పర్షియా సామ్రాజ్యం
Achaemenid Empire | |
|---|---|
| 550–330 BC | |
Greatest territorial extent of the Achaemenid Empire, achieved during the reign of Darius the Great (522–486 BC)[2][3][4][5] | |
| రాజధాని |
|
| సామాన్య భాషలు | |
| మతం | Zoroastrianism (official) |
| ప్రభుత్వం | Monarchy |
| Monarchs[b] | |
• 559–530 BC | Cyrus the Great |
• 530–522 BC | Cambyses II |
• 522–522 BC | Bardiya |
• 522–486 BC | Darius the Great |
• 486–465 BC | Xerxes I |
• 465–424 BC | Artaxerxes I |
• 424–424 BC | Xerxes II |
• 424–423 BC | Sogdianus |
• 423–405 BC | Darius II |
• 405–358 BC | Artaxerxes II |
• 358–338 BC | Artaxerxes III |
• 338–336 BC | Artaxerxes IV |
• 336–330 BC | Darius III |
• 330–329 BC | Artaxerxes V |
| చారిత్రిక కాలం | Classical antiquity |
| 550 BC | |
| 547 BC | |
| 539 BC | |
| 535–518 BC | |
| 525 BC | |
| 513 BC | |
| 499–449 BC | |
| 484 BC | |
| 395–387 BC | |
| 372–362 BC | |
| 343 BC | |
| 330 BC | |
| విస్తీర్ణం | |
| 500 BC[12][13][14] | 5,500,000 km2 (2,100,000 sq mi) |
| జనాభా | |
• 500 BC[15] | 17 million to 35 million |
| ద్రవ్యం | Daric, siglos |
| |
అకెమెనిడ్ సామ్రాజ్యం[c] (/əˈkiːmənɪd/ ə-KEE-mə-nid; Old Persian: 𐎧𐏁𐏂, Xšāça,| 'సామ్రాజ్యం'[19] లేదా 'రాజ్యం' అని పిలిచేవారు) అనేది క్రీ.పూ. 550లో అకెమెనిడు రాజవంశంకు చెందిన సైరసు ది గ్రేటుచే స్థాపించబడిన ఒక ప్రాచీన ఇరానియను సామ్రాజ్యం. దాని ఉచ్ఛస్థితిలో దాని ప్రాదేశిక విస్తీర్ణం సుమారుగా 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇది దాని కాలంలోని అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. ఇరానియను పీఠభూమిలో కేంద్రీకృతమై ఉన్న ఈ సామ్రాజ్యం, పశ్చిమాన బాల్కన్సు, ఈజిప్టు నుండి తూర్పున సింధు లోయ వరకు విస్తరించి ఉంది. ఇందులో అనటోలియా, సైప్రసు, మెసొపొటేమియా, లెవంతు, తూర్పు అరేబియాలోని కొన్ని భాగాలు, మధ్య ఆసియాలోని పెద్ద భాగాలు కూడా ఉన్నాయి.[12][13][14]
క్రీ.పూ. 7వ శతాబ్దానికి, ఇరానియను పీఠభూమి నైరుతి భాగంలో ఉన్న పెర్సిసు ప్రాంతంలో పర్షియన్లు స్థిరపడ్డారు.[20] పెర్సిసు నుండి సైరసు ఉద్భవించి మెడియా, లిడియా, నవ్య బాబిలోనియను సామ్రాజ్యాన్ని ఓడించాడు. తద్వారా ప్రాచీన సమీప ప్రాచ్యంలో ఒక కొత్త సామ్రాజ్య పాలన స్థాపనకు నాంది పలికాడు. చాలా ప్రాంతాలలో దీని విజయాలు విజయవంతమైనప్పటికీ గ్రీసులోకి విస్తరించడానికి అకెమెనిడు సామ్రాజ్యం చేసిన ప్రయత్నాలు దశాబ్దాల యుద్ధాలు, పలువురు రాజుల కాలంలో అత్యంత కష్టతరంగా మారాయి. చివరికి గ్రీకు ప్రధాన భూభాగంలో దాని ఓటమికి దారితీశాయి.
క్రీ.పూ. 330లో, క్రీ.పూ. 336లో ప్రారంభమైన సైనిక దండయాత్ర మధ్యలో అలెగ్జాండర్ ది గ్రేట్ అకెమెనిడు సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించి దానిని తన మాసిడోనియన్ సాంరాజ్యంలో విలీనం చేసుకున్నాడు. క్రీ.పూ. 323లో అలెగ్జాండరు మరణం జరిగింది. ఇది హెలెనిస్టికు కాలం ప్రారంభానికి దారితీసింది. తరువాత పూర్వ అకెమెనిడు సామ్రాజ్య భూభాగాలలో అధిక భాగం సెల్యూసిడ్ సామ్రాజ్యం, టోలెమికు రాజ్య పాలనలోకి వచ్చాయి. దాదాపు ఒక శతాబ్దం తరువాత మధ్య పీఠభూమిలోని ఇరానియను ఉన్నత వర్గాలు సెల్యూసిడుల నుండి అధికారాన్ని విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుని పార్థియన్ సామ్రాజ్యం స్థాపించాయి. ఇది ఇరానియను ససానియన్ సామ్రాజ్యందాని స్థానంలోకి వచ్చే వరకు దాదాపు అర్ధ సహస్రాబ్దం పాటు కొనసాగింది.
ఆధునిక యుగంలో అకెమెనిడు సామ్రాజ్యం దాని కేంద్రీకృత అధికార యంత్రాంగం, పరిపాలన కోసం గుర్తింపు పొందింది; దాని బహుళ సాంస్కృతిక విధానం, మత సహనం, ముఖ్యంగా సైరసు పాలనలో; రాయలు రోడ్, వ్యవస్థీకృత తపాలా వ్యవస్థ వంటి దాని సంక్లిష్ట మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు; దాని భూభాగాల అంతటా అధికారిక భాషలైన పర్షియను, అరామికు భాషల వాడకం; ఒక పౌర సేవ, ఒక పెద్ద, వృత్తిపరమైన సైన్యం, నావికాదళం అభివృద్ధి. ఈ వ్యవస్థలలో చాలా వాటిని గ్రీకో-రోమను ప్రపంచంలో, వెలుపల ఉన్న అనేక తరువాతి సామ్రాజ్యాలు స్వీకరించి, విస్తరించాయి.
పద వ్యుత్పత్తి
[మార్చు]అకెమెనిడు సామ్రాజ్యానికి అకెమెనిడు రాజవంశ స్థాపకుడిగా భావించబడే అకెమెనెసు పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. 'అకెమెనిడు' అనే పదానికి "అకెమెనిసు/అకెమెనెస కుటుంబానికి చెందినది" అని అర్థం (Old Persian: 𐏃𐎧𐎠𐎶𐎴𐎡𐏁, romanized: Haxāmaniš;[21] దీనిని "స్నేహితుని మనస్సు కలిగినవాడు" అని అనువదించగల ఒక బహువ్రీహి సమాసం). అకెమెనెసు స్వయంగా క్రీ.పూ. ఏడవ శతాబ్దంలో నైరుతి ఇరాన్లోని అన్షాను ప్రాంతానికి చెందిన ఒక చిన్న పాలకుడు. ఆయన అస్సిరియాకు సామంతుడు.
క్రీ.పూ. 850 ప్రాంతంలో సామ్రాజ్యాన్ని ప్రారంభించిన అసలైన సంచార జాతి ప్రజలు తమను తాము 'పార్సా' అని, వారి నిరంతరం మారుతున్న భూభాగాన్ని 'పార్సువా' అని పిలుచుకున్నారు. ఇది చాలా వరకు పెర్సిసు చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. [20] "పర్షియా" అనే పేరు గ్రీకు, లాటిను ఉచ్చారణ. ఇది పెర్సిసు (పురాతన పర్షియను: 𐎱𐎠𐎼𐎿, రోమనైజ్డు: పర్స) నుండి ఉద్భవించిన ప్రజల దేశాన్ని సూచించే స్థానిక పదం).[22]పాత పర్షియను పదం 𐎧𐏁𐏂 Xšāça, అక్షరాలా "రాజ్యం" అని అర్థం.[23] వారి బహుళజాతి రాజ్యంచే ఏర్పడిన సామ్రాజ్యాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. [24]
చరిత్ర
[మార్చు]అకెమెనిడు రాజవంశం మూలం
[మార్చు]
పర్షియను జాతిలో ఇక్కడ జాబితా చేయబడిన అనేక తెగలు ఉన్నాయి. ... : పసార్గడే, మరాఫీ, మాస్పియి, వీటి మీద మిగిలిన అన్ని తెగలు ఆధారపడి ఉన్నాయి. వీరిలో, పసార్గడే అత్యంత విశిష్టమైనవారు; వారిలో అకెమెనిడ్ల వంశం ఉంది. దాని నుండే పర్షియను రాజులు ఉద్భవించారు. ఇతర తెగలు పాంథియాలీ, డెరుసియాయీ, జెర్మానీ, వీరందరూ భూమికి అనుబంధంగా ఉన్నారు. మిగిలిన వారు—డై, మార్డి, డ్రోపిసి, సగార్టి—సంచార జాతులు.
— హెరోడోటసు, చరిత్రలు 1.101 & 125
అకెమెనిడు సామ్రాజ్యాన్ని సంచార పర్షియన్లు సృష్టించారు. పర్షియన్లు ఇరానియను ప్రజలు. వీరు క్రీ.పూ. 1000 ప్రాంతంలో నేటి ఇరాన్కు వచ్చి, స్థానిక ఎలామైటులతో పాటు వాయువ్య ఇరాన్, జాగ్రోసు పర్వతాలు, పెర్సిసుతో సహా ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. పర్షియన్లు వాస్తవానికి పశ్చిమ ఇరానియన్ పీఠభూమిలో సంచార పశుపోషకులు. అకెమెనిడు సామ్రాజ్యం మొదటి ఇరానియన్ సామ్రాజ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇరానియను ప్రజల మరొక సమూహమైన మేడీలు, అస్సిరియన్లను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించినప్పుడు బహుశా ఒక స్వల్పకాలిక సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండవచ్చు.[25]
అకెమెనీడ్లు ప్రారంభంలో ఆధునిక మర్వుదాష్తు నగరానికి సమీపంలో ఉన్న అన్షాను అనే ఎలామైటు నగరాన్ని పాలించారు;[26] "అన్షాను రాజు" అనే బిరుదు అంతకు ముందు ఉన్న ఎలామైటు బిరుదు "సూసా, అన్షాను రాజు" నుండి స్వీకరించబడింది.[27] అన్షాను తొలి రాజుల గుర్తింపుల గురించి విభిన్న కథనాలు ఉన్నాయి. సైరసు సిలిండరు (అకెమెనీడ్ల అత్యంత పురాతన వంశావళి) అభిప్రాయం ప్రకారం అన్షాను రాజులు టెస్పెస 1వ సైరసు, 1వ కంబైసెస, సైరస ఆయన మహానుభావుడైన సైరసు అని కూడా పిలువబడ్డాడు. ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[26] తరువాత మహానుభావుడైన డారియసు వ్రాయించిన బెహిస్తును శాసనం, టెస్పెసు అకెమెనెసు కుమారుడని, డారియసు కూడా వేరే వంశక్రమం ద్వారా టెస్పెసు వారసుడని పేర్కొంది. కానీ అంతకు ముందు ఏ గ్రంథాలలోనూ అకెమెనెసు ప్రస్తావన లేదు.[28] హెరోడోటసు చరిత్రలు మహానుభావుడైన సైరసు 1వ కంబైసెస మెడియా సామ్రాజ్యపు రాజు అస్టియాజెసు కుమార్తె అయిన మండేను ఆఫ్మెడియా కుమారుడని ఆయన రాశాడు.[29]
క్రీ.పూ. 550వ దశకం
[మార్చు]సైరసు క్రీ.పూ. 553లోమెడయా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. క్రీ.పూ. 550లో మెడెసును ఓడించి, అస్టియాజెసును బంధించి,మెడియా రాజధాని నగరం అయిన ఎక్బటానాను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు. [30][31][32] ఎక్బటానా మీద నియంత్రణ సాధించిన తర్వా సైరసు తనను తాను అస్టియాజెసు వారసుడిగా ప్రకటించుకుని మొత్తం సామ్రాజ్యం మీద నియంత్రణ సాధించాడు.[33] అస్టియాజెసు సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందడం ద్వార ఆయను మేడీయన్లకు లిడియా, నవ్య-బాబిలోనియను సామ్రాజ్యం రెండింటితో ఉన్న ప్రాదేశిక వివాదాలను కూడా వారసత్వంగా పొందాడు.[34]
క్రీ.పూ. 540లు
[మార్చు]లిడియా రాజు క్రోసెసు ఆసియా మైనరులో గతంలో మేడీయన్ల భూభాగంగా ఉన్న ప్రాంతంలోకి ముందుకు సాగడం ద్వారా ఈ కొత్త అంతర్జాతీయ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాడు.[35] సైరసు ఒక ప్రతిదాడికి నాయకత్వం వహించాడు. అది క్రోసెసు సైన్యాలను తిప్పికొట్టడమే కాకుండ క్రీ.పూ. 546లో సార్డిసు నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి, లిడియను రాజ్యం పతనానికి కూడా దారితీసింది. సైరసు లిడియాలో కప్పం వసూలు చేసే బాధ్యతను పాక్టీసుకు అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ సైరసు వెళ్ళిపోయిన తర్వాత పాక్టీసు ఆయకున వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించాడు. సైరసు ఈ తిరుగుబాటును అణచివేయడానికిమెడియానుు సేనాధిపతి మజారేసును పంపాడు. పాక్టీసు పట్టుడి మరణించాడు. ఆయన మరణానంతరంమజారెసు హర్పగసు, తిరుగుబాటులో పాల్గొన్న అన్ని నగరాలను లొంగదీసుకోవడం ప్రారంభించారు. లిడియాను లొంగదీసుకోవడానికి మొత్తం మీద సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది.
ఎక్బటానాలో అధికారం మేడీల నుండి పర్షియన్లకు మారినప్పుడ మేడియను సామ్రాజ్యానికి కప్పం చెల్లించే అనేక రాజ్యాలు తమ పరిస్థితి మారిందని భావించి సైరసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. ఇది సైరసును మధ్య ఆసియాలోని బాక్ట్రియా, సకా సంచార జాతులతో యుద్ధాలు చేయడానికి బలవంతం చేసింది. ఈ యుద్ధాల సమయంలో సైరసు మధ్య ఆసియాలో సైరోపోలితో సహా అనేక సైనిక స్థావర పట్టణాలను స్థాపించాడు.
క్రీ.పూ. 530వ దశకం
[మార్చు]క్రీ.పూ. 547 - 539 మధ్య పర్షియా-బాబిలోను సంబంధాల గురించి ఏమీ తెలియదు. కానీ క్రీ.పూ. 540–539 యుద్ధానికి, బాబిలోను పతనానికి ముందు అనేక సంవత్సరాల పాటు ఈ రెండు సామ్రాజ్యాల మధ్య శత్రుత్వం ఉండే అవకాశం ఉంది.[36] క్రీ.పూ. 539 అక్టోబరులో సైరసు ఓపిసు వద్ద బాబిలోనియను మీద ఒక యుద్ధంలో విజయం సాధించాడు. ఆ తర్వాత ఎలాంటి పోరాటం లేకుండానే సిప్పారును స్వాధీనం చేసుకున్నాడు. చివరకు అక్టోబరు 12న బాబిలోను నగరాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ బాబిలోనియను రాజు నబోనిడసు బందీగా పట్టుబడ్డాడు.[37] నగరం మీద నియంత్రణ సాధించిన తర్వా, సైరసు తనపోరాటంలో, మర్దూకుకు బదులుగా సిన్ ఆరాధనను ప్రోత్సహించిన నబోనిడసు ద్వారా భంగం కలిగిన దైవిక క్రమాన్ని పునరుద్ధరించినట్లుగా తనను తాను చిత్రీకరించుకున్నాడు.[38][39][40] అస్సిరియను రాజు అషురుబనిపాలుతో తనను తాను పోల్చుకోవడం ద్వారా నవ్య-నియో-అస్సిరియను సామ్రాజ్యం వారసత్వాన్ని పునరుద్ధరించినట్లుగా కూడా తనను తాను చిత్రీకరించుకున్నాడు.[41][42][43] సైరసు యూదా ప్రజలను వారి ప్రవాసం నుండి విముక్తి చేసినందుకు. రెండవ దేవాలయంతో సహా జెరూసలేంలోని చాలా భాగాన్ని పునర్నిర్మించడానికి అధికారం ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందాడు.[43]

క్రీ.పూ. 520లు
[మార్చు]క్రీ.పూ. 530లో సైరసు మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు 2వ కంబైసెసు ఆయన వారసుడయ్యాడు. అయితే ఆయన చిన్న కుమారుడు బార్డియా[d] మధ్య ఆసియాలో ఆయనకు ఒక పెద్ద భూభాగం లభించింది.[46][47] క్రీ.పూ. 525 నాటికి కాంబైసెసు ఫోయెనీషియా సైప్రసులను విజయవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కొత్తగా సృష్టించబడిన పర్షియను నావికాదళంతో ఈజిప్టు మీద దండెత్తడానికి సన్నాహాలు చేస్తున్నాడు.[48][49] ఫారో 2వ అమాసిసు 526లో మరణించాడు. ఆయన తర్వాత 3వ ప్సామ్టికు సింహాసనాన్ని అధిష్టించాడు. దీని ఫలితంగా ఈజిప్టు ముఖ్య మిత్రులు పర్షియన్ల పక్షాన చేరారు.[49] ప్సామ్టికు తన సైన్యాన్ని నైలు డెల్టాలోని పెలుసియం వద్ద మోహరించాడు. పెలుసియం యుద్ధంలో పర్షియన్ల చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయి మెంఫిసుకు పారిపోయాడు. అక్కడ పర్షియన్లు ఆయనను ఓడించి బందీగా పట్టుకున్నారు. విఫలమైన తిరుగుబాటుకు ప్రయత్నించిన తర్వాత 3వ ప్సామ్టికు వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు.[43][50]
హెరోడోటసు, కాంబైసెసు ఈజిప్టు ప్రజలకు, వారి దేవతలకు, ఆచారాలకు, దేవాలయాలకు, పూజారులకు బహిరంగంగా వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించబడింది. ప్రత్యేకించి పవిత్రమైన ఎద్దు అపిసు హత్య గురించి నొక్కి చెప్పాడు.[51] ఈ చర్యలు ఆయనకు ఒక పిచ్చిని కలిగించాయని దానివలన ఆయన తన సోదరుడు బార్దియాను (హెరోడోటసు ప్రకారం రహస్యంగా చంపబడ్డాడు),[52] తన సొంత సోదరి-భార్యను (లిడియాకు చెందిన క్రోససు) చంపాడని ఆయన చెప్పాడు.[53] .[54] ఆ తర్వాత కాంబైసెసు పూర్తిగా తన మానసిక సమతుల్యతను కోల్పోయాడని ఆయన ముగించాడు. [55] తర్వాతి శాస్త్రీయ రచయితలందరూ కాంబైసెసు భక్తిహీనత పిచ్చి అనే ఇతివృత్తాలను పునరావృతం చేశారు. అయితే ఇది తప్పుడు సమాచారం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే క్రీ.పూ. 524 నాటి అపిస్ సమాధి శాసనం కాంబైసెసు ఫారోగా తనను తాను ప్రకటించుకుంటూ అపిసు అంత్యక్రియలలో పాల్గొన్నట్లు చూపిస్తుంది.
ఈజిప్టును జయించిన తర్వాత ప్రస్తుత తూర్పు లిబియాలోని (సైరెనైకా) లిబియన్లు సైరీను, బార్కా నగరాల గ్రీకులు పోరాటం లేకుండానే కాంబైసెస్కు లొంగిపోయి కప్పం చెల్లించారు. కాంబైసెసు ఆ తర్వాత కార్తేజు, అమ్మోను ఒయాసిసు, ఇథియోపియా మీద దండయాత్రలకు ప్రణాళిక వేశాడు. కాంబైసెసు నౌకాదళంలో అధిక భాగం ఉన్న ఫోనీషియన్లు తమ సొంత ప్రజల మీద ఆయుధాలు పట్టడానికి నిరాకరించినందున కార్తేజు మీద నావికా దండయాత్ర రద్దు చేయబడిందని హెరోడోటసు పేర్కొన్నాడు. కానీ ఆధునిక చరిత్రకారులు కార్తేజు మీద దండయాత్ర అసలు ప్రణాళిక చేయబడిందా లేదా అనే దాని మీద సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కంబైసెసు తన ప్రయత్నాలను ఇతర రెండు సైనిక దండయాత్రల మీద కేంద్రీకరించాడు. మెరోయి రాజ్యాన్ని జయించడం ద్వారా, పశ్చిమ ఒయాసిసులలో వ్యూహాత్మక స్థానాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆఫ్రికాలో సామ్రాజ్యం వ్యూహాత్మక స్థానాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ఉద్దేశ్యంతో ఆయన ఎలిఫాంటైనులో ప్రధానంగా యూదు సైనికులతో కూడిన ఒక సైనిక స్థావరాన్ని స్థాపించాడు. వారు కంబైసెసు పాలన అంతటా ఎలిఫాంటైనులోనే మోహరించి ఉన్నారు. హెరోడోటసు అభిప్రాయం ప్రకారంకంబైసెసు పిచ్చి ఆయన సైనికులకు సరఫరాల కొరత కారణంగా ఇథియోపియా మీద దండయాత్ర విఫలమైంది. కానీ పురావస్తు ఆధారాలు ఈ దండయాత్ర విఫలం కాలేదని సూచిస్తున్నాయి. ఈజిప్టు కుష్ సరిహద్దులో ఉన్న నైలు నది రెండవ జలపాతం వద్ద ఉన్న ఒక కోట అకెమెనిడు కాలమంతటా వాడుకలో ఉంది. అంతేకాకుండా డారియసు రెండు శాసనాలలో నుబియా సామ్రాజ్యంలో ఒక భూభాగంగా జాబితా చేయబడింది, డారియసు సామ్రాజ్యంలోని భూభాగాలను దృశ్యమానంగా ప్రదర్శించే పెర్సెపోలిసులోని అపడానా శిల్పాలలో ఒక నుబియను ప్రతినిధి బృందం చిత్రీకరించబడింది. ఇవన్నీ నుబియాను లొంగదీసుకోవడంలో కంబైసెసు విజయం సాధించాడని సూచిస్తున్నాయి.
కంబైసెసు మరణం, బార్డియా వారసత్వానికి సంబంధించిన సంఘటనల గురించి అనేక విరుద్ధమైన కథనాలు ఉన్నందున వాటి మీద తీవ్ర చర్చ జరుగుతోంది. హెరోడోటసు అభిప్రాయం ప్రకారం బార్డియా హత్య రహస్యంగా జరిగినందున చాలా మంది పర్షియన్లు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్మారు. ఇది ఇద్దరు మాగీలు కాంబైసెస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వీలు కల్పించింది. వారిలో ఒకరు సింహాసనం మీద కూర్చుని, వారి అద్భుతమైన శారీరక పోలిక, ఒకే పేరు (హెరోడోటసు వృత్తాంతాలలో స్మెర్డిసు[d]) కారణంగా బార్దియాగా నటించగలిగాడు. [56]కాంబైసెసు బార్దియాను చంపించినప్పుడు అద్భుతమైన శారీరక పోలిక కారణంగా వెంటనే స్ఫెండడేట్సు అనే మాగీని ఆయన స్థానంలో బాక్ట్రియాకు సాత్రపుగా నియమించాడని క్టేసియాసు రాశాడు.[57] ఆ తర్వాత కాంబైసెసు ఇద్దరు విశ్వసనీయులు కుట్ర పన్ని కాంబైసెస్ను పదవీచ్యుతుడిని చేసి బార్దియా ముసుగులో స్ఫెండడేటును సింహాసనం మీద కూర్చోబెట్టారు.[58]తర్వాతి రాజు మహాయోధుడు డారియసు వ్రాయించిన బెహిస్తును శాసనం ప్రకారం గౌమత అనే ఒక మాగసు బర్దియాగా నటిస్తూ పర్షియాలో విప్లవాన్ని ప్రేరేపించాడు.[44] తిరుగుబాటు కచ్చితమైన పరిస్థితులు ఏవైనప్పటికీ కంబైసెసు క్రీ.పూ. 522 వేసవిలో దాని గురించి విని ఈజిప్టు నుండి తిరిగి రావడం ప్రారంభించాడు. కానీ సిరియాలో ఆయన తొడకు గాయమైంది. గ్యాంగ్రీను కారణంగా మరణించాడు. దాంతో బర్దియా వేషధారి రాజు అయ్యాడు.[59]. డేరియసు చెప్పిన వృత్తాంతం అన్నింటికంటే పురాతనమైనది. తరువాతి చరిత్రకారులందరూ ఒక మాగసు బార్దియాగా నటిస్తూ సింహాసనాన్ని అధిష్టించాడనే కథలోని కీలక వివరాల మీద ఏకీభవించినప్పటికీ ఇది డేరియసు తన సింహాసన ఆక్రమణను సమర్థించుకోవడానికి సృష్టించిన కథ అయి ఉండవచ్చు. [60] ఇరానియాలజిస్టు పియెరు బ్రియాంటు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం బార్దియాను కాంబైసెసు చంపలేదు. కానీ క్రీ.పూ. 522 వేసవిలో ఆయన మరణం వరకు వేచి ఉండి, సింహాసనం మీద తన చట్టబద్ధమైన హక్కును పొందడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అప్పటికి ఆయన అకెమెనిడు రాజవంశంలో ఏకైక పురుష వారసుడు. రాజకుటుంబం. బ్రియాంటు ఇలా అంటారు. డారియసు చేసిన మోసం అనే పరికల్పన ఈ రోజులలో సాధారణంగా అంగీకరించబడినప్పటికీ. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యాల దృష్ట్యా, ఈ సమయంలో ఏదీ కచ్చితంగా నిరూపించబడలేదు".[61]

బెహిస్తును శాసనం ప్రకారం గౌమత క్రీ.పూ. 522లో మహానుభావుడైన డారియసు (పాత పర్షియను Dāryavuš, "మంచిని దృఢంగా పట్టుకునేవాడు", Darayarahush అని కూడా పిలువబడ్డాడు) చేతిలో పదవీచ్యుతుడు కావడానికి ముందు ఏడు నెలల పాటు పరిపాలించాడు. మాగీలు హింసకు గురైనప్పటికీ వారి ఉనికి కొనసాగింది. మొదటి నకిలీ స్మెర్డిసు (Gaumata) మరణించిన ఒక సంవత్సరం తర్వాత, రెండవ నకిలీ స్మెర్డిసు (Vahyazdāta) తిరుగుబాటుకు ప్రయత్నించాడు. ఈ తిరుగుబాటు ప్రారంభంలో విజయవంతమైనప్పటికీ చివరికి విఫలమైంది.[62]
హెరోడోటసు ఇలా వ్రాశాడు[63] ఆ సామ్రాజ్యానికి ఉత్తమమైన ప్రభుత్వ రూపం గురించి స్థానిక నాయకత్వం చర్చించిందని.
క్రీ.పూ. 510లు
[మార్చు]512–511లో మాసిడోనియను రాజు 1వ అమింటాసు తన దేశాన్ని పర్షియన్లకు అప్పగించినప్పటి నుండి మాసిడోనియన్లు పర్షియన్లు కూడా అపరిచితులుగా లేరు. 513లో డారియసు ది గ్రేటు (521–486) ప్రారంభించిన పర్షియను సైనిక కార్యకలాపాలలో మాసిడోనియాను స్వాధీనం చేసుకోవడం ఒక భాగం - అపారమైన సన్నాహాల తర్వాత - ఒక భారీ అచెమెనిడు సైన్యం బాల్కన్ల మీద దాడి చేసి డానుబే నదికి ఉత్తరాన తిరుగుతున్న యూరోపియను సిథియన్లను ఓడించడానికి ప్రయత్నించింది. [64] డారియసు సైన్యం ఆసియా మైనరుకు తిరిగి రాకముందే అనేక మంది థ్రేసియను ప్రజలను నల్ల సముద్రం యూరోపియను భాగాన్ని తాకిన ఆధునిక బల్గేరియా, రొమేనియా, ఉక్రెయిను, రష్యా వంటి అన్ని ఇతర ప్రాంతాలను లొంగదీసుకుంది. [64][65] డారియసు తన కమాండర్లలో ఒకరైన మెగాబాజసును యూరపులో వదిలిపెట్టాడు. ఆయన పని బాల్కన్లలో విజయాలు సాధించడం. [64] పర్షియను దళాలు బంగారంతో కూడిన థ్రేసు తీరప్రాంత గ్రీకు నగరాలను లొంగదీసుకున్నాయి. శక్తివంతమైన పెయోనియన్లను ఓడించి జయించాయి.[64][66][67] చివరగా మెగాబాజసు పర్షియను ఆధిపత్యాన్ని అంగీకరించాలని డిమాండు చేస్తూ అమినాసుకు రాయబారులను పంపాడు. మాసిడోనియన్లు కూడా అలాగే చేశారు. బహుళ జాతి అకేమెనిడు సైన్యానికి బాల్కన్లు చాలా మంది సైనికులను అందించారు. అమింటాసు కుమార్తె గైగేయాను వివాహం చేసుకున్న పర్షియను అధికారి బుబారెసు వంటి అనేక మంది మాసిడోనియను, పర్షియను ఉన్నత వర్గాల వారు అంతర్వివాహం చేసుకున్నారు. మాసిడోనియను పాలకులు అమినాసు, అలెగ్జాండరు బుబారెసుతో ఆనందించిన కుటుంబ సంబంధాలు పర్షియను రాజులు డారియసు, 1వ జెర్క్సెసుతో వారికి మంచి సంబంధాలను కల్పించాయి. వీరిని జెర్క్సెసు ది గ్రేటు అని కూడా పిలుస్తారు. పెర్షియను దండయాత్ర పరోక్షంగా మాసిడోనియా అధికారంలో ఎదగడానికి దారితీసింది. పర్షియా బాల్కన్లలో కొన్ని సాధారణ ప్రయోజనాలను కలిగి ఉంది; పర్షియను సహాయంతో మాసిడోనియన్లు పెయోనియన్లు గ్రీకులు వంటి కొన్ని బాల్కను తెగల ఖర్చుతో చాలా లాభపడ్డారు. మొత్తం మీద, మాసిడోనియన్లు "ఇష్టపూర్వకంగా, ఉపయోగకరమైన పర్షియను మిత్రులు. 1వ జెర్క్సెసు సైన్యంలో మాసిడోనియను సైనికులు ఏథెన్సు, స్పార్టాతో పోరాడారు." [64] పర్షియన్లు గ్రీకులు, మాసిడోనియన్లు ఇద్దరినీ యౌనా ("అయోనియన్లు", వారి పదం "గ్రీకులు"), మాసిడోనియన్లను ప్రత్యేకంగా యౌనా టకాబారా లేదా "కవచాల వలె కనిపించే టోపీలు కలిగిన గ్రీకులు" అని పిలిచారు. బహుశా మాసిడోనియను కౌసియా టోపీని సూచిస్తుంది. [68]

క్రీ.పూ. 5వ శతాబ్దం
[మార్చు]క్రీ.పూ. 5వ శతాబ్దానికి, పర్షియా రాజులు కేవలం మొత్తం పర్షియను పీఠభూమిని, పూర్వం నియో-అస్సిరియన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న అన్ని భూభాగాలను (మెసొపొటేమియా లెవంతు, సైప్రసు, పర్షియను ఈజిప్టు) మాత్రమే కాకుండా దీనికి మించి మొత్తం అనటోలియా, అర్మేనియా, అలాగే దక్షిణ కాకససు, ఉత్తర కాకససు, అజరుబైజాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, బల్గేరియా, పేయోనియా, థ్రేసు, మాసిడోనియాలోని కొన్ని భాగాలను ఉత్తరాన, పశ్చిమాన, నల్ల సముద్ర తీర ప్రాంతాలలో చాలా వరకు, మధ్య ఆసియాలోని కొన్ని భాగాలను అరలు సముద్రం వరకు ఉత్తరాన, ఈశాన్యంలో అము దర్యా, సిర్ దర్యా నదుల వరకు, సుదూర తూర్పున హిందూ కుష్, పశ్చిమ సింధు నదీ పరీవాహక ప్రాంతం (ఆధునిక ఆఫ్ఘనిస్తాను, పాకిస్తానుకు అనుగుణంగా), దక్షిణాన ఉత్తర అరేబియాలోని కొన్ని భాగాలను, నైరుతిలో తూర్పు ప్రాచీన లిబియా (సైరెనైకా)లోని కొన్ని భాగాలను, ఒమన్, చైనా, యుఎఇలోని కొన్ని భాగాలను కూడా పరిపాలిస్తున్నారు లేదా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.[69][70][71][72][73][74][75]
గ్రీకో-పర్షియను యుద్ధాలు
[మార్చు]
క్రీ.పూ. 499లో జరిగిన ఐయోనియను తిరుగుబాటు, ఏయోలిసు, డోరిసు, సైప్రసు, కారియా ప్రాంతాలలో జరిగిన సంబంధిత తిరుగుబాట్లు, క్రీ.పూ. 499 నుండి 493 వరకు పర్షియను పాలనకు వ్యతిరేకంగా ఆసియా మైనరు లోని అనేక ప్రాంతాలు చేసిన సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఆసియా మైనరులోని గ్రీకు నగరాలు తమను పాలించడానికి పర్షియా నియమించిన నిరంకుశ పాలకుల మీద అసంతృప్తి చెందడం అలాగే మిలేటసుకు చెందిన ఇద్దరు నిరంకుశ పాలకులైన హిస్టియసు, అరిస్టాగోరసు, వ్యక్తిగత చర్యలు. క్రీ.పూ. 499లో అప్పటి మిలేటసు పాలకుడైన అరిస్టాగోరసు మిలేటసులో తన ఆర్థిక, ప్రతిష్టాపరమైన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో, పర్షియను సాత్రపు ఆర్టాఫెర్నెసుతో కలిసి నాక్సోసును జయించడానికి ఒక సంయుక్త దండయాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర ఘోరంగా విఫలమైంది. పాలకుడిగా తన పదవి నుండి తొలగింపు అనివార్యమని గ్రహించిన అరిస్టాగోరసు, సాధారణంగా డారియసు ది గ్రేటు అని పిలువబడే పర్షియను రాజు మొదటి డారియసుకు వ్యతిరేకంగా మొత్తం అయోనియాను తిరుగుబాటుకు పురికొల్పాలని నిర్ణయించుకున్నాడు.
పర్షియన్లు తమను ప్రతిఘటిస్తున్న పశ్చిమ తీరంలోని నగరాలను లొంగదీసుకోవడం కొనసాగించారు. చివరకు క్రీ.పూ. 493లో అయోనియా మీద ఒక శాంతి ఒప్పందాన్ని విధించారు. ఇది సాధారణంగా న్యాయమైనదిగా. నిష్పక్షపాతమైనదిగా పరిగణించబడింది. అయోనియను తిరుగుబాటు గ్రీసు, అకెమెనిడు సామ్రాజ్యం మధ్య మొదటి ప్రధాన సంఘర్షణగా నిలిచింది. ఈ విధంగా గ్రీకో-పర్షియను యుద్ధాల మొదటి దశను సూచిస్తుంది. ఆసియా మైనరు తిరిగి పర్షియన్ల ఆధీనంలోకి తీసుకురాబడింది. కానీ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చినందుకు ఏథెన్సు, ఎరెట్రియాను శిక్షించాలని డారియసు ప్రతిన పూనాడు.[76] అంతేకాకుండా గ్రీసులోని రాజకీయ పరిస్థితి తన సామ్రాజ్యం స్థిరత్వానికి నిరంతర ముప్పుగా ఉందని గ్రహించి ఆయన మొత్తం గ్రీసును జయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ దండయాత్రలో మొదటి పోరాటం బాల్కను ద్వీపకల్పంలోని భూభాగాలను తిరిగి సామ్రాజ్యంలోకి తీసుకురావడం.[77] అయోనియను తిరుగుబాటు తరువాత ఈ భూభాగాల మీద పర్షియన్ల పట్టు సడలింది. క్రీ.పూ. 492లో పర్షియను సేనాధిపతి మార్డోనియసు థ్రేసును తిరిగి లొంగదీసుకుని మాసిడోనియాను సామ్రాజ్యంలో పూర్తిగా అధీనంలో ఉన్న భాగంగా మార్చాడు; క్రీ.పూ. 6వ శతాబ్దం చివరలోనే అది ఒక సామంతరాజ్యంగా ఉన్నప్పటికీ గణనీయమైన స్వయంప్రతిపత్తిని నిలుపుకుంది.[77] అయితే, క్రీ.పూ. 490లో మారథాను యుద్ధంలో పర్షియను దళాలు ఏథెన్సు వాసుల చేతిలో ఓడిపోయాయి. గ్రీసు మీద దండయాత్ర చేసే అవకాశం రాకముందే మొదటి డారియసు మరణించాడు.[78]

మొదటి డారియసు కుమారుడైన 1వ జెర్క్సెసు (క్రీ.పూ. 485–465, పాత పర్షియను భాషలో క్షయార్ష "రాజులలో వీరుడు"), ఆ పనిని పూర్తి చేస్తానని ప్రతిన పూనాడు. ఆయన గ్రీసును జయించాలనే లక్ష్యంతో ఒక భారీ దండయాత్రను నిర్వహించాడు. ఆయన సైన్యం క్రీ.పూ. 480 వసంతకాలంలో ఉత్తరం నుండి గ్రీసులో ప్రవేశించింది. మాసిడోనియా, థెస్సాలీ గుండా వెళ్లేటప్పుడు చాలా తక్కువ లేదా ఎటువంటి ప్రతిఘటనను ఎదుర్కోలేదు. కానీ థర్మోపైలే వద్ద ఒక చిన్న గ్రీకు సైన్యం చేతిలో మూడు రోజుల పాటు నిలిచిపోయింది. అదే సమయంలో జరిగిన ఆర్టెమిసియం యుద్ధం వ్యూహాత్మకంగా అనిశ్చితంగా ముగిసింది. ఎందుకంటే పెద్ద తుఫానులు ఇరుపక్షాల ఓడలను నాశనం చేశాయి. థర్మోపైలే వద్ద ఓటమి వార్త గ్రీకులకు తెలియగానే యుద్ధం అకాలంగా ఆగిపోయింది. వారు వెనుదిరిగారు. ఈ యుద్ధం పర్షియన్లకు వ్యూహాత్మక విజయాన్ని అందించింది. వారికి ఆర్టెమిసియం, ఏజియను సముద్రం మీద నిరాటంకమైన నియంత్రణను ఇచ్చింది.[79]
థెర్మోపైలే యుద్ధంలో విజయం సాధించిన తర్వాత జెర్సెసు ఖాళీ చేయబడిన ఏథెన్సు నగరాన్ని దోచుకుని వ్యూహాత్మకమైన కొరింతు భూసంధి, సరోనికు సింధుశాఖ వద్ద గ్రీకులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. క్రీ.పూ. 480లో గ్రీకులు సలామిసు యుద్ధంలో పర్షియను నౌకాదళం మీద నిర్ణయాత్మక విజయం సాధించి జెర్సెసును సార్డిసుకు వెనక్కి తగ్గవలసి వచ్చేలా చేశారు.[80] ఆయన గ్రీసులో మర్డోనియసు ఆధ్వర్యంలో వదిలివెళ్లిన భూ సైన్యం ఏథెన్సును తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ చివరికి క్రీ.పూ. 479లో ప్లాటియా యుద్ధంలో నాశనం చేయబడింది. మైకేలు వద్ద పర్షియన్ల తుది ఓటమి ఆసియాలోని గ్రీకు నగరాలను తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించింది. పర్షియన్లు ఐరోపాలోని తమ భూభాగాలన్నింటినీ కోల్పోయారు. మాసిడోనియా మరోసారి స్వతంత్రంగా మారింది.[64] రాజ అంగరక్షకుల కమాండరు. పర్షియను ఆస్థానంలో అత్యంత శక్తివంతమైన అధికారి అయిన అర్టబానసు, అస్పామిట్రెసు అనే ఒక నపుంసకుడి సహాయంతో జెర్సెసును హత్య చేశాడు.[81][82] జెర్సెసు హత్య జరిగిన కచ్చితమైన సంవత్సరం, తేదీ మీద చరిత్రకారుల మధ్య వివాదం ఉంది.
సాంస్కృతిక దశ - జొరాస్ట్రియను సంస్కరణలు
[మార్చు]1వ జెర్సెసు హత్యకు గురైన తర్వాత ఆయన పెద్ద కుమారుడు 1వ ఆర్టాక్సెర్క్సెసు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన పాలనలోనే ఎలామైటు భాష ప్రభుత్వ భాషగా నిలిచిపోయింది. అరామైకు భాషకు ప్రాముఖ్యత పెరిగింది. బహుశా ఈ పాలనలోనే సౌర క్యాలెండరును జాతీయ క్యాలెండరుగా ప్రవేశపెట్టారు. 1వ ఆర్టాక్సెర్క్సెసు పాలనలో జొరాస్ట్రియనిజం సామ్రాజ్యం వాస్తవ మతంగా మారింది.
యూరిమెడాను యుద్ధంలో (క్రీ.పూ. 469 లేదా 466[83]) పర్షియా ఓడిపోయిన తర్వాత గ్రీసు, పర్షియా మధ్య సైనిక చర్యలు నిలిచిపోయాయి. 1వ ఆర్టాక్సెర్క్సెసు అధికారంలోకి వచ్చినప్పుడు, గ్రీసులోని ఏథెన్సు శత్రువులకు నిధులు సమకూర్చడం ద్వారా వారిని బలహీనపరిచే కొత్త పర్షియను వ్యూహాన్ని ప్రవేశపెట్టాడు. ఇది పరోక్షంగా ఏథెనియన్లు డెలియను లీగు ఖజానాను డెలోసు ద్వీపం నుండి ఏథెనియను అక్రోపాలిసుకు తరలించడానికి కారణమైంది. ఈ నిధుల సమీకరణ పద్ధతి అనివార్యంగా క్రీ.పూ. 450లో తిరిగి పోరాటానికి దారితీసింది. ఇక్కడ గ్రీకులు సైప్రసులో జరిగిన యుద్ధంలో దాడి చేశారు. ఈ దండయాత్రలో సిమోను పెద్దగా ఏమీ సాధించకుండా విఫలమైన తర్వాత క్రీ.పూ. 449లో ఏథెన్సు, ఆర్గాసు, పర్షియా మధ్య కాలియాసు శాంతి ఒప్పందం కుదిరింది.
సలామిసు యుద్ధంలో విజేత అయిన థెమిస్టోక్లిసును ఏథెన్సు నుండి బహిష్కరించిన తర్వాత, ఆర్టాక్సెర్క్సెసు ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించాడు. అంతేకాకుండా, ఆయనకు రొట్టె, మాంసం, వైన్ అందించడానికి ఆర్టాక్సెర్క్సెసు మాగ్నీషియా, మయసు, లాంప్సాకసు అనే ప్రాంతాలను ఇచ్చాడు. అంతేకాకుండా మొదటి ఆర్టాక్సెర్క్సెసు ఆయనకు బట్టలు సమకూర్చడానికి పాలెస్సెప్సిసును ఇచ్చాడు. ఆయన ఇంటికి పరుపుల కోసం పెర్కోటేను కూడా ఇచ్చాడు.[84]

క్రీ.పూ. 424లో సూసాలో ఆర్టాక్సెర్క్సెసు మరణించినప్పుడు ఆయన శరీరాన్ని నఖ్ష్-ఎ రుస్తం నెక్రోపాలిసులో ఆయన కోసం అప్పటికే నిర్మించిన సమాధికి తీసుకువెళ్లారు. రాజులు తాము సజీవంగా ఉన్నప్పుడే తమ సమాధులను నిర్మించడం ప్రారంభించడం పర్షియను సంప్రదాయం. 1వ ఆర్టాక్సెర్క్సెసు తర్వాత వెంటనే ఆయన పెద్ద, ఏకైక చట్టబద్ధమైన కుమారుడు 2వ జెర్క్సెసు సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే సింహాసనం మీద కొన్ని రోజుల తర్వాత ఆయన సవతి సోదరుడు సోగ్డియానసు ఆదేశాల మేరకు ఫర్నాసియాసు, మెనోస్టేన్సు చేత ఆయన తాగి ఉన్నప్పుడు హత్య చేయబడ్డాడు. సోగ్డియానసు తన ప్రాంతాల మద్దతును పొందినట్లు తెలుస్తోంది. సోగ్డియానసు ఆరు నెలల పదిహేను రోజుల పాటు పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన సవతి సోదరుడు ఓచసు, ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను బంధించాడు. గతంలో ఓచసు కత్తితో, విషంతో లేదా ఆకలితో చంపబడడని సోగ్డియానసుకు వాగ్దానం చేసినందున సోగ్డియానసును బూడిదలో ఊపిరాడకుండా చేసి ఉరితీశారు. ఆ తర్వాత ఓచసు 2వ డేరియసు అనే రాజ బిరుదును స్వీకరించాడు. సింహాసనం మీద తన స్థానాన్ని కాపాడుకోవడంలో డేరియసు సామర్థ్యం స్వల్పకాలిక అధికార శూన్యతకు ముగింపు పలికింది.
క్రీ.పూ. 412 నుండి పర్షియాకు చెందిన 2వ డేరియసు, టిస్సాఫెర్నెసు పట్టుదల మేరకు మొదట ఏథెన్సుకు ఆ తర్వాత స్పార్టాకు మద్దతు ఇచ్చాడు. కానీ క్రీ.పూ. 407లో డేరియసు కుమారుడు సైరసు ది యంగరును టిస్సాఫెర్నెసుకు బదులుగా నియమించారు. సహాయం పూర్తిగా స్పార్టాకు ఇవ్వబడింది. ఇది చివరకు క్రీ.పూ. 404లో ఏథెన్సును ఓడించింది. అదే సంవత్సరంలో డారియసు అనారోగ్యానికి గురై బాబిలోనులో మరణించాడు. ఆయన మరణం అమిర్టేయసు అనే ఈజిప్షియను తిరుగుబాటుదారుడికి ఈజిప్టు మీద పర్షియన్ల పాలనను తొలగించడానికి అవకాశాన్ని కల్పించింది. తన మరణశయ్య మీద ఉన్నప్పుడు, డారియసు బాబిలోనియను భార్య పారిసాటిసు తన రెండవ పెద్ద కుమారుడైన సైరసు (ది యంగరు)కు పట్టాభిషేకం చేయమని వేడుకుంది. కానీ డారియసు నిరాకరించాడు. రాణి పారిసాటిసు తన పెద్ద కుమారుడైన 2వ ఆర్టాక్సెర్క్సెసు కంటే సైరసును ఎక్కువగా ఇష్టపడింది. ప్లూటార్కు (బహుశా క్టేసియాసు అధికారం మీద ఆధారపడి) వివరించిన దాని ప్రకారం పదవి కోల్పోయిన టిస్సాఫెర్నెసు కొత్త రాజు పట్టాభిషేక రోజున ఆయన వద్దకు వచ్చి ఆయన తమ్ముడు సైరసు (ది యంగరు) వేడుక సమయంలో ఆయనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని హెచ్చరించాడు. ఆర్టాక్సెర్క్సెసు సైరసును అరెస్టు చేయించాడు. వారి తల్లి పారిసాటిసు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన మరణశిక్ష విధించేవాడు. ఆ తర్వాత సైరసును లిడియాకు సాత్రపుగా తిరిగి పంపారు. అక్కడ ఆయన సాయుధ తిరుగుబాటుకు సన్నాహాలు చేశాడు. సైరసు ఒక పెద్ద సైన్యాన్ని సమీకరించాడు. అందులో పదివేల మంది గ్రీకు కిరాయి సైనికుల బృందం కూడా ఉంది. వారితో సైరసు పర్షియా లోపలికి ముందుకు సాగాడు. క్రీ.పూ. 401లో కునాక్సా వద్ద 2వ ఆర్టాక్సెర్క్సెసు రాజ సైన్యం పర్షియను సైన్యం సైరసు సైన్యాన్ని అడ్డుకుంది. అక్కడ సైరసు చంపబడ్డాడు. జెనోఫోనుతో సహా పదివేల మంది గ్రీకు కిరాయి సైనికులు ఇప్పుడు పర్షియను భూభాగంలో లోపల ఉన్నారు. దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి వారు తమ సేవలను అందించడానికి ఇతరుల కోసం వెతికారు. కానీ చివరికి గ్రీసుకు తిరిగి వెళ్లవలసి వచ్చింది.[85][80][86]
అకెమెనిడు రాజులలో 2వ ఆర్టాక్సెర్క్సెసు అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాజుగా గుర్తించబడ్డాడు. సాపేక్ష శాంతి, స్థిరత్వం నెలకొన్న ఈ 45 సంవత్సరాల కాలంలోనే ఆనాటి అనేక స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి. ఆర్టాక్సెర్క్సెసు రాజధానిని తిరిగి పెర్సెపోలిసుకు మార్చి దానిని ఆయన ఎంతగానో విస్తరించాడు. అలాగే ఎక్బటానాలోని వేసవి రాజధానిని బంగారు పూత పూసిన స్తంభాలు, వెండి, రాగి పలకలతో చేసిన పైకప్పులతో విలాసవంతంగా విస్తరించారు.[87] జొరాస్ట్రియను పుణ్యక్షేత్రాల అసాధారణ ఆవిష్కరణ కూడా ఆయన పాలన కాలానికే చెందినదిగా చెప్పవచ్చు. బహుశా ఈ కాలంలోనే జొరాస్ట్రియనిజం అర్మేనియా నుండి ఆసియా మైనరు, లెవంటు అంతటా వ్యాపించింది. దేవాలయాల నిర్మాణం మతపరమైన ప్రయోజనాన్ని అందించినప్పటికీ అది పూర్తిగా నిస్వార్థమైన చర్య కాదు. ఎందుకంటే అవి ఆదాయానికి ఒక ముఖ్యమైన వనరుగా కూడా పనిచేశాయి. బాబిలోనియను రాజుల నుండి, అకెమెనిడులు తప్పనిసరి దేవాలయ పన్ను అనే భావనను స్వీకరించారు. ఇది తమ భూమికి సమీపంలో ఉన్న దేవాలయానికి లేదా మరొక ఆదాయ వనరుకు నివాసులందరూ చెల్లించే పదవ వంతు పన్ను.[88]

2వ ఆర్టాక్సెర్క్సెసు పర్షియా పూర్వ మిత్రులైన స్పార్టనులతో యుద్ధంలో చిక్కుకున్నాడు. 2వ ఏజిసిలాసు నాయకత్వంలో వారు ఆసియా మైనరు మీద దండెత్తారు. స్పార్టనుల దృష్టిని గ్రీకు వ్యవహారాల వైపు మళ్లించడానికి 2వ ఆర్టాక్సెర్క్సెసు వారి శత్రువులకు ఆర్థిక సహాయం చేశాడు: ముఖ్యంగా ఏథెనియన్లు, థేబన్లు, కొరింథియన్లకు. ఈ సహాయాలు స్పార్టనులను కొరింథియను యుద్ధంగా పిలువబడే యుద్ధంలోకి నెట్టడానికి సహాయపడ్డాయి. క్రీ.పూ. 387లో 2వ ఆర్టాక్సెర్క్సెసు తన మిత్రులకు ద్రోహం చేసి స్పార్టాతో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆంటాల్సిడాసు ఒప్పందంలో ఆయన తన పూర్వ మిత్రులను షరతులకు అంగీకరించేలా బలవంతం చేశాడు. ఈ ఒప్పందం అనటోలియను తీరంలోని అయోనియా ఏయోలిసు గ్రీకు నగరాల మీద నియంత్రణను పర్షియన్లకు తిరిగి ఇచ్చింది. అదే సమయంలో గ్రీకు ప్రధాన భూభాగంలో స్పార్టాకు ఆధిపత్యాన్ని కల్పించింది. క్రీ.పూ. 385లో ఆయన కడూసియన్లకు వ్యతిరేకంగా సైనిక దండయాత్ర చేశాడు. గ్రీకులకు వ్యతిరేకంగా విజయం సాధించినప్పటికీ 2వ ఆర్టాక్సెర్క్సెసు తన పాలన ప్రారంభంలోనే తన మీద విజయవంతంగా తిరుగుబాటు చేసిన ఈజిప్షియన్లతో ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు. క్రీ.పూ. 373లో ఈజిప్టును తిరిగి జయించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. కానీ ఆయన చివరి సంవత్సరాలలో పర్షియన్లు ఫోయెనిషియాను జయించడానికి ఈజిప్టు-స్పార్టా చేసిన సంయుక్త ప్రయత్నాన్ని ఓడించగలిగారు. ఆయన క్రీ.పూ. 372–362లో సాత్రపుల తిరుగుబాటును అణచివేశాడు. ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నట్లు చెబుతారు. ఆయన ప్రధాన భార్య స్టేటిరా. క్రీ.పూ. 400 ప్రాంతంలో 2వ ఆర్టాక్సెర్క్సెసు తల్లి పారిసాటిసు చేత ఆమెకు విషప్రయోగం చేయబడింది. మరొక ముఖ్య భార్య ఫోకాయాకు చెందిన అస్పాసియా అనే గ్రీకు మహిళ (పెరికల్సు ఉంపుడుగత్తెతో ఈమె ఒకరు కాదు). 2వ ఆర్టాక్సెర్క్సెసు 350 మంది భార్యల ద్వారా 115 కంటే ఎక్కువ మంది కుమారులు ఉన్నారని చెబుతారు.[89]
క్రీ.పూ. 358లో 2వ ఆర్టాక్సెర్క్సెసు మరణించాడు. ఆయన కుమారుడు 3వ ఆర్టాక్సెర్క్సెసు సింహాసనాన్ని అధిష్టించాడు. క్రీ.పూ. 355లో 3వ ఆర్టాక్సెర్క్సెసు ఏథెన్సును శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని బలవంతం చేశాడు. దీని ప్రకారం ఆ నగరం సైన్యాలు ఆసియా మైనరు నుండి వైదొలగాలి. దాని తిరుగుబాటు మిత్రదేశాల స్వాతంత్ర్యాన్ని అంగీకరించాలి.[90] ఆర్టాక్సెర్క్సెసు తిరుగుబాటు చేస్తున్న కడూసియన్ల మీద ఒక సైనిక చర్యను ప్రారంభించాడు. కానీ ఆయన ఇద్దరు కడూసియను రాజులను శాంతింపజేయగలిగాడు. ఈ సైనిక దండయాత్ర నుండి విజయవంతంగా బయటపడిన వ్యక్తులలో ఒకరు డారియసు కోడోమన్నసు. ఈయన తరువాత 3వ డారియసుగా పర్షియను సింహాసనాన్ని అధిష్టించాడు.[91]
ఆ తర్వాత 3వ ఆర్టాక్సెర్క్సెసు, ఆసియా మైనరులోని అన్ని సాత్రపీ సైన్యాలను రద్దు చేయాలని ఆదేశించాడు. ఎందుకంటే అవి పశ్చిమ ప్రాంతంలో శాంతికి ఇక మీద హామీ ఇవ్వలేవని ఆయన భావించాడు. ఈ సైన్యాలు పశ్చిమ సాత్రపులు తిరుగుబాటు చేయడానికి మార్గాలను అందిస్తాయని ఆందోళన చెందాడు.[92] అయితే ఈ ఆదేశాన్ని ఫ్రిజియాకు చెందిన ఆర్టాబాజోసు విస్మరించాడు. ఆయన రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఏథెన్సు సహాయం కోరాడు. ఏథెన్సు సార్డిసుకు సహాయం పంపింది. మైసియాకు చెందిన ఒరోంటెసు కూడా ఆర్టాబాజోసుకు మద్దతు ఇచ్చాడు. సంయుక్త దళాలు క్రీ.పూ. 354లో 3వ ఆర్టాక్సెర్క్సెసు పంపిన దళాలను ఓడించగలిగాయి. అయితే, క్రీ.పూ. 353లో వారు 3వ ఆర్టాక్సెర్క్సెసు సైన్యం చేతిలో ఓడిపోయి చెల్లాచెదురయ్యారు. ఒరోంటెసును రాజు క్షమించాడు. అయితే ఆర్టాబాజోసు మాసిడోనియాకు చెందిన 2వ ఫిలిపు ఆస్థానంలోకి పారిపోయి ఆశ్రయం పొందాడు. సుమారు క్రీ.పూ. 351లో ఆర్టాక్సెర్క్సెసు తన తండ్రి 2వ ఆర్టాక్సెర్క్సెసు కాలంలో తిరుగుబాటు చేసిన ఈజిప్టును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక సైనిక యాత్రను ప్రారంభించాడు. అదే సమయంలో ఆసియా మైనరులో ఒక తిరుగుబాటు చెలరేగింది. ఇది థీబ్సు మద్దతుతో తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఒక భారీ సైన్యాన్ని సమీకరించి, ఆర్టాక్సెర్క్సెసు ఈజిప్టు మీద దండెత్తి నెక్టానెబోతో యుద్ధంలో నిమగ్నమయ్యాడు. ఈజిప్టు ఫారోతో ఒక సంవత్సరం పాటు పోరాడిన తర్వాత నెక్టానెబో గ్రీకు సేనాధిపతులైన డియోఫాంటసు, లామియసు నాయకత్వంలోని కిరాయి సైనికుల మద్దతుతో పర్షియన్ల మీద నిర్ణయాత్మక విజయం సాధించాడు.[93] ఆర్టాక్సెర్క్సెసు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఈజిప్టును తిరిగి జయించాలనే తన ప్రణాళికలను వాయిదా వేయవలసి వచ్చింది. ఈ ఓటమి జరిగిన కొద్దికాలానికే ఫోనిషియా, ఆసియా మైనరు, సైప్రసులో తిరుగుబాట్లు చెలరేగాయి.
క్రీ.పూ. 343లో ఆర్టాక్సెర్క్సెసు సైప్రసు తిరుగుబాటుదారులను అణచివేసే బాధ్యతను కారియా యువరాజు అయిన ఇడ్రియసుకు అప్పగించాడు. ఇడ్రియసు 8,000 మంది గ్రీకు కిరాయి సైనికులను, నలభై ట్రైరీంలను ఉపయోగించాడు. వీటికి ఏథెన్సుకు చెందిన ఫోసియను, సైప్రసు రాజు అయిన వృద్ధ ఎవగోరసు కుమారుడైన ఎవగోరసు నాయకత్వం వహించారు. ఇడ్రియసు సైప్రసును లొంగదీసుకోవడంలో విజయం సాధించాడు. ఆర్టాక్సెర్క్సెసు సిరియా సాత్రపు అయిన బెలెసిసు, సిలిసియా సాత్రపు అయిన మజేయసులను సిడాను మీద దండెత్తి, ఫోనీషియన్లను అదుపులో ఉంచమని ఆదేశించి, ఒక ప్రతిదాడిని ప్రారంభించాడు. నెకటానెబో పంపిన రోడ్సుకు చెందిన మెంటారు నాయకత్వం వహించిన 40,000 మంది గ్రీకు కిరాయి సైనికుల సహాయంతో సిడాను రాజు టెన్నెసు చేతిలో ఈ ఇద్దరు సాత్రపులు ఘోర పరాజయాలను చవిచూశారు. ఫలితంగా పర్షియను దళాలు ఫోనీషియా నుండి తరిమివేయబడ్డాయి.
దీని తరువాత ఆర్టాక్సెర్క్సెసు స్వయంగా 3,30,000 మంది సైన్యంతో సిడానుపైకి దండెత్తాడు. ఆర్టాక్సెర్క్సెసు సైన్యంలో 3,00,000 పదాతి సైనికులు, 30,000 అశ్వికదళం, 300 ట్రైరీంలు, 500 రవాణా లేదా సరఫరా నౌకలు ఉన్నాయి. ఈ సైన్యాన్ని సమీకరించిన తర్వాత ఆయన గ్రీకుల సహాయం కోరాడు. ఏథెన్సు, స్పార్టా సహాయం నిరాకరించినప్పటికీ ఆయన లాక్రేట్సు ఆధ్వర్యంలో వెయ్యి థీబను భారీ సాయుధ హోప్లైటులను, నికోస్ట్రాటసు ఆధ్వర్యంలో మూడు వేల ఆర్గివులను, ఆసియా మైనరులోని గ్రీకు నగరాల నుండి ఆరు వేల ఏయోలియన్లు, అయోనియన్లు, డోరియన్లను పొందడంలో విజయం సాధించాడు. ఈ గ్రీకు మద్దతు సంఖ్యాపరంగా తక్కువగా కేవలం 10,000 మందికి మించకుండా ఉన్నప్పటికీ ఇది తరువాత తన పక్షంలో చేరిన ఈజిప్టుకు చెందిన గ్రీకు కిరాయి సైనికులతో కలిసి ఆయన ప్రధానంగా ఆధారపడిన శక్తిగా మారింది. ఆయన దండయాత్ర అంతిమ విజయానికి ఇది ప్రధాన కారణం. ఆర్టాక్సెర్క్సెసు రాక టెన్నెసు సంకల్పాన్ని తగినంతగా బలహీనపరిచింది. దాంతో ఆయన సిడాను నగరంలోని 100 మంది ప్రముఖ పౌరులను పర్షియను రాజు చేతికి అప్పగించి ఆ మీద ఆర్టాక్సెర్క్సెసును నగరం రక్షణ వలయంలోకి అనుమతించడం ద్వారా తన క్షమాపణను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఆర్టాక్సెర్క్సెసు ఆ 100 మంది పౌరులను ఈటెలతో పొడిచి చంపించాడు. మరో 500 మంది ఆయన దయ కోసం వేడుకుంటూ వచ్చినప్పుడు. ఆర్టాక్సెర్క్సెసు వారిని కూడా అదే గతికి గురిచేశాడు. ఆ తర్వాత సిడాను నగరం ఆర్టాక్సెర్క్సెసు చేత గానీ లేదా సిడాను పౌరుల చేత గానీ నేలమట్టం చేయబడింది. ఆ మహాగ్నిప్రమాదంలో నలభై వేల మంది మరణించారు.[94] ఆర్టాక్సెర్క్సెసు ఆ శిథిలాలను అధిక ధరకు ఊహాగాన వ్యాపారులకు అమ్మాడు. వారు బూడిదలో నుండి తవ్వితీస్తామని ఆశించిన నిధుల ద్వారా తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలని లెక్కలు వేశారు.[95] టెన్నెసుకు తరువాత ఆర్టాక్సెర్క్సెసు మరణశిక్ష విధించాడు.[96] ఆర్టాక్సెర్క్సెసు తరువాత తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన యూదులను కాస్పియను సముద్రం దక్షిణ తీరంలో ఉన్న హిర్కానియాకు పంపాడు.[97][98]
ఈజిప్టు మీద రెండవ దండయాత్ర
[మార్చు]

సిడానును లొంగదీసుకున్న వెంటనే ఈజిప్టు మీద దండయాత్ర జరిగింది. క్రీ.పూ. 343లో 3వ ఆర్టాక్సెర్క్సెసు తన 330,000 పర్షియను సైన్యంతో పాటు, ఆసియా మైనరులోని గ్రీకు నగరాలు అందించిన 14,000 మంది గ్రీకు సైనికులను కూడా కలిగి ఉన్నాడు: వీరిలో టెన్నెసుకు సహాయం చేయడానికి ఈజిప్టు నుండి తీసుకువచ్చిన సైనికులతో కూడిన 4,000 మంది రోడ్సుకు చెందిన మెంటారు. ఆధ్వర్యంలో; ఆర్గాసు పంపిన 3,000 మంది; థీబ్సు నుండి వచ్చిన 1,000 మంది ఉన్నారు. ఆయన ఈ దళాలను మూడు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగానికి ఒక పర్షియను, ఒక గ్రీకు అధికారిని అధిపతిగా నియమించాడు. గ్రీకు కమాండర్లు థీబ్సుకు చెందిన లాక్రేట్సు, రోడ్సుకు చెందిన మెంటారు ఆర్గాసుకు చెందిన నికోస్ట్రాటసు కాగా. పర్షియన్లకు రోస్సేసెసు, అరిస్టాజేన్సు, నపుంసకుల అధిపతి అయిన బాగోవాసు నాయకత్వం వహించారు. 2వ నెక్టానెబో 1,00,000 మంది సైన్యంతో ప్రతిఘటించాడు. వీరిలో 20,000 మంది గ్రీకు కిరాయి సైనికులు ఉన్నారు. 2వ నెక్టానెబో తన పెద్ద నావికాదళంతో నైలు నదిని దాని వివిధ శాఖలను ఆక్రమించాడు.
అనేక కాలువలతో నిండి పటిష్టంగా కోటలు నిర్మించిన పట్టణాలతో ఉన్న ఆ దేశ భౌగోళిక స్వరూపం ఆయనకు అనుకూలంగా ఉంది. 2వ నెక్టానెబో విజయవంతం కాకపోయినా సుదీర్ఘ ప్రతిఘటనను అందించాడని భావించారు. అయితే ఆయన వద్ద మంచి సేనాధిపతులు లేరు. తన సొంత నాయకత్వ సామర్థ్యాల మీద అతి విశ్వాసంతో, ఆయన గ్రీకు కిరాయి సైనికాధికారుల వ్యూహాలకు చిక్కుకున్నాడు. ఆయన దళాలు చివరికి సంయుక్త పర్షియను సైన్యాల చేతిలో ఓడిపోయాయి. తన ఓటమి తరువాత నెక్టానెబో హడావిడిగా మెంఫిసుకు పారిపోయాడు. కోటల రక్షణను వాటి సైనిక దళాలకు అప్పగించాడు. ఈ సైనిక దళాలలో కొంతమంది గ్రీకు సైనికులు, మరికొంతమంది ఈజిప్షియను సైనికులు ఉన్నారు; వీరి మధ్య పర్షియను నాయకులు సులభంగా అసూయలను, అనుమానాలను రేకెత్తించారు. ఫలితంగా పర్షియన్లు దిగువ ఈజిప్టులోని అనేక పట్టణాలను వేగంగా స్వాధీనం చేసుకోగలిగారు. మెంఫిసు వైపు ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో నెక్టానెబో దేశాన్ని విడిచిపెట్టి దక్షిణం వైపు ఇథియోపియాకు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. పర్షియను సైన్యం ఈజిప్షియన్లను పూర్తిగా ఓడించి నైలు నది దిగువ డెల్టాను ఆక్రమించింది. నెక్టానెబో ఇథియోపియాకు పారిపోయిన తరువాత. ఈజిప్టు మొత్తం ఆర్టాక్సెర్క్సుకు లొంగిపోయింది. ఈజిప్టులోని యూదులను బాబిలోనుకు లేదా కాస్పియను సముద్రం దక్షిణ తీరానికి పంపారు, ఫోయెనిషియా యూదులను ఇంతకు ముందు పంపిన ప్రదేశానికే వీరిని కూడా పంపారు.
ఈజిప్షియన్ల మీద ఈ విజయం తరువాత ఆర్టాక్సెర్క్సు నగర గోడలను ధ్వంసం చేయించాడు. భయానక పాలనను ప్రారంభించాడు. అన్ని దేవాలయాలను దోచుకోవడం మొదలుపెట్టాడు. ఈ దోపిడీ ద్వారా పర్షియా గణనీయమైన సంపదను పొందింది. ఆర్టాక్సెర్క్సు అధిక పన్నులు కూడా విధించాడు. ఈజిప్టు పర్షియాకు వ్యతిరేకంగా ఎప్పటికీ తిరుగుబాటు చేయలేని విధంగా దానిని బలహీనపరచడానికి ప్రయత్నించాడు. పర్షియా ఈజిప్టును నియంత్రించిన 10 సంవత్సరాల పాటు, స్థానిక మత విశ్వాసులను హింసించారు. పవిత్ర గ్రంథాలను దొంగిలించారు. ఆర్టాక్సెర్క్సు పర్షియాకు తిరిగి వెళ్ళే ముందు ఆయన ఫెరెండారెసును ఈజిప్టు సాత్రపుగా నియమించాడు. ఈజిప్టును తిరిగి జయించడం ద్వారా సంపాదించిన సంపదతో, ఆర్టాక్సెర్క్సెసు తన కిరాయి సైనికులకు పుష్కలంగా బహుమతులు ఇవ్వగలిగాడు. ఆ తర్వాత ఈజిప్టు మీద తన దండయాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు.
ఈజిప్టులో విజయం సాధించిన తర్వాత ఆర్టాక్సెర్క్సెసు పర్షియాకు తిరిగి వచ్చాడు. తదుపరి కొన్ని సంవత్సరాలు సామ్రాజ్యం వివిధ ప్రాంతాలలో జరిగిన తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేయడంలో గడిపాడు. తద్వారా ఈజిప్టును జయించిన కొన్ని సంవత్సరాలకే పర్షియను సామ్రాజ్యం ఆయన పూర్తి నియంత్రణలోకి వచ్చింది. అప్పటి నుండి అలెగ్జాండర్ ది గ్రేట్ ఈజిప్టును జయించే వరకు ఈజిప్టు పర్షియను సామ్రాజ్యంలో భాగంగానే ఉంది.
ఈజిప్టును జయించిన తర్వాత ఆర్టాక్సెర్క్సెసుకు వ్యతిరేకంగా ఎటువంటి తిరుగుబాట్లు లేదా విప్లవాలు జరగలేదు. ఈజిప్టు సైనిక చర్యలో అత్యంత విశిష్టంగా రాణించిన ఇద్దరు సేనాధిపతులు అయిన మెంటారు బాగోసులకు అత్యంత కీలకమైన పదవులు లభించాయి. మొత్తం ఆసియా సముద్ర తీరానికి గవర్నరుగా ఉన్న మెంటారు, ఇటీవలి గొడవల సమయంలో పర్షియను పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అనేక మంది నాయకులను లొంగదీసుకోవడంలో విజయం సాధించాడు. కొన్ని సంవత్సరాల వ్యవధిలో మెంటారు. ఆయన సైన్యాలు మొత్తం ఆసియా మధ్యధరా తీరాన్ని పూర్తిగా లొంగదీసుకుని, తమ మీద ఆధారపడేలా చేయగలిగారు.
బాగోసు ఆర్టాక్సెర్క్సెసుతో కలిసి పర్షియను రాజధానికి తిరిగి వెళ్ళాడు. అక్కడ ఆయన సామ్రాజ్యం అంతర్గత పరిపాలనలో కీలక పాత్ర పోషించాడు. సామ్రాజ్యం అంతటా శాంతిని నెలకొల్పాడు. 3వ ఆర్టాక్సెర్క్సెసు పాలన చివరి ఆరు సంవత్సరాలలో, పర్షియను సామ్రాజ్యం ఒక శక్తివంతమైన, విజయవంతమైన ప్రభుత్వంచే పరిపాలించబడింది.
ఐయోనియా, లిసియా లోని పర్షియను సైన్యాలు ఏజియను మధ్యధరా సముద్రం మీద తిరిగి నియంత్రణ సాధించాయి. ఏథెన్సు పూర్వ ద్వీప సామ్రాజ్యంలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, ఏథెన్సుకు చెందిన ఇసోక్రేట్సు 'అనాగరికుల మీద ధర్మయుద్ధం' చేయాలని పిలుపునిస్తూ ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు. కానీ ఆయన పిలుపుకు స్పందించడానికి ఏ గ్రీకు నగర-రాష్ట్రాలలోనూ తగినంత బలం మిగిలి లేదు.[99]
పర్షియను సామ్రాజ్యంలోనే ఎలాంటి తిరుగుబాట్లు లేనప్పటికీ మాసిడోనియాలో మాసిడోనియాకు చెందిన 2వ ఫిలిపు పెరుగుతున్న శక్తి, భూభాగం (దీని గురించి డెమోస్థనీసు ఏథెనియన్లను వృధాగా హెచ్చరిస్తున్నాడు) ఆర్టాక్సెర్క్సెసు దృష్టిని ఆకర్షించింది. దీనికి ప్రతిస్పందనగా మాసిడోనియా రాజ్యపు పెరుగుతున్న శక్తి, ప్రభావాన్ని అరికట్టడానికి. నియంత్రించడానికి పర్షియను ప్రభావాన్ని ఉపయోగించాలని ఆయన ఆదేశించాడు. క్రీ.పూ. 340లో, థ్రేసియను యువరాజు సెర్సోబ్లెప్టెసు తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయడానికి సంధి చ్జెసుకోవాలన్న ప్రతిపాదనతో ఒక పర్షియను సైన్యాన్ని పంపారు. పెరింథసు నగరానికి తగినంత సమర్థవంతమైన సహాయం అందించబడింది. దానితో ఫిలిపు నగరాన్ని ముట్టడించడానికి ప్రారంభించిన భారీ, సుసజ్జితమైన సైన్యం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది.[94] ఆర్టాక్సెర్క్సెసు పాలన చివరి సంవత్సరానికి,2వ ఫిలిపు ఇప్పటికే పర్షియను సామ్రాజ్యం మీద దండయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇది ఆయన వృత్తి జీవితానికి కిరీటం అవుతుంది. కానీ గ్రీకులు ఆయనతో ఏకం కాలేదు.[100]
క్రీ.పూ. 338లో ఆర్టాక్సెర్క్సెసు ఒక వైద్యుడి సహాయంతో బాగోవాసు చేత విషప్రయోగానికి గురయ్యాడు.[101]
మాసిడోనియాకు చెందిన మూడవ అలెగ్జాండరు చేతిలో పతనం
[మార్చు]

3వ ఆర్టాక్సెర్క్సెసు తర్వాత 4వ ఆర్టాక్సెర్క్సెసు ఆర్సెసు సింహాసనాన్ని అధిష్టించాడు. కానీ ఆయన ఏదైనా చర్య తీసుకునేలోపే బగోవాసు చేత విషప్రయోగానికి గురయ్యాడు. బగోవాసు ఆర్సెసు పిల్లలందరినీ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర యువరాజులలో చాలా మందిని కూడా చంపాడని చెబుతారు. ఆ తర్వాత బగోవాసు 4వ ఆర్టాక్సెర్క్సెసు మేనల్లుడైన 3వ డారియసుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతకు ముందు అర్మేనియా సాత్రపుగా ఉన్న 3వ డారియసు స్వయంగా బగోవాసును విషం మింగేలా బలవంతం చేశాడు. క్రీ.పూ. 334లో డారియసు ఈజిప్టును మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకురావడంలో విజయం సాధిస్తున్న సమయంలో అలెగ్జాండరు ఆయన యుద్ధాలలో రాటుదేలిన సైనికులు ఆసియా మైనరు మీద దండెత్తారు.
మహానుభావుడైన అలెగ్జాండరు (మాసిడోనియాకు చెందిన మూడవ అలెగ్జాండరు) పర్షియను సైన్యాలను గ్రానికసు (క్రీ.పూ. 334), ఆ తర్వాత ఇస్ససు (క్రీ.పూ. 333), చివరగా గౌగమెలా (క్రీ.పూ. 331) వద్ద ఓడించాడు. ఆ తర్వాత, ఆయన సూసా పెర్సెపోలిసు మీద దండెత్తాడు. అవి లొంగిపోయాయి. క్రీ.పూ. 330 ప్రారంభంలో అగ్నికి ఆహుతయ్యాయి. పెర్సెపోలిసు నుండి, అలెగ్జాండరు ఉత్తరం వైపు పసరుగాడేకు వెళ్ళాడు. అక్కడ ఆయన 'సైరోపీడియా' నుండి తాను విన్న సైరసు సమాధిని సందర్శించాడు.
అలెగ్జాండరు పర్షియా మీద చేసిన దండయాత్ర వల్ల ఏర్పడిన గందరగోళంలో, సైరసు సమాధిని పగలగొట్టి, అందులోని చాలా విలాసవంతమైన వస్తువులను దోచుకున్నారు. అలెగ్జాండరు ఆ సమాధి వద్దకు చేరుకున్నప్పుడు దానిని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. మాగీలను ప్రశ్నించి, వారి మీద విచారణ జరిపాడు.[102][103] కొన్ని కథనాల ప్రకారం మాగీల మీద విచారణ జరపాలని అలెగ్జాండరు తీసుకున్న నిర్ణయం సైరసు సమాధి పట్ల శ్రద్ధ చూపడం కంటే వారి ప్రభావాన్ని తగ్గించి తన సొంత అధికారాన్ని ప్రదర్శించే ప్రయత్నమే ఎక్కువ.[104] ఏదేమైనా అలెగ్జాండరు ది గ్రేటు సైరసుకు గౌరవం చూపుతూ సమాధి పరిస్థితిని మెరుగుపరచాలని దాని లోపలి భాగాన్ని పునరుద్ధరించాలని అరిస్టోబులసును ఆదేశించాడు.[102] అక్కడి నుండి ఆయన ఎక్బటానాకు బయలుదేరాడు. అక్కడ 3వ డారియసు ఆశ్రయం పొంది ఉన్నాడు.[105]
3వ డారియస తన బాక్ట్రియాను సాట్రాపు బంధువైన బెస్ససు చేత బందీగా పట్టుబడ్డాడు. అలెగ్జాండరు సమీపిస్తున్నాడని తెలియగానే బెస్ససు తన మనుషులతో 3వ డారియసుని హత్య చేయించి ఆ తర్వాత తాను 5వ ఆర్టాక్సెర్క్సెసుగా డారియసు వారసుడిగా ప్రకటించుకున్నాడు. అలెగ్జాండరును ఆలస్యం చేయడానికి డారియసు మృతదేహాన్ని దారిలో వదిలి ఆయన మధ్య ఆసియాకు పారిపోయాడు. అలెగ్జాండరు ఆ మృతదేహాన్ని పెర్సెపోలిసుకు తీసుకువచ్చి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరిపించాడు. ఆ తర్వాత అలెగ్జాండరుకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి బెస్ససు తన బలగాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. సామ్రాజ్యం తూర్పు భాగంలో తన మిత్రులతో బెస్ససు పూర్తిగా ఏకం కాకముందే... గొప్ప మాసిడోనియను అయిన అలెగ్జాండరు బెస్ససు అధికారం చేజిక్కించుకునే ప్రమాదం ఉందని భయపడి ఆయనను పట్టుకుని తన ఆధీనంలో ఉన్న ఒక పర్షియను కోర్టులో విచారణ జరిపించి ఆయనకు "క్రూరమైన, అనాగరిక పద్ధతిలో" మరణశిక్ష విధించాడు.
అలెగ్జాండరు సాధారణంగా అసలైన అకెమెనిడు పరిపాలనా నిర్మాణాన్ని కొనసాగించాడు. దీనివల్ల కొంతమంది మేధావులు ఆయనను "అకెమెనిడ్లలో చివరివాడు" అని అభివర్ణించారు. క్రీ.పూ. 323లో అలెగ్జాండరు మరణించిన తర్వాత ఆయన సామ్రాజ్యం ఆయన సేనాధిపతులైన డయాడోచిల మధ్య విభజించబడింది. ఫలితంగా అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిలో అతిపెద్దది ఇరానియను పీఠభూమి మీద అలెగ్జాండరు సేనాధిపతి 1వ సెల్యూకసు నికేటరు స్థాపించిన సెల్యూసిడ్ సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయించినది. క్రీ.పూ. 2వ శతాబ్దంలో ఈశాన్య ఇరాన్కు చెందిన పార్థియన్లచే పార్థియను సామ్రాజ్యం ద్వారా స్థానిక ఇరానియను పాలన పునరుద్ధరించబడింది.
తరువాతి పర్షియను రాజవంశాలలో వారసులు
[మార్చు]సెల్యూసిడ్ సామ్రాజ్యం "ఫ్రతారకా"
[మార్చు]
'ఫ్రతారకా' రాజవంశాన్ని స్థాపించిన అనేక మంది తరువాతి పర్షియను పాలకులుగా ఫార్సు ప్రాంతంలో సెల్యూసిడులకు ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది.[107] వారు క్రీ.పూ. 3వ శతాబ్దం చివరి నుండి క్రీ.పూ. 2వ శతాబ్దం ప్రారంభం వరకు పాలించారు. నైరుతి పర్షియా, పర్షియను గల్ఫు ప్రాంతాలలో సెల్యూసిడు శక్తి క్షీణించినప్పుడు వహబార్జు లేదా 1వ వాద్ఫ్రదాదు. సుమారుగా క్రీ.పూ. 150లో స్వాతంత్ర్యం పొందాడు.[107]
పార్థియను సామ్రాజ్యం క్రింద పెర్సిసు రాజులు
[మార్చు]
క్రీ.పూ. 2వ శతాబ్దం.
2వ వాడుఫ్రదాదు, మరొక అనిశ్చిత రాజుల పాలనా కాలానికి సంబంధించిన ఒక స్పష్టమైన పరివర్తన కాలంలో వారి నాణేల వెనుక భాగంలో ఎటువంటి అధికార బిరుదులు కనిపించలేదు. అంతకు ముందు ఉన్న 'ప్రత్రకు జీ అల్హాయా' (ఫ్రతారక) అనే బిరుదు అదృశ్యమైంది. అయితే 1వ దారేవు (డారియసు) పాలనలో, 'mlk' లేదా రాజు అనే కొత్త బిరుదు కనిపించింది. కొన్నిసార్లు 'prs' (పెర్సిసు) ప్రస్తావనతో పాటుగా ఇది పెర్సిసు రాజులు స్వతంత్ర పాలకులయ్యారని సూచిస్తుంది.[108]
పార్థియను అర్సాసిడు రాజు 1వ మిథ్రిడేట్సు (సుమారు క్రీ.పూ. 171–138) పెర్సిసును స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన పెర్సిసు రాజులుగా పిలువబడే పర్షియను రాజవంశీకులను పదవిలో కొనసాగనిచ్చాడు. వారు 'mlk' ("రాజు") అనే బిరుదుతో నాణేలను ముద్రించడం కొనసాగించడానికి అనుమతించబడ్డారు.[107]
సస్సానియను సామ్రాజ్యం
[మార్చు]పాపగు కుమారుడైన షాబురు పాలనలో పెర్సిసు రాజ్యం ససానియన్ సామ్రాజ్యంలో భాగమైంది. షాబురు సోదరుడు, వారసుడైన 5వ అర్దక్షిరు (ఆర్టాక్సెర్క్సెసు) క్రీ.శ. 224లో చివరి చట్టబద్ధమైన పార్థియను రాజు 5వ అర్టబానోసు ఓడించి క్టెసిఫోనులో 5వ అర్దక్షిరు (1వ అర్దాషిరు), 'షాహనుషాహు ఈ ఎరాన్'గా పట్టాభిషేకం చేయించుకుని, కొత్త సస్సానియను సామ్రాజ్యానికి మొదటి రాజు అయ్యాడు.[108]
పొంటసు రాజ్యం
[మార్చు]అకెమెనిడు వంశం ఉత్తర ఆసియా మైనరులోని పొంటసు ప్రాంతంలో స్థాపించబడిన పొంటసు రాజ్యంగా కూడా కొనసాగింది. పర్షియను మూలానికి చెందిన ఈ పొంటికు రాజ్యం[109][110][111][112] బహుశా 1వ డారియసు అకెమెనిడు రాజవంశంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండవచ్చు.[112] దీనిని క్రీ.పూ. 281లో 1వ మిత్రిడేట్సు స్థాపించాడు. క్రీ.పూ. 63లో రోమను రిపబ్లికు దీనిని జయించే వరకు ఇది కొనసాగింది. ఈ రాజ్యం 6వ మిత్రిడేట్సు ది గ్రేటు పాలనలో అత్యంత విస్తరించింది. ఆయన కోల్చిసు, కప్పడోసియా, బిథినియా, టారికు చెర్సోనెస్సు లోని గ్రీకు కాలనీలను, స్వల్పకాలం పాటు రోమను ప్రావిన్సు అయిన ఆసియాను కూడా జయించాడు. ఈ విధంగా ప్రధాన పర్షియన్ సామ్రాజ్యం పతనమైనప్పటికీ ఈ పర్షియను రాజవంశం హెలెనిస్టికు ప్రపంచంలో మనుగడ సాగించి. అభివృద్ధి చెందగలిగింది. గ్రీకు ప్రభావం ఉన్నప్పటికీ, పాంటసు రాజ్యం వారు తమ అకెమెనిడు వంశపారంపర్యాన్ని కొనసాగించారు.[112]

తరువాతి పార్థియన్లు, ససానియన్ల రెండు రాజవంశాలు కూడా అప్పుడప్పుడు తాము అకెమెనిడు వంశానికి చెందినవారమని చెప్పుకున్నాయి. ఇటీవల, పాలకుల శారీరక వర్ణనల ద్వారా, పురాతన నాణేల మీద ఉన్న వంశపారంపర్య వ్యాధికి సంబంధించిన సాక్ష్యాల ద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఒక వ్యాధి (న్యూరోఫైబ్రోమాటోసిసు) అవకాశం ద్వారా అకెమెనిడు వంశానికి చెందినవారమనే పార్థియన్ల వాదనకు కొంత ధృవీకరణ లభించింది.[113]
ప్రభుత్వం
[మార్చు]
సైరసు ది గ్రేటు ఈ సామ్రాజ్యాన్ని బహుళ-రాష్ట్ర సామ్రాజ్యంగా స్థాపించాడు. దీనిని నాలుగు రాజధాని నగరాలైన పసరుగడె, బాబిలోను, సూసా ఎక్బటానా నుండి పరిపాలించారు. అకెమెనిడులు సాత్రపీ వ్యవస్థ రూపంలో కొంత ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని అనుమతించారు. సాత్రపీ అనేది ఒక పరిపాలనా విభాగం, ఇది సాధారణంగా భౌగోళిక ప్రాతిపదికన ఏర్పాటు చేయబడింది. ఒక 'సాత్రప్' (గవర్నరు) ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఒక 'జనరలు' సైనిక నియామకాలను పర్యవేక్షించి శాంతిభద్రతలను నిర్ధారించేవాడు. ఒక 'ప్రభుత్వ కార్యదర్శి' అధికారిక రికార్డులను నిర్వహించేవాడు. జనరలు, ప్రభుత్వ కార్యదర్శి నేరుగా సాత్రపుకు, కేంద్ర ప్రభుత్వానికి నివేదించేవారు. వేర్వేరు సమయాలలో 20 నుండి 30 సాత్రపీలు ఉండేవి.
సైరసు ది గ్రేటు ఒక వ్యవస్థీకృత సైన్యాన్ని సృష్టించాడు. ఇందులో 10,000 మంది అత్యంత శిక్షణ పొందిన సైనికులతో కూడిన ఇమ్మోర్టల్సు విభాగం కూడా ఉంది.[114] సైరసు సామ్రాజ్యం అంతటా చాపరు ఖానే అని పిలువబడే అనేక రిలే స్టేషన్ల ఆధారంగా ఒక వినూత్న పోస్టలు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు.[115]
పెర్సెపోలిసు పరిపాలనా పత్రాలు అకెమెనిడు ప్రభుత్వ వ్యవస్థ మీద అనేక అంతర్దృష్టులను అందిస్తాయి. 1930వ దశకంలో పెర్సెపోలిసులో కనుగొనబడిన ఇవి ఎక్కువగా ఎలామైటు భాషలో ఉన్నాయి; ఈ క్యూనిఫాం పత్రాలలో 10,000 కంటే ఎక్కువ వాటి అవశేషాలు వెలికితీయబడ్డాయి. సామ్రాజ్య అరామికు భాషలో సుమారు 1,000 లేదా అంతకంటే ఎక్కువ అసలు రికార్డులు లభించాయి.[116] ఇప్పటివరకు పాత పర్షియను భాషలో కేవలం ఒక ఫలకం మాత్రమే గుర్తించబడింది.[117]
అలాగే ఈ పెర్సెపోలిసు ఆర్కైవులలో అనేక ముద్రలు, ముద్రల గుర్తులు కనుగొనబడ్డాయి. ఈ పత్రాలు యాభైకి పైగా వరుస సంవత్సరాల పాటు (క్రీ.పూ. 509–457) పెర్సెపోలిసులో జరిగిన పరిపాలనా కార్యకలాపాలను, సమాచార ప్రవాహాన్ని సూచిస్తాయి.
నాణేల ముద్రణ
[మార్చు]
పర్షియను డారికు అనేది మొదటి బంగారు నాణెం. ఇది దానితో సమానమైన వెండి నాణెం అయిన సిగ్లోసుతో పాటు అకెమెనిడ్ల ద్విలోహ ద్రవ్య ప్రమాణంను ప్రవేశపెట్టింది. ఇది నేటి వరకు కొనసాగుతోంది.[118] సామ్రాజ్యాన్ని పటిష్టం చేసి, పెర్సెపోలిసును ఒక ఉత్సవ రాజధానిగా విస్తరించిన 1వ డారియసు దీనిని సాధించాడు;[119] ఆయన ఆర్థిక వ్యవస్థను వెండి, బంగారు నాణేల ఆధారంగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు.
పన్ను జిల్లాలు
[మార్చు]
డారియసు ప్రతి సాత్రపీ ఉత్పాకత, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా వాటికి కచ్చితంగా సరిపోయే ఒక నియంత్రిత, సుస్థిరమైన పన్ను వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు బాబిలోను మీద అత్యధిక మొత్తంలో ఆశ్చర్యపరిచే వస్తువుల మిశ్రమం మీద పన్ను విధించబడింది – 1,000 వెండి టాలెంట్లు, సైన్యానికి నాలుగు నెలలకు సరిపడా ఆహారం. భారతదేశం అప్పటికే తన బంగారానికి ప్రసిద్ధి చెందింది; ఈజిప్టు తన పంటల సంపదకు ప్రసిద్ధి చెందింది; అది పర్షియను సామ్రాజ్యానికి (తరువాత రోమ్ సామ్రాజ్యానికి కూడా) ధాన్యాగారంగా ఉండేది. 700 టాలెంట్ల వెండితో పాటు 120,000 కొలతల ధాన్యాన్ని అందించాల్సి ఉండేది. ఇది కేవలం సామంత ప్రజల మీద విధించిన పన్ను.[123] జయించిన, తిరుగుబాటు చేసిన శత్రువులను బానిసలుగా అమ్మేవారనడానికి ఆధారాలు ఉన్నాయి.[124] పరిపాలన, పన్నుల విధానంలో ఇతర ఆవిష్కరణలతో పాటు, అకెమెనిడ్లు పురాతన సమీప ప్రాచ్యంలో ప్రైవేటు బానిసల అమ్మకాలను నమోదు చేసి ఒక ప్రాచీన రూపంలోని అమ్మకపు పన్నును ఉపయోగించి వాటి మీద పన్ను విధించిన మొదటి ప్రభుత్వం అయి ఉండవచ్చు.[125]
డారియసు పాలనలోని ఇతర విజయాలలో 'దాతా' (తరువాతి ఇరానియను చట్టానికి ఆధారంగా మారిన ఒక సార్వత్రిక న్యాయ వ్యవస్థ) క్రోడీకరణ, పెర్సెపోలిసులో కొత్త రాజధాని నిర్మాణం ఉన్నాయి.[126][127]
రవాణా - కమ్యూనికేషను
[మార్చు]అకెమెనిడ్ల పాలనలో వాణిజ్యం విస్తృతంగా ఉండేది. సామ్రాజ్యం సుదూర ప్రాంతాలలో వస్తువుల మార్పిడిని సులభతరం చేసే సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు ఉండేవి. వ్యవసాయం, కప్పంతో పాటు, వాణిజ్యం మీద విధించే సుంకాలు సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేవి.[123][128]


సాత్రపీలు 2,500 కిలోమీటర్ల రహదారి ద్వారా అనుసంధానించబడ్డాయి. ఇందులో అత్యంత ఆకట్టుకునే భాగం 1వ డారియసు ఆదేశాల మేరకు నిర్మించిన సూసా నుండి సార్డిసు వరకు ఉన్న రాజమార్గం. ఇది ఇరాన్ పీఠభూమిని మధ్య ఆసియా మధ్యధరా ప్రాంతంతో కలిపింది.[129] దీనిలో నిర్దిష్ట వ్యవధులలో స్టేషన్లు, సత్రాలు ఉండేవి. గుర్రాల మీద ప్రయాణించే దూతల బృందాలు (అంగారియం) పదిహేను రోజులలో అత్యంత సుదూర ప్రాంతాలకు చేరుకోగలిగేవి. హెరోడోటసు ఇలా పేర్కొన్నాడు: "ఈ పర్షియను దూతల కంటే వేగంగా ప్రపంచంలో మరేదీ ప్రయాణించదు. మంచు, వర్షం, వేడి లేదా రాత్రి చీకటి కూడా ఈ ధైర్యవంతులైన దూతలను వారి నియమిత ప్రయాణాలను వేగంగా పూర్తి చేయకుండా ఆపలేవు."[130][131] సాత్రపీ వ్యవస్థ ద్వారా లభించిన సాపేక్ష స్థానిక స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ, రాజ ప్రతినిధులు, అంటే "రాజు, కళ్ళు, చెవులు", సామ్రాజ్యం అంతటా పర్యటించి స్థానిక పరిస్థితుల మీద నివేదికలు ఇచ్చేవారు.
వాణిజ్యానికి సంబంధించిన మరో ప్రధాన రహదారి గ్రేటు ఖొరాసను రోడ్, ఇది మెసొపొటేమియాలోని సారవంతమైన లోతట్టు ప్రాంతాలలో ప్రారంభమై, జాగ్రోసు పర్వత ప్రాంతాల గుండా, ఇరానియను పీఠభూమి. ఆఫ్ఘనిస్తాను మీదుగా మధ్య ఆసియాలోని సమర్కండ్, మెర్వు, ఫెర్గానా ప్రాంతాల వరకు విస్తరించిన ఒక అనధికారిక వాణిజ్య మార్గం. ఇది సైరోపోలిసు వంటి సరిహద్దు నగరాల నిర్మాణానికి వీలు కల్పించింది. అలెగ్జాండరు దండయాత్రల తరువాత ఈ రహదారి గ్రీకో-బౌద్ధమతం వంటి సాంస్కృతిక సమ్మేళనాలు మధ్య ఆసియా, చైనాకు వ్యాపించడానికి అలాగే కుషాన్, ఇండో-గ్రీకు, పార్థియన్ వంటి సామ్రాజ్యాలు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య వాణిజ్యం నుండి లాభం పొందడానికి వీలు కల్పించింది. ఈ మార్గం అబ్బాసిదు ఖలీఫాల కాలంలో గొప్పగా పునరుద్ధరించబడి. అధికారికంగా మార్చబడింది. ఆ సమయంలో ఇది ప్రసిద్ధ పట్టు రహదారిలో ఒక ప్రధాన భాగంగా అభివృద్ధి చెందింది.[132]
సైన్యం
[మార్చు]పెర్సిసులో నిరాడంబరంగా ప్రారంభమైనప్పటికీ ఈ సామ్రాజ్యం సైరస్ ది గ్రేట్ నాయకత్వంలో అపారమైన విస్తీర్ణాన్ని చేరుకుంది. సైరసు ఒక బహుళ-రాష్ట్ర సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అక్కడ ఆయన ప్రాంతీయ పాలకులైన క్షత్రపాలురును తన సామ్రాజ్యంలో ఒక నిర్దిష్ట ప్రాంతం మీద తన ప్రతినిధులుగా పరిపాలించడానికి అనుమతించాడు. ఆ ప్రాంతాన్ని క్షత్రపత్వం అని పిలిచేవారు. పరిపాలన ప్రాథమిక నియమం ప్రతి క్షత్రపత్వం కేంద్ర అధికారానికి అంటే రాజుకు, విధేయత, విధేయతతో ఉండటం, పన్ను చట్టాలను పాటించడం మీద ఆధారపడి ఉండేది.[133]పర్షియా పాలనలో ఉన్న దేశాల జాతి-సాంస్కృతిక వైవిధ్యం, దాని అపారమైన భౌగోళిక పరిమాణం, ప్రాంతీయ పోటీదారుల నిరంతర అధికార పోరాటం కారణంగా.[20] శాంతిని కాపాడటానికి, తిరుగుబాట్లు, విదేశీ ముప్పుల సందర్భాలలో రాజు అధికారాన్ని అమలు చేయడానికి ఒక వృత్తిపరమైన సైన్యాన్ని సృష్టించడం అవసరమైంది.[134][114] సైరసు ఒక బలమైన భూ సైన్యాన్ని సృష్టించగలిగాడు. దానిని బాబిలోనియా, లిడియా, ఆసియా మైనరులలో తన దండయాత్రలలో ముందుకు సాగడానికి ఉపయోగించాడు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు 2వ కంబైసెసు దానిని ఈజిప్టులో 3వ ప్సామ్టికుకి వ్యతిరేకంగా ఉపయోగించాడు. సైరసు ఒక నావికాదళాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం లభించక ముందే సామ్రాజ్యంలో జరిగిన ఒక స్థానిక ఇరానియను తిరుగుబాటుతో పోరాడుతూ మరణించాడు. [135]ఆ బాధ్యత 1వ డారియసు మీద పడింది. ఆయన పర్షియన్లకు అధికారికంగా సొంత రాజ నావికాదళాన్ని అందించాడు. దీనివల్ల వారు ఈ విశాలమైన సామ్రాజ్యం బహుళ సముద్రాలలో అంటే నల్ల సముద్రం, ఏజియన్ సముద్రం నుండి పర్షియను గల్ఫు, అయోనియన్ సముద్రం, మధ్యధరా సముద్రం వరకు తమ శత్రువులతో పోరాడటానికి వీలు కలిగింది.
జాతి కూర్పు
[మార్చు]
సామ్రాజ్యం గొప్ప సైన్యాలు, సామ్రాజ్యం వలెనే చాలా విభిన్నంగా ఉండేవి. వాటిలో: [e]పర్షియన్లు,[137]మాసిడోనియన్లు,[64] యూరోపియను థ్రేసియన్లు, పేయోనియన్లు, మేడీలు, అఖేయన్ గ్రీకులు, సిస్సియన్లు, హిర్కేనియన్లు,[138] అస్సిరియన్లు, చాల్డియన్లు,[139] బాక్ట్రియన్లు, సాకేలు,[140] ఆరియన్లు, పార్థియాలు, కాకససు అల్బేనియాలు,[141] ఖోరాస్మియన్లు, సోగ్డియన్లు, గాంధారన్లు, డాడికే,[142] కాస్పియన్లు, సారంగే, పాక్టీసు,[143] ఉటియన్లు, మైసియన్లు, ఫోనిషియాన్లు, జూడియన్లు, ఈజిప్షియన్లు,[144] సైప్రియన్లు,[145] సిలిసియా వాసులు, పాంఫిలియా వాసులు, లిసియా వాసులు, ఆసియాకు చెందిన డోరియన్లు, కారియా వాసులు, ఐయోనియా వాసులు, ఏజియను ద్వీపవాసులు, ఏయోలియన్లు, పొంటసు నుండి వచ్చిన గ్రీకులు, పారికానియన్లు,[146] అరబ్బులు, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్లు, [144] లిబియన్లు,[147] పాఫ్లగోనియన్లు, లిగీలు, మాటియెనీలు, మారియాండినీలు, కప్పడోసియన్లు,[148] ఫ్రిజియన్లు, అర్మేనియన్లు,[149] లిడియన్లు, మైసియన్లు,[150] ఆసియాకు చెందిన థ్రేసియన్లు,[151] లాసోనియై, మిలియై, మోస్కి, టిబారెని, మాక్రోనెస్, మోస్సినోయెసి, మారెస్, కోల్చియన్లు, అలరోడియన్లు, సాస్పిరియన్లు,[152] ఎర్ర సముద్ర ద్వీపవాసులు,[153] సగార్టియన్లు,[154] హిందూష్, ఎయోర్డి, బోటియై, చాల్సిడియన్లు, బ్రైజియన్లు, పియరియన్లు, పెర్హేబి, ఎనియెనెస్, డోలోపెస్ మరియు మాగ్నీషియన్లు ఉన్నారు.
పదాతిదళం
[మార్చు]అకెమెనిడు పదాతిదళం మూడు సమూహాలను కలిగి ఉండేది: ఇమ్మోర్టల్సు, స్పరాబారా, తకాబారా, అయితే అకెమెనిడు సామ్రాజ్యం చివరి సంవత్సరాలలో కార్డేసెసు అనే నాల్గవ సమూహం ప్రవేశపెట్టబడింది.
హెరోడోటసు ఇమ్మోర్టల్సును 2వ హైడార్నెసు నేతృత్వంలోని భారీ పదాతిదళంగా వర్ణించాడు. వీరి సంఖ్యను ఎల్లప్పుడూ సరిగ్గా 10,000 మంది ఉండేలా చూసుకునేవారు. చంపబడిన తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న ప్రతి సభ్యుడి స్థానంలో వెంటనే కొత్త వ్యక్తిని నియమించడం వల్ల ఈ విభాగానికి ఆ పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. తద్వారా యూనిటు సంఖ్య, సమన్వయం కొనసాగేవి.[155] వారి వద్ద రెల్లు డాలులు, పొట్టి ఈటెలు, కత్తులు లేదా పెద్ద కఠారులు, విల్లు బాణాలు ఉండేవి. వారి వస్త్రాల కింద వారు పొలుసుల కవచం కోట్లను ధరించేవారు. సాధారణ సైనికుల ఈటెల వెనుక భాగంలోని బరువులు వెండితో ఉండేవి; కమాండింగు ర్యాంకులను వేరు చేయడానికి, అధికారుల ఈటెల వెనుక భాగంలోని మొనలు బంగారంతో ఉండేవి.[155] మిగిలి ఉన్న అకెమెనిడు రంగుల మెరుగుపెట్టిన ఇటుకలు, చెక్కిన శిల్పాలు ఇమ్మోర్టల్సును అలంకరించబడిన వస్త్రాలు, వలయాకార చెవిపోగులు, బంగారు ఆభరణాలు ధరించినట్లుగా చూపిస్తాయి. అయితే ఈ వస్త్రాలు, ఉపకరణాలు బహుశా కేవలం ఉత్సవ సందర్భాలలో మాత్రమే ధరించి ఉండవచ్చు.[156]

స్పరాబారా సాధారణంగా శత్రువులతో ముఖాముఖి పోరాటంలో పాల్గొనే మొదటివారు. ఈ రోజులలో వారి గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ వారు పర్షియను సైన్యానికి వెన్నెముకగా ఉండేవారని నమ్ముతారు. వారు ఒక కవచ గోడను ఏర్పరిచి తమ రెండు మీటర్ల పొడవు గల ఈటెలతో విలుకాళ్ల వంటి బలహీనమైన సైనికులను శత్రువుల నుండి రక్షించేవారు. స్పారాబారా సైనికులను పర్షియను సమాజంలోని పూర్తి స్థాయి సభ్యుల నుండి తీసుకునేవారు. వారిని చిన్నప్పటి నుండే సైనికులుగా శిక్షణ ఇచ్చేవారు, సుదూర దేశాలలో జరిగే యుద్ధాలకు పిలుపు రాని సమయాలలో వారు పర్షియా విశాలమైన మైదానాలలో వేటను సాధన చేసేవారు. అయితే అంతా ప్రశాంతంగా ఉండి, 'పాక్సు పెర్సికా' (పర్షియను శాంతి) కొనసాగుతున్నప్పుడు, స్పారాబారా సైనికులు సాధారణ జీవితానికి తిరిగి వచ్చి భూమిని సాగు చేస్తూ, తమ పశువుల మందలను మేపుకునేవారు. దీని కారణంగా వారికి యుద్ధభూమిలో నిజమైన వృత్తిపరమైన నైపుణ్యం లోపించింది. అయినప్పటికీ వారు బాగా శిక్షణ పొంది చాలా పరిస్థితులలో ఎదురుదాడికి తగినంత సమయం వరకు తమ స్థానాన్ని నిలబెట్టుకునేంత ధైర్యవంతులుగా ఉండేవారు. వారు కుట్టిన నార వస్త్రంతో చేసిన కవచాన్ని ధరించేవారు. తేలికైన, సులభంగా కదిలించగల రక్షణ కోసం పెద్ద దీర్ఘచతురస్రాకారపు రెల్లు గడ్డి డాలులను మోసేవారు. అయితే ఇది హాప్లైటు వంటి భారీ కవచాలు ధరించిన ప్రత్యర్థుల ముందు వారిని తీవ్రమైన ప్రతికూల స్థితిలో ఉంచింది. వారి రెండు మీటర్ల పొడవు గల ఈటె ఒక శిక్షణ పొందిన ఫాలాంక్సుతో సమర్థవంతంగా పోరాడటానికి స్పారాబారాకు తగినంత దూరాన్ని అందించలేకపోయింది. రెల్లు గడ్డి డాలులు బాణాలను సమర్థవంతంగా ఆపగలిగినప్పటికీ ఈటెల నుండి సైనికుడిని రక్షించడానికి తగినంత బలంగా లేవు. అయితే స్పారాబారా తూర్పు దేశాల నుండి వచ్చిన శిక్షణ పొందిన దళాలతో సహా ఇతర పదాతిదళాలలో చాలా వరకు ఎదుర్కోగలరు.
అకెమెనిడ్లు విలువిద్య మీద ఎక్కువగా ఆధారపడ్డారు. ప్రధానంగా సహకరించిన దేశాలు సిథియన్లు, మెడెసు, పర్షియన్లు, ఎలామైట్లు. సంయుక్త విల్లును పర్షియన్లు, మెడెసు ఉపయోగించారు. వారు దీనిని సిథియన్ల నుండి స్వీకరించి, గ్రీకులతో సహా ఇతర దేశాలకు అందించారు. అకెమెనిడు సైన్యాలు సాధారణంగా సాకెటు ఉన్న, మూడు బ్లేడ్ల (ట్రిలోబేటు లేదా సిథియను అని కూడా పిలువబడే) బాణం మొనలను ఉపయోగించాయి. ఈ బాణం మొనలను సీసం కలిపిన తగర-కాంస్యంతో పోత పోశారు. ఇది ఆ కాలంలోని విడిగా కమ్మరి పని చేయవలసి వచ్చిన ఇనుప బాణం మొనల వలె కాకుండా వాటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించింది. [157][158][159][160][161]
తకబారా ఒక అరుదైన సైనిక విభాగం వీరు కఠినమైన రకానికి చెందిన పెల్టాస్టులు.[162] వారు తమ సొంత దేశీయ ఆయుధాలతో పోరాడేవారు. వాటిలో నెలవంక ఆకారంలో ఉండే తేలికపాటి అల్లిక డాలు గొడ్డళ్లు, అలాగే తేలికపాటి నార వస్త్రం, తోలు ఉండేవి. తకబారాలను ఆధునిక ఇరాన్ భూభాగాల నుండి నియమించుకున్నారు.
అశ్వికదళం
[మార్చు]
దేశాలను జయించడంలో పర్షియను అశ్వికదళం కీలక పాత్ర పోషించింది. అకెమెనిడు సామ్రాజ్యం చివరి రోజుల వరకు అకెమెనిడు సైన్యంలో దాని ప్రాముఖ్యతను నిలుపుకుంది. అశ్వికదళం నాలుగు విభాగాలుగా విభజించబడింది: రథపు విలుకాళ్ళు, గుర్రపు అశ్వికదళం, ఒంటెల అశ్వికదళం, యుద్ధ ఏనుగులు.
అకెమెనిడు సామ్రాజ్యం తరువాతి సంవత్సరాలలో రథపు విలుకాళ్ళు పర్షియను సైన్యంలో కేవలం ఒక లాంఛనప్రాయమైన భాగంగా మారారు. అయినప్పటికీ సామ్రాజ్యం ప్రారంభ సంవత్సరాలలో, వాటి ఉపయోగం విస్తృతంగా ఉండేది. రథపు విలుకాళ్ళు ఈటెలు, విల్లులు, బాణాలు, కత్తులు, పొలుసుల కవచంతో సాయుధులై ఉండేవారు. గుర్రాలకు కూడా సస్సానియను కటాఫ్రాక్టుల పొలుసుల కవచం మాదిరిగానే పొలుసుల కవచం ఉండేది. రథాల మీద సామ్రాజ్య చిహ్నాలు అలంకరణలు ఉండేవి.

చాలా అశ్వికదళ విభాగాల మాదిరిగానే అకెమెనిడులు అశ్వికదళం కోసం ఉపయోగించిన గుర్రాలకు తరచుగా పొలుసుల కవచం ఉండేది. సైనికులకు తరచుగా పదాతిదళ విభాగాల మాదిరిగానే కవచం, రెల్లు డాలులు, పొట్టి ఈటెలు, కత్తులు లేదా పెద్ద కఠారులు, విల్లు, బాణం, పొలుసుల కవచపు కోట్లు ఉండేవి. ఒంటెల అశ్వికదళం భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఒంటెలకు కొన్నిసార్లు సైనికులకు కూడా శత్రువుల నుండి తక్కువ రక్షణ కల్పించబడేది. అయినప్పటికీ వారికి రక్షణ కల్పించినప్పుడు వారికి ఈటెలు, కత్తులు, విల్లు, బాణం, పొలుసుల కవచం ఉండేవి. ఒంటెల అశ్వికదళాన్ని థైంబ్రా యుద్ధంలో మహానుభావుడైన సైరసు పర్షియను సైన్యంలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. సింధూ లోయను జయించిన తర్వాత 1వ డారియసు పర్షియను సైన్యంలోకి ఏనుగులను ప్రవేశపెట్టి ఉండవచ్చు. డారియసు, 1వ జెర్సెసు గ్రీకు దండయాత్రలలో ఏనుగులను ఉపయోగించి ఉండవచ్చు. కానీ గ్రీకు చారిత్రక ఆధారాలు గాగామెలా యుద్ధంలో కేవలం 15 ఏనుగులను మాత్రమే ఉపయోగించినట్లు పేర్కొన్నాయి.
నౌకాదళం
[మార్చు]సైరసు స్థాపించినప్పటి నుండి పర్షియను సామ్రాజ్యం ప్రధానంగా ఒక బలమైన సైన్యాన్ని కలిగి ఉన్న భూ-ఆధారిత సామ్రాజ్యంగా ఉండేది. కానీ దానికి ఎటువంటి నిజమైన నౌకాదళం ఉండేది కాదు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే సామ్రాజ్యం గ్రీకు, ఈజిప్షియను బలగాలను ఎదుర్కొంది. వీరికి వారి స్వంత సముద్రయాన సంప్రదాయాలు, సామర్థ్యాలు ఉన్నాయి. మొదటి దారియసు పర్షియను నౌకాదళం మీద పెట్టుబడి పెట్టిన మొదటి అకెమెనిడు రాజు.[163] అప్పటికి కూడా గ్రీసు లేదా ఈజిప్టులో నిజమైన "సామ్రాజ్య నౌకాదళం" ఏదీ ఉనికిలో లేదు. దారియసు పాలనలో, పర్షియా మొదటి క్రమబద్ధమైన సామ్రాజ్య నౌకాదళాన్ని ప్రారంభించి, మోహరించిన మొదటి సామ్రాజ్యంగా అవతరించింది.[163] ఈ విజయం సాధించినప్పటికీ సామ్రాజ్య నౌకాదళానికి సిబ్బంది ఇరాన్ నుండి రాలేదు. కానీ వారు తరచుగా ఫోనిషియాన్లు (ఎక్కువగా సిడాను నుండి), ఈజిప్షియన్లు, గ్రీకులు, వీరిని మహమ్మదు దారియసు సామ్రాజ్యం యుద్ధ నౌకలను నడపడానికి ఎంపిక చేశాడు.[163]

మొదట నౌకలను ఫోనిషియన్లు సిడానులో నిర్మించారు; మొదటి అకెమెనిడు నౌకలు సుమారు 40 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పుతో ఉండేవి. ఇవి ఒకే పర్యటనలో 300 మంది పర్షియను సైనికులను రవాణా చేయగలవు. త్వరలోనే సామ్రాజ్యంలోని ఇతర రాష్ట్రాలు కూడా తమ సొంత నౌకలను నిర్మించడం ప్రారంభించాయి. ప్రతి ఒక్కటి స్వల్ప స్థానిక ప్రాధాన్యతలను చేర్చింది. ఈ నౌకలు చివరికి పర్షియను గల్ఫుకు చేరుకున్నాయి.[163] పర్షియను నౌకాదళాలు అక్కడ బలమైన పర్షియను సముద్ర ఉనికికి పునాది వేశాయి. పారశీకులకు 100 నుండి 200 మంది సైనికులను మోయగల సామర్థ్యం గల ఓడలు కూడా ఉండేవి. ఈ ఓడలు సామ్రాజ్యం వివిధ నదులైన పశ్చిమాన ఉన్న కరూను, టైగ్రిసు, నైలు నదులతో పాటు సింధు నదిలో కూడా గస్తీ తిరిగేవి.[163]

అకెమెనిడు నావికాదళం కరూను నది వెంబడి బహ్రెయిను, ఒమన్, యెమెన్లలో స్థావరాలను ఏర్పాటు చేసింది. పర్షియను నౌకాదళం కరూను నది వెంబడి శాంతి పరిరక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించబడటమే కాకుండా, పర్షియను గల్ఫు ద్వారా భారతదేశంతో వాణిజ్యానికి కూడా మార్గం సుగమం చేసింది.[163] డారియసు నావికాదళం ఆ సమయంలో అనేక విధాలుగా ఒక ప్రపంచ శక్తిగా ఉండేది. కానీ క్రీ.పూ. 397 వేసవిలో అద్భుతమైన నావికాదళాన్ని నిర్మించింది. రెండవ ఆర్టాక్సెర్క్సెసు. ఇది పునఃఆయుధీకరణలో భాగంగా జరిగింది. ఇది క్రీ.పూ. 394లో క్నిడోసు వద్ద ఆయనకు నిర్ణయాత్మక విజయాన్ని అందించింది. ఇయోనియాలో అకెమెనిడు అధికారాన్ని పునఃస్థాపించింది. రెండవ ఆర్టాక్సెర్క్సెసు తన నావికాదళాన్ని తరువాత ఈజిప్టులో ఒక తిరుగుబాటును అణచివేయడానికి కూడా ఉపయోగించాడు.[164]
ఓడల నిర్మాణానికి ప్రధానంగా కలపను ఉపయోగించేవారు. కానీ కొన్ని కవచం ఉన్న అకెమెనిడు ఓడల ముందు భాగంలో లోహపు బ్లేడులు ఉండేవి. ఇవి ఓడ వేగాన్ని ఉపయోగించి శత్రు ఓడలను చీల్చడానికి ఉద్దేశించబడ్డాయి. నావికాదళ ఓడలకు శత్రు ఓడలను పట్టుకోవడానికి లేదా వాటి స్థానాన్ని నియంత్రించడానికి పక్కల కొక్కేలు కూడా అమర్చబడి ఉండేవి. ఓడలు తెరచాపల ద్వారా లేదా మానవశక్తి ద్వారా నడపబడ్డాయి. పారశీకులు సృష్టించిన ఓడలు ప్రత్యేకమైనవి. సముద్ర యుద్ధాల విషయానికొస్తే, ఓడలు రెండు మంగోనెలులతో అమర్చబడి ఉండేవి. ఇవి రాళ్లు లేదా మండే పదార్థాల వంటి ప్రక్షేపకాలను ప్రయోగించేవి.[163]
జెనోఫోను, టైగ్రిసు నదిపై 37 పర్షియను నౌకలను కలిపి నిర్మించిన ఒక భారీ సైనిక వంతెన గురించి తన ప్రత్యక్ష సాక్ష్య వృత్తాంతాన్ని వివరిస్తాడు. పర్షియన్లు ప్రతి పడవ తేలే శక్తిని ఉపయోగించి దాని మీద సామాగ్రిని రవాణా చేయడానికి వీలుగా ఒక అనుసంధాన వంతెనను నిర్మించారు.[163] హెరోడోటసు కూడా పర్షియన్లు వంతెనలు నిర్మించడానికి నౌకలను ఉపయోగించినట్లు అనేక వృత్తాంతాలను అందించాడు.[165][166]
మహారాజు మొదటి డారియసు, నల్ల సముద్రానికి ఉత్తరాన ఉన్న సిథియను అశ్విక దళాలను లొంగదీసుకునే ప్రయత్నంలో అకెమెనియను పడవలను కలిపి నిర్మించిన ఒక భారీ వంతెనను ఉపయోగించి బోస్ఫరసు మీదుగా దాటి, ఆపై డాన్యూబు నది వరకు ముందుకు సాగి రెండవ పడవ వంతెన సహాయంతో దానిని దాటాడు.[167] బోస్ఫరసు మీదుగా ఉన్న ఈ వంతెన, ఆసియా సమీప కొనను ఐరోపాతో అనుసంధానించింది. ఇది కనీసం 1000 మీటర్ల బహిరంగ జలభాగాన్ని, అంతకంటే ఎక్కువ కాకపోయినా, కలుపుకుంది. హెరోడోటసు ఈ దృశ్యాన్ని వర్ణిస్తూ, దానిని "డారియసు వంతెన" అని పిలిచాడు:[168]
బాస్పోరసు అని పిలువబడే జలసంధి, దాని మీద డారియసు వంతెన నిర్మించబడింది. ఇది యూక్సిను సముద్రం నుండి ప్రొపొంటిసు వరకు వంద ఇరవై ఫర్లాంగుల పొడవు ఉంటుంది. ప్రొపొంటిసు ఐదు వందల ఫర్లాంగుల వెడల్పు, పద్నాలుగు వందల ఫర్లాంగుల పొడవు ఉంటుంది. దాని జలాలు డార్డనెల్లెసు/హెలెస్పాంటులోకి ప్రవహిస్తాయి. దాని పొడవు నాలుగు వందల ఫర్లాంగులు...
సంవత్సరాల తరువాత గ్రీసు మీద దండయాత్ర సమయంలో 1వ జెర్క్సెసు చేత ఇలాంటి పడవల వంతెన నిర్మించబడింది. పర్షియన్లు గ్రీకు నగర-రాజ్యాలను పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయినప్పటికీ సముద్రయానంలో పాల్గొనే సంప్రదాయాన్ని పర్షియను రాజులు ముఖ్యంగా 2వ ఆర్టాక్సెర్క్సెసు కొనసాగించారు. సంవత్సరాల తరువాత అలెగ్జాండరు పర్షియా మీద దండెత్తి భారతదేశం వైపు ముందుకు సాగుతున్నప్పుడు. ఆయన పర్షియన్ల యుద్ధ కళ నుండి ఒక పద్ధతిని స్వీకరించి క్రీ.పూ. 327 వసంతకాలంలో భారతదేశంలోని సింధు నది మీద హెఫెస్టియను, పెర్డిక్కాసులతో ఇలాంటి పడవల వంతెనను నిర్మింపజేశాడు.[169]
సంస్కృతి
[మార్చు]భాషలు
[మార్చు]2వ సైరసు మొదటి డారియసు పాలనలో, ప్రభుత్వ పీఠం ఎలాంలోని సూసాలో ఉన్నంత కాలం, కార్యాలయ భాషగా ఎలామైటు ఉండేది. ఇది ప్రధానంగా పెర్సెపోలిసు కోట, ఖజానా శాసనాలలో ధృవీకరించబడింది. ఇవి సామ్రాజ్యం రోజువారీ కార్యకలాపాల వివరాలను వెల్లడిస్తాయి.[171] రాజుల గొప్ప శిలా శాసనాలలో ఎలామైటు పాఠాలు ఎల్లప్పుడూ అక్కాడియను (బాబిలోనియను మాండలికం), పాత పర్షియను శాసనాలతో పాటుగా ఉంటాయి. ఈ సందర్భాలలో ఎలామైటు పాఠాలు పాత పర్షియను వాటికి అనువాదాలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి, సూసాలోని రాజధాని ప్రభుత్వం ఎలామైటును ఉపయోగించినప్పటికీ అది సామ్రాజ్యంలో ప్రతిచోటా ప్రామాణిక ప్రభుత్వ భాషగా ఉండేది కాదని భావించవచ్చు. క్రీ.పూ. 458 తర్వాత ఎలామైటు వాడకం ధృవీకరించబడలేదు.[172]


మెసొపొటేమియాను జయించిన తరువాత ఆ భూభాగంలో ఉపయోగించే అరామికు భాషను, "వివిధ ప్రజలు, భాషలు గల విశాల సామ్రాజ్యం విభిన్న ప్రాంతాల మధ్య వ్రాతపూర్వక సంభాషణకు ఒక సాధనంగా" స్వీకరించారు. ఆధునిక మేధావులు "అధికారిక అరామికు" లేదా "సామ్రాజ్య అరామికు" అని పిలిచే ఒకే అధికారిక భాషను ఉపయోగించడం అకెమెనీడులు తమ సువిశాల సామ్రాజ్యాన్ని అంతకాలం పాటు ఏకీకృతంగా ఉంచడంలో సాధించిన అద్భుతమైన విజయానికి ఎంతగానో దోహదపడిందని భావించవచ్చు. 1955లో రిచర్డు ఫ్రై, సామ్రాజ్య అరామికును అధికారిక భాషగా వర్గీకరించడాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే మిగిలి ఉన్న ఏ శాసనం కూడా ఏ నిర్దిష్ట భాషకు ఆ హోదాను స్పష్టంగా, నిస్సందేహంగా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఫ్రై సామ్రాజ్య అరామికును అకెమెనీడు సామ్రాజ్యం 'లింగ్వా ఫ్రాంకా'గా పునఃవర్గీకరించారు. అకెమెనీడు సామ్రాజ్యంలో అరామికు భాష వాడకం సాధారణంగా భావించిన దానికంటే చాలా విస్తృతంగా ఉందని సూచించారు. సామ్రాజ్యం పతనమైన చాలా శతాబ్దాల తర్వాత అరామికు లిపి,—భావచిత్రాలుగా—అరామికు పదజాలం పహ్లావి లిపి వ్యవస్థ ముఖ్య లక్షణాలుగా నిలిచిపోయాయి.[173]
కొన్ని ముద్రలు, కళా వస్తువుల మీద ప్రాచీన పర్షియను భాష కనిపించినప్పటికీ ఆ భాష ప్రధానంగా పశ్చిమ ఇరాన్లోని అకెమెనిడు శాసనాలలోనే కనిపిస్తుంది. ఇది ప్రాచీన పర్షియను ఆ ప్రాంతం సాధారణ భాష అని సూచిస్తుంది. అయితే 2వ ఆర్టాక్సెర్క్సెసు పాలన నాటికి ఆ శాసనాల వ్యాకరణం, అక్షరక్రమం "పరిపూర్ణతకు చాలా దూరంగా" ఉండేవి[174] కాబట్టి ఆ గ్రంథాలను రచించిన లేఖకులు అప్పటికే ఆ భాషను చాలా వరకు మరచిపోయారని వారు పాత శాసనాల మీద ఆధారపడవలసి వచ్చిందని వాటిని వారు చాలా వరకు యథాతథంగా పునరుత్పత్తి చేశారని సూచించబడింది.[175]
సందర్భం అవసరమైనప్పుడు అకెమెనిడు పరిపాలనా ఉత్తరప్రత్యుత్తరాలు గ్రీకు భాషలో జరిగాయి. దీనితో అది విస్తృతంగా ఉపయోగించే ఒక అధికార భాషగా మారింది.[9] అకెమెనిడులకు గ్రీకులతో, గ్రీకులకు వారితో విస్తృతమైన సంబంధాలు ఉన్నప్పటికీ, సామ్రాజ్యం వివిధ కాలాలలో యూరపు, ఆసియా మైనరులోని అనేక గ్రీకు మాట్లాడే ప్రాంతాలను వారు జయించినప్పటికీ స్థానిక ప్రాచీన ఇరానియన్ ఆధారాలు గ్రీకు భాషా ప్రభావానికి సంబంధించిన ఎటువంటి సూచనను అందించవు.[9] అయితే సామ్రాజ్యం ప్రధాన ప్రాంతాలలో గ్రీకులు మోహరించబడటమే కాకుండా అకెమెనిడు సామ్రాజ్యం హృదయభూమి అయిన ఇరానులో కూడా నివసించి పనిచేశారనడానికి (హెరోడోటసు వృత్తాంతాలతో పాటు) పుష్కలమైన ఆధారాలు ఉన్నాయి.[9] ఉదాహరణకు, సూసాలోని డారియసు రాజభవనాన్ని నిర్మించిన వివిధ జాతులలో గ్రీకులు కూడా ఒక భాగం, అంతేకాకుండా అక్కడ సమీపంలో గ్రీకు శాసనాలు, గ్రీకు భాషలో వ్రాయబడిన ఒక చిన్న పెర్సెపోలిసు ఫలకం కూడా కనుగొనబడ్డాయి.[9]
ఆచారాలు
[మార్చు]
హెరోడోటసు పేర్కొన్నదాని ప్రకారం, పర్షియన్లను గొప్ప పుట్టినరోజు విందులకు ఆహ్వానించేవారు (హెరోడోటసు, హిస్టరీసు 8), ఆ విందుల తర్వాత అనేక రకాల తీపి వంటకాలు ఉండేవి. గ్రీకులు తమ భోజనంలో వీటిని చేర్చనందుకు పర్షియన్లు వారిని విమర్శించేవారు. పర్షియన్లు పెద్ద మొత్తంలో వైన్ తాగేవారని, దానిని సంప్రదింపుల కోసం కూడా ఉపయోగించేవారని తాగి ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాల మీద చర్చించి, మరుసటి రోజు స్పృహలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం మీద చర్య తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునేవారని కూడా ఆయన గమనించాడు.[176]
మతం
[మార్చు]మత సహనం అకెమెనిడు సామ్రాజ్యం "ఒక విశేష లక్షణం"గా వర్ణించబడింది. [177] పాత నిబంధన ప్రకారం, పర్షియను రాజు సైరస్ ది గ్రేట్ క్రీ.పూ. 539–530లో బాబిలోనియను బానిసత్వం నుండి యూదు ప్రజలను విడిపించి వారిని వారి స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించాడు. [178]సైరసు ది గ్రేటు వివిధ నగరాలలోని పవిత్ర స్థలాల పునరుద్ధరణలో సహాయం చేశాడు.[177]
అకెమెనిడు కాలంలోనే జొరాస్ట్రియనిజం నైరుతి ఇరాన్కు చేరుకుంది. అక్కడ అది పాలకులచే ఆమోదించబడి, వారి ద్వారా పర్షియను సంస్కృతిలో ఒక కీలకమైన భాగంగా మారింది. ఈ మతం సాంప్రదాయ ఇరానియన్ దేవతల సమూహంలోని భావనలు, దేవతలకు ఒక అధికారిక రూపాన్ని ఇవ్వడమే కాకుండా, స్వేచ్ఛా సంకల్పం వంటి అనేక కొత్త ఆలోచనలను కూడా పరిచయం చేసింది.[179][180]
అకెమెనిడు సామ్రాజ్యంలో మిత్రుడు [181] ఆరాధించబడ్డాడు; ఆయన దేవాలయాలు, చిహ్నాలు అత్యంత విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఆయనతో సంబంధం ఉన్న పేర్లను కలిగి ఉన్నారు. [182][183] చాలా పండుగలు ఆయనకు అంకితం చేయబడ్డాయి. [184] చాలా పండుగలు ఆయనకే అంకితం చేయబడ్డాయి. [185][186]

1వ ఆర్టాక్సెర్క్సెసు, 2వ డారియసు, పాలనలో, గ్రీకు చరిత్రకారుడు హెరోడోటసు ఇలా వ్రాశాడు: "పర్షియన్లకు దేవతల విగ్రహాలు లేవు. దేవాలయాలు గానీ బలిపీఠాలు గానీ లేవు. వాటిని ఉపయోగించడాన్ని అవివేకానికి చిహ్నంగా భావిస్తారు. ఇది నా అభిప్రాయం ప్రకారం దేవతలకు మనుషులతో సమానమైన స్వభావం ఉందని వారు నమ్మకపోవడం వల్ల వచ్చింది. గ్రీకులు ఊహించినట్లుగా."[187] పర్షియన్లు వీరికి బలి అర్పిస్తారని ఆయన పేర్కొన్నాడు: "సూర్యుడు, చంద్రుడు, భూమికి, అగ్నికి, నీటికి, గాలులకు. ప్రాచీన కాలం నుండి వారి వరకు పూజించబడుతున్న ఏకైక దేవతలు వీరే. తర్వాతి కాలంలో, వారు యురేనియా ఆరాధనను ప్రారంభించారు. దీనిని వారు అరేబియన్లు, అస్సిరియాన్ల నుండి స్వీకరించారు. మైలిట్టా అనేది అస్సిరియన్లు ఈ దేవతను పిలిచే పేరు. దీనిని పర్షియన్లు అనాహిత అని పిలిచేవారు."[187]
బాబిలోనియను పండితుడు, పూజారి బెరోససు—2వ ఆర్టాక్సెర్క్సెసు పాలన తర్వాత డెబ్బై సంవత్సరాలకు పైగా వ్రాస్తున్నప్పటికీ—చక్రవర్తియే మొదటిసారిగా దేవతల విగ్రహాలను తయారు చేయించి సామ్రాజ్యంలోని అనేక ప్రధాన నగరాలలోని దేవాలయాలలో వాటిని ప్రతిష్ఠించాడని నమోదు చేశాడు.[188]2వ ఆర్టాక్సెర్క్సెసు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించే వరకు పర్షియన్లకు దేవతల విగ్రహాల గురించి తెలియదని బెరోససు చెప్పడం ద్వారా హెరోడోటసు మాటలను కూడా సమర్థించాడు. బలి ఇచ్చే పద్ధతుల గురించి హెరోడోటసు ఇలా జతచేస్తాడు. "వారు బలిపీఠాన్ని నిర్మించరు, అగ్నిని వెలిగించరు, నైవేద్యాలు సమర్పించరు." హెరోడోటసు ఇంకా ఇలా గమనించాడు, "ఒక మాగసు (పూజారి) హాజరు లేకుండా ఏ ప్రార్థన గానీ, నైవేద్యం గానీ చేయబడదు."
మహిళలు
[మార్చు]అకెమెనిడ్ సామ్రాజ్యంలో మహిళల స్థానం వారు చెందిన సంస్కృతిని బట్టి మారుతూ ఉండేది. అందువలన ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉండేది. అసలైన పర్షియాలో పర్షియను మహిళల స్థానం సాంప్రదాయకంగా పౌరాణిక బైబిలు ప్రస్తావనలు, కొన్నిసార్లు పక్షపాతంతో కూడిన ప్రాచీన గ్రీకు మూలాల నుండి వర్ణించబడింది. ఈ రెండూ కూడా ఆధారాలుగా పూర్తిగా విశ్వసనీయమైనవి కావు. కానీ అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు పురావస్తు పెర్సెపోలిసు ఫోర్టిఫికేషను టాబ్లెట్లు (PFT), ఇవి పెర్సెపోలిసులోని రాజ దర్బారుకు సంబంధించిన మహిళల గురించి, రాజ కుటుంబ మహిళల నుండి పెర్సెపోలిసులో ఆహార రేషన్లు పొందిన మహిళా కార్మికుల వరకు వివరిస్తాయి.[189]
పర్షియను దర్బారులో రాజ కుటుంబ మహిళల శ్రేణి ఈ క్రింది విధంగా ఉండేది: రాజు తల్లి, ఆ తర్వాత రాణి, రాజు కుమార్తెలు, రాజు ఉపపత్నులు, రాజభవనంలోని ఇతర మహిళలు.[189] రాజు సాధారణంగా రాజ కుటుంబానికి చెందిన మహిళను లేదా ఒక సాత్రపు లేదా మరొక ముఖ్యమైన పర్షియను వ్యక్తికి సంబంధించిన పర్షియను ఉన్నత మహిళను వివాహం చేసుకునేవాడు; రాజకుటుంబ సభ్యులు బంధువులను వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండేది. కానీ సవతి తోబుట్టువుల కంటే దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య వివాహానికి ఎటువంటి ఆధారాలు లేవు.[189] రాజు ఉపపత్నులు తరచుగా బానిసలు, కొన్నిసార్లు యుద్ధ ఖైదీలు, లేదా విదేశీ యువరాణులుగా ఉండేవారు. వారు విదేశీయులు కావడం వల్ల రాజు వారిని వివాహం చేసుకోలేదు. వారి పిల్లలకు సింహాసనాన్ని వారసత్వంగా పొందే హక్కు ఉండేది కాదు.[189]
గ్రీకు ఆధారాలు రాజుకు వందలాది మంది ఉపపత్నులు అంతఃపురంలో ఏకాంతంగా ఉంచబడ్డారని ఆరోపిస్తున్నాయి. కానీ పర్షియను ఆస్థానంలో అంతఃపురం ఉనికిని గానీ, లేదా పురుషులతో సంబంధం లేకుండా స్త్రీలను ఏకాంతంగా ఉంచడాన్ని గానీ సమర్థించే పురావస్తు ఆధారాలు లేవు.[189] రాజకుటుంబ మహిళలు అల్పాహారం, విందు సమయంలో రాజుతో చేరేవారు. ఆయన ప్రయాణాలలో ఆయనతో పాటు వెళ్ళేవారు.[189] వారు రాజ వేటలో అలాగే రాజ విందులలో కూడా పాల్గొని ఉండవచ్చు; హెరోడోటసు ఇలా వివరిస్తాడు, మాసిడోనియను ఆస్థానంలో పర్షియను రాయబారులు ఒక విందులో మహిళల ఉనికిని కోరారు. ఎందుకంటే వారి స్వదేశంలో విందులలో మహిళలు పాల్గొనడం ఆచారం.[189] రాణి రాజు సభకు హాజరై ఉండవచ్చు. పురావస్తు ఆధారాలు ఆమె తన సొంత సభలను నిర్వహించిందని కనీసం మహిళా విన్నపదారుల కోసం అయినా, చూపిస్తున్నాయి.[189] ఆస్థానంలోని రాజకుటుంబ మహిళలు, ఉన్నత వంశపు మహిళలు పురుష, మహిళా సిబ్బందితో కలిసి సొంతంగా ప్రయాణించగలరు. తమ సొంత సంపద, భూమి, వ్యాపారాలను కలిగి ఉండి, నిర్వహించగలరు.[189] పర్షియను మహిళల చిత్రణలు వారిని పొడవాటి దుస్తులు, ముసుగులతో చూపిస్తాయి. అవి వారి ముఖాలను గానీ, జుట్టును గానీ కప్పవు, కేవలం అలంకారంగా తల వెనుక భాగంలో మెడపైకి జారిపడతాయి.[189]
రాజకుటుంబానికి, ఉన్నత వర్గాలకు చెందిన అకెమెనిడు మహిళలకు గుర్రపు స్వారీ, విలువిద్య వంటి ఏకాంత జీవితానికి సరిపోని విషయాలలో విద్యను అందించారు.[190][191] రాజకుటుంబానికి, ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు విశాలమైన ఎస్టేటులను, కర్మాగారాలను కలిగి ఉండి వాటిని నిర్వహించేవారు. పెద్ద సంఖ్యలో సేవకులను, వృత్తిపరమైన కార్మికులను నియమించుకునేవారు.[192] రాజకుటుంబానికి మరియు ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు పురుషుల నుండి ఏకాంతంగా జీవించినట్లు అనిపించదు. ఎందుకంటే వారు బహిరంగ ప్రదేశాలలో కనిపించారని[193] వారు తమ భర్తలతో కలిసి ప్రయాణించారని,[193] వేటలో,[194] విందులలో[195] పాల్గొన్నారని తెలిసింది: కనీసం ఒక రాజు లేదా ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి, ప్రధాన భార్య ఏకాంతంగా జీవించలేదు. ఎందుకంటే భార్యలు ఆచారబద్ధంగా విందు భోజనాలలో తమ భర్తలతో పాటు వచ్చేవారని స్పష్టంగా పేర్కొనబడింది. అయినప్పటికీ "మహిళా వినోదకారిణులు" వచ్చినప్పుడు, పురుషులు "వినోద కార్యక్రమాలు" ప్రారంభించినప్పుడు వారు విందు నుండి వెళ్లిపోయేవారు.[196]
ఏ మహిళ కూడా అకెమెనిడు సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా గానీ లేదా ప్రతినిధిగా గానీ పాలించలేదు. కానీ కొంతమంది రాణుల భార్యలు రాజ్య వ్యవహారాల మీద ప్రభావం చూపారని తెలిసింది. ముఖ్యంగా అటోస్సా, పారిసాటిసు. పరిపాలనలో లేదా మతపరమైన సేవలో ఏ మహిళలైనా అధికారులుగా నియమించబడినట్లు ఎటువంటి ఆధారాలు లేవు; అయితే పెర్సెపోలిసులో మహిళలు స్వేచ్ఛా కార్మికులుగా పనిచేసినట్లు పుష్కలమైన పురావస్తు ఆధారాలు ఉన్నాయి. అక్కడ వారు పురుషులతో పాటు పనిచేశారు.[189] మహిళలు తమ కార్మిక బృందాలకు నాయకులుగా నియమించబడవచ్చు, వారిని 'అర్రాషర పాషబెన' అనే బిరుదుతో పిలిచేవారు. వారికి వారి కార్మిక బృందంలోని పురుష కార్మికుల కంటే ఎక్కువ జీతం ఇచ్చేవారు;[189] మహిళా కార్మికులకు పురుషుల కంటే తక్కువ వేతనం ఇచ్చినప్పటికీ, చేతివృత్తులలోని అర్హత కలిగిన కార్మికులకు వారి లింగంతో సంబంధం లేకుండా సమాన వేతనం ఇచ్చేవారు.[189] అయినప్పటికీ చివరి అకెమెనిడు, హెలెనిస్టికు బాబిలోను నుండి లభించిన క్యూనిఫాం ఆధారాలలో మతపరమైన సందర్భాలలో మహిళలు విస్తృతంగా కనిపిస్తారు.[197]
వాస్తుశిల్పం - కళ
[మార్చు]
అకెమెనిడు వాస్తుశిల్పంలో పెద్ద నగరాలు, దేవాలయాలు, రాజభవనాలు. సైరసు ది గ్రేటు సమాధి వంటి సమాధులు ఉన్నాయి. దాని వాస్తుశిల్పం, ముఖ్య లక్షణం దాని విభిన్న శైలుల సమ్మేళనం. ఇందులో మెడియా, అస్సిరియను, ఆసియా గ్రీకు అంశాలన్నీ పొందుపరచబడ్డాయి. అయినప్పటికీ పూర్తి అయిన నిర్మాణాలలో ఒక ప్రత్యేకమైన పర్షియను గుర్తింపును నిలుపుకుంది.[198] దీని ప్రభావం మధ్యధరా తీరాల నుండి భారతదేశం వరకు, అకెమెనిడులచే పాలించబడిన ప్రాంతాలన్నింటిలో విస్తరించి ఉంది. ముఖ్యంగా రాతితో చెక్కబడిన స్మారకచిహ్నాల రూపకల్పన, నీటి కాలువల ద్వారా విభజించబడిన తోటల మీద దాని ప్రాధాన్యత కనిపిస్తుంది.[199]
అకెమెనిడు కళలో ఫ్రీజు శిల్పాలు, ఆక్ససు ట్రెజరు వంటి లోహపు పని, రాజభవనాల అలంకరణ, మెరుస్తున్న ఇటుకల నిర్మాణం, చక్కటి చేతిపని (తాపీపని, వడ్రంగి పని మొదలైనవి) తోటల పెంపకం ఉన్నాయి. పర్షియన్లు తమ సామ్రాజ్యం నలుమూలల నుండి కళాకారులను తీసుకువచ్చి, వారి శైలులు, పద్ధతులను పొందుపరిచినప్పటికీ, వారు కేవలం శైలుల కలయికను మాత్రమే కాకుండా, ఒక కొత్త, ప్రత్యేకమైన పర్షియను శైలి, సంశ్లేషణను సృష్టించారు.[200]
అకెమెనిడు వాస్తుశిల్పం, కళకు అత్యంత విశేషమైన ఉదాహరణలలో ఒకటి పెర్సెపోలిసు లోని గొప్ప రాజభవనం. దాని గొప్ప పరిమాణంతో పాటు దాని వివరణాత్మక పనితనం. సూసాలోని డేరియసు రాజభవనం నిర్మాణాన్ని వివరిస్తూ, మహానుభావుడైన డేరియసు ఇలా నమోదు చేశాడు:
యాకా కలపను గాందారా, కార్మానియా నుండి తీసుకువచ్చారు. బంగారాన్ని సార్డిసు, బాక్ట్రియా నుండి తీసుకువచ్చారు... నీలమణి, కార్నెలియను అనే విలువైన రాళ్లను సోగ్డియానా నుండి తీసుకువచ్చారు. మణిరత్నాన్ని ఖోరాస్మియా నుండి, వెండి, నల్లకలపను ఈజిప్ట్ నుండి, అలంకరణ వస్తువులను ఐయోనియా నుండి, ఏనుగు దంతాలను ఇథియోపియా, సింధు అరకోసియా నుండి తీసుకువచ్చారు. రాళ్లను చెక్కిన రాతిపనివారు ఐయోనియన్లు, సార్డియన్లు. స్వర్ణకారులు, మెడియన్లు, ఈజిప్షియన్లు. కలపతో పనిచేసినవారు సార్డినియన్లు, ఈజిప్షియన్లు. కాల్చిన ఇటుకలతో పనిచేసినవారు బాబిలోనియన్లు. గోడను అలంకరించినవారు మీడియన్లు, ఈజిప్షియన్లు.
— మహానుభావుడైన డేరియసు, DSf శాసనం
-
సూసాలోని డారియసు ప్యాలెసు పునర్నిర్మాణం. ఈ ప్యాలెసు పెర్సెపోలిసుకు ఒక నమూనాగా నిలిచింది.
-
మహాను డారియసు ప్యాలెసు నుండి ఒక అలంకార పలక మీద సింహం చిత్రం, లూవ్రే మ్యూజియం
-
సింహం, ఎద్దు పోరాడుతున్న ప్రసిద్ధ శిల్పం, పెర్సెపోలిసు అపదానా
-
మజాందరనుకు చెందిన సింహపు బొమ్మలతో ఉన్న అకెమెనిడు బంగారు గిన్నె, ఇరాన్ జాతీయ మ్యూజియం
సమాధులు
[మార్చు]
అనేక అకెమెనిడు పాలకులు తమ కోసం సమాధులను నిర్మించుకున్నారు. అత్యంత ప్రసిద్ధమైనది, నక్ష్-ఎ రుస్తం, ఇది పెర్సెపోలిసుకు వాయువ్యంగా సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న ఒక పురాతన సమాధుల ప్రదేశం. ఈ పర్వతంలో ఈ రాజవంశానికి చెందిన నలుగురు రాజుల సమాధులు చెక్కబడ్డాయి: 1వ డారియసు, 1వ జెర్క్సెసు, 1వ ఆర్టాక్సెర్క్సెసు, 2వ డారియసు. ఇతర రాజులు తమ సమాధులను వేరే చోట్ల నిర్మించుకున్నారు. 2వ ఆర్టాక్సెర్క్సెసు, 3వ ఆర్టాక్సెర్క్సెసు తమ సమాధులను తమ వసంతకాల రాజధాని అయిన పెర్సెపోలిసు పక్కన చెక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. ఎడమ వైపు సమాధి 2వ ఆర్టాక్సెర్క్సెసుకి చెందినది, కుడి వైపు సమాధి 3వ ఆర్టాక్సెర్క్సెసుకి చెందినది. ఆయన సమాధిని కలిగి ఉన్న చివరి అకెమెనిడు రాజు. అకెమెనిడు రాజవంశ స్థాపకుడైన సైరసు ది గ్రేటు సమాధి పసరుగడెలో నిర్మించబడింది (ప్రస్తుతం ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశం).[201]
వారసత్వం
[మార్చు]
అకెమెనిడు సామ్రాజ్యాన్ని మొదటి "ప్రపంచ సామ్రాజ్యం"గా పేర్కొంటారు. ఎందుకంటే పర్షియను రాజుల మాటలలో చెప్పాలంటే అందులో "అనేక ప్రజలు, అనేక భాషలు" ఉండేవి. సామ్రాజ్యాన్ని రూపొందించిన విభిన్న సమూహాలు గొప్ప చట్టపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని అనుభవించాయి.[202] అకెమెనిడు సామ్రాజ్యం ఆసియా, మధ్యప్రాచ్యం వారసత్వం, సాంస్కృతిక గుర్తింపు మీద శాశ్వత ముద్ర వేసింది. భవిష్యతు సామ్రాజ్యాల అభివృద్ధి, నిర్మాణం మీద ప్రభావం చూపింది. వాస్తవానికి, గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు, సామ్రాజ్యాన్ని పరిపాలించే పర్షియను పద్ధతిలోని ఉత్తమ లక్షణాలను స్వీకరించారు.[203] పర్షియను పరిపాలనా నమూనా, అబ్బాసిదు ఖలీఫాతు విస్తరణ. నిర్వహణలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంది. వీరి పాలన విస్తృతంగా 'ఇస్లామికు స్వర్ణయుగం' కాలంగా పరిగణించబడుతుంది. ప్రాచీన పర్షియన్ల మాదిరిగానే, అబ్బాసిదు రాజవంశం తమ విశాలమైన సామ్రాజ్యాన్ని మెసొపొటేమియాలో (బాబిలోను చారిత్రక ప్రదేశానికి సమీపంలో ఉన్న కొత్తగా స్థాపించబడిన బాగ్దాదు, సమర్రా నగరాలలో) కేంద్రీకరించింది. పర్షియను ఉన్నత వర్గం నుండి అధిక మద్దతు పొందింది. పర్షియను భాషను, వాస్తుశిల్పాన్ని ఇస్లామికు సంస్కృతిలో విరివిగా చేర్చింది. అకెమెనిడు సామ్రాజ్యం పాశ్చాత్య చరిత్రలో గ్రీకో-పర్షియను యుద్ధాల సమయంలో గ్రీకు నగర-రాజ్యాలకు విరోధిగా, బాబిలోనులోని యూదు ప్రవాసులను విముక్తి చేసినందుకు ప్రసిద్ధి చెందింది. ఈ సామ్రాజ్యం చారిత్రక ముద్ర దాని ప్రాదేశిక సైనిక ప్రభావాలకు మించి విస్తరించింది. సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక, మతపరమైన ప్రభావాలను కూడా కలిగి ఉంది. ఉదాహరణకు పరస్పర సాంస్కృతిక మార్పిడిలో చాలా మంది ఏథెన్సు వాసులు తమ దైనందిన జీవితంలో అకెమెనిడు ఆచారాలను స్వీకరించారు. కొందరు పర్షియను రాజుల వద్ద ఉద్యోగంలో ఉన్నారు. లేదా వారితో పొత్తు పెట్టుకున్నారు. సైరసు శాసనం ప్రభావం యూదు-క్రైస్తవ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ సామ్రాజ్యం జొరాస్ట్రియనిజంను తూర్పున చైనా వరకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సామ్రాజ్యం ఇరాన్ (పర్షియా అని కూడా పిలువబడే) రాజకీయాలు, వారసత్వం, చరిత్రకు కూడా మార్గదర్శకంగా నిలిచింది.[204] చరిత్రకారుడు ఆర్నాల్డు టాయనుబీ అబ్బాసిదు సమాజాన్ని అకెమెనిడు సమాజం "పునరేకీకరణ" లేదా "పునర్జన్మ"గా అభివర్ణించారు. ఎందుకంటే పర్షియను, టర్కికు, ఇస్లామికు పాలనా విధానాలు, జ్ఞానం సమ్మేళనం, టర్కికు మూలానికి చెందిన సెల్జుకు, ఒట్టోమను, సఫావిదు, మొఘల్ సామ్రాజ్యాల ద్వారా యూరేషియాలోని విశాలమైన ప్రాంతంలో పర్షియనేటు సంస్కృతి వ్యాప్తికి దోహదపడింది.[205] చరిత్రకారుడు బెర్నార్డు లూయిసు ఇలా వ్రాశారు,
అరబికు కవిత్వంతో సహా సాంస్కృతిక కృషి ప్రతి రంగంలోనూ ఇరానియన్ల పనిని చూడవచ్చు. అరబికులో తమ కవితలను రచించిన ఇరానియను మూలానికి చెందిన కవులు దీనికి చాలా ముఖ్యమైన తోడ్పాటు అందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరానియను ఇస్లాం అనేది ఇస్లాం రెండవ ఆవిర్భావం. దీనిని కొన్నిసార్లు ఇస్లాం-ఇ-అజం అని పిలుస్తారు. అసలైన అరబు ఇస్లాం కాకుండా, ఈ పర్షియను ఇస్లామే కొత్త ప్రాంతాలకు, కొత్త ప్రజలకు తీసుకువెళ్లబడింది: మొదట మధ్య ఆసియాలో ఆ తర్వాత మధ్యప్రాచ్యంలో టర్కీ అని పిలువబడిన దేశంలో టర్కులకు, నిస్సందేహంగా భారతదేశానికి. ఒట్టోమను టర్కులు ఇరానియను నాగరికత ఒక రూపాన్ని వియన్నా గోడల వరకు తీసుకువచ్చారు. [...] పదమూడవ శతాబ్దపు గొప్ప మంగోలు దండయాత్రల సమయానికి, ఇరానియను ఇస్లాం కేవలం ఒక ముఖ్యమైన భాగంగా మాత్రమే కాకుండా; అది ఇస్లాంలోనే ఒక ఆధిపత్య అంశంగా మారింది. అనేక శతాబ్దాల పాటు ఇస్లామికు శక్తి, నాగరికత ప్రధాన కేంద్రాలు, ఇరానియను దేశాలు కాకపోయినా కనీసం ఇరానియను నాగరికతచే ప్రభావితమైన దేశాలలోనే ఉన్నాయి... మధ్యయుగ చివరి, ఆధునిక ప్రారంభ కాలాలలో ఇస్లాం ప్రధాన కేంద్రాలు, రాజకీయ, సాంస్కృతిక శక్తి కేంద్రాలైన భారతదేశం, మధ్య ఆసియా, ఇరాను, టర్కీ అన్నీ ఈ ఇరానియను నాగరికతలో భాగమే.[206]
జార్జ్ డబ్ల్యూ. ఎఫ్. హేగెల్ తన చరిత్ర తత్వశాస్త్రం అనే గ్రంథంలో పర్షియన్ సామ్రాజ్యాన్ని "నశించిపోయిన మొదటి సామ్రాజ్యం"గా, దాని ప్రజలను చరిత్రలో "మొదటి చారిత్రక ప్రజలు"గా పరిచయం చేశారు. ఆయన వివరణ ప్రకారం:
పర్షియను సామ్రాజ్యం ఆధునిక అర్థంలో ఒక సామ్రాజ్యం—జర్మనీలో ఉన్నటువంటిది, నెపోలియను పాలనలో ఉన్న గొప్ప సామ్రాజ్య రాజ్యం వంటిది; ఎందుకంటే ఇది అనేక రాష్ట్రాలతో కూడి ఉన్నట్లు మనం చూస్తాము. అవి వాస్తవానికి ఆధారపడినప్పటికీ, తమ సొంత వ్యక్తిత్వాన్ని, ఆచారాలను, చట్టాలను నిలుపుకున్నాయి. అందరికీ వర్తించే సాధారణ శాసనాలు, వారి రాజకీయ, సామాజిక ప్రత్యేకతలకు భంగం కలిగించలేదు. పైగా వాటిని రక్షించి, నిలబెట్టాయి; తద్వారా సమగ్ర సామ్రాజ్యంలో భాగమైన ప్రతి జాతికి దాని స్వంత రాజ్యాంగ స్వరూపం ఉండేది. కాంతి ప్రతి వస్తువును ప్రకాశింపజేసి, దానికి ఒక ప్రత్యేకమైన జీవశక్తిని ప్రసాదించినట్లుగా, పర్షియను సామ్రాజ్యం అనేక జాతుల మీద విస్తరించి, ప్రతి జాతికి దాని ప్రత్యేక స్వభావాన్ని నిలుపుకుంది. కొన్నింటికి సొంత రాజులు కూడా ఉన్నారు; ప్రతిదానికి దాని ప్రత్యేక భాష, ఆయుధాలు, జీవన విధానం, ఆచారాలు ఉన్నాయి. ఈ వైవిధ్యమంతా కాంతి నిష్పక్షపాత పాలనలో సామరస్యంగా సహజీవనం చేస్తుంది... ఇది ప్రజల సమ్మేళనం—ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛను ఇస్తుంది. దీనివల్ల, జాతులు తమ విధ్వంసకర కలహాలను కొనసాగించడానికి అలవాటుపడిన ఆ అనాగరికతకు, క్రూరత్వానికి అడ్డుకట్ట పడింది.[207]
అమెరికన్ చరిత్రకారుడు. తత్వవేత్త అయిన విల్ డ్యూరాంటు, 1948 ఏప్రిలు 21న టెహ్రానులో 'ఇరాన్-అమెరికా సొసైటీ' ముందు చేసిన "నాగరికత చరిత్రలో పర్షియా" అనే తన ప్రసంగాలలో ఒకదానిలో ఇలా పేర్కొన్నారు:
వేలాది సంవత్సరాలుగా పర్షియన్లు సౌందర్యాన్ని సృష్టిస్తున్నారు. క్రీస్తుకు పదహారు శతాబ్దాల ముందు ఈ ప్రాంతాల నుండి లేదా దానికి సమీప ప్రాంతాల నుండి... మీరు నాగరికతకు ఒక విధమైన జలవిభజక ప్రాంతంగా ఉన్నారు. మీ రక్తాన్ని, ఆలోచనలను, కళను, మతాన్ని తూర్పుకు, పడమరకు ప్రపంచంలోకి ప్రవహింపజేశారు... మీ అకెమెనిడు కాలపు విజయాలను నేను మీకు మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. అప్పుడు తెలిసిన చరిత్రలో మొదటిసారిగా యునైటెడు స్టేట్సు అంత విస్తారమైన సామ్రాజ్యం ఒక క్రమబద్ధమైన ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన పరిపాలనను, వేగవంతమైన సమాచార వ్యవస్థను, గంభీరమైన రహదారుల మీద ప్రజలు, వస్తువుల రవాణాకు భద్రతను పొందింది. ఇది మన కాలానికి ముందు సామ్రాజ్య రోం ఉచ్ఛదశలో మాత్రమే సాటిలేనిదిగా ఉంది.
పాలకుల జాబితా
[మార్చు]| పేరు | చిత్రం | వ్యాఖ్యలు | కాలం |
|---|---|---|---|
| అకెమెనెసు | అకెమెనిడ్ రాజ్యానికి మొదటి పాలకుడు మరియు రాజవంశ స్థాపకుడు. బెహిస్తున్ శాసనం ద్వారా మాత్రమే ధృవీకరించబడింది. | క్రీ.పూ. 705 | |
| టీస్పెసు | అకెమెనెస్ కుమారుడు. బెహిస్తున్ శాసనం ద్వారా మాత్రమే ధృవీకరించబడింది. | క్రీ.పూ. 640 | |
| 1వసైరసు | టీస్పెస్ కుమారుడు, ధృవీకరణ ఉన్న మొదటి అకెమెనిడ్ పాలకుడు. | క్రీ.పూ. 580 | |
| 1వ కంబైసెసు | 1వ సైరసు కుమారుడు, 2వ సైరసు తండ్రి. అతని పాలన నాటి రికార్డులు ఏవీ లభ్యం కాలేదు. | క్రీ.పూ. 550 | |
| 2వ సైరసు | రాజవంశాన్ని సామ్రాజ్యంగా మార్చాడు; "ప్రపంచంలోని నాలుగు మూలల" రాజు | క్రీ.పూ. 560–530 | |
| 2వ కంబైసెసు | ఈజిప్టు ఫారోతో పాటు పర్షియా రాజు | క్రీ.పూ. 530–522 | |
| గౌమత | పర్షియా రాజు, గౌమత అనే పేరు గల ఒక మోసగాడు అని ఆరోపణ. | క్రీ.పూ. 522 | |
| 1వ డారియసు | ఈజిప్టు ఫారోతో పాటు పర్షియా రాజు. 2వ కంబైసెసు బార్డియా బంధువు. | 522–486 క్రీ.పూ. | |
| 1వ జెర్సెసు | పర్షియా రాజు ఈజిప్టు ఫారో | 486–465 క్రీ.పూ. | |
| 1వ అర్టాక్సెర్క్సెసు | పర్షియా రాజు ఈజిప్టు ఫారో | 465–424 క్రీ.పూ. | |
| 2వజెర్క్సెసు | పర్షియా రాజు, అదనంగా ఈజిప్టు ఫారో. తన సవతి సోదరుడు మరియు వారసుడైన సోగ్డియానస్ చేత హత్య చేయబడ్డాడు. | క్రీ.పూ. 424 (45 రోజులు) | |
| సోగ్డియానసు | పర్షియా రాజు, అదనంగా ఈజిప్టు ఫారో | క్రీ.పూ. 424–423 | |
| 2వ డారియసు | పర్షియా రాజు, అదనంగా ఈజిప్టు ఫారో. అతని అసలు పేరు ఓచసు. | క్రీ.పూ. 423–405 | |
| 2వ ఆర్టాక్సెర్క్సెసు | పర్షియా రాజు 47 సంవత్సరాలు పాలించిన 2వ ఆర్టాక్సెర్క్సెసు అకెమెనిడు వంశంలో అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాజు. ఆయన అసలు పేరు ఆర్సెసు. | క్రీ.పూ. 405–358 | |
| 3వ ఆర్టాక్సెర్క్సెసు | పర్షియా రాజు, అదనంగా ఈజిప్టు ఫారో. 2వ ఆర్టాక్సెర్క్సెసు పాలనలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి జయించాడు. అతని అసలు పేరు ఓచస్. | క్రీ.పూ. 358–338 | |
| 4వ ఆర్టాక్సెర్క్సెసు | పర్షియా రాజు, ఈజిప్టు ఫారో. ఆయన అసలు పేరు అర్సెసు. | క్రీ.పూ. 338–336 | |
| 3వ డారియసు | పర్షియా రాజు, ఈజిప్టు ఫారో; సామ్రాజ్యం చివరి పాలకుడు. ఆయన అసలు పేరు ఆర్టాషాటా లేదా కొడోమన్నసు. | క్రీ.పూ. 336–330 |
మూలాలు
[మార్చు]- ↑ "DERAFŠ". Encyclopædia Iranica. Encyclopædia Iranica Foundation. 21 November 2011. Retrieved 7 April 2019.
- ↑ 2002 Oxford Atlas of World History p.42 (West portion of the Achaemenid Empire) Archived 29 నవంబరు 2022 at the Wayback Machine and p.43 (East portion of the Achaemenid Empire).
- ↑ O'Brien, Patrick Karl (2002). Atlas of World History (in ఇంగ్లీష్). Oxford University Press. pp. 42–43. ISBN 978-0-19-521921-0.
- ↑ Visible online: Philip's Atlas of World History (1999) Archived 17 అక్టోబరు 2018 at the Wayback Machine
- ↑ The Times Atlas of World History, p. 79 (1989): Barraclough, Geoffrey (1997). The Times Atlas of World History (in ఇంగ్లీష్). Times Books. ISBN 978-0-7230-0906-1.
- ↑ Yarshater, Ehsan (1993). The Cambridge History of Iran. Vol. 3. Cambridge University Press. p. 482. ISBN 978-0-521-20092-9.
Of the four residences of the Achaemenids named by Herodotus—Ecbatana, Pasargadae or Persepolis, Susa and Babylon—the last [situated in Iraq] was maintained as their most important capital, the fixed winter quarters, the central office of bureaucracy, exchanged only in the heat of summer for some cool spot in the highlands. Under the Seleucids and the Parthians the site of the Mesopotamian capital moved slightly to the north on the Tigris—to Seleucia and Ctesiphon. It is indeed symbolic that these new foundations were built from the bricks of ancient Babylon, just as later Baghdad, a little further upstream, was built out of the ruins of the Sassanian double city of Seleucia-Ctesiphon.
- ↑ Kittel, Harald; Frank, Armin Paul; House, Juliane; Greiner, Norbert; Schultze, Brigitte; Koller, Werner (2007). Traduction: encyclopédie internationale de la recherche sur la traduction. Walter de Gruyter. pp. 1194–1195. ISBN 978-3-11-017145-7.
- ↑ Windfuhr, Gernot. "Iran vii. Non-Iranian Languages (3) Elamite". Encyclopædia Iranica. Retrieved 8 February 2017.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 Tucker, Elizabeth (2001). "Greek and Iranian". In Christidis, Anastasios-Phoivos (ed.). A History of Ancient Greek: From the Beginnings to Late Antiquity. Cambridge: Cambridge University Press. ISBN 978-0-521-83307-3.
- ↑ "History of Iran: Achaemenid Society and Culture". www.iranchamber.com. Retrieved 2022-11-19.
- ↑ Boiy, T. (2004). Late Achaemenid and Hellenistic Babylon. Leuven: Peeters Publishers. p. 101. ISBN 978-90-429-1449-0.
- ↑ 12.0 12.1 Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D (December 2006). "East-West Orientation of Historical Empires". Journal of World-Systems Research. 12 (2): 223. ISSN 1076-156X. Retrieved 12 September 2016.
- ↑ 13.0 13.1 Taagepera, Rein (1979). "Size and Duration of Empires: Growth-Decline Curves, 600 B.C. to 600 A.D". Social Science History. 3 (3/4): 121. doi:10.2307/1170959. ISSN 0145-5532. JSTOR 1170959.
- ↑ 14.0 14.1 Bang, Peter Fibiger; Bayly, C. A.; Scheidel, Walter (2020). The Oxford World History of Empire: Volume One: The Imperial Experience (in ఇంగ్లీష్). Oxford University Press. pp. 92–94. ISBN 978-0-19-977311-4.
- ↑ Morris, Ian; Scheidel, Walter (2009). The Dynamics of Ancient Empires: State Power from Assyria to Byzantium. Oxford University Press. p. 77. ISBN 978-0-19-975834-0.
- ↑ Wiesehöfer 2001, p. 119.
- ↑ 17.0 17.1 Lavan, Payne & Weisweiler 2016, p. 17.
- ↑ Brosius 2021, p. 1.
- ↑ Shahbazi, A. Shapour (2012). "The Achaemenid Persian Empire (550–330 bce)". In Daryaee, Touraj (ed.). The Oxford handbook of Iranian history. Oxford: Oxford University Press. p. 131. ISBN 978-0-19-973215-9.
Although the Persians and Medes shared domination and others were placed in important positions, the Achaemenids did not—could not—provide a name for their multinational state. Nevertheless, they referred to it as Khshassa, "the Empire".
- ↑ 20.0 20.1 20.2 Sacks, David; Murray, Oswyn; Brody, Lisa (2005). Encyclopedia of the Ancient Greek World. Infobase Publishing. p. 256. ISBN 978-0-8160-5722-1.
- ↑ Curtis, Vesta Sarkhosh; Stewart, Sarah (2010). The Sasanian Era. I.B. Tauris. ISBN 978-0-85773-309-2.
- ↑ Stokes, Jamie (2009). Encyclopedia of the Peoples of Africa and the Middle East. Vol. II. Infobase Publishing. p. 551. ISBN 978-0-8160-7158-6.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;autoఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Shapour Shahbazi, Alireza (2012). Daryaee, Touraj (ed.). The Oxford handbook of Iranian history. Oxford: Oxford University Press. p. 131. doi:10.1093/oxfordhb/9780199732159.001.0001. ISBN 978-0-19-973215-9.
Although the Persians and Medes shared domination and others were placed in important positions, the Achaemenids did not—could not—provide a name for their multinational state. Nevertheless, they referred to it as Khshassa, "the Empire".
- ↑ Van de Mieroop, Marc (25 June 2015). A history of the ancient Near East ca. 3000–323 BC (Third ed.). Chichester, West Sussex, UK. ISBN 978-1-118-71817-9. OCLC 904507201.
{{cite book}}: CS1 maint: location missing publisher (link) - ↑ 26.0 26.1 Briant 2002, p. 17.
- ↑ Brosius 2006, p. 6.
- ↑ Briant 2002, p. 16.
- ↑ Briant 2002, p. 15.
- ↑ Nabonidus Cylinder I.8–II.25. Archived 12 మే 2021 at the Wayback Machine.
- ↑ Nabonidus Chronicle II.1–4. Archived 11 మే 2021 at the Wayback Machine.
- ↑ Briant 2002, p. 31.
- ↑ Briant 2002, p. 33.
- ↑ Briant 2002, p. 34.
- ↑ హెరోడోటస్, చరిత్రలు I.72, I.73.
- ↑ Briant 2002, pp. 41–43.
- ↑ నబోనిడస్ క్రానికల్ III.12–16.
- ↑ సైరస్ సిలిండర్ 23–35 Archived 19 జనవరి 2019 at the Wayback Machine
- ↑ Kuhrt 1983, pp. 85–86.
- ↑ Briant 2002, pp. 43–44.
- ↑ సైరస్ సిలిండర్ 43 Archived 2019-01-19 at the Wayback Machine
- ↑ కుహర్ట్ 1983.
- ↑ 43.0 43.1 43.2 బ్రియంట్ 2002.
- ↑ 44.0 44.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;behistunsmerdisఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Briant 2002, p. 98.
- ↑ Briant 2002, pp. 49–50.
- ↑ Brosius 2006, p. 13.
- ↑ Wallinga 1984, pp. 406–409.
- ↑ 49.0 49.1 Briant 2002, pp. 52–55.
- ↑ హెరోడోటస్, చరిత్రలు III.11 Archived 2021-02-27 at the Wayback Machine, III.13 Archived 2021-03-10 at the Wayback Machine
- ↑ హెరోడోటస్, చరిత్రలు III.29 Archived 2021-02-25 at the Wayback Machine
- ↑ హెరోడోటస్, చరిత్రలు III.30 Archived 2021-03-01 at the Wayback Machine
- ↑ హెరోడోటస్, చరిత్రలు III.31 Archived 4 మార్చి 2021 at the Wayback Machine
- ↑ హెరోడోటస్, హిస్టరీస్ III.36 Archived 26 ఫిబ్రవరి 2021 at the Wayback Machine
- ↑ Herodotus, Histories III.38 Archived 24 ఫిబ్రవరి 2021 at the Wayback Machine
- ↑ Herodotus, Histories III.61 Archived 24 ఫిబ్రవరి 2021 at the Wayback Machine
- ↑ క్టేసియాస్, పెర్సికా 11 Archived 2 ఏప్రిల్ 2017 at the Wayback Machine
- ↑ Ctesias, Persica 11 Archived 2 ఏప్రిల్ 2017 at the Wayback Machine
- ↑ Briant 2002, p. 61.
- ↑ Briant 2002, pp. 100–101.
- ↑ Briant 2002, pp. 101–103.
- ↑ Herodotus (1897). Herodotus: the text of Canon Rawlinson's translation, with the notes abridged, Volume 1. C. Scribner's. p. 278.
- ↑ Herodotus. The Histories Book 3.80–83.
- ↑ 64.0 64.1 64.2 64.3 64.4 64.5 64.6 Joseph Roisman, Ian Worthington A Companion to Ancient Macedonia. pp. 342–345. John Wiley & Sons, 2011 ISBN 978-1-4443-5163-7
- ↑ The Oxford Classical Dictionary by Simon Hornblower and Antony Spawforth,ISBN 978-0-19-860641-3, p. 1515, "The Thracians were subdued by the Persians by 516"
- ↑ "Persian influence on Greece (2)". Archived from the original on 24 July 2020. Retrieved 17 December 2014.
- ↑ Howe & Reames 2008, p. 239.
- ↑ Johannes Engels, "Ch. 5: Macedonians and Greeks", In: Roisman and Worthington, "A companion to Ancient Macedonia", p. 87. Oxford Press, 2010.
- ↑ "Maka". livius.org.
- ↑ బెహిస్తున్ శాసనం
- ↑ "DĀḠESTĀN". Retrieved 29 December 2014.
- ↑ సునీ, రొనాల్డ్ గ్రిగోర్ (1994). The Making of the Georgian Nation. ఇండియానా యూనివర్సిటీ ప్రెస్. ISBN 978-0-253-20915-3. Retrieved 29 December 2014.
- ↑ రమీరెజ్-ఫారియా, కార్లోస్ (2007). ప్రపంచ చరిత్ర సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం. అట్లాంటిక్ పబ్లిషర్స్ & డిస్ట్. p. 6. ISBN 978-81-269-0775-5. Retrieved 7 అక్టోబర్ 2012.
{{cite book}}: Check date values in:|access-date=(help) - ↑ కుహర్ట్ 2013, p. 2.
- ↑ ఓ'బ్రియన్, పాట్రిక్ (2002). ప్రపంచ చరిత్ర సంక్షిప్త అట్లాస్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. p. 43. ISBN 978-0-19-521921-0. Retrieved 7 అక్టోబర్ 2012.
{{cite book}}: Check date values in:|access-date=(help)
కర్టిస్, జాన్ ఇ.; టాలిస్, నైజెల్ (2005). విస్మృత సామ్రాజ్యం: ప్రాచీన పర్షియా ప్రపంచం. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. p. 47. ISBN 978-0-520-24731-4.
ఫ్యాక్ట్స్ ఆన్ ఫైల్, ఇంకార్పొరేటెడ్ (2009). ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య ప్రజల విజ్ఞాన సర్వస్వం. ఇన్ఫోబేస్ పబ్లిషింగ్. p. 60. Retrieved 7 అక్టోబర్ 2012.{{cite book}}: Check date values in:|access-date=(help); Unknown parameter|ఐఎస్బిఎన్=ignored (help)
ది మేకింగ్ ఆఫ్ రోమన్ ఇండియా. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్. 2008. p. 13. Retrieved 7 అక్టోబర్ 2012.{{cite book}}: Check date values in:|access-date=(help); Unknown parameter|ఐఎస్బిఎన్=ignored (help); Unknown parameter|చివరి పేరు1=ignored (help); Unknown parameter|మొదటి పేరు1=ignored (help)
తొలి భారతదేశం: మూలాల నుండి క్రీ.శ. 1300 వరకు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. 2004. p. 157. Retrieved 7 అక్టోబర్ 2012.{{cite book}}: Check date values in:|access-date=(help); Unknown parameter|ఐఎస్బిఎన్=ignored (help); Unknown parameter|చివరి పేరు1=ignored (help); Unknown parameter|మొదటి పేరు1=ignored (help) - ↑ West, Willis Mason (1904). The ancient world from the earliest times to 800 CE. Allyn and Bacon. p. 137.
The Athenian support was particularly troubling to Darius since he had come to their aid during their conflict with Sparta.
- ↑ 77.0 77.1 Joseph Roisman, Ian Worthington. "A companion to Ancient Macedonia". John Wiley & Sons, 2011. ISBN 978-1-4443-5163-7, pp. 135–138, 343–345.
- ↑ "Darius I | Biography, Accomplishments, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-05-29.
- ↑ హెరోడోటస్ VIII, 21.
- ↑ 80.0 80.1 Hanson, Victor Davis (2007). Carnage and Culture: Landmark Battles in the Rise to Western Power (in ఇంగ్లీష్). Knopf Doubleday Publishing Group. ISBN 978-0-307-42518-8.
- ↑ Iran-e-Bastan/Pirnia, book 1, p. 873.
- ↑ "హత్య". జెర్క్సెస్: ఒక పర్షియన్ జీవితం. యేల్ యూనివర్సిటీ ప్రెస్. 2015-10-06. doi:10.12987/yale/9780300180077.003.0009. ISBN 978-0-300-18007-7.
{{cite book}}: Unknown parameter|చివరి పేరు=ignored (help); Unknown parameter|పుటలు=ignored (help); Unknown parameter|మొదటి పేరు=ignored (help) - ↑ యూరిమెడాన్ యుద్ధం వ్యాసంలో యుద్ధానికి సంబంధించిన సాధ్యమయ్యే తేదీలపై చర్చను చూడండి.
- ↑ "ప్లూటార్క్ రచించిన ప్లూటార్క్ జీవిత చరిత్రలు: థెమిస్టోక్లెస్, రెండవ భాగం". 1 అక్టోబర్ 2015. Archived from the original on 1 అక్టోబర్ 2015. Retrieved 22 మార్చి 2018.
{{cite web}}: Check date values in:|date=and|archive-date=(help) - ↑ Brennan, Shane; Thomas, David (2021). The Landmark Xenophon's Anabasis. New York: Pantheon Books. ISBN 9780307906854.
- ↑ Maurice Whittemore Mather (ed.), Joseph William Hewitt (ed.), Xenophon: Anabasis, Books 1–4. University of Oklahoma Press, 1979, ISBN 978-0-8061-1347-0, p. 44.
- ↑ (పాలిబియస్, 27 అక్టోబర్ 2012).
- ↑ (దండమాయెవ్ & లుకోనిన్, 1989: 361–362).
- ↑ "ది అకెమెనిడ్ ఎంపైర్". 25 April 2014. Retrieved 21 June 2015.[1] Archived 19 జూన్ 2008 at the Wayback Machine
- ↑ Kjeilen, Tore. "ఆర్టాక్సెర్క్సెస్ 3". Archived from the original on 25 February 2008. Retrieved 5 March 2008.
- ↑ మూస:Encyclopædia Iranica Online
- ↑ సెకుండా, నిక్; నికోలస్ వి. సెకుండా; సైమన్ చూ (1992). ది పర్షియన్ ఆర్మీ 560–330 BC. ఆస్ప్రే పబ్లిషింగ్. p. 28. ISBN 978-1-85532-250-9.
- ↑ Miller, James Maxwell; Hayes, John Haralson (1986). A History of Ancient Israel and Judah. Philadelphia: The Westminster Press. p. 465. ISBN 978-0-664-21262-9.
- ↑ 94.0 94.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Persianempireఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ రావిన్సన్, జార్జ్ (1889). "ఫొనీషియా పర్షియన్ల పాలనలో". ఫొనీషియా చరిత్ర. లాంగ్మన్స్, గ్రీన్. Archived from the original on 20 జూలై 2006. Retrieved 10 మార్చి 2008.
- ↑ Chisholm, Hugh, ed. (1911). . ఎన్సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 2 (11th ed.). Cambridge University Press. p. 663.
- ↑ "గోగ్ మరియు మాగోగ్ పురాణం". Archived from the original on 15 మార్చి 2008. Retrieved 10 మార్చి 2008.
- ↑ బ్రూస్, ఫ్రెడరిక్ ఫైవీ (1990). అపొస్తలుల కార్యములు: పరిచయం మరియు వ్యాఖ్యానంతో గ్రీకు పాఠం. డబ్ల్యుఎమ్. బి. ఈర్డ్మాన్స్ పబ్లిషింగ్. p. 117. ISBN 978-0-8028-0966-7.
- ↑ "అధ్యాయం V: తాత్కాలిక ఉపశమనం". Archived from the original on 19 June 2008. Retrieved 1 March 2008.
- ↑ "మాసిడోనియాకు చెందిన ఫిలిప్ మాసిడోనియాకు చెందిన ఫిలిప్ II జీవిత చరిత్ర". Archived from the original on 14 మార్చి 2008. Retrieved 7 March 2008.
- ↑ Briant 2002, p. 769.
- ↑ 102.0 102.1 Cleveland, Charles Dexter (1861). A compendium of classical literature: comprising choice extracts translated from Greek and Roman writers, with biographical sketches. Biddle. p. 313.
- ↑ Jackson, Abraham Valentine Williams (1906). Persia past and present. The Macmillan Company. p. 278.
- ↑ Griffiths, Ralph; Griffiths, George Edward (1816). The Monthly review. p. 509.
- ↑ "Achaemenid Empire, Cyrus the Great, Darius the Great, Xerxes the Great". www.crystalinks.com – Crystalinks. Retrieved 2020-05-24.
- ↑ "CNG: ఫీచర్ వేలం CNG 96. పెర్సిస్ రాజులు. వాద్ఫ్రదాద్ (ఆటోఫ్రాడేట్స్) I. క్రీ.పూ. 3వ శతాబ్దం. AR టెట్రాడ్రాక్మ్ (28mm, 15.89 g, 9h). ఇస్తఖర్ (పెర్సెపోలిసు) టంకశాల". www.cngcoins.com.
- ↑ 107.0 107.1 107.2 "ఫ్రతారకా – ఎన్సైక్లోపీడియా ఇరానికా". www.iranicaonline.org.
- ↑ 108.0 108.1 "CNG: Feature Auction CNG 90. Kings of Persis. Vahbarz (Oborzos). 3rd century BC. AR Obol (10mm, 0.50 g, 11h)". www.cngcoins.com.
- ↑ B. C. McGing. The Foreign Policy of Mithridates VI Eupator, King of Pontus, p. 11.
- ↑ John Freely. Children of Achilles: The Greeks in Asia Minor Since the Days of Troy, pp. 69–70.
- ↑ Strabo of Amasia: A Greek Man of Letters in Augustan Rome, by Daniela Dueck, p. 3
- ↑ 112.0 112.1 112.2 "Pontus – Encyclopaedia Iranica". www.iranicaonline.org.
- ↑ Ashrafian, Hutan (2011). "Limb gigantism, neurofibromatosis and royal heredity in the Ancient World 2500 years ago: Achaemenids and Parthians". J Plast Reconstr Aesthet Surg. 64 (4): 557. doi:10.1016/j.bjps.2010.08.025. PMID 20832372.
- ↑ 114.0 114.1 Briant 2002, p. 261.
- ↑ Herodotus, trans. A. D. Godley, vol. 4, book 8, verse 98, pp. 96–97 (1924).
- ↑ పెర్సెపోలిస్ ఫోర్టిఫికేషన్ ఆర్కైవ్. Archived 29 సెప్టెంబరు 2016 at the Wayback Machine ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ – ది యూనివర్సిటీ ఆఫ్ చికాగో
- ↑ స్టోల్పర్, మాథ్యూ W. మరియు టావెర్నియర్, జాన్ (2007), పెర్సెపోలిస్ ఫోర్టిఫికేషన్ ఆర్కైవ్ ప్రాజెక్ట్ నుండి, 1: పెర్సెపోలిస్ కోట నుండి ఒక పాత పర్షియన్ పరిపాలనా ఫలకం.. Archived 20 సెప్టెంబరు 2022 at the Wayback Machine. ARTA 2007.001.
- ↑ Alram, Michael (17 November 2011) [15 December 1994], "DARIC", ఎన్సైక్లోపీడియా ఇరానికా, archived from the original on 29 April 2011
- ↑
- రెజాయియన్, ఫర్జిన్ (2005). పెర్సెపోలిస్ రీక్రియేటెడ్ (1st ed.). NEJ ఇంటర్నేషనల్ పిక్చర్స్. ISBN 978-964-06-4525-3.
- https://www.youtube.com/watch?v=nCwxJsk14e4[dead link]Archived 12 మే 2021 at the Wayback Machine
- ↑ హెరోడోటస్ పుస్తకం III, 89–95 Archived 2022-11-29 at the Wayback Machine
- ↑ ఆర్చిబాల్డ్, జోసియా; డేవిస్, జాన్ కె.; గాబ్రియెల్సెన్, విన్సెంట్ (2011). హెలెనిస్టిక్ సమాజాల ఆర్థిక వ్యవస్థలు, క్రీ.పూ. మూడవ నుండి మొదటి శతాబ్దాలు (in ఇంగ్లీష్). ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్. p. 404. ISBN 978-0-19-958792-6.
- ↑ "భారతదేశ సంబంధాలు: అకెమెనిడ్ కాలం – ఎన్సైక్లోపీడియా ఇరానికా". www.iranicaonline.org (in ఇంగ్లీష్).
- ↑ 123.0 123.1 "History of Iran (Persia)". Historyworld.net. Retrieved 7 January 2011.
- ↑ M. Dandamayev, "Foreign Slaves on the Estates of the Achaemenid Kings and their Nobles", in Trudy dvadtsat' pyatogo mezhdunarodnogo kongressa vostokovedov II, Moscow, 1963, pp. 151–152
- ↑ Stolper, Matthew (1989). "Registration and Taxation of Slave Sales in Achaemenid Babylonia". Zeitschrift für Assyriologie und Vorderasiatische Archäologie. 79: 80–101. doi:10.1515/zava.1989.79.1.80. S2CID 162232807.
- ↑ Nyrop, Richard F., ed. (1978). Iran, a Country Study (in ఇంగ్లీష్). American University (Washington, D.C. ) Foreign Area. pp. 25–26.
- ↑ "DĀTA – Encyclopaedia Iranica". iranicaonline.org.
- ↑ "Darius I (Darius the Great), King of Persia (from 521 BC)". 1902encyclopedia.com. Retrieved 7 January 2011.
- ↑ Daryaee, Touraj (2014). The Oxford Handbook of Iranian History. Oxford University Press. p. 4. ISBN 978-0199390427.
- ↑ ఈ పదాలు వాస్తవానికి న్యూయార్క్ నగరంలోని మాన్హాటన్ బరోలో ఉన్న జేమ్స్ ఎ. ఫార్లీ పోస్ట్ ఆఫీస్ భవనం యొక్క ఫ్రీజ్పై చెక్కబడి ఉన్నాయి. ఈ శాసనం దీనిపై ఆధారపడి ఉంది: హెరోడోటస్ విత్ జార్జ్ రావిన్సన్, అనువాదం, ది హిస్టరీ ఆఫ్ హెరోడోటస్ (న్యూయార్క్, న్యూయార్క్: టాండీ-థామస్ కో., 1909), సంపుటి 4, పుస్తకం 8, § 98, [https://babel.hathitrust.org/cgi/pt?id=uva.x000329532;view=1up;seq=163 p.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 8 మార్చి 2021. Retrieved 31 డిసెంబర్ 2025.
{{cite web}}: Check date values in:|access-date=(help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "యువ అన్వేషకుల డైరీ: ఇరాన్ మరియు రాజ రహదారి". en.unesco.org. Retrieved 2020-04-11.
{{cite web}}: Text "పట్టు రహదారులు" ignored (help) - ↑ Palmira Johnson Brummett; Robert R. Edgar; Neil J. Hackett; Robert R. Edgar; Neil J. Hackett (2003). Civilization past & present, Volume 1. Longman. p. 38. ISBN 978-0-321-09097-3.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;schmittఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ A history of Greece, Vol. 2, by Connop Thirlwall, Longmans, 1836, p. 174
- ↑ Herodotus VII, 59 Archived 29 నవంబరు 2022 at the Wayback Machine
- ↑ Herodotus VII, 84 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 62 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 63 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 64 Archived 29 నవంబరు 2022 at the Wayback Machine
- ↑ Chaumont, M.L.అల్బేనియా[usurped]. ఎన్సైక్లోపీడియా ఇరానికా.
- ↑ Herodotus VII, 66 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 67 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ 144.0 144.1 Herodotus VII, 89 Archived 4 ఆగస్టు 2020 at the Wayback Machine
- ↑ Herodotus VII 90 Archived 29 నవంబరు 2022 at the Wayback Machine
- ↑ Herodotus VII, 68 Archived 23 జూలై 2021 at the Wayback Machine
- ↑ Herodotus VII, 71 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 72 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 73 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 74 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus, VII, 75
- ↑ Herodotus VII, 79 Archived 24 జూలై 2020 at the Wayback Machine
- ↑ Herodotus VII, 80 Archived 6 మే 2008 at the Wayback Machine
- ↑ Herodotus VII, 85
- ↑ 155.0 155.1 జోనా, లెండరింగ్ (1997). "ఇమ్మోర్టల్స్". Livius.org. Retrieved 16 మే 2009.
- ↑ వాల్యూమ్ IX, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, పదిహేనవ ఎడిషన్ 1983
- ↑ Dugaw, Sean; Lipschits, Oded; Stiebel, Guy (2020). "A New Typology of Arrowheads from the Late Iron Age and Persian Period and its Historical Implications". Israel Exploration Journal. 70 (1): 64–89. JSTOR 27100276.
- ↑ Yahalom-Mack, Naama; Herzlinger, Gadi; Bogdanovsky, Alexander; Tirosh, Ofir; Garfinkel, Yosef; Dugaw, Sean; Lipschits, Oded; Erel, Yigal (2020). "Combining chemical and lead isotope analyses with 3-D geometric–morphometric shape analysis: A methodological case study of socketed bronze arrowheads from the southern Levant". Journal of Archaeological Science. 118 105147. Bibcode:2020JArSc.118j5147Y. doi:10.1016/j.jas.2020.105147. S2CID 218967765.
- ↑ Moorey, P. R. S. (1980). Cemeteries of the First Millennium B.C. at Deve Hüyük, near Carchemish, salvaged by T. E. Lawrence and C. L. Woolley in 1913. British Archaeological Reports Limited. p. 65. ISBN 978-0-86054-101-1.
- ↑ Delrue, Parsival (2007). "Trilobate Arrowheads at Ed-Dur (U.A.E, Emirate of Umm Al-Qaiwain)". Arabian Archaeology and Epigraphy. 18 (2): 239–250. doi:10.1111/j.1600-0471.2007.00281.x.
- ↑ "Collection online: arrow-head". British Museum.
- ↑ Sekunda, Nicholas (1992). The Persian Army 560–330 BC. Osprey Publishing. p. 30. ISBN 978-1-85532-250-9.
- ↑ ఎహ్సాన్ యార్-షాటర్ (1982). ఎన్సైక్లోపీడియా ఇరానికా, సంపుటి 4, సంచికలు 5–8. రౌట్లెడ్జ్ & కేగన్ పాల్.
- ↑ జాన్ మాన్యుయెల్ కుక్ (1983). ది పర్షియన్ ఎంపైర్. షాకెన్ బుక్స్. p. 109. ISBN 978-0-8052-3846-4.
అకెమెనియన్లు తమ ప్రధాన మార్గాలలో కొన్ని వంతెనలను నిర్వహించారు. మనం విన్నదాని ప్రకారం, బాబిలోనియాలోని టైగ్రిస్ నదిపై పడవ వంతెనలు సాధారణ వాడుకలో ఉండేవి...
- ↑ ఇ.వి. సెర్నెంకో; ఆంగస్ మెక్బ్రైడ్; ఎం.వి. గోరెలిక్ (24 మార్చి 1983). ది సిథియన్స్, 700–300 BC. ఆస్ప్రే పబ్లిషింగ్. ISBN 978-0-85045-478-9.
- ↑ Herodotus (1859). The History of Herodotus: a new English version, Volume 3. Translated by George Rawlinson; Sir Henry Creswicke Rawlinson; Sir John Gardner Wilkinson. John Murray. p. 77 (Chp. 86).
- ↑ Waldemar Heckel (2006). Who's who in the age of Alexander the Great: prosopography of Alexander's empire. Wiley-Blackwell. p. 134. ISBN 978-1-4051-1210-9.
- ↑ DPh – Livius (in ఇంగ్లీష్).
- ↑ దండమాయెవ్, ముహమ్మద్ (2002). "పెర్సెపోలిస్ ఎలామైట్ టాబ్లెట్లు". ఎన్సైక్లోపీడియా ఇరానికా. Archived from the original on 21 జనవరి 2012. Retrieved 1 నవంబర్ 2013.
{{cite encyclopedia}}: Check date values in:|access-date=(help) - ↑ "సంస్కృతి – ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రేడియో టీవీ". బజ్తాబ్ న్యూస్ (in ఇంగ్లీష్). Archived from the original on 8 మార్చి 2021. Retrieved 2020-05-24.
- ↑ Geiger, Wilhelm; Ernst Kuhn (2002). Grundriss der iranischen Philologie: Band I. Abteilung 1. Boston: Adamant. pp. 249ff.
- ↑ Ware, James R.; Kent, Roland G. (1924). "The Old Persian Cuneiform Inscriptions of Artaxerxes II and Artaxerxes III". Transactions and Proceedings of the American Philological Association. 55: 52–61. doi:10.2307/283007. JSTOR 283007. p. 53
- ↑ Gershevitch, Ilya (1964). "Zoroaster's own contribution". Journal of Near Eastern Studies. 23 (1): 12–38. doi:10.1086/371754. S2CID 161954467. p. 20.
- ↑ "హెరోడోటస్, ది హిస్టరీస్, పుస్తకం 1, అధ్యాయం 133". www.perseus.tufts.edu. Retrieved 2020-11-21.
- ↑ 177.0 177.1 Fisher, William Bayne; Gershevitch, I. (1968). The Cambridge History of Iran (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 412. ISBN 978-0-521-20091-2.
- ↑ "Book of Ezra | King James Bible". Kingjamesbibletrust.org. Archived from the original on 10 May 2011. Retrieved 21 March 2011.
- ↑ A. V. Williams Jackson (2003). Zoroastrian Studies: The Iranian Religion and Various Monographs (1928). Kessinger Publishing. p. 224. ISBN 978-0-7661-6655-4. OL 8060499M.
- ↑ Virginia Schomp (2009). The Ancient Persians. Marshall Cavendish. p. 24. ISBN 978-0-7614-4218-9.
- ↑ William W. Malandra (1983). An Introduction to Ancient Iranian Religion: Readings from the Avesta and Achaemenid Inscriptions. U of Minnesota Press. ISBN 978-0-8166-1114-0. in the Achaemenid Empire.
- ↑ Pierre Briant (2002). From Cyrus to Alexander: A History of the Persian Empire. Eisenbrauns. pp. 252–. ISBN 978-1-57506-120-7.
- ↑ M. A. Dandamaev (1989). A Political History of the Achaemenid Empire. Brill. pp. 97–. ISBN 978-90-04-09172-6.
- ↑ A. D. H. Bivar (1998). The Personalities of Mithra in Archaeology and Literature. Bibliotheca Persica Press. ISBN 978-0-933273-28-3.
- ↑ Jean Perrot (2013). The Palace of Darius at Susa: The Great Royal Residence of Achaemenid Persia. Bloomsbury Academic. ISBN 978-1-84885-621-9.
- ↑ Juri P. Stojanov; Yuri Stoyanov (11 August 2000). The Other God: Dualist Religions from Antiquity to the Cathar Heresy. Yale University Press. pp. 77–. ISBN 978-0-300-08253-1.
- ↑ 187.0 187.1 హెరోడోటస్, I.131
- ↑ బెరోసస్, III.65
- ↑ 189.00 189.01 189.02 189.03 189.04 189.05 189.06 189.07 189.08 189.09 189.10 189.11 189.12 Maria Brosius, "Women i. In Pre-Islamic Persia", Encyclopædia Iranica, online edition, 2021, available at Women i. In Pre-Islamic Persia (accessed on 26 January 2021). Originally Published: 2000. Last Updated: March 15, 2010. Encyclopædia Iranica, online edition, New York, 1996 – https://iranicaonline.org/articles/women-i Archived 3 నవంబరు 2020 at the Wayback Machine
- ↑ (Ctesias, frg. 16 (56) in Jacoby, Fragmente III/C, p. 471)
- ↑ Foundation, Encyclopaedia Iranica. "Welcome to Encyclopaedia Iranica". iranicaonline.org.
- ↑ (Brosius, Maria, Women in ancient Persia (559–331 BC), Oxford, 1996. pp. 125–182)
- ↑ 193.0 193.1 (Brosius, Maria, Women in ancient Persia (559–331 BC), Oxford, 1996. pp. 83–93)
- ↑ (Heracleides of Cyme apud Athenaeus, 514b)
- ↑ (Brosius, Maria, Women in ancient Persia (559–331 BC), Oxford, 1996. pp. 94–97)
- ↑ (Plutarch, Moralia, 140B)
- ↑ Dolansky, Shawna; Shectman, Sarah (12 June 2025). The Bloomsbury Handbook of Religion, Gender, and Sexuality in the Ancient Near East (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. p. 147-. ISBN 978-1-350-38202-2.
- ↑ చార్లెస్ హెన్రీ కాఫిన్ (1917). వాస్తుశిల్పాన్ని ఎలా అధ్యయనం చేయాలి. డాడ్, మీడ్ అండ్ కంపెనీ. p. 80.
- ↑ మాక్డొనాల్డ్, ఈవ్ (8 జనవరి 2020). "ఇరాన్ సాంస్కృతిక వారసత్వం పర్షియన్ సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగం యొక్క వైభవాన్ని మరియు సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది". ది కన్వర్జేషన్ (in ఇంగ్లీష్). Retrieved 2020-02-15.
- ↑ ఎడ్వర్డ్ లిపిన్స్కీ; కారెల్ వాన్ లెర్బెర్గే; ఆంటోన్ స్కూర్స్; కారెల్ వాన్ లెర్బెర్గే; ఆంటోన్ స్కూర్స్ (1995). ప్రాచీన సమీప తూర్పులో వలసలు మరియు వలస వెళ్ళడం. పీటర్స్ పబ్లిషర్స్. ISBN 978-90-6831-727-5.
{{cite book}}: Unknown parameter|పుట=ignored (help) - ↑ Cotterell, Arthur (1993). The Penguin Encyclopedia of Classical Civilizations. p. 162. ISBN 0670826995.
- ↑ Daryaee, Touraj (2014). The Oxford Handbook of Iranian History. Oxford University Press. p. 120. ISBN 978-0199390427.
- ↑ "మాస్టరింగ్ వరల్డ్ హిస్టరీ" ఫిలిప్ ఎల్. గ్రోయిసర్ ద్వారా, న్యూయార్క్, 1970, పుట 17
- ↑ Vesta Sarkhosh Curtis; Sarah Stewart (2005). Birth of the Persian Empire. I.B.Tauris. p. 7. ISBN 978-1-84511-062-8.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Hovannisianఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Lewis, Bernard (2004). From Babel to Dragomans: Interpreting the Middle East. Oxford University Press. p. 44. ISBN 978-0-19-517336-9.
- ↑ జార్జ్ డబ్ల్యూ.ఎఫ్. హెగెల్ (2007). చరిత్ర తత్వశాస్త్రం. కోసిమో. ISBN 978-1-60206-438-6.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు
- Articles containing Old Persian (ca. 600-400 B.C.)-language text
- Pages using infobox country or infobox former country with the flag caption or type parameters
- Pages using sfn with unknown parameters
- Pages using multiple image with auto scaled images
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 maint: location missing publisher
- All articles with dead external links
- CS1: unfit URL