ్లగూడ | ||
| 13 | సికింద్రాబాదు | సికింద్రాబాదు | |
| 14 | ముషీరాబాదు | ముషీరాబాదు | |
| 15 | గోల్కొండ | గోల్కొండ | గోల్కొండ |
| 16 | చార్మినార్ | చార్మినార్ | చార్మినార్ |
అధికారులు [మార్చు]
జిల్లా పాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారులచేత పాలనా యంత్రాంగం పని చేస్తుంది. పట్టణ జిల్లాకావున నగరపాలకసంస్థ స్థానిక పరిపాలన చేస్తుంది. ఈ జిల్లాకు రాష్ట్రీయంగా ఎమ్ ఎల్ ఎ మరియు కేంద్రీయంగా ఎమ్ పి ప్రతినిధులు పాలనాబాధ్యతలలో పాలు పంచుకుంటారు. జిల్లా మొత్తం హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జి హెచ్ ఎమ్ సి) అధికార పరిధిలోనే ఉంటుంది. పాలనా ప్రతినిధులను జి హెచ్ ఎమ్ సి ఆధ్వర్యంలో అన్ని వార్డుల నుండి ఎన్నిక చేయబడతారు.
జిల్లా పాలనలో భాగంగా ఈ-సేవ కేంద్రాల ద్వారా వివిధ ధృవపత్రాలు (కులం, నివాసం, ఆదాయం...)జారీచేయబడుతున్నాయి. ఆలాగే ఆసుపత్రి నమోదు, పాఠశాల తాత్కాలిక నమోదు,వడ్డీ వ్యాపారం అనుమతి మరియు వృద్ధాప్య , వికలాంగ, విధవ పింఛన్లు మంజూరు చేయబడుతున్నాయి.
నియోజకవర్గాలు [మార్చు]
హైదరాబాదు జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంతకు క్రితం ఈ సంఖ్య 13 మాత్రమే. ఈ 15 నియోజకవర్గాలు హైదరాబాదు లోకసభ మరియు సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గాలలో ఏడేసి చొప్పున, మిగిలిన ఒక నియోజకవర్గం మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
|
రవాణా వ్వవస్థ [మార్చు]
హైదరాబాదు రాష్ట్ర రాజధాని కావడంతో వాయు, రైలు, రహదారి సౌకర్యాలు అభివృద్ధి చెందినవి.
జనాభా లెక్కలు [మార్చు]
2011 లెక్కల ప్రకారం హైదరాబాదు జిల్లా జనాభా 40,10,238. 2001లో 38,29,753 ఉన్న జిల్లా జనాభా దశాబ్దం కాలంలో 4.71% వృద్ధి చెందింది. 1901లో కేవలం 4.99 లక్షలు ఉన్న జనాభా 1911 నాటికి 6.27 లక్షలకు పెరిగి 1921లో 5.56 లక్షలకు తగ్గింది.[3] ఆ తర్వాత క్రమక్రమంగా వృద్ధిచెందుతూ 2011 నాటికి 40.1 లక్షలకు చేరింది. గ్రేటర్ హైదరాబాదు మొత్తాన్ని పరిగనలోకి తీసుకుంటే జనాభా 2011 నాటికి 68.09 లక్షలకు చేరింది.
సంస్కృతి [మార్చు]
హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి.
ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను ఖచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.
పశుపక్ష్యాదులు [మార్చు]
విద్యాసంస్థలు [మార్చు]
హైదరాబాదు లో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కలవు.
ఆకర్షణలు [మార్చు]
*టాంక్ బండ్ హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము
- లుంబిని పార్కు
హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉన్నది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
- పబ్లిక్ గార్డెన్స్- శాసనసభ, జూబిలీ హాలు వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం.
- లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్- ఈ యస్ ఐ వద్ద : లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు హైదరాబాదు లోని ప్రముఖ పార్కుల్లో ఒకటి. ఇది ESI బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
- చార్మినారు- ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదు చిహ్నం.
- లాడ్ బజార్- చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది.
- మక్కా మసీదు - చార్మినారుకు నైరుతిలో ఉన్న రాతి కట్టడం.
- గోల్కొండ కోట - భారత్లో ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి.
- హుస్సేన్ సాగర్ - హైదరాబాదు, సికిందరాబాదులను వేరుచేస్తున్న మానవనిర్మిత కాసారం.
- సాలార్జంగ్ మ్యూజియం- పురాతన వస్తువులతో కూడిన పెద్ద సంగ్రహాలయమిది.
- బిర్లా ప్లానిటేరియం - నగర మధ్యంలో నౌబత్ పహాడ్ గుట్టపై ఉంది.
- ఇస్కాన్ దేవాలయం
ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.[4]
- శిల్పారామం
క్రీడలు [మార్చు]
హైదరాబాదులో చాలా క్రీడాప్రదేశాలు కలవు. లాల్ బహదూర్ స్టేడియం క్రీడాపోటీలకు ప్రముఖ వేదిక.
ఇవికూడా చూడండి [మార్చు]
- హైదరాబాదు నగరం
బయటి లింకులు [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ హైదరాబాదు జిల్లా అధికారిక జాలస్థలి
- ↑ ఈనాడు జాలస్థలిలో హైదరాబాద్
- ↑ Hand Book of Statistics, Hyderabad Dist, 2009, Published by Chief Planning Office
- ↑ http://www.iskcon-hyderabad.com/directions.html
|
||||||||||||||