అంబ (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంబ అనే పౌరాణిక నాటకాన్ని చిలుకూరి నారాయణరావు (1889 - 1951) వాడుక భాష ప్రాచుర్యం కోసం 1933 ప్రచురించారు.

తెలుగు సాహిత్య భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రారంభమైన వ్యవహారిక భాషోద్యమానికి ఈ గ్రంథానికి సంబంధం ఉంది. భాషావేత్త, మహా పండితుడు గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషోద్యమానికి లక్షణకర్తగా సిద్ధాంత పరమైన పోరాటం చేస్తూండగా, శ్రీపాద, చిలుకూరి వంటి వారు తమ రచనలు వాడుక భాషలో రచించి బలోపేతం చేశారు. అదే క్రమంలో ఈ నాటకాన్ని వాడుక భాషలో భీష్మ-శిఖండి చరిత్రముగా రచించారు. రచయిత చిలుకూరి నారాయణరావు సంగీతం, పద్యాలు, ఔచిత్యానికి సంబంధం లేని గ్రాంథికాల నుంచి నాటకాలను బయటపడేసి వాడుక భాషలో ఒరవడి పెట్టేందుకు రాశారు. ముందుమాటలో దీన్ని గ్రాంథికంలోకి మార్చి ప్రదర్శించవద్దని నటులు, దర్శకులను విజ్ఞప్తి చేశారాయన.

పాత్రలు[మార్చు]

  • అంబ : కథానాయిక
  • అంబిక
  • అంబాలిక
  • కాశీరాజు : అంబాంబికాంబాలికల తండ్రి
  • సాళ్వరాజు : అంబ కోసము భీష్మునితో యుద్ధముచేసిన రాజు
  • భీష్ముడు : కథానాయకుడు
  • పరశురాముడు : భీష్ముని గురువు
  • కుబేరుడు
  • స్థూలకర్ణుడు : కుబేరుని వనపాలకుడు
  • అర్జునుడు
  • కృష్ణుడు
  • శిఖండి : అంబ పునర్జన్మము పొందినవాడు, ద్రుపదరాజు పుత్రుడు
  • దేవదూత
  • రెండు పిశాచములు
  • పప్పుశాస్త్రి, నేతావధానులు : ఇద్దరు బ్రాహ్మణులు

మూలాలు[మార్చు]