Coordinates: 16°23′10″N 81°02′16″E / 16.386062°N 81.037642°E / 16.386062; 81.037642

అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగలూరు
—  రెవెన్యూ గ్రామం  —
అంగలూరు is located in Andhra Pradesh
అంగలూరు
అంగలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°23′10″N 81°02′16″E / 16.386062°N 81.037642°E / 16.386062; 81.037642
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 16,234
 - పురుషులు 2,102
 - స్త్రీలు 2,132
 - గృహాల సంఖ్య 1,248
పిన్ కోడ్ 521330
ఎస్.టి.డి కోడ్ 08674

అంగలూరు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గుడ్లవల్లేరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1248 ఇళ్లతో, 4234 జనాభాతో 1159 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2102, ఆడవారి సంఖ్య 2132. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1451 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589598[1].పిన్ కోడ్: 521331.సముద్రమట్టానికి 9 మీ.ఎత్తులో ఉంది.

గామం పేరువెనుక చరిత్ర[మార్చు]

ఒక కథనం ప్రకారం ఈ ఊరు 12వ శతాబ్దం నుండి ఉంది. పూర్వం ఇక్కడ సైన్యము కొరకు అంగళ్లు ఉండటాన అంగళ్లూరు అని పేరు వచ్చింది. ఆంగళ్లూరు కాలక్రమేణా అంగలూరు అయింది. ఈ చిన్న గ్రామం అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను అందించింది.

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సరిహద్దులు[మార్చు]

1913 ప్రాంతంలో బ్రిటీష్ కాలంలో గ్రామం సరిహద్దులు ఇలా వుండేవి- ఉత్తరంలో వేల్పూరు, తూర్పున, చంద్రాల, దక్షిణాన గుడ్లవల్లేరు, వేముగుంట అగ్రహారం, పెంజెండ్ర, పడమర సేరికలవపూడి, రామచంద్రపురం. ఆయా గ్రామాల భూములు వేరుపడినట్టుగా సరిహద్దు పుంత అన్న సరిహద్దు ప్రాంతం చుట్టూ ఏర్పడివుంది. రెండు గ్రామాల సరిహద్దులు కలిసిన ప్రతిచోటా సరిహద్దు తెలిపేందుకు పూర్వం గచ్చుదిమ్మలు కట్టారు. అవి పగిలిపోయివుండడంతో వాటి స్థానంలో బౌండరీస్టేషన్లు అన్న పేరుతో పెద్ద చదునైన నలుచదరపు కొండరాళ్ళు పాతారు.[2]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి గుడ్లవల్లేరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుడ్లవల్లేరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ గుడ్లవల్లేరులోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గుడ్లవల్లేరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

  • ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
  1. చాలా కాలంనుండి (బ్రిటిష్‌వారి కాలం నుండి) ఉంది. బాలికలకు ఉన్నత పాఠశాల ఉండడం అప్పట్లో చాలా అరుదు. బహుశా కృష్ణా జిల్లాలో అప్పటికి ఇదొక్కటే ఈ విధమైన పాఠశాల కావచ్చును.
  2. ఈ పాఠశాలలో, 2013లో మంజూరైన 15.90 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మించి, 2015 డిసెంబరులో ప్రారంభించారు.
  3. ఈ పాఠశాల 70వ వార్షికోత్సవం 2016లో నిర్వహించారు.
  • శ్రీ లింగం వీరభద్రయ్య జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల

ఈ పాఠశాల 57వ వార్షికోత్సవం 2016, ఫిబ్రవరి-22 న నిర్వహించారు.

  • జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)
  • శ్రీ సాయి ప్రతిభా స్కూల్, కొత్తపేట

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

అంగలూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం

ఈ కేంద్రానికి భవన నిర్మాణానికై, గ్రామంలోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న పంచాయతీ స్థలాన్ని కేటయించారు.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

అంగలూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

అంగలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామానికి చెందిన ఎన్.ఆర్.ఐ. విద్యార్థి శొంఠి ఫణిసాయి, 1.6 లక్షల వితరణతో ఏర్పాటుచేసిన నూతన త్రాగునీటి ట్యాంకరును, 2017, ఏప్రిల్-21న ప్రారంభించారు.గ్రామానికి ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీకి 80 ఏళ్ళ చరిత్ర ఉంది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో బొర్రా వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా త్రిపురనేని సురేశ్ ఎన్నికైనాడు.
  3. 32021 ఫిబ్రవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేడిపల్లి రవి, సర్పంచిగా టి. సురేశ్ ఉప సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అమరేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాలలో స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ సీతారామస్వామివారి అలయం[మార్చు]

ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ ఆలయంలోని శ్రీ సీతారాముల విగ్రహం, రాష్ట్రంలోనే అత్యంత అరుదైనదిగా గుర్తింపు పొందినది. ఏకశిలగా శ్రీరాముని ఎడమ తొడపై సీతాదేవి కూర్చున్నట్లుగా ఉన్న విగ్రహం అరుదైనది. భద్రాచలం రామాలయంలో ఇలాంటి విగ్రహం ఉన్నా, అక్కడ ప్రక్కనే లక్ష్మణస్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం సీతారాములిద్దరిదీ మాత్రమే కావడం విశేషం. దీనికి ప్రక్కనే ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. 2012 ఆగష్టులో 6 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా, దాత, సెంటినీ గ్రూపు ఛైర్మన్ శ్రీ త్రిపురనేని శేషగిరిరావు , మూలవిరాట్టు ఆకారంలోనే, ఉత్సవమూర్తి విగ్రహాన్ని, ఒక లక్ష రూపాయల వ్యయంతో, శ్రీలంక దేశంలో తయారు చేయించారు. దీనికి తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నగిషీలు దిద్దించి, అక్కడే ప్రతేకపూజలు చేయించి, ఇక్కడ వైభవంగా ప్రతిష్ఠించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఈ ఆలయంలో, 2015,మార్చి-21వ తేదీనాడు, పెద్ద యెత్తున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు నిర్వహించెదరు.

శ్రీ సీతారామాలయం[మార్చు]

అంగలూరులోని ఒక పెంకుటింటిలో, 1925లో రామమందిరాన్ని ఏర్పాటుచేసారు. అందులో స్వామివారల మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసి పూజించేవారు. ఈ మందిరం శిథిలావస్థకు చేరడంతో, గత సంవత్సరం దానిని తొలగించి, నూతన ఆలయ నిర్మాణం ప్రారంభించారు. స్థానిక శ్రీ ఙానసాయి ఆలయ నిర్మాణదాతలు యలమంచిలి నాగమోహన్, లక్ష్మి దంపతులు, ఆలయ నిర్మాణానికి వస్తుసామగ్రి అందజేసినారు. గౌడసంఘీయులు ఇచ్చిన విరాళాలతో, ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినది. స్వామివారల రాతివిగ్రహాలను తిరుమలలో తయారుచేయించి తెచ్చారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు ప్రారంభించారు. మంగళవారంనాడు, అఖండస్థాపన, యాగశాల ప్రవేశం, దీక్షాధారణ, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, గణేశ, నవగ్రహ హోమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 10వ తేదీ బుధవారం నాడు, వివిధపూజలు, హోమాలు నిర్వహించారు. 11వ తేదీ గురువారంనాడు, ఉదయం 6 గంటలనుండి, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశనం, రత్నన్యాసం, శిఖరస్థాపన, యంత్రస్థాపన, శ్రీ సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జవనాయసము, నేత్రమోక్షము, మహాకుంభాభిషేకం, ధేను విప్రకన్య దర్పణ, మహోధ్య, నవధాన్య దర్శనములు, పూర్ణాహుతి, అన్నసమారాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ పురాతన, అరుదైన ఆలయాన్ని సప్తఋషులలో ఒకరైన విశ్వామిత్ర మహర్షి దర్శించుకున్నట్లు గ్రామస్తుల కథనం. ఇక్కడ స్వామివారి విగ్రహం, ఏకరీతిగా, ఆరడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారు ఉత్తరముఖంగా దర్శనమిస్తారు. అరుదైన ఈ ఉత్తరముఖ ఆంజనేయస్వామివారి దర్శానం, సర్వపాప హరణం అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు పునర్నిర్మాణం అనంతరం, 105 సంవత్సరాల క్రితం, గ్రామంలోని దుగ్గిరాల వంశీకులు, ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. బొప్పన వంశీయులు ధ్యజస్తంభ ప్రతిష్ఠ, నిత్యార్చనకు చేయూతనిచ్చుచున్నారు. దుగ్గిరాల వంశీకులు, గ్రామస్థులు, 2013లో, పురాతన ఆలయాన్ని తొలగించి, నూతన ఆలయ పునర్నిర్మాణానికై, 2015,జనవరి-4వ తేదీనాడు, శంకుస్థాపన నిర్వహించారు. అప్పటినుండి 60 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. 2015,మే నెల-25 నుండి, ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించి, 28వ తేదీ గురువారం ఉదయం 8-29 గంటలకు స్వామివారి యంత్ర, రత్న, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, వాహన, బలిపీఠ ప్రతిష్ఠోత్సవాలు, మహాపూర్ణాహుతి, నేత్రోన్మలనము, గోపృష్ట దర్శనం, మాహాకుంభాభి నివేదన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. తదుపరి భారీ అన్నసమారాధన నిర్వహించారు.

ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి 40 రోజులైన సందర్భంగా, 2015,జూలై-6వ తేదీ, సోమవారంనాడు, ఆలయంలో ఆచార సంప్రదాయాల ప్రకారం, మండల దీక్షా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2017,జూన్-4వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.

తాజుద్దీన్ బాబా, జ్ఞాన శాయి మందిరం[మార్చు]

మత సామరస్యం వెల్లి విరుస్తూ తాజుద్దీన్ బాబా, జ్ఞాన శాయి మందిరం ఒకే ప్రాంగణంలో, అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం ఉంది.

ప్రధాన పంటలు[మార్చు]

వ్యవసాయం పై ఆధారపడిన ఈ వూరిలో ప్రధానమైన పంట వరి.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన యలమంచిలి నాగమోహన్, గుంటూరు జిల్లాలో ఒక గుత్తేదారుగా విధులు నిర్వహించుచున్నారు. ఇతని సతీమణి లక్ష్మి. వీరు 2010, నవంబరు-25నుండి, గ్రామంలో ఒక నిత్యాన్నదన పథకాన్ని నిరాటంకంగా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో నా అనేవారు ఎవరూ లేని అనాథలు, మంచంపై నుండి కదలలేక వంటగూడా చేసుకోలేని అశక్తులు, శారీరిక, మానసిక వికలాంగులైన 51 మందిని గుర్తించి, వారికి నిత్యం, రెండుపూటలకు సరిపడే అన్నం, కూర, పచ్చడి, చారు, సాంబారు పెరుగు కలిపిన అన్నం వగైరాలను, రుచికరంగా పరిశుభ్రమైన వంటశాలలో వండి, క్యారేజీలలో సర్ది, ఇంటింటికీ రిక్షాలద్వారా పంపించుచున్నారు. వీరికి సంవత్సరానికి రెండుసార్లు వస్త్రదానం చేయుటయేగాక, అనారోగ్యులకు వైద్య సేవలుగూడా అందించుచున్నారు. ఇంతేగాక, నెలకు నాలుగు గురువారాలలోనూ, ఒక రోజున తాజుద్దీన్ బాబా చందనోత్సవం రోజున, మొత్తం ఆరురోజులలలో గుడికి వచ్చే భక్తులకు వండిపెట్టే పులిహోర, ఒక తీపిపదార్ధం, 2,3 రకాల కూరలను గూడా క్యారేజీలలో సర్ది అన్నార్తులకు పంపుచున్నారు. ఈ నిత్యాన్నదాన పథకానికై రు. 60 లక్షల వ్యయంతో ఒక రెండతస్థుల భవనాన్ని నిర్మించడమేగాక, ఖరీదైన హోటళ్ళలో ఉండేటటువంటి అత్యాధునిక వంటసామగ్రిని అందుబాటులో ఉంచారు. ఈ పనికోసం ఇద్దరు వంటవారు, ఒక రిక్షా, రిక్షాను తొక్కడానికి ఒక మనిషి, ఈ పనులపై అజమాయిషీ చేయడానికి ఒక సూపర్ వైజర్ వగైరాలను నియమించారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్న యలమంచిలి నాగమోహన్, లక్ష్మి దంపతులు, అంగలూరులోని శ్రీ ఙానసాయి ఆలయ నిర్మాణ దాతలుగూడా. శ్రీ షిర్డీ సాయిబాబా సమకాలికులైన నాగపూర్ తాజుద్దీన్ బాబా శిష్యపరంపరలోని చీమలపాడు బాబా అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి ప్రేరణ, స్ఫూర్తి, సూచనలతోనే ఈ బృహత్ కార్యక్రమం చేపట్టినట్లు ఈ దంపతులు చెప్పుచున్నారు.
  2. దుగ్గిరాల, త్రిపురనేని అనే ఇంటి పేరులు గల కుటుంబాలు ఈ వూళ్ళో చాలా కాలంగా ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నారు.
  3. ఈ వూరివారయిన యెర్నేని జగన్మోహనరావు హైదరాబాదులోని మధురానగర్లో "వృషామణి ఫౌండేషన్" స్థాపించారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడు చక్రధర్ ఆర్థిక సాయంతో ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులయిన నిరుపేద విద్యార్థులకు విద్యాదానాన్ని అందించి వాళ్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు సహాయపడుచున్నాడు.
  4. ఈ గ్రామంలో నగిశెట్టి బ్రహ్మయ్యలింగం, కోటేశ్వరమ్మ అను దంపతులు, స్వాతంత్ర్య సమరయోధులు. ఆ రోజులలో మహాత్మా గాంధీ పిలుపుమేరకు, సమీప మోటూరు రైల్వే స్టేషను వద్ద అప్పట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలుపట్టాలను తొలగించిన కేసులో కారాగార శిక్ష అనుభవించాడు. బ్రహ్మయ్యలింగం, కొద్దికాలం క్రితం కాలంచేసారు. కోటేశ్వరమ్మ, 2015, మార్చి-26వ తేదీనాడు కన్నుమూసాడు. ఈ దంపతులకు పిల్లలులేరు.
  5. గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జన్మించిన మూల్పూరు సరోజినీదేవి, బాపులపాడు మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన మూల్పూరు రామారావుని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. సరోజినీదేవి నూరు సంవత్సరాలు పూర్తి చేసుకొనడంతో, ఆమెను ఆమె వారసులు 2016, ఫిబ్రవరి-24న జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4542. ఇందులో పురుషుల సంఖ్య 2233, స్త్రీల సంఖ్య 2309, గ్రామంలో నివాసగృహాలు 1159 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. అడవి, సాంబశివరావు పంతులు (1913). అంగలూరు గ్రామ భూగోళం (PDF) (1 ed.). దుగ్గిరాల: తిపిర్నేని రం.రామయ్య. p. 1. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 11 April 2015.

బయటి లింకులు[మార్చు]