Coordinates: 16°37′52″N 80°43′25″E / 16.631238°N 80.723521°E / 16.631238; 80.723521

అడివినెక్కలం

వికీపీడియా నుండి
(అడవినెక్కలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడివినెక్కలం
—  రెవెన్యూ గ్రామం  —
అడివినెక్కలం is located in Andhra Pradesh
అడివినెక్కలం
అడివినెక్కలం
అక్షాంశరేఖాంశాలు: 16°37′52″N 80°43′25″E / 16.631238°N 80.723521°E / 16.631238; 80.723521
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం అగిరిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,939
 - పురుషులు 3,032
 - స్త్రీలు 2,905
 - గృహాల సంఖ్య 1,641
పిన్ కోడ్ 521212
ఎస్.టి.డి కోడ్ 08656

అడివినెక్కలం ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆగిరిపల్లి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1641 ఇళ్లతో, 5937 జనాభాతో 2494 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3032, ఆడవారి సంఖ్య 2905. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2017 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 41. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589117.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది.[2]

సమీప గ్రామాలు[మార్చు]

సూరంపల్లి 4 కి.మీ, తోటపల్లి 6 కి.మీ, ఎస్.ఎ. పేట 6 కి.మీ, గోపవరపుగూడెం 7 కి.మీ, నున్న 7 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. రామవరప్పాడు, గన్నవరం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 18 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. సమీప బాలబడి ఆగిరిపల్లిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల ఆగిరిపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో, 2014, ఆగస్టు-27, బుధవారం నాడు, తెలుగు భాషా దినోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. తొలుత వ్యావహారిక భాషోద్యమకారుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు రూపొందించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. విద్యార్థులు నిర్వహించిన అష్టావధానం, శివతాండవం, బుర్రకథాగానం, ఛందోమాంత్రికుడు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయనం, పద్యతోరణాలు, కవిత్రయం, ఇతర తెలుగు కవుల వేషధారణతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పద్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినారు. తెలుగు ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అంతటా తెలుగుదనం ఉట్టిపడినది. [2]&[3]

జీవన వికాస విద్యావనం పాఠశాల[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని అక్కినేని సుదర్శనపురంలోని ఈ పాఠశాలలో, సమగ్ర జీవనంలోనే సమగ్ర వికాసం సాధ్యం అన్న ఉన్నత లక్ష్యంతో, ప్రకృతి ఒడిలో ఆవిర్భవించినది ఈ పాఠశాల. ఇక్కడ విద్యార్థులు బాహ్యానందాలకు దూరమవకుండా స్వేచ్ఛాయూతంగా విద్యనభ్యసించుచున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించుచూ ఒత్తిడి లేని విద్యాభ్యాసాన్ని అందించేందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పాఠశాలను నిర్వహించుచున్నారు. ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం నవంబరు నెలలోని నాల్గవ ఆదివారంనాడు, మా ఊరు వేడుకలు కార్యక్రమం సందడిగా నిర్వహించుచున్నారు.

చుక్కపల్లి ఉన్నత పాఠశాల[మార్చు]

కారుణ్య ఆంగ్ల మాధ్యమ పాఠశాల[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామ సర్పంచులు:-

  • మొక్కపాటి వేంకటేశ్వరరావు (కాంగ్రెస్)
  • పాలడుగు రాజశేఖర్ (యం.బి.ఎ)
  • 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మొక్కపాటి శైలజ సర్పంచ్‌గా ఎన్నికైంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామం నడి బొడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేయనున్న నూతన ధ్వజస్థంబానికి, 2017, ఏప్రిలి17వతేదీ సోమవారంనాడు పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి గ్రామోత్సవం నిర్వహించారు. యాగశాలలో హోమాలు నిర్వహించారు. నిత్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

అడివినెక్కలంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

అడివినెక్కలంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 523 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 132 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 146 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 7 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 51 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 125 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 30 హెక్టార్లు
  • బంజరు భూమి: 172 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1307 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1400 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 109 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

అడివినెక్కలంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 69 హెక్టార్లు
  • చెరువులు: 40 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

అడివినెక్కలంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ ఊరు మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి. ఇక్కడి గొల్లగూడెంలో తాండ్ర తయారు చేసి రాష్ట్రం లోనే గాక ఇతర రాష్ట్రాలకు గూడా ఎగుమతి అగుచున్నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై వరకూ జరిగే సీజనులో సుమారు 300 మందికి ఉపాధి దొరుకుతుంది.
  2. ఈ గ్రామములో ప్రతి సంవత్సరం నవంబరు నెలలోని నాల్గవ ఆదివారంనాడు, మా ఊరు వేడుకలు కార్యక్రమం సందడిగా నిర్వహించుచున్నారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5057. ఇందులో పురుషుల సంఖ్య 2569, స్త్రీల సంఖ్య 2488, గ్రామంలో నివాసగృహాలు 1241 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2494 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "అడివినెక్కలం". Retrieved 20 June 2016.

వెలుపలి లంకెలు[మార్చు]